సాక్షి,విజయవాడ: ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్ బిగ్ షాకిచ్చింది. జీవో నెం 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది.
గతంలో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ రూ.28280 ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25220కి తగ్గించింది. పేస్కేల్ తగ్గిస్తూ జీవో నెంబర్.91ను సవరణ చేసింది. అయితే కూటమి సర్కార్ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పోరాటం తప్పదని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.


