తుర్లపాటి కుటుంబరావు మృతికి సీఎం జగన్‌ సంతాపం

AP CM YS Jagan Condolences To Turlapati Kutumba Rao Death - Sakshi

సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబరావు కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్లపాటి కుటుంబరావు(89) గత రాత్రి కన్నుమూశారు. గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టంగుటూరి ప్రకాశం దగ్గర కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top