
5–8 తేదీల మధ్య ఒక విడత, 12–15 తేదీల మధ్య మరో విడత
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండు విడతల్లో ఆధార్ క్యాంపులను నిర్వహించనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచి 8వ తేదీ వరకు ఒక విడతలో, 12 నుంచి 15వ తేదీ వరకు మరో విడతలో గ్రామ, వార్డు సచివాలయాలు, వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్టు పేర్కొంది. 5 నుంచి 7 ఏళ్ల మధ్య, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసుగలవారు ఈ ప్రత్యేక క్యాంపుల్లోని సేవలను ఒక్కసారి ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.