ఏపీ మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా

Andhra Pradesh Legislative Council Chairman MA. Sharif‌ tested covid19 - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్  శాసనమండలి చైర్మన్‌ ఎంఏ. షరీఫ్‌ కరోనా బారినపడ్డారు. ప్ర‌స్తుతం  హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు  స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో  ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. షరీఫ్‌ కోవిడ్‌ బారిన పడటం బాధాకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top