ఏపీలో కొత్తగా 1,908 కరోనా కేసులు

1908 New Corona Cases Recorded In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా  వైరస్‌ ప్రభావంతో 23 మంది మృతి చెందారు.  తాజాగా 2,103 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌  అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,51,08,146 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,46,370 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,513 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375  పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,80,258 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top