ఓడీచెరువు: మండల పరిధిలోని నల్లచెరువుపల్లికి చెందిన లక్కసాని ఉషారాణి (37) బావిలో పడి మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల వివరాలమేరకు... నల్లచెరువుపల్లికి చెందిన ప్రతాప్రెడ్డి, ఉషారాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఉదయం టమాట పంటను చూసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రతాప్రెడ్డి తిరిగి వచ్చేశాడు. ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో బోరు బావి దగ్గరికి వెళ్లి వెతకగా ఆమె బావిలోని నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలికి అప్పుడప్పుడూ ఫిట్స్ వచ్చేవని, ప్రమాదవశాత్తూ బావినీటిలో పడి చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి సోమశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


