అనంతపురం: ఈ నెల 24, 25 తేదీల్లో జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ క్యాంపస్ కళాశాలలోని ఎలక్ట్రికల్ విభాగంలో ఐ (ఈవైఈ)–2026 పేరుతో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు గురువారం ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ ఎక్స్పో, హెక్తాన్, పేపర్ ప్రజెంటేషన్, వర్క్ షాప్, టెక్నికల్ క్విజ్, సర్క్యూట్ హంట్, జంక్ టు పవర్, పవర్ కోడ్, పోస్టర్ ప్రజంటేషన్ తదితర అంశాల ప్రాధాన్యతగా సదస్సు జరగనుంది. సదస్సు కన్వీనర్గా ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ ఎం.రామశేఖర్రెడ్డి వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ పి.సుజాత, ప్రొఫెసర్ ఆర్.కిరణ్మయి, డాక్టర్ బి.జితేంద్రగౌడ్, డాక్టర్ ఎస్.శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు, మాజీ రిజిస్ట్రార్ వి.శంకర్, ఏఈ శ్యాంబాబు, ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ ఎం.నాగ చైత్ర, ఫిర్దోసి కౌసర్ అహమ్మదీయ, విద్యార్థుల కో–ఆర్డినేటర్లు కె.విజయకుమార్, డి.మోనికా పాల్గొన్నారు.


