కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం పూజాదికాలు ముగించిన అనంతరం ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులకు తాళాం వేశారు. అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ కూడా నిలిపేశారు. తిరిగి బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. – సాక్షి బృందం, అనంతపురం:
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేసిన దృశ్యం
మూసేసిన అనంతపురం ఒకటో రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం
తాడిపత్రి రూరల్: బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని మూసివేస్తున్న దృశ్యం
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలంలో ఆలయాన్ని మూసి వేస్తున్న అర్చకులు


