‘ఎకై ్సజ్ ’క్రీడా పోటీలు ప్రారంభం
అనంతపురం సెంట్రల్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారుల క్రీడా పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య క్రీడా పోటీలను ప్రారంభించారు. రెండు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలతో మానసికోల్లాసం కలుగుతుందని నాగమద్దయ్య అన్నారు. మొదటిరోజు నిర్వహించిన వివిధ క్రీడల్లో ఉద్యోగులు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామ్మోహన్రెడ్డి, గోవిందనాయక్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నరసింహులు, రేవితి, డీఎం వేణుగోపాల్రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జయనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


