
జగన్ ..నీరాజనం
న్యూస్రీల్
జన తరంగం ఎగసింది. అభిమాన నేతను చూసి మురిసిపోయింది. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది. అడుగడుగునా నీరాజనం పలికింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నీ వెంటే అంటూ ముందుకు నడిచింది. ఏ శక్తీ తమను ఆపలేదంటూ స్పష్టం చేసింది. జగన్ నినాదాలతో మార్మోగించింది.
● అనంతలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం
● మాజీ ఎమ్మెల్యే విశ్వ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన జననేత
● జగన్ను చూసేందుకు తరలివచ్చిన జన సందోహం
● హెలిప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకు అడుగడుగునా నీరాజనం
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
అనంతపురం కార్పొరేషన్: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత వివాహం గురువారం అనంతపురంలోని ఇంద్రప్రస్థ జీఎంఆర్ గార్డెన్స్లో జరిగింది. వీరి వివాహానికి హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జననేతను చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఉదయం 9 గంటలకే..
హెలీప్యాడ్ వద్దకు ఉదయం 9 గంటల నుంచే ప్రజలు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూశారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగగానే కేరింతలు కొట్టారు. ‘అన్న వచ్చాడు’ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఈలలు, కేకలు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఇంద్రప్రస్థ జీఎంఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపానికి బయలు దేరిన జగన్కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సంక్షేమ ప్రదాతను చూసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. రుద్రంపేట బ్రిడ్జి వద్ద, హెలీప్యాడ్ చుట్టుపక్కల భవనాలు, కల్యాణ మండపం చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కి అభివాదం చేశారు.
కిక్కిరిసిన కల్యాణ మండపం..
అభిమానులు, నాయకులు, ప్రజలతో కల్యాణ మండపం పరిసరాలు కిక్కిరిసిపోవడంతో వైఎస్ జగన్ లోపలికి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. జగనన్నతో కరచాలనం చేయడానికి అడుగడుగునా ప్రజలు ఉత్సాహం చూపారు. వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహితను ఆశీర్వదించిన అనంతరం హెలికాప్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.
సాదర స్వాగతం..
హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు అనంత వెంకటరామిరెడ్డి (అనంతపురం), డాక్టర్ సాకే శైలజానాథ్ (శింగనమల), ఉషశ్రీ చరణ్(పెనుకొండ), మెట్టు గోవిందరెడ్డి(రాయదుర్గం), తలారి రంగయ్య(కళ్యాణదుర్గం),తోపుదుర్తి ప్రకాష్రెడ్డి(రాప్తాడు), దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (పుట్టపర్తి),వై.వెంకటరామిరెడ్డి(గుంతకల్లు) కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), పెద్దారెడ్డి (తాడిపత్రి), మక్బుల్ (కదిరి), ఈరలక్కప్ప (మడకశిర), ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మాజీ మంత్రులు ఆర్కే రోజా, శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, గుంటూరు వెస్ట్ సమన్వయకర్త ఫాతిమా నూరి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జగన్ ..నీరాజనం

జగన్ ..నీరాజనం

జగన్ ..నీరాజనం

జగన్ ..నీరాజనం