మాడుగుల రూరల్ : మండలంలో ఎం.కోడూరు గ్రామంలో మోదమాంబ ఆలయంలో ఉపాలయంలో గల సిద్ధి వినాయక విగ్రహానికి దాతలు సహకారంతో వెండి కిరిటంను ఆదివారం అందజేశారు. కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం, రాజపూడి గ్రామానికి చెందిన కోరుకొండ సూర్యారావు, కోరుకొండ వెంకట శ్రీనివాసరావు, కోరుకొండ సూర్య సత్తిబాబు, కోరుకొండ సూర్య గంగాధర్ జగదీశ్, దంపతులు, పాడేరు గ్రామానికి చెందిన నవర బబ్లూ, సహకారంతో 750 గ్రాముల విలువ చేసే వెండి కిరీటాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి సంజీవిరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధానార్చకులు శ్రీనివాసశర్మ, భారతి దంపతులతో పాటు స్థానికులు శానాపతి గణేశ్, కలిమి గోపాల్, ఎంపిటిసి సభ్యుడు ముమ్మిన రమణబాబు, పడాల అప్పలనాయుడు, పోతిన జగదీష్ పాల్గొన్నారు.


