శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా
తెరుచుకోని పాపయ్యపాలెం సచివాలయం
అనకాపల్లి: పాపయ్యపాలెం సచివాలయం ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా సచివాలయానికి ఒక్క ఉద్యోగి కూడా రాలేదు. అప్పటికే సచివాలయానికి వచ్చిన ప్రజలు భవనానికి తాళం వేసి ఉండడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మండల, జిల్లా స్థాయి అధికారులు స్పందించి సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని పాపయ్యపాలెం ప్రజలు కోరుతున్నారు.


