విద్యుత్‌ షాక్‌ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం

Dec 29 2025 7:53 AM | Updated on Dec 29 2025 7:53 AM

విద్యుత్‌ షాక్‌ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం

విద్యుత్‌ షాక్‌ బాధితుడికి రూ.1.02 లక్షల సాయం

అచ్యుతాపురం రూరల్‌: ఆపదలో ఉన్న వారికి అచ్యుతాపురం హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందజేస్తోంది. విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన నవీన్‌కు ఆ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. ఆదివారం రూ.1.02 లక్షలు అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వీలుగా తమకు విరాళాలు అందజేస్తున్న వారికి సంస్థ అధ్యక్షుడు రెడ్డి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్స్‌ నాయుడు, రెడ్డి చిరంజీవి, రాజాన అశోక్‌, డాక్టర్‌ సుధీర్‌, డాక్టర్‌ వెంకట్‌, సురేష్‌, గొర్లి వెంకటేష్‌, కొల్లి నాయుడు, పిడి శివాజీ, ధర్మిరెడ్డి శ్రీనివాస్‌, లాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement