
కావ్యకు జ్ఞాపిక అందజేస్తున్న హెచ్ఎం సత్యనారాయణ
ఎస్.రాయవరం: స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని కర్రి కావ్య జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్టు పీడీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. అండర్ – 17 విభాగంలో ఎంపికై నట్టు చెప్పారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో కావ్య ప్రతిభ కనబరచిందన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థినితోపాటు పీడీ శ్రీనివాసును అభినందించారు.