రహదారి నిర్మాణం నాణ్యత పరిశీలన
ఆర్వీ నగర్, గూడెంకొత్తవీధి రహదారి పనులను తనిఖీ చేస్తున్న క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు
గూడెంకొత్తవీధి: మండలంలోని ఆర్వీనగర్ నుంచి గూడెంకొత్తవీధి మీదుగా సీలేరు వరకూ నిర్మిస్తున్న రహదారి నిర్మాణాలను ఆదివారం క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ సూర్యనారాయణ, ఈఈ శ్రీనివాస్నాయక్, డీఈ వేణుగోపాల్లు ఈ తనిఖీలు చేపట్టారు. వారి వెంట ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, జేఈలు భరత్, జయరాజ్ ఉన్నారు.


