అసెంబ్లీని సందర్శించిన రిషివ్యాలీ విద్యార్థులు
అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం : ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా నర్సీపట్నం రిషీ వ్యాలీ స్కూల్కు చెందిన 120 మంది గురువారం అసెంబ్లీని సందర్శించారు. విద్యార్థులతో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ముచ్చటించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా అసెంబ్లీ విజ్ఞాన యాత్ర కొనసాగుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, మాతృభాషను మరువొద్దు అని స్పీకర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనలో స్కూల్ నిర్వాహకులు అక్కంరెడ్డి కార్తీకేయ, కౌశిక్ పాల్గొన్నారు.


