
జిల్లా టాపర్లకు కలెక్టర్, పీవో అభినందన
కూనవరం/ఎటపాక: పదో తరగతి ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన కూనవరం మండలం టేకులబోరు మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థిని అరవా మాధవి, నెల్లిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాదులూరి లాస్యంత్ను కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీటీఏ పీవో అపూర్వభరత్ చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేసి, అభినందించారు.
ఐఏఎస్ అవుతా...
590 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన అరవా మాధవి తండ్రి అరవా రాము, తల్లి ధనలక్ష్మి గృహిణి. ఇద్దరూ కూలిపని చేసుకుంటూ తమ కుమార్తెను కష్టపడి చదివిస్తున్నారు. తల్లిద్రండుల కృషికి తగ్గట్టుగా మాధవి పదో తరగతిలో అత్యధిక మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. భవిష్యత్తులో ఏమి కావాలని కోరుకుంటున్నావని కలెక్టర్ మాధవిని ప్రశ్నించగా తాను ఐఏఎస్ అవుతానని సమాధానం చెప్పింది.
మెకానికల్ ఇంజినీర్ కావాలన్నది ధ్యేయం
టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 587 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన మండలంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన నెల్లిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాదులూరి లాస్యంత్ తల్లిదండ్రులు రామ్మోహనరావు,నాగేశ్వరి. టైలర్ వృత్తి చేస్తూ కుమారుడు, కుమార్తెను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారు. కుమారుడు లాస్యంత్ నెల్లిపాక హైస్కూల్లో చదవుతుండగా, కుమార్తె హర్షిణి రేఖపల్లి కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ట్రిపుల్ఐటీలో సీటు సాధించి మెకానికల్ ఇంజినీర్ కావాలనేది తన ధ్యేయమని లాస్యంత్ తెలిపాడు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మంచి మార్కులు సాధించగలిగానని చెప్పాడు. పాఠశాల సెలవు రోజుల్లో తాము కుట్టుమిషన్ పనిచేస్తున్నప్పుడు మాకు సహాయంగా దుస్తులకు బటన్స్ వేయటం,ఇసీ్త్ర చేయడం తదితర పనులను లాస్యంత్ చేస్తుంటాడని తల్లిదండ్రులు తెలిపారు.

జిల్లా టాపర్లకు కలెక్టర్, పీవో అభినందన

జిల్లా టాపర్లకు కలెక్టర్, పీవో అభినందన