మోదమ్మకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

మోదమ్మకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ పూజలు

Apr 21 2025 7:55 AM | Updated on Apr 21 2025 7:55 AM

మోదమ్మకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ పూజలు

మోదమ్మకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ పూజలు

సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లిని పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అధికారి వి.అభిషేక్‌ ఆదివారం తల్లిదండ్రులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో అభిషేక్‌, వారి తల్లిదండ్రు లను ఘనంగా సత్కరించారు. మోదమ్మ చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. మే 11,12,13 తేదీల్లో జరిగే మోదమ్మ ఉత్సవా లకు రావాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు.. అభిషేక్‌కు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు కూడ సురేష్‌కుమార్‌, కొణతాల ప్రశాంత్‌, కేజీయారాణి, ఆలయ కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ,రాధాకృష్ణ,చిన్న,బొనంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement