హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ

Dec 24 2025 4:24 AM | Updated on Dec 24 2025 4:24 AM

హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ

హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ

హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ కష్టపడితే ఉన్నత స్థానాలకు చేరుకోగలం మద్దిపాడు: మండల కేంద్రం మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవాన్ని మంగళవారం ప్రధాన ఆచార్యులు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ.. చదువును ఇష్టంగా చదువుతూ కష్టపడితేనే ఉన్నత స్థానాలకు చేరుకోగలమని విద్యార్థులకు ఉద్బోధించారు. రాబోయే ఇంటర్‌ పరీక్షలలో అందరూ చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఒంగోలు మెట్రో: బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న అరాచక దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు నగరంలో విశ్వహిందూ పరిషత్‌, హైందవ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్‌ దగ్గర నుంచి అద్దంకి బస్టాండ్‌ బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ కూడల వద్ద వరకు నిరసన ర్యాలీ చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందూ బంధువులు ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, పసుమర్తీ వెంకటేశ్వర్లు వీహెచ్‌పీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement