నిందితుడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నిందితుడి రిమాండ్‌

Aug 27 2025 8:44 AM | Updated on Aug 27 2025 8:44 AM

నిందితుడి రిమాండ్‌

నిందితుడి రిమాండ్‌

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని బంగారుగూడ కాలనీలో ఓ వ్యక్తిని బెదిరించి నగదు దొంగిలించిన డీసీ సీటర్‌ ఖద్ధర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విష్ణువర్ధన్‌ తె లిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ముత్యాలు ఆ ప్రాంతంలో చేపలు విక్రయిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన డీసీ సీటర్‌ ఖద్ధర్‌ ముత్యాలును బె దిరించి రూ.1,500 దొంగిలించి పరారయ్యా డు. అంతేకాకుండా ముత్యాల పక్కనున్న శ్రీని వాస్‌పై దాడి చేశాడు. దీంతో బాధితుల ఫిర్యా దు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఖద్ధర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

కలప పట్టివేత

దండేపల్లి: మండలంలోని నంబాల గోదావరి తీరం వద్ద అక్రమంగా తరలించేందుకు నిల్వ చేసిన 15 టేకు దుంగలను మంగళవారం తమ సిబ్బంది పట్టుకున్నట్లు తాళ్లపేట అటవీ రేంజ్‌ అధికారి సుష్మారావు తెలిపారు. పట్టుకున్న కలప విలువ రూ.42,329 ఉంటుందని పేర్కొన్నారు. కలపను రేంజ్‌కి తరలించినట్లు తెలిపారు. అటవీ సిబ్బంది ఎఫ్‌ఎస్‌వో నరేశ్‌, ఎఫ్‌బీవో నాగరాజుచారి, టైగర్‌ ట్రాకర్‌ ప్రశాంత్‌, బేస్‌ క్యాంప్‌ వాచర్‌ పాల్గొన్నారు.

చోరీకి పాల్పడ్డ నిందితుల అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: చోరీలకు పాల్పడిన ముగ్గు రు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 19న తిర్పెల్లిలోని శ్రీనివాస వైన్స్‌లో ఐదుగురు దొంగతనానికి పాల్పడగా అందులో షేక్‌ బిలాల్‌, మహ్మద్‌ షారుఖ్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీ సుకోగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 6న సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన శానం నవీన్‌కుమార్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మహారాష్ట్రకు చెందిన మా ర్కులే అనిల్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. మూడు తులాల బంగారం చోరీ కి పాల్పడగా, నిందితుడి నుంచి అర తులం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement