-
విజిలెన్స్ దాడుల్లో భారీగా పట్టుబడ్డ వంట నూనె
-
మాజీ మంత్రికి ఝలక్.. 69 చోట్ల విజిలెన్స్ సోదాలు
అన్నాడీఎంకే మాజీ మంత్రులపై డీఎంకే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే నలుగురు మాజీలపై అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన డీవీఏసీ తాజాగా తంగమణి లక్ష్యంగా సోదాలు చేపట్టింది. ఇందులో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): మాజీ మంత్రి తంగమణిని బుధవారం డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్) టార్గెట్ చేసింది. తంగమణి, ఆయన కుటుంబం, సన్నిహితులకు సంబంధించిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాలు అంటూ 69 చోట్ల అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. ఈ చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్షసాధింపు ధోరణి తగదని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సిద్ధం చేసిన జాబితా మేరకు.. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు సాగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లంచగొండితనం తదితరుల వ్యవహారాలపై ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓ జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వీరిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో గవర్నర్కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. తాజాగా, తాము అధికారంలోకి వచ్చినానంతరం ఆ జాబితాలో ఉన్న అవినీతి రాయుళ్ల భరతం పట్టే దిశగా డీఎంకే ప్రభుత్వం దూకుడు పెంచింది. తొలుత రవాణశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ను టార్గెట్ చేసి సోదాలు విస్తృతం చేసి, ఆయన్ని విచారణ వలయంలోకి తెచ్చా రు. తదుపరి ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఎంఆర్ విజ య భాస్కర్, రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమ ణిని టార్గెట్ చేశారు. ఇటీవల నగరాభివృద్ధి శాఖ మంత్రి, పళనిస్వామి సన్నిహితుడు ఎస్పీ వేలుమణిపై దృష్టి పెట్టారు. తాజాగా మరో సన్నిహితుడు, విద్యుత్శాఖ మాజీ మంత్రి తంగమణి లక్ష్యంగా డీవీఏసీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఏక కాలంలో సోదాలు 2016–2021 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.4.85 కోట్లు ఆస్తుల్ని తంగమణి గడించినట్టు ఆధారాలతో సహా తేల్చిన డీవీఏసీ వర్గాలు కేసు నమోదు చేశాయి. ఆయన భార్య శాంతి, కుమారు డు ధరణి ధరణ్ను సైతం ఈ కేసులో చేర్చారు. దీంతో బుధవారం ఉదయాన్నే పలు బృందాలుగా డీవీఏసీ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో తంగమణి ఆస్తులు, సన్నిహితుల ఇళ్లు, బినామీ సంస్థలపై దాడులకు దిగారు. చెన్నై, నామక్కల్, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ తదితర తొమ్మిది జిల్లాలతో పాటుగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో అనేకచోట్ల పొద్దు పోయే వరకు సోదాలు జరిగాయి. నామక్కల్ జిల్లా ఆలపాళయంలోని తంగమణి ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే వర్గాలు అక్కడికి తరలివచ్చి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నైలో అరుంబాక్కం, షెనాయ్ నగర్తో పాటుగా 14 చోట్ల, సేలంలోని తంగమణి కుమారుడు ధరని ధరణ్ ఇంట్లోనూ సోదాలు సాగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, బినామీ సంస్థలు, పలు చోట్ల పెట్టుబడులే కాకుండా క్రిష్టోకరెన్సీలోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోదాలు ముగిసినా, తంగమణి, ధరణి ధరణ్ నివాసాలు, టైల్స్ సంస్థలు, మాల్స్లలో ఇంకా సోదాలు సాగుతున్నాయి. కాగా ఇప్పటివరకు రూ.2.37 కోట్లు లెక్కలోకి రాని నగదు, 40 కేజీల వెండి, 1.5 కేజీల బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కక్ష సాధింపు తగదు డీవీఏసీని ఉసిగొలిపి డీఎంకే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తాము నిరసనలకు పిలుపు నివ్వగానే కేసులు, దాడులు అంటూ ముందుకు సాగడం శోచనీయమన్నారు. ఈ విషయంపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ స్పందిస్తూ, 2011 తర్వాత తనతో పాటుగా డీఎంకే వర్గాల్ని అన్నాడీఎంకే సర్కారు పెద్దఎత్తున అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. అది కక్షసాధింపు అయితే, ఇది కూడా అలాగే అనుకోనివ్వండి అని పేర్కొన్నారు. -
మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లో సోదాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి సంబంధించిన ఇళ్లు, సంస్థలే లక్ష్యంగా మంగళవారం తమిళనాడులో 60 చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీకరప్షన్ (డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి. వేలుమణితో సహా 17 మందిపై డీవీఏసీ కేసుల్ని నమోదు చేసింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం గత నెల అన్నాడీఎంకేకు చెందిన రవాణాశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్పై ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం నగరాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి టార్గెట్గా కోయంబత్తూరులో 42 చోట్ల, చెన్నైలో 16 చోట్ల, దిండుగల్, కాంచీపురంలలో తలా ఓ చోట డీవీఏసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో చెన్నై , కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ. 810 కోట్ల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు, మంత్రి , ఆయన సన్నిహితులు ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు దర్యాప్తులో స్పష్టం కావడంతో డీవీఏసీ ఈ దాడులు చేసింది. వేలుమణి, ఆయన సోదరుడు అన్భరసన్, సన్నిహితుడు చంద్రశేఖర్, గతంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన మధురాంతకీ, చెన్నై కార్పొరేషన్ ప్రధాన ఇంజినీరు నందకుమార్, మాజీ ఇంజినీరు పుగలేంది ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కాగా దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఆందోళన నిర్వహించాయి. -
గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ హయాంలో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయింది. అప్పట్లో ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీల నిర్వాహకులు, వ్యాపారులు అక్రమాలకు తెరలేపగా.. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ దందా నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గనులను అడ్డగోలుగా దోచేశారు. క్వారీల నిర్వాహకులు, లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.కోట్లకొద్దీ రాయల్టీని ఎగ్గొట్టారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించటంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా అక్రమాలను వెలుగులోకి తీశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. 155 క్వారీల్లో అక్రమాలు ఇప్పటివరకు జరిపిన విచారణలో 155 గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. వీటి నిర్వాహకులకు రూ.3,527 కోట్లు జరిమానా విధించేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రానైట్ ఫ్యాక్టరీలు, పాలిషింగ్ యూనిట్లపైనా విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వీరినుంచి కూడా జీఎస్టీ, రాయల్టీ రూపంలో మరో రూ.2 వేల కోట్లు జరిమానా విధించేందుకు సన్నద్ధం కాగా.. గ్రానైట్ క్వారీ లీజుదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విజిలెన్స్ విచారణకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారిపై 100 పైగా కేసులు నమోదు చేయించి ఆట కట్టించారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడం వెనుక ప్రకాశం జిల్లాలోని భూగర్భ గనుల శాఖ (మైనింగ్) అధికారుల పాత్ర కూడా ఉంది. దాదాపు రాయల్టీ రూపంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఎగ్గొట్టినట్టు విజిలెన్స్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. అక్రమాలకు చెక్ పెడతాం ఎవరైనా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదు. క్వారీల్లోంచి బయటకు తీసిన ప్రతి రాయి రవాణా చేసేప్పుడు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి ఏ ఒక్కరైనా గండి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. గ్రానైట్ రవాణాపై ఎప్పటికప్పుడు విజిలెన్స్ నిఘా ఉంటుంది. – కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చదవండి: గోదావరి డెల్టాలకు పోల‘వరం’ -
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారుల దాడులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కారణంగా రోగులు ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పలు ఆస్పత్రుల పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 9 ప్రైవేట్ ఆస్పత్రులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడమే గాక పేషెంట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకుగాను ఏలూరులోని చైత్ర ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లాలో రోగుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆశా ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. విశాఖ ఎస్ఆర్ హాస్పిటల్, అనిల్ నీరుకొండ కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఆస్పత్రులు అధిక ధరలు వసూలు, రెమిడెసివర్ దుర్వినియోగం చేస్తుండడంతో వాటిపై కేసులు నమోదయ్యాయి. పలువురు ఆస్పత్రిలపై కేసు నమోదు విశాఖలోని రమ్య ఆస్పత్రి యాజమాన్యం అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం చేస్తున్నారని కేసు నమోదు చేశారు. విజయవాడ శ్రీరామ్ ఆస్పత్రిపైన కేసు నమోదు అయ్యింది. గుంటూరు విశ్వాస్ హాస్పటల్ లో అనుమతి లేకుండా వైద్యం చేయడమే కాకుండా అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. పీలేరు ప్రసాద్ హాస్పటల్ యాజమాన్యం అధిక ఫీజు వసూలు, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు. ఇలా పలు రకాల కారణంగా ఈ ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 37 ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. (చదవండి: అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం )
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement