breaking news
Vennupotu
-
జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటేనే మోసం
-
కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైఎస్సార్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి, జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం.. బుక్ కోసం క్లిక్ చేయండిజగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తులాంటిది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్టపాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5వేల పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు ముకుతాడు వేయాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని ఆలోచించ కూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
విజయవాడ : ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు (మంగళవారం, జూన్ 10వ తేదీ)) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నార వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు. చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది: ఆర్కే రోజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందిహోం మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదుఅధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలిఅధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారుమహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటునగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారుఅనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదుపరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చిందిడిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదుహోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి విజయవాడలో..రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కృష్ణాజిల్లా:లో.. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్రా నినాదాలతో వైఎస్సార్సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు.విశాఖలో..మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్సష్టం చేశారు. అనంతపురంలో.. అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు.వైఎస్ఆర్ జిల్లా:కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళనరాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై నిరసనరాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలుహోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపాటుఆమెకు నిత్యం జగన్ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని విమర్శ32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ కి ప్రశ్నమహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్32వేల మంది మహిళలను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్కాకినాడ జిల్లా:మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసనడా.బి.అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేతపాల్గొన్న వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాతఏలూరు జిల్లా:సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర... నినాదంతో ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నేతల నిరసనపాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు సరిత రెడ్డి, నగర అధ్యక్షురాలు విజయనిర్మల, పార్టీ మహిళా విభాగం నాయకులుఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళ నాయకులుమహిళలు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైంది: సరిత రెడ్డికూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయికూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేదుజగనన్న పాలనలో మహిళకు పెద్దపీట వేశారుచంద్రబాబు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఒక్క పథకం కూడా అమలు చేయలేదుఅంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారూజగనన్నదిశ యాప్ ద్వారా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే మహిళలకు అండగా నిలిచారుగత వారం రోజుల వ్యవధిలోని మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయిహోం మంత్రి మహిళ అయినా మహిళల పట్ల బాధ్యత లేదు కర్నూలు:కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆందోళనమహిళలు, బాలికల పై జరుగుతున్న అఘయిత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం నేతలు చిత్తూరు జిల్లా: దర్గా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంఅంబేద్కర్కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులురాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు..అంజలి రెడ్డికూటమి ప్రభుత్వం పాలనలో మహిళలు పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.మహిళలు పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోం మంత్రి మహిళగా ఉండి ఏం చేస్తున్నట్లు.. కార్పో రేటర్ హరిణి రెడ్డివైఎస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది.సంక్షేమ పాలన అందించారు..హరిణి రెడ్డిమహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు,మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు జగనన్న.. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి , -
Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది
-
వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్
-
చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు
-
జగన్ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్
-
Vennupotu Dinam: ఉదయగిరిలో YSRCP భారీ ర్యాలీ
-
Buchepalli Sivaprasad: దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్, నీకు పాలన చేతకాకపోతే దిగిపో
-
పబ్లిసిటీ కాదు పనులు చేయాలి.. వెన్నుపోటు దినం నిరసనల్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు
-
వెన్నుపోటు దినం నిరసన హోరు.. ఇది ట్రైలర్ మాత్రమే!
-
ఆలూరులో వెన్నుపోటు దినం
-
MLA Deepika: బాలయ్య అడ్డాలో బాబుకు సవాల్..!
-
Vennupotu Dinam: పోలీసుల ఓవర్ యాక్షన్ దుమ్ములేపిన పేర్ని కిట్టు
-
చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య: శ్యామల
-
చంద్రబాబు చరిత్ర పూర్తిగా మోసపూరితం : ఎంపీ మిథున్ రెడ్డి
-
ప్రజల చేతికి చిప్ప తప్పు... బాబు, లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
ప్రజా శంఖారావం.. ఇది ఆరంభం మాత్రమే!
-
Sajjala Ramakrishna: బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం
-
Usha Sri: బాబుకు వెన్నులో వణుకు వచ్చేలా పెనుకొండలో వెన్నుపోటు దినం ర్యాలీ
-
Perni Nani: మీ వల్ల ప్రతి ఇంట్లో ఎన్ని దీపాలు ఆగాయో తెలుసా?
-
Vennupotu Dinam: చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు
-
కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు రోజా
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
రాష్ట్ర ప్రజలను నిలువునా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం
-
దమ్ముంటే ఆపు .. అంబటి VS పోలీసులు
-
ప్రజలకే వెన్నుపోటు.. బాబును క్షమించే ప్రసక్తే లేదు (చిత్రాలు)
-
వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్.. భారీగా జన సంద్రం..
-
వెన్నుదినంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నెల్లూరు ప్రజలు
-
ఏం చేశారని దీపావళి చేసుకోవాలి.. వెన్నుపోటుపై వినూత్న నిరసన
-
చీపురుపల్లిలో బొత్స నిరసన
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ పోలీసుల తీరుపై ఆగ్రహం
-
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంద్రప్రదేశ్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. -
AP Belt Shops: ఏడాది పాలనలో దశాబ్దాల విధ్వంసం
-
ఏపీలో తాలిబాన్లను తలదన్నేలా ఎల్లోబాన్ల అరాచకాలు
-
ప్రజలను తాగుబోతులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోన్న చంద్రబాబు సర్కార్
-
మందు.. బాబు
-
మహిళలకు ఉపాధి కల్పించటమంటే మద్యం అమ్మటమా బాబూ..
-
బాబు హయాం కన్నా జగన్ పాలనలో సగానికి తగ్గిన మద్యం అమ్మకాలు
-
ఆ రోజు జగన్ పై నిందలు వేశావ్ ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి?
-
జాబులు ఎందుకు తమ్ముళ్లు.. 24 గంటలు మద్యం ఉండగా!
-
మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతోన్న చంద్రబాబు
-
ఆంధ్రప్రదేశ్ లో ఏరులై పారుతున్న మద్యం
-
కూటమి ప్రభుత్వం వేధింపులపై YSRCP కార్యకర్త ప్రవీణ్ సెల్ఫీ వీడియో
-
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు
-
చంద్రబాబు వెన్నుపోటుకు 29 ఏళ్లు
సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు చంద్రబాబే ప్రపంచ బ్రాండ్. ఆయనకు ఈ ఘనత వచ్చి నేటితో సరిగ్గా 29 ఏళ్లు నిండింది. 30వ సంవత్సరంలోకి అడుగిడుతోంది. పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్నే అధికార దాహంతో వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులేయించి, 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎం పీఠాన్ని ఎక్కారు. అప్పటి నుంచి తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. రాజకీయాలను డబ్బు మయం చేసి, కుట్రలు, కుతంత్రాలతో 3 దశాబ్దాలుగా నాయకుడిగా చలామణి అవుతున్నారు. అప్పటి వెన్నుపోటుకు మూడు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా తనను గొప్పగా కీర్తిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబును దశమ గ్రహంతో పోలి్చన ఎన్టీఆర్ చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆయన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ట్రాప్లో పడేసి వెన్నుపోటు ప్రహసనంలో పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్కు ద్రోహం చేసి పదవి నుండి తప్పించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, గుర్తును సొంతం చేసుకున్నారు. ఈ తిరుగుబాటులో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు మాయలో పడ్డారని గ్రహించిన ఎన్టీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్ హోటల్కు వెళ్తే చంద్రబాబు దగ్గరుండి ఎన్టీఆర్పై చెప్పులు వేయించి దాడి చేశారు.ఈ ఘోరమైన అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్ తనకు జరిగిన అవమానంతో కుంగిపోయారు. ఆ క్షణమే తాను చచ్చిపోయినట్లు లెక్క అని కంటతడి పెట్టి ఆక్రోశించారు. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాను చంద్రబాబు ఫ్రీజ్ చేయించారు. ఎన్టీఆర్ కురీ్చని కబ్జా చేసిన చంద్రబాబు అసెంబ్లీలోనూ ఆయన్ని అవమానించారు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ తనదైన శైలితో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ తన జీవిత చరమాంకంలో సొంత మనుషుల చేతుల్లోనే ఘోరమైన అవమానాలు పొంది కంట తడి పెట్టుకున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్ దశమ గ్రహంగా, ఔరంగజేబుగానూ పోల్చారు. చంద్రబాబు పరివారం పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్ కన్ను మూశారన్నది చరిత్ర చెప్పే విషయం. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు చంద్రబాబు అనేక నిర్ణయాలు తీసుకున్నారు.ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం, రెండు రూపాయల బియ్యం పథకాలను ఎత్తివేశారు. రైతులకు నీటి రాయితీని తొలగించారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ జ్ఞాపకాలు లేకుండా చెరిపేశారు. ఇలా అనేక చర్యలతో ఎన్టీఆర్ను ప్రజలకు దూరం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్టీఆర్ను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తూ అనుక్షణం క్షోభ పెట్టిన చంద్రబాబు.. రాజకీయ అవసరాలకు మాత్రం ఎన్టీఆర్ పేరు, బొమ్మ వాడేసుకుంటారు. ఎన్టీఆర్ గురించి గొప్పగా చెబుతూ నిజ జీవితంలో ఎన్టీఆర్ను మించిన మహానటుడి పాత్ర పోషిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా అన్ని దారుణాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తేలా పొగడడం రాజకీయ వైచిత్రేనంటారు రాజకీయ విశ్లేషకులు.బాబు హయాంలో అనేక నేరాలు, ఘోరాలు995లో ఎన్టీఆర్ను ద్రోహపూరితంగా గద్దె దించి, తాను పీఠమెక్కింది మొదలు చంద్రబాబు రాజకీయం, పరిపాలన మొత్తం కుట్రలు, కుతంత్రాలు, స్వార్థ ప్రయోజనాలే. 1995 – 2004 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారనే విమర్శలున్నాయి. “ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మాయగాడు’ అంటూ అప్పట్లో కమ్యూనిస్టులు ప్రత్యేక పాటలు రచించి ప్రచారం చేశాయంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను వంచించారో అర్థం చేసుకోవచ్చు. హైటెక్ సిటీ నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు కూడగట్టారు. ఏలేరు స్కాం, తెల్గీ స్టాంపులు, మద్యం ముడుపులు, పనికి ఆహార పథకం వంటి కుంభకోణాలు అనేకం వెలుగు చూశాయి.అప్పట్లోనే ‘చంద్రబాబు జమానా–అవినీతి ఖజానా’ అని సీపీఎం పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేశారు. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వందలాది మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంతో ప్రజలు ఉద్యమించి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 2000 సంవత్సరంలో వారిపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది.ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారి చంద్రబాబు రాక్షసత్వాన్ని బయటపెట్టింది. అంతకు ముందు తణుకు సమీపంలోని కాల్దరి రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపించి ఒక రైతు మృతికి కారకుడయ్యారు. వీటన్నింటిపైనా వైఎస్ రాజశేఖర్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దాని పర్యవసానమే 2004 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయి వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చారు.రంగా హత్యలోనూ తెరవెనుక పాత్ర! రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహన రంగా తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డు తొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాశారు.రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ కుంభకోణాలు రాష్ట్ర విభజన తర్వాత ప్రజలను ఏమార్చి దొంగ హామీలతో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను పీక్కు తిన్నారు. అమరావతి రాజధాని పేరుతో చేసిన అంతర్జాతీయ కుంభకోణంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. రాజధాని కోసం రైతులపై దౌర్జన్యాలకు పాల్పడి బలవంతపు భూసమీకరణ చేశారు. అసైన్డ్ భూములను లాక్కోవడం, ఇన్సైడర్ ట్రేడింగ్, ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, విశాఖలో లక్ష ఎకరాల భూ కుంభకోణం, నీరు–చెట్టు కార్యక్రమంలో అవినీతి వంటి లెక్కలేనని వ్యవహారాలు బయటకు వచ్చాయి.ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని మరోసారి చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏకంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. ప్రజలను మాయ చేసి కనీవినీ ఎరుగని అబద్ధాలు, దొంగ హామీలతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. వెన్నుపోట్లు, మోసం, నయవంచనతో రాజకీయ జీవితాన్ని నిరి్మంచుకున్న చంద్రబాబు తనను ఒక విజనరీగా చూపించేందుకు ఎల్లో మీడియాను ఉపయోగించుకున్నారు.చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే ఈ మీడియా ఆయన్ని అవతార పురుషుడిగా, అభివృద్ధి ప్రదాతగా కీర్తిస్తూ నిత్యం ప్రజలను ఏమారుస్తూనే ఉంటుంది. మీడియా హైప్, సొంత డబ్బా కొట్టుకోవడంలోనే ఆయన విజన్ కనిపిస్తుంది తప్ప నిజానికి చంద్రబాబు ఒక దారి తప్పిన, మోసపూరిత నాయకుడు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత వంచించడం ఆయన నైజం. వీటన్నింటినీ దాచి చంద్రబాబును గొప్ప నేతగా టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా కీర్తించడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. -
Mark Antony: చంద్రబాబు ‘వెన్నుపోటు’పై హీరో విశాల్ సెటైర్లు
గత 30 ఏళ్లుగా ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుంచి టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పటి నుంచి వెన్నుపోటు పదం రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఈ వెన్నుపోటుపై చర్చ జరుగుతూనే ఉంది. స్వయాన ఎన్టీఆర్ గారే ‘ పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు’అని మండిపడ్డాడు. దీంతో వెన్నుపోటు అనగానే తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు టక్కున గుర్తొస్తాడు. తాజాగా ఈ వెన్నుపోటు డైలాగ్తో చంద్రబాబుపై సెటైర్లు పేల్చాడు హీరో విశాల్. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ‘మార్క్ ఆంటోని’ విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తమిళ్తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. గ్యాంగ్స్టర్ డ్రామాకి టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరెక్కించాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. బాబుపై ‘వెన్నుపోటు’ సెటైర్లు ఇది డబ్బింగ్ సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కొన్ని సంభాషణలను పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు గురించి హీరో విశాల్ వేసే సెటైరికల్ డైలాగ్ థియేటర్స్లో విజిల్స్ వేయించింది. ఈ సినిమా కథ 1975 నేపథ్యంలో సాగుతున్నప్పుడు ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’సినిమా కోసం హీరో తన స్నేహితుడితో కలిసి థియేటర్కి వెళ్తాడు. అక్కడ ఒకడు కత్తితో హీరోపై దాడి చేస్తాడు. వెనుకవైపు నుంచి పొడిచేందుకు ప్రయత్నించగా.. హీరో వాడిని పట్టుకుంటాడు. ఈ క్రమంలో వాడి షర్ట్ చిరిగిపోయి.. గుండెలపై ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తుంది. అంటే వాడు ఎన్టీఆర్ అభిమాని అన్నమాట. అది గమనించిన హీరో.. ‘అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవరికి వెన్నుపోటు పొడిచే అలవాటే లేదురా’అంటాడు. వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తుకు రావడం సహజం. అందుకే విశాల్ ఆ డైలాగ్ చెప్పగానే ‘చంద్రబాబు..చంద్రబాబు’అని ఆడియన్స్ గట్టిగా నవ్వుతున్నారు. -
రౌడీ రాజకీయాలను ప్రేరేపిస్తున్న బాబు, లోకేశ్
తిరుపతి సిటీ: చంద్రబాబు, లోకేశ్ పాదయాత్రల పేరుతో చంపుతాం.. అంతు చూస్తాం.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తామని ఒక్క మాట కూడా లోకేశ్ తన పాదయాత్రలో మాట్లాడకపోవడం దారుణమన్నారు.పుంగనూరులో టీడీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కులపిచ్చి, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజాప్రభుత్వం రావాలనే ఆకాంక్ష టీడీపీ వారికి లేదన్నారు. రామోజీ గ్రూపునకు చెందిన మార్గదర్శి సంస్థ మోసాలను సీఎం వైఎస్ జగన్ బయటపెట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పదవులు పోవడంతో మతిభ్రమించి బొండా ఉమ, అయ్యన్నపాత్రుడు రాక్షసుల్లాగా మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఉచ్చపోయిస్తాం.. అంటున్న లోకేశ్ లెట్రిన్, బాత్రూమ్లు కట్టే పనిలో ఉన్నారా.. అని ప్రశ్నించారు. లోకేశ్ అందుకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. -
వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్ను వెన్నుపోటు పోడిచిన పాపం బాబును వెంటాడుతుంది
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ను మించిన వెన్నుపోటు’
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ను మించిన వెన్నుపోటు’
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ను హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్) ఓ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా సహచర ఆటగాడినే మరో బ్యాట్స్మెన్ రనౌట్ చేయిస్తాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్మన్ డిఫెన్స్ ఆడి పరుగుకు పిలుస్తాడు. వెంటనే నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మన్ పరుగు కోసం యత్నించాడు. వెంటనే డిఫెన్స్ ఆడిన బ్యాట్స్మన్ బంతిని బౌలర్కు అందించి సహచర ఆటగాడు రనౌట్లో భాగస్వామ్యమవుతాడు. దీంతో సొంత జట్టు ఆటగాడి చర్యతో షాక్కు గురైన బ్యాట్స్మన్ అసహనంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ను మించిన వెన్నుపోటు ఇది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ వెన్నుపోటు ఉంటుందని నిరూపించావ్ బ్రదర్’అంటూ వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. (ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు) @RGVzoomin #LakshmiNTR ni minchina venupootu idhi!! pic.twitter.com/nxt3eVfk3F — Saketh Ram Peri (@saketh_4490) March 12, 2019 -
వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ
-
వీళ్లను గుర్తించటంలో సాయం చేయండి : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్లో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్కు సంబంధించి పాటలతో వివాదాలకు తెర తీసిన వర్మ సోషల్ మీడియా పోస్ట్లతో మరింత వేడి పెంచుతున్నాడు. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ ఆసక్తికర కామెంట్ చేశాడు. బాహుబలి 2 టైటిల్స్ సమయంలో వచ్చిన బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫొటోషాప్లో గ్రాఫిక్స్ చేసిన ఇమేజ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ.. ‘ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. వీరిని గుర్తుపట్టడంలో నాకు సాయం చేయండి’ అంటూ కామెంట్ చేశాడు. వర్మ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈసినిమాలో కీలక పాత్రల్లో యాగ్న శెట్టి, శ్రీతేజ్లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు కీలక పాత్రల్లో నటించనున్నారు. These faces are vaguely reminding of two people I know ..can u please help me with my memory pic.twitter.com/Hgqb3tKNB5 — Ram Gopal Varma (@RGVzoomin) 19 January 2019