breaking news
Valmiki boyalu
-
AP: వాల్మీకి బోయ, బెంతో ఒరియా కులాలపై ఏక సభ్య కమిషన్
సాక్షి, అమరావతి: ఏపీలోని వాల్మీకి/ బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. శామ్యూల్ ఆనంద్ను ఏకసభ్య కమిషన్గా నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మూడు నెలల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వాల్మీకి, బోయలు ఉన్నట్లు అంచనా. -
అలంకార్ సెంటర్లో ఉద్రిక్తత
-
అలంకార్ సెంటర్లో ఉద్రిక్తత
విజయవాడ: వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం విజయవాడ అలంకార్ సెంటర్లో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్లను తీర్చాలని కోరుతూ.. కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థతి విషమంగా ఉంది.