-
Mahadev app case: సీఎం బఘేల్కు డబ్బు పంపలేదు
రాయ్పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
‘మహా’ ట్విస్ట్; మాట మార్చిన ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గానికి నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే మరో ట్విస్ట్ ఇచ్చారు. తమతో ఏ జాతీయ పార్టీ సంప్రదింపులు జరపడం లేదని పేర్కొంటూ యూ టర్న్ తీసుకున్నారు. శక్తివంతమైన జాతీయ పార్టీ తమకు సాయం చేస్తోందని చెప్పిన మరుసటి రోజే ఆయన మాట మార్చడం గమనార్హం. గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో తన వర్గం ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘మనమంతా ఐక్యంగా ఉండాలి. మనం చేసిన తిరుగుబాటును ఓ జాతీయ పార్టీ ప్రశంసించింది. మనకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ముందుకు వచ్చింది. ఆ జాతీయ పార్టీ మహాశక్తివంతమైనద’ని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆయన మాట మార్చారు. శివసేన చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నపై.. ఓ టీవీ చానల్తో షిండే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఓ మహాశక్తి మాకు ఇస్తుందని నేను చేసిన వ్యాఖ్యలు బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేలను ఉద్దేశించినవ’ని జవాబిచ్చారు. కాగా, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంతో మతకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. శివసేన పార్టీ అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టబోమని తెలిపింది. బీజేపీ కుటిల యత్నాలు: కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రేను పదవి నుంచి దించేందుకు బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయనను గద్దె దించేందుకు బీజేపీ చేయని కుట్రలు లేవు. మహా వికాస్ ఆఘాడీ సర్కారు సామాన్యుల విశ్వాసాన్ని చూరగొనడంతో కాషాయ పార్టీ కడుపుమంటతో రగిలిపోతంద’ని తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే అనైతికంగా వ్యవహరించారని, అపవిత్ర పొత్తు పెట్టకున్నందుకు ఆయన ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే తొలగింపు చెల్లుతుంది!) -
తగ్గేదేలే... ఈసారి గర్వంగా మెలేశాడు
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు. -
కేంద్రమంత్రి యూ టర్న్..‘ ఆ చట్టాలు మళ్లీ తెచ్చే ప్రశ్నే లేదు’
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట మార్చారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటన తర్వాత పార్లమెంట్ సాక్షిగా రద్దయిన సాగు చట్టాలను భవిష్యత్లో అమల్లోకి తెస్తామని నర్మగర్భంగా మాట్లాడిన మంత్రి రెండ్రోజులకే యూ టర్న్ తీసుకున్నారు. ఉపసంహరించుకున్న ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన లేదని ఆయన ఆదివారం స్పష్టంచేశారు. మహరాష్ట్రలోని నాగ్పూర్లో ఒక వ్యవసాయ సంబంధ కార్యక్రమంలో శుక్రవారం తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని, అసలు ఈ గందరగోళానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ వ్యవసాయ కార్యక్రమంలో నేను మాట్లాడింది వేరు. ‘రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గాం. రైతు సంక్షేమం విషయంలో ముందడుగు వేస్తాం’ అని మాత్రమే నేను అన్నాను. చట్టాల విషయంలో కాదు. ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన మోదీ సర్కార్కు ఎంత మాత్రం లేదు’’ అని తోమర్ వివరణ ఇచ్చారు. ‘ రైతు సంక్షేమానికి మేలుబాటలు పరుస్తూ 2006లో స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులను పట్టించుకోని వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఇలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్పై తోమర్ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆ చట్టాల తరహాలో కొత్త చట్టాలను తేవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని కాంగ్రెస్ విమర్శించడం తెల్సిందే. ఎన్నికల తర్వాత దొడ్డిదారిన తెస్తారు: కాంగ్రెస్ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటుందని పేర్కొంది. అందుకే, ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చింది. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: గత నెల(సెప్టెంబర్)లో ప్రయివేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. దీంతో పెట్టుబడులు సగానికి తగ్గాయి. 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది సెప్టెంబర్లో నమోదైన 4.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి అధికమే అయినప్పటికీ ఆగస్ట్లో 10.9 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక త్రైమాసికవారీగా చూస్తే క్యూ3(జులై–సెప్టెంబర్)లో 3.4 రెట్లు జంప్చేసి 25.3 బిలియన్ డాలర్లను తాకాయి. ప్రధానంగా స్టార్టప్లలో పెట్టుబడులు జోరందుకోవడం ప్రభావం చూపినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమల లాబీ ఐవీసీఏ సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్ల వాటా 39 శాతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసింది. పెట్టుబడులు, అమ్మకాలు ఇలా ఈ ఏడాది(2021)లో పీఈ, వీసీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్లకు చేరగలవని ఈవై నిపుణులు వివేక్ సోనీ అంచనా వేశారు. ఇక పెట్టుబడి విక్రయాలు 50 బిలియన్ డాలర్లను తాకే వీలున్నట్లు పేర్కొన్నారు. మరో కన్సల్టెన్సీ దిగ్గజం గ్రాంట్ థార్న్టన్ భారత్ సైతం డీల్స్పై రూపొందించిన నివేదికలో క్యూ3లో 597 లావాదేవీలు జరిగినట్లు తెలియజేసింది. వీటి విలువ 30 బిలియన్ డాలర్లుగా మదింపు చేసింది. రియలీ్ట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మినహాయిస్తే పీఈ, వీసీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఈవై నివేదిక పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
దంపతులను ఢీకొన్న లారీ
రత్నగిరికి ఉత్సవ శోభ
వాహనాల తనిఖీలో రూ.2.71 కోట్ల పట్టివేత
ట్రిపుల్ ఐటీ.. భవితకు మేటి
రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement