breaking news
True
-
ఆలకించడమూ ఓ కళే!
మానవ సంబంధాలలో, సమర్థవంతమైన సంభాషణకు పునాది శ్రద్ధగా వినడం. ఇది కేవలం మాటలను వినడం కాదు, మాట్లాడేవారి భావాలను, ఉద్దేశాలను, చెప్పదలచుకున్న అసలు విషయాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన కళ. శ్రద్ధగా వినడం ద్వారానే అపార్థాలు తొలగిపోతాయి, బంధాలు బలపడతాయి. నిజమైన అవగాహన ఏర్పడుతుంది.శ్రోతుం తు యతతే నర్తకో గీయతే యదా ్ఢవక్తుం యతతే బాలస్తం న శృణ్వంతి పండితాః నాట్యం చేసేవారు పాటను శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తారు. పండితులు మాట్లాడేటప్పుడు పిల్లలు వినడానికి ప్రయత్నించరు. ఈ శ్లోకం వినడంలోని ప్రాముఖ్యతను, విజ్ఞులు ఇతరుల మాటలను ఎంత శ్రద్ధగా వింటారో సూచిస్తుంది.శ్రద్ధగా వినడం అనేది ఒక గొప్ప నైపుణ్యం, దీనిని సాధన ద్వారా పెంపొందించుకోవచ్చు. సనాతన ధర్మంలో జ్ఞాన సముపార్జనకు ‘శ్రవణం’ (వినడం) మొదటి మెట్టుగా చెప్పబడింది. గురువుల నుండి, పెద్దల నుండి జ్ఞానాన్ని పొందడానికి శ్రద్ధగా వినడం అత్యవసరం. శ్రద్ధగా వినడం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, వృత్తిపరమైన రంగంలో కూడా అత్యంత కీలకమైనది. ఒక వ్యాపారవేత్త ఖాతాదారుల అవసరాలను శ్రద్ధగా వింటేనే సరైన సేవలను అందించగలడు. ఒక నాయకుడు తన బృంద సభ్యుల సమస్యలను విని, పరిష్కారాలు చూపడం ద్వారా విశ్వసనీయతను పొందుతాడు. కుటుంబంలో, స్నేహితుల మధ్య తలెత్తే అనేక చిన్నపాటి సమస్యలకు, అపార్థాలకు ప్రధాన కారణం ఒకరి మాటలను మరొకరు శ్రద్ధగా వినకపోవడమే. నిశ్శబ్దంగా ఉండి, ఎదుటి వ్యక్తిని మాట్లాడటానికి ప్రోత్సహించడం, వారి మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం – ఇవన్నీ శ్రద్ధగా వినే లక్షణాలు. ఇవి కేవలం సంభాషణను సులభతరం చేయడమే కాదు, వ్యక్తిగత ఎదుగుదలకు, సామరస్య పూర్వక సంబంధాలకు పునాదులు వేస్తాయి.ఆకర్ణనతో భవంతి లోకే జ్ఞానినః సాధువాదినః అశ్రద్ధయా చ మూర్ఖత్వం భవేత్ సర్వదా ఖలు శ్రద్ధగా వినడం వల్లనే లోకంలో జ్ఞానులు, మంచి మాటలు పలికేవారు అవుతారు. అశ్రద్ధగా వినడం వల్ల ఎల్లప్పుడూ మూర్ఖత్వం కలుగుతుంది. ఈ సూక్తి శ్రద్ధగా వినడం వల్ల కలిగే ప్రయోజనాలను, అశ్రద్ధ వల్ల కలిగే నష్టాలను వివరిస్తుంది.వినయం శోభయతే విద్వాంసం శ్రవణం జ్ఞానదాయకమ్ అవధానం హి సర్వత్ర సఫలతాం ప్రయచ్ఛతివినయం విద్వాంసుడికి శోభను ఇస్తుంది, వినడం జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ విషయంలోనైనా శ్రద్ధే విజయానికి దారితీస్తుంది. ఈ శ్లోకం వినయం, వినడం, శ్రద్ధ అనే లక్షణాలు విజయానికి ఎలా దోహదపడతాయో స్పష్టం చేస్తుంది.శ్రద్ధగా వినడం అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ టెక్నిక్ మాత్రమే కాదు, అది ఎదుటి వ్యక్తిని గౌరవించే, వారి పట్ల సానుభూతిని చూపించే ఒక గొప్ప మానవ లక్షణం. ఇది సంబంధాలకు బలాన్నిస్తుంది, వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడుతుంది, సంఘర్షణలను తగ్గిస్తుంది. ప్రతి సంభాషణను ఒక అభ్యాస అవకాశంగా భావించి, శ్రద్ధగా వినే కళను అలవరచుకోవడం ద్వారా మనం జీవితంలో మరింత విజయవంతంగా, సంతోషంగా జీవించగలం.మహాభారతంలో ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా యుద్ధ వివరాలను విన్నప్పటికీ, తన పుత్ర ప్రేమ కారణంగా ఆయన మాటలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. అదే విదురుడు, శ్రీకృష్ణుడి మాటలను శ్రద్ధగా విని, ధర్మ సూక్ష్మాలను గ్రహించాడు. ఈ ఉదాహరణలు కేవలం వినడం సరిపోదని, అర్థం చేసుకునే తత్వంతో వినాలని చాటిచెబుతాయి.– కె. భాస్కర్ గుప్తా -
విశ్రాంతి అంటే..?
నీవు నీవుగా మిగిలిపోవడమే అసలైన విశ్రాంతి. ఎందుకంటే నీవు నీవుగా మిగిలిపోవడానికి ఏమైనా శ్రమ ఉందా? అస్సలు లేదు. కానీ మనిషి నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటూ విశ్రాంత స్థితి నుండి పక్కకు వెళ్ళిపోతున్నాడు. నీవు నీవు కావడానికి ఏమైనా శక్తి కావాలా? లేక ప్రయత్నం కావాలా? అసలు అలా ఉన్నప్పుడు అలసటనేదే ఉండదు.నీ పేరు మైత్రేయ అనుకుందాం. ఎప్పుడైతే నీవు మైత్రేయ అనే వ్యక్తివి ఐనావో, నాకు ప్రాముఖ్యత కావాలి. నన్ను సమాజం గుర్తించాలి, నన్ను గౌరవించాలి అనుకున్నావు. అదే నువ్వు ఆత్మగా ఉన్నపుడు, సాక్షిగా ఉన్నపుడు ఇలా అనిపించదు. అంటే సమాజంలో ఎప్పుడూ ఒక వ్యక్తిలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఏది కాదో అది నిరూపించుకోవాలని అనుకుంటున్నావు. అలా ఏదో నిరూపించాలని అనుకుంటున్నావు కాబట్టే నీలో ఎప్పుడూ ఏదో అలసట ఉండే తీరుతుంది. అందుకే చూడు ఎప్పుడైనా నీవు బయటికి వెళ్ళేటప్పుడు బాగా బిగుసుకోని పోతావు. ఇంటికి రాగానే రిలాక్స్ ఐపోతావు. ఎందుకంటే ఇంటికొచ్చాక నీవు నీవైపోతున్నావన్నమాట. అంటే రిలాక్సేషన్కి కారణం నీవు నీ అంతరాత్మతో ఉండటమే. నీవు సమాజంలో కలిసినప్పుడల్లా నీవు కానిది చూపించాలను కోని ఏదో ఒకటి నటిస్తూ వ్యక్తిత్వం అనే ముసుగును వేసుకుంటూ నీ అంతరాత్మకు దూరంగా జరిగిపోతున్నావు. నీ నిజతత్వమైన ప్రశాంతతకు విశ్రాంతికి చాలా దూరమవుతున్నావు.నీవు ఆత్మగా మిగిలిపోవడానికి ఏమీ చేయనవసరం లేదు. నీవు నీవుగా ఈ క్షణంలో సంపూర్ణత్వంతో మిగిలిపోతే నీవే ఆత్మ. ఆత్మ స్వయం ప్రకాశం అంటారు భగవద్గీతలో కూడా. సహజంగానే నీవు శాంతి, విశ్రాంతి మూర్తీభవించిన మనిషివి. నీలో లేనిది ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడూ ఇంకా ఏదో కావాలి అని వ్యక్తిగా కోరుకుంటూనే ఉంటాం. భగవద్గీత ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానికి చావులేదు. పుట్టుక లేదు. ఆత్మగా మిగిలిపోవడానికి ఏమైనా కావాలా? ఆత్మకు వస్తువులు, విషయాలు కావాలా? ఏమీ అబ్జర్లేదు. ఆత్మగా ఏదీ నీకు చెందదు. నీవు ఎవరికీ చెందవు. కానీ అన్నీ నీవే ఒక ఆత్మగా... దేవునిగా. అందుకే ఆత్మగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీవు అంతులేని ప్రకాశానివి, నీవే దైవానివి.– స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు -
వర్తమానమే... నిజం!
అరణ్యంలో ఉన్న ఓ జ్ఞాని దగ్గరకు వెళ్లిన ఒక యువకుడు తనకు నిజమంటే ఏమిటో చెప్పాలని కోరాడు. వెంటనే జ్ఞాని ‘నిజం సంగతి ఇప్పటికి పక్కనపెట్టు. నేనడిగిన దానికి జవాబు చెప్పు. మీ ఊళ్ళో బియ్యం ధర ఎంతో చెప్పు’ అన్నాడు. అందుకు యువకుడు వినమ్రంగా ‘స్వామీ! నన్ను మన్నించండి. మర్యాద మరచి మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఇక మీదట నన్ను అడక్కండి. ఎందుకంటే నేను గతకాలపు దారులు మరచిపోయాను. గతానికి సంబంధించినంత వరకు నేను ఇప్పుడు మరణించాను. ఇదిగో ఇప్పుడు నడిచొ చ్చిన మార్గాన్ని కూడా నేను మరచిపోయాను’ అన్నాడు. ‘నువ్వు గత కాలపు భారాన్ని ఇంకా మోస్తున్నావా... లేదా అనేది తెలుసుకోవడానికే బియ్యం ధర ఎంతని అడిగాను. నువ్వు దానికి జవాబు చెప్పి ఉంటే వెంటనే నిన్ను ఇక్కడినుంచి పంపించేసేవాడిని. నిజం గురించి మాట్లాడటానికి తిరస్కరించే వాడిని’ అన్నాడు. ‘అయితే ఇపుడు చెప్పండి నిజమంటే ఏమిటో’ అని అడిగాడు యువకుడు.‘వర్తమానంలో బతకడం తెలీని మనిషిని ఓ తోటలోకి తీసుకు వెళ్ళి ఓ గులాబీ పువ్వుని అతనికి చూపించు. ఈ గులాబీ ఎంత అందమైనదో అని అతనితో అను. వెంటనే అతను దీని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. సాయంత్రంలోపు వాడి రాలిపోతుంది అంటాడు. యవ్వనం ఎంతటి సుఖమైనదో చెప్పమని అడిగితే అది నిజమే కావచ్చు కానీ ముసలితనం త్వరగా వచ్చేస్తుందిగా అంటాడు. సంతోషం గురించి మాట్లాడితే అదంతా వట్టి మాయ అంటాడు. కానీ వర్తమానంలో బతకడం తెలిసిన వ్యక్తిని ఓ ఉద్యానంలోకి తీసుకు వెళ్తే అక్కడి రంగు రంగుల పువ్వులను చూపిస్తే వాటిని చూసి అతనెంతగా ఆనందిస్తాడో తెలుసా... ఎన్ని కబుర్లు చెప్తాడో తెలుసా! ఇవి చూడటానికి వచ్చిన దారులను గురించి ఆలోచించవలసిన అవసరమేముందంటాడు.రాలిపోయే పువ్వులైనా సరే ఇప్పుడు ఎంత ఆందంగా ఉన్నాయో అంటాడు. వికసించే పువ్వులు అందమైనవా... రాలిపోయే పువ్వులు అందమైనవా అని అడిగితే గతించిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వర్తమానంలోని నిజాన్ని గ్రహించలేమంటాడు. అది నిజం. ఏది నిజమో అది ఈ క్షణంలో ఉంది. నిజమనేది గతించిన, రానున్న కాలాలకు సంబంధించినది కాదు. వర్తమానమే నిజమైన కాలం’ అని చెప్పాడు జ్ఞాని. యువకుడికి విషయం అర్థమైంది. ఆనందంగా వెనుతిరిగాడు. – యామిజాల జగదీశ్ -
'ట్రూ' మూవీ ఫస్ట్ లుక్ విడుదల..
గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన 'ట్రూ' మూవీ :ఫస్ట్ లుక్ రిలీజైంది. మూవీ క్రిటిక్, ప్రముఖ యాంకర్ టి.ఎన్ ఆర్ ట్రూ మూవీ పోస్ట్ర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు బెస్ట్ విషెస్ అందజేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్యామ్ మండల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హరీష్ వినయ్ హీరోగా నటించగా, మణికంఠ ముఖ్య పాత్ర పోషించారు. హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ " బైలంపుడి నా మొదటి సినిమా, ఈ ట్రూ మూవీ నా సెకండ్ మూవీ. నా మీద నమ్మకముంచి నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ కేఆర్ గారికి, డైరెక్టర్ శ్యామ్ మండల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అలాగే పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. . డైరెక్టర్ శ్యామ్ మండల మాట్లాడుతూ " నాకు దర్శకుడిగా ఈ ట్రూ మూవీ మొదటి సినిమా.. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఆర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రూ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎక్కడా డీవియేట్ అవకుండా హోల్ మూవీ ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. డెఫినిట్ గా ట్రూ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నా నమ్మకం.. ఇక ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ పిలవగానే రావడానికి ఒప్పుకున్న మా శ్రేయోభిలాషి టి.ఎన్ ఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ ముగించారు. -
స్వీడన్ పర్యటనలో ప్రధాని మోదీ
-
ట్రూజెట్ సర్వీసు రద్దు
మధురపూడి : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానా్రÔ¶ యానికి సాయంత్రం 4–20 గంటలకు రావాల్సిన ట్రూజెట్ విమాన సర్వీసు మంగళవారం కూడా రద్దయింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సర్వీసు రద్దయినట్టు స్థానిక ప్రతినిధి తెలిపారు. సాయంత్రం 4–20 గంటలకు ఇక్కడకు చేరే ఈ సర్వీసు 4–40 గంటలకు తిరిగి చెన్నైకు బయలుదేరుతుంది. కొన్ని రోజులుగా ఈ సర్వీసు రద్దవుతున్న సంగతి తెల్సిందే. కాగా వర్షాకాలం ప్రారంభం కావడం, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడటం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు దీనిని నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
సత్యం పలికేవానికి అన్నీ సాధ్యమే
శ్లోకనీతి భాగవత పద్యం-7 మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్యదెరుక కలుగు వాని కిష్టమెయ్య దీశ భక్తిరతునికీరాని దెయ్యది యెరుక లేనివానికేది కీడు వ్యాఖ్యాన భావం... పరీక్షిన్మహారాజా! సత్యం పలికేవానికి అసాధ్యమనేదే ఉండదు. వానికి అన్నీ సాధ్యమే. యుక్తాయుక్త విచక్షణ కలవానికి ‘ఇది ఇష్టము - ఇది అనిష్టము’ అనే భేద భావం ఉండదు. స్థిరబుద్ధితో ఉంటారు. భగవద్భక్తుడు ఈయరానిదంటూ ఏదీ ఉండదు. (సర్వస్వాన్నీ త్యాగం చేస్తాడు). అజ్ఞానికి ‘ఇది మేలు - ఇది కీడు’ అనే జ్ఞానమే ఉండదు కదా! తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే ఇంగితజ్ఞానం వానికి ఉండదు. అంటూ వసుదేవుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి కంసునితో పలుకుతూ, తన మాటపై నిలిచి కొడుకును అప్పగించాడు. వసుదేవుని స్థిరబుద్ధికి కంసుడు ఎంతో సంబరపడి, ప్రశంసించాడు. ఆపదలు కలిగినప్పుడు ఆ ఆపద నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. స్థిరచిత్తంతో సదాలోచన చేయాలి. వసుదేవుడు ఎంతో చాకచక్యంగా కంసునితో ప్రవర్తించాడు.... అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి బోధించాడు. - డా. పురాణపండ వైజయంతి -
బాట్లా ఎన్కౌంటర్ నిజమైనదే