breaking news
Tirupati Laddu Case
-
బాబు, పవన్ పై హిందూ ధర్మ పరిరక్షణ వేదిక ఆగ్రహం..
-
దేవుడా లేక...త్రివిక్రమ్ స్క్రిప్ట్ మాట్లాడించిందా... ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు
-
తిరుపతి నెయ్యి.. రాజమండ్రి పాల ఘటనపై బొత్స స్ట్రాంగ్ రియాక్షన్
-
మార్కెట్లో 560కే ఇంద్రపూర్ నెయ్యి టీటీడీకి మాత్రం 658కి ఎలా?
-
తిరుమల లడ్డూ కథనాలపై ఎల్లో మీడియాకు కోర్టు నోటీసులు
సాక్షి,విజయవాడ: తిరుమల లడ్డు అంశంపై ఎల్లో మీడియాకు విజయవాడ కోర్టు నోటీసులు జారీచేసింది. తిరుమల లడ్డూ అంశంలో ఎల్లో మీడియా కథనాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంబంధిత కథనాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కూటమి అనుకూల ఎల్లో మీడియా తిరుమల లడ్డూ అంశంపై అనువసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పదేపదే టీటీడీ లడ్డులో జంతు కొవ్వులు,కెమికల్స్ కలిసాయంటూ న్యూస్ చానల్స్ డిబెట్లు పెడుతున్నాయని జడ శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అనవసర డిబెట్ల కారణంగా శ్రీవారి భక్తుల్లో ఆందోళన రేకెత్తుతుందన్నారు. న్యూస్ చానల్స్ చేస్తున్న రాద్ధాంతాన్ని కట్టడి చేయాలని కోర్టును కోరారు. జడ శ్రవణ్ కుమార్ వాదనలపై న్యాయస్థానం ఏకీభవించింది. కథనాలపై వివరణ ఇవ్వాలని సంబంధిత మీడియా ఛానెళ్లకు పంపించిన నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. -
గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఎవ్వడైనా కలుపుతాడా? రఫ్ఫాడించిన ఉండవల్లి
-
ఇందాపూర్, హెరిటేజ్ ఒక్కటే పాలు, పెరుగే కాదు పాలన కూడా కల్తీ
-
Tirumala Laddu Row : ఫ్రస్టేషన్లో పవన్ కళ్యాణ్
సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం గుంటూరులో జనసేన జనరల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు. లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
Chelluboyina: లడ్డూ కల్తీ కాదు.. చంద్రబాబే పెద్ద కల్తీ
-
Srinivas: నువ్వు సీఎంగా ఉన్నప్పుడు తీసిన శాంపిల్స్ లోనే
-
‘చంద్రబాబుకు ఇప్పటికీ బుద్ధి రాలేదు’
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ప్రతిపక్షం మీద బురద జల్లాలని చేసిన కుట్రను ల్యాబ్ రిపోర్ట్లు భగ్నం చేశాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అబద్దాల పునాదుల మీద అసత్యాలు పోగుచేసి జగన్గారి మీద, వైఎస్సార్సీపీ మీద బురద జల్లాలని చేసిన కుట్ర పటాపంచలైందన్నారు.దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థల నివేదికల ద్వారా ఈ కుట్రలు భగ్నమై నిజం బయటికి వచ్చిందన్నారు. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రెస్మీట్లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:కల్తీ నెయ్యి కుట్రకు అప్పుడే బీజం:చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నారు. అంతటితో ఆగకుండా పందికొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని, దాంతోనే లడ్డూలు తయారు చేశారని, వాటిని ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలతో దేశంలోని భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పంది కొవ్వు, పశువుల కొవ్వేమిటి!. లడ్డూ ప్రసాదంలో కలిశాయని ఓ ముఖ్యమంత్రే చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న అనుభవజ్ఢుడని చెప్పుకునే రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు ఇవి. వీటిని ఆరోజే విజ్ఞులైన వారంతా ఖండించారు.ఏ కొవ్వూ లేదని తేల్చిన ల్యాబ్లు. ఆ నివేదికలతో సీబీఐ సిట్ ఛార్జ్షీట్ :రాజకీయాల్లో ప్రత్యర్థులపై కక్ష సాధించాలంటే వేరేలా ప్రయత్నాలు చేయొచ్చు కానీ హిందూ ధర్మానికి భంగం కలిగేలా ప్రపంచంలో అందరూ కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని చేసిన ఆరోపణ సహించరానిది. అంతకు ముందే టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చీవాట్లు పెట్టి మీ సిట్ కాదు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ శాంపిల్స్ ను సెకండ్ ఒపీనియన్ కోసం మళ్లీ ల్యాబ్స్ కు పంపమని ఆదేశించింది. ఆ శాంపిల్స్ పరిశీలించిన ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ.. అందులో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేల్చి చెప్పాయి. ఆ నివేదికల ఆధారంగా, చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని సిట్ తేల్చింది. అదే విషయాన్ని పొందుపర్చిన సీబీఐ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయినా మీడియా బలంతో, అధికార బలంతో జగన్మోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోలతో దారుణంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు.మీ హయాంలో నెయ్యిపైనే ల్యాబ్ రిపోర్టులు:చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చాక జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తేదీల్లో వీఆర్ డెయిరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళ్తే శాంపిల్స్ తీసుకున్నారు. ఇది జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. ఈ శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపించి, నెయ్యి కల్తీ జరిగిందని ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా ల్యాబ్ రిపోర్ట్స్ లోనే ఇలా జరగొచ్చు అని చెప్తే.. వాటిని పట్టుకుని చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. దీని మీద సుప్రీంకోర్టు వెళ్తే చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత సిట్ వేస్తే విచారణ జరిపి తాజాగా నివేదిక ఇచ్చింది. దున్నపోతు ఈనిందంటే కట్టేయండి అన్న చందాన పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి వెళ్లి, మెట్లు కడిగి, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 జూన్, జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి పరీక్షలు చేయకుండా, సెకండ్ ఒపీనియన్ కూడా లేకుండా అయోధ్యకు పంపిన లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసారు.ఆ డెయిరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే:నెయ్యి కల్తీ పేరుతో ఆధారాలు లేకపోయినా రాజకీయంగా వైఎస్సార్సీపీపై బురదజల్లడంతో పాటు శ్రీవారిని కూడా అడ్డుపెట్టుకుని ఆయన ప్రసాదంలో పందికొవ్వు పేరుతో కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు. ఇవాళ ఏ కొవ్వూ లేదని తేలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి వాడామని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కల్తీ నెయ్యిని ఎందుకు వాడారో చెప్పండి. తిప్పిపంపిన ట్యాంకర్లను తిరిగి తెప్పించి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అపచారం కాదా వీళ్లు చెప్పాలి.నెయ్యిపై రిపోర్ట్ ఇచ్చిన సంస్థలు రెండూ ప్రతిష్టాత్మకమైనవే. ఇందులో ఒకటి హర్యానాలోని కర్నాల్ లో ఉన్న నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), అలాగే గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ). టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నెయ్యి పంపిణీ మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలోనే. మేం అనుమతి ఇచ్చినా చంద్రబాబు హయాంలో సరఫరా చేస్తుంటే సరి చూసుకోవాలిగా. మీ పాలనలో సరఫరా అయిన నెయ్యికి కూడా మేం ఎలా బాధ్యత వహిస్తాం ?, భోలేబాబాకు తొలుత అనుమతి ఇచ్చింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. ముందు హర్ష డెయిరీగా పేరు పెట్టుకుని, ఆ తర్వాత పేరు మార్చుకున్నారు. భోలేబాబాకు పాలు లేవని ఇవాళ పచ్చమీడియాలో రాతలు రాస్తున్నారు. అటువంటి డెయిరీకి మీరు అనుమతి ఎలా ఇచ్చారు?.చంద్రబాబు అధికారంలో ఉండగా అనుమతిచ్చిన భోలే బాబాగా చెప్తున్న హర్ష డెయిరీ కిలో నెయ్యి రూ.291కి ఎలా ఇచ్చింది?, ఇప్పుడు ఇంత చౌకగా ఎలా నెయ్యి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్న వారు ముందు దీనికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మాన్ని గౌరవించే వారు ఇలాంటి చేష్టల్ని ఖండించాల్సిందే.అధికారులు రాజకీయ కుట్రలో భాగం కావద్దు:చిన్నప్పన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన దగ్గరే జీతం కూడా తీసుకున్నాడు. చిన్నప్పన్ పీఏ అయితే ఛార్జిషీట్ లో వైవీ సుబ్బారెడ్డి పేరు ఉండాలిగా, ఎందుకు లేదు. లడ్డూకు నామాలు పెట్టి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లకు అడ్డూ అదుపూ లేదు. టీటీడీ బోర్డు ఛైర్మన్ డబ్బు కోసం దేనికైనా సిద్దపడే వ్యక్తి. ఆయనకు వెంకటేశ్వరస్వామి మీద కాదు డబ్బుల మీద, బూతు బొమ్మలు చూపించడం మీద, నూజేన్ ఆయిల్ లాంటి ఉత్పత్తులు తయారు చేసి డబ్బులు దండుకోవడంలో, జూబ్లీ పార్క్ ల్లో డబ్బులు కాజేసే కార్యక్రమంలో ఉంది. ఆయన అపవిత్రుడు కాబట్టే కొండమీద అపచారాలు జరుగుతున్నాయి.మేం నాస్తికులు అంటున్న ఆయన పెద్ద ఆస్తికుడు మరి. ఐఏఎస్ అయిన శ్యామలరావు, ఐఆర్ఐఎస్ వెంకయ్య చౌదరికి ఏం పోయేకాలం వచ్చింది. మీరు భగవంతుడి దగ్గర కాపలా కాయకుండా నాటకాలు నడిపిస్తే భగవంతుడు క్షమించడు. వీరిద్దరిపై మాకు గౌరవం ఉంది. ధర్మాన్ని పాటించాల్సిన వీళ్లు చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగస్వాములై మా మీద బురదజల్లుతున్నారు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోండి. లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసిన వాళ్లు పుట్టగతుల్లేకుండా పోతారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..తిరుమలలో వాడిన నెయ్యికి సంబంధించి సీబీఐ సిట్ పూర్తి వాస్తవాలతో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎందుకు మాట్లాడటం లేదు?. ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఓ పార్టీ ఉందని గుర్తుంచుకోవాలి. మీరు చంద్రబాబు చెంచా అని మేం అనుకుంటున్నాం. కానీ జనం మాత్రం చంద్రబాబు చెంచా అనే అనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది మాత్రమే వినకుండా పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. పవన్ ఇంతవరకూ పొలిటిషియన్ గా మారలేకపోయారు. చంద్రబాబు, లోకేష్ చెప్పింది చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ల అవినీతిలో నాకు భాగం లేదని పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆయన బీజేపీ, టీడీపీ.. ఇలా ఎవరికి ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తున్నారు.అధికారం కోసం ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు. భగవంతుడు లేదు, తండ్రి లేదు, పిల్లనిచ్చిన మామ లేదు, పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఆయనకు కొడుకు మాత్రమే ఉండాలి. కొడుకు వారసుడు కాబట్టి తనను మాత్రమే చంద్రబాబు లెక్క చేస్తాడని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
Tirumala Laddu: బయటపడ్డ బాబు భోలే బాబా డెయిరీ రహస్యం ఇవిగో ఆధారాలు
-
కూటమికి దేవుడే బుద్ది చెప్తాడు..! కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్
-
తప్పుడు ఆరోపణలు.. ఆధారాలు లేని నిందలు రాజకీయ దురుద్దేశంతోనే బాబు కుట్రలు
-
నిజమేంటో.. రెండు జాతీయ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయి!
-
మీ కుట్రలకు అంతు లేదా !! బాబు, పవన్ పై లక్ష్మీ పార్వతి ఫైర్
-
‘పవన్ ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారో..’
సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సీబీఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు.తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలి. చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోయాడు.సనాతన ధర్మం ముసుగులో ప్యాకేజీల కోసం ఆడించే డ్రామా ఆర్టిస్టులు. పవన్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?.వైఎస్ జగన్ కాళ్లు కడిగి చంద్రబాబు, పవన్ నెత్తిన చల్లుకోవాలి. ఆడవాళ్లకు అబార్షన్లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు.. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?. తప్పుడు ప్రచారం చేసిన నోర్లను పినాయిల్తో కడగాలి. శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారు.విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్లో ఉన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు’అని మండిపడ్డారు. -
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. -
తిరుమల లడ్డూ కేసు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కేసులో సీబీఐ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డు కేసులో సిట్ పనిచేయడం ఆపేసిందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు. ‘‘సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించకూడదా?. చిన్నప్పన్నను ఇంటరాగేషన్లో వేధిస్తే ఫిర్యాదు చేయొచ్చు కదా’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.చిన్నప్పన్నకు సిట్లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం.. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
‘సిట్ రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు’
సాక్షి, తాడేపల్లిగూడెం: టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలను వైఎస్సార్సీపీ బయటపెడుతుందనే భయంతో చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తల్లడిల్లేలా తప్పుడు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయంటూ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించారు. తరువాత సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. 26వ తేదీన రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తరువాత దీనిపై సుప్రీంకోర్ట్ లో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటయ్యింది.టెండర్లలో ఉల్లంఘనలను మాత్రమే గుర్తించిన సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై విచారణకు వచ్చిన సిట్ ముందుగా టీటీడీ నిర్వహిస్తున్న టెండర్లను పరిశీలించింది. దీనిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించి, దానికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసింది. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మరోసారి వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని, ఈ కల్తీ నెయ్యి విషయంలోనే నలుగురి అరెస్ట్ జరిగిందంటూ అసత్య ప్రచారానికి తెర తీశారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని సిట్ నిర్ధారించక ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా నిర్ధారించి తీర్పులు కూడా చెప్పేయడం దుర్మార్గం.ఆది నుంచి చంద్రబాబు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడం, వైఎస్సార్సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. నీచమైన రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏఅంశాని అయినా సరే వాడుకోగల ఘనుడు. నిత్యం అబద్ధాలతోనే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా నిలుస్తోంది. చంద్రబాబు చెప్పే ప్రతి దుర్మార్గమైన మాటను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ల్యాబ్లు టీటీడీకి ఉన్నాయి. 2024 జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లను తీసి టీటీడీ ల్యాబ్లో పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగానే ఈ శాంపిళ్లు ఉన్నాయని నిర్థారించడం కూడా జరిగింది. అంటే లడ్డూ తయారీకి వస్తున్న నెయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించే ల్యాబ్లు, మెకానిజం టీటీడీకి ఉంది. ఈ పరిశీలనలో ఏ మాత్రం నాణ్యాతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తేలినా ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు.ఈ విషయాన్ని మొదటి నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉంది. కానీ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయాలంటే ఒక బలమైన అంశంతో ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే వారి లక్ష్యం. హిందూధర్మాన్ని అనుసరించే భక్తులు శ్రీవారి లడ్డూలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని ఉచ్ఛరించడానికే ఇష్టపడరు. అలాంటిది దుర్మార్గమైన కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారు.వెనక్కి పంపిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎలా వినియోగిస్తారు?గత ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నాలుగు ట్యాంకర్ల ద్వారా కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. వీటి నుంచి ఎన్డీడీపీకి టెస్ట్ కోసం నెయ్యి శాంపిళ్ళను పంపించారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. దీనిలో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా లేదు. ఎన్డీడీపీ తన నివేదికలో ఈ నెయ్యిలో వనస్పతి కలిసి ఉండే అవకాశం ఉందని, మా నివేదిక తప్పు కూడా అయ్యేందుకు అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్అదే విధంగా జూలై 23నే టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఈ నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించేశామని, ప్రసాదంలో ఉపయోగించలేదని కూడా ప్రకటించారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకపోయినా రెండు నెలల తరువాత అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఆ నెయ్యిని వాడినట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశంతో కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా ప్రారంభించారు. దీనిని సీబీఐ కూడా గుర్తించింది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై మాట్లాడేప్పుడు ఏ ఆధారాలతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆరోపించారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు తప్ప పట్టింది. దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెప్పలేదు. -
శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఉంది కల్తీ
సాక్షి,తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పేర్కొనలేదని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. అయినా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియా.. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్రెడ్డి, ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు, ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని.. లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.ప్రెస్మీట్లో భూమన కరుణాకర్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:ఆ విషయం రిమాండ్ రిపోర్టులో లేదు: నిందితుల రిమాండ్ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పలేదు. అయినా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ చేసిన తప్పులపై మాత్రమే సిట్ విచారణ జరిపి రిమాండ్ బాధ్యులను రిమాండ్కి తరలించింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఎక్కడా నెయ్యి కల్తీపై మాట్లాడలేదు. టెండర్ల అవకతవకలపై మాత్రమే విచారణ జరుగుతోంది. దానికి సంబంధించే నలుగురిని అరెస్టు చేశారు.అయినా నిస్సిగ్గుగా దుష్ప్రచారం:కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ మీద నిందలు మోపడానికి లడ్డూ తయారీ కోసం పంది కొవ్వును ఉపయోగించారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారు. పవన్ కళ్యాణ్ మరింత ముందుకెళ్లి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తానే ఆవిర్భవించినట్టు వేషం కట్టి బిల్డప్ ఇచ్చాడు. తిరుపతిలో పవన్ ముందుకు వెళ్లి పవానంద స్వామి వేషంలో సనాతనధర్మం కోసం నడుం బిగించాను అని, తిరుపతిలో లడ్డూను నీచులు అపవిత్రం చేశారు అని మాట్లాడారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపారని డిప్యూటీ సీఎం పవనానంద స్వామి తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేశారు..నిజానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యిని చంద్రబాబు నియమించిన టీటీడీ బోర్డులోనే సభ్యుడిగా ఉన్న ముంబైకి చెందిన సౌరభ్ బోరా అనే వ్యక్తి సరఫరా చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ముందుగా ఆ సౌరభ్ బోరాను అరెస్ట్ చేయాలి.కల్తీ నెయ్యి వినియోగించే ఛాన్స్ లేనేలేదు:చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా క్షుద్ర రాజకీయాల కోసం అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని కూడా వాడుకున్నాడు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో దశాబ్దాలుగా ఉంది. గత మా వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య నాణ్యత పరీక్షల్లో విఫలమైన 18 ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. అంతకుముందు కూడా ఇదే విధంగా చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య 15 ట్యాంకర్లు తిప్పి పంపించడం జరిగింది. నెయ్యి నాణ్యత టెస్టుల్లో ఫెయిలైతే ట్యాంకర్లను వెనక్కి పంపడమే తప్ప వాడటం అనేది జరగదు.టీటీడీ ఈఓ కూడా ఏమన్నారు?:తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో శ్యామలరావు చెప్పారు. జూన్ 12, 20, 25, జూలై4న వచ్చిన నెయ్యిని పరిశీలించి టెస్టులు పాసయ్యాక వినియోగానికి పంపించామని, గత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలారావు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా జూలై 6, 12న ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్ పరీక్షించగా,వనస్పతి ఆయిల్ కలిసిన ఆనవాళ్లు తేలడంతో, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపామని చెప్పారు. కాబట్టి, లడ్డూల తయారీలో ఎక్కడా కల్తీ నెయ్యి వాడలేదని స్పష్టంగా తేలిపోయింది. పెరిగిన నెయ్యి నాణ్యత:2019కి పూర్వం నెయ్యి నాణ్యత నిర్ధారణకు హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఉండేవాడు. తిరుమల నెయ్యి నాణ్యతను మరింత పెంచడంలో భాగంగా వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే రిటైర్డ్ సైంటిస్టుని సీఎఫ్టీఆర్టీఐ నుంచి టీటీడీ ల్యాబరేటరీకి తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు మరో 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్లను కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు రకరకాల ప్రాంతాల్లో ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరణ విధానాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ల్యాబ్ అప్గ్రేడేషన్ చేయడం కోసం కమలవర్థన్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి సూచనలు తీసుకోవడం జరిగింది. ఎన్డీడీబీ సాయంతో రూ.46 కోట్లతో ల్యాబ్ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.8 కోట్ల పనులకు టెండర్లు పిలవడం జరిగింది. కానీ ఒకే కంపెనీ ముందుకుడరావడంతో టెండరింగ్ ఆలస్యమైంది.నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం:‘మేం ఆరోపణలు చేస్తాం.. వైఎస్సార్సీపీ తుడుచుకోవాలి’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అనేలా తొందర్లోనే చంద్రబాబుకి వినాశనం తప్పదు. సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలి. వైఎస్సార్సీపీ మీద దాడి చేయడానికి, వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయం. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టుల్లో తేడాలు రావొచ్చని, మా నివేదిక నూటికి నూరుపాళ్లు ప్రామాణికం కాదని ఎన్డీడీబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇకనైనా ఎల్లో మీడియా దేవదేవుని విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్రెడ్డి హితవు పలికారు. -
HYD: పవన్కల్యాణ్పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్
సాక్షి,హైదరాబాద్: తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్ 14)ఈ పిటిషన్ వేశారు. ‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతుమాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తన హోదా మరచి వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్లో పవన్ మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయాలి. తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’అని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టును కోరారు.ఈ పిటిషన్ను సిటీ సివిల్ కోర్టు మంగళవారం విచారించనుంది.ఇదీ చదవండి: జనం లేని పవన్ పల్లె పండుగ సభ -
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు


