Tense
-
బాక్సైట్.. ఫైట్ .. తీవ్రరూపం
రాయగడ : రాయగడలో బాక్సైట్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. సిజిమాలి తవ్వకాలకు అనుమతి కాశీపూర్ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్ సమీపంలొ ఉన్న సిజిమాలి (Sijimali)లో సుమారు 311 మిలయన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాక్సైట్ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంత వ్యతిరేకత..? కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. సిజిమాలిలో జరిగింది ఇదే.. సిజిమాలి బాక్సైట్ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్ 7 వ తేదిన జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి కంఠమాల్ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తులకు వివరించారు. అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాష్వ వాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్ పైండింగ్ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు. ఇందులో భాగంగా కొరాపుట్ లొక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్ గొమాంగొలు కంఠమాల్ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్ అశుతొష్ కులకరి్ణతో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి. ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులుప్రభావిత గ్రామాలు సిజిమాలి బాక్సైట్ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది! -
ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి?
ఆఫ్రికాలోని నైగర్లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీవ్ర ఆగ్రహం నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది. What's Happening in Niger? Most Americans do not seem to pay attention to Africa much, but Africa, particularly Niger are huge exporters of important materials and play a crucial role in international politics. So what's going on? - Last week a junta seized power from President… pic.twitter.com/6t0vAd1SS6 — Brian Krassenstein (@krassenstein) August 1, 2023 అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్..యూరోపియన్ యూనియన్కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు సైనిక తిరుగుబాటు తర్వాత నైగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తిరుగుబాటుకు మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు లభించింది. ఫలితంగా ఇతర దేశాలకు మరింత ముప్పు పెరిగింది. ఈ సైనిక తిరుగుబాటుకు మద్దతిచ్చిన మూడు దేశాలు ప్రస్తుతం తిరుగుబాటు సైనికుల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తన పౌరులను నైజర్ నుండి తరలించడం ప్రారంభించింది. నైగర్లో కొనసాగుతున్న తిరుగుబాటు కారణంగా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మీడియాకు తెలిపారు. అదే సమయంలో పెరుగుతున్న సంఘర్షణల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ కూడా 70 మందికి పైగా పౌరులను విమానంలో తరలించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇటలీ కూడా తమ దేశ పౌరులను రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు నైగర్ నూతన సైనిక నాయకులు సీనియర్ రాజకీయ నాయకులను అరెస్టు చేయడంతో పాటు దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ను అతని ప్యాలెస్లో బంధించారు. ఈ తిరుగుబాటు తర్వాత జూలై 30న ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిపై ఫ్రెంచ్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
షహీన్బాగ్లో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్బాగ్లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ధర్నా జరుగుతున్న ప్రాంతానికి సీఏఏ మద్దతుదారులు చేరుకుని విద్రోహులపై కాల్పులు జరపాలని నినాదాలు చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. షహీన్బాగ్లో నిరసనకు దిగిన ఆందోళనకారులు తక్షణమే అక్కడి నుంచి ఖాళీచేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ మద్దతుదారులు వందేమాతరం నినాదాలతో హోర్తెతించారు. షహీన్బాగ్ నిరసనలను వ్యతిరేకించిన ఆందోళనకారులను కొందరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. పారామిలటరీ బలగాలతో షహీన్బాగ్ వద్ద బందోబస్తును ముమ్మరం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా షహీన్బాగ్ వద్ద పౌర నిరసనలకు వ్యతిరేకంగా శనివారం తుపాకీతో హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి : పెళ్లి అని చెప్పి తుపాకీ కొన్నాడు.. -
కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
గింత విషం పోయండి
♦ మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆగ్రహం ♦ కడుపు మండి కొంతమంది నేతల ఇళ్లపై దాడులు.. విధ్వంసం ♦ గ్రామంలో యుద్ధ వాతావరణం పోలీసు పహారాలో కిష్టాపూర్ దుబ్బాక/తొగుట: ‘మల్లన్న సాగర్కు భూములివ్వొద్దని రాత్రింబవళ్లు ఇంటింటికీ తిరిగినం.. అయినోళ్లను, కానోళ్లను బతిమిలాడినం.. కాళ్లు మొక్కినం.. అయినా మార్పు రాలే.. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. కన్నతల్లిని వదులుకోలేక దుఃఖమొస్తోంది.. గుండె భారమవుతోంది.. కడుపు మండుతోంది.. చెట్టుకొక్కరు, పుట్టకొక్కరులా తమ బతుకులు తయారయ్యాయి. తమకింత విషం పోయండి..’ అంటూ కొమరవెళ్లి మల్లన్న సాగర్ ముంపు బాధితులు రోదించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ ఎంపీటీసీ దామరంచ ప్రతాప్రెడ్డి సమక్షంలో సోమవారం కొంతమంది తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్కు తమ భూములను అప్పజెప్పారు. విషయాన్ని తెలుసుకున్న ఏటిగడ్డ కిష్టాపూర్, వేములాఘాట్ గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు, యువకులు గ్రామ సర్పంచ్ దాతారు సునంద నేతృత్వంలో తొగుట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ పేరున భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని వినతిపత్రాన్ని తహసీల్దార్ దేశ్యా నాయక్కు అందించారు. అయితే పక్కనే ఉన్న ప్రతాప్రెడ్డి ముంపు బాధితులను చూసి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్లారు. ‘గ్రామస్తులంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా.. తమను చూసి కాలర్ ఎగరేస్తావా’ అంటూ వందలాది మంది ఆగ్రహంతో ప్రతాప్రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడున్న కారును ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుమలగిరిలోని వెల్దండ నర్సింహారెడ్డి ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. నర్సింహారెడ్డి ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. నర్సింహారెడ్డి తండ్రి మల్లారెడ్డిపై దాడి చేసేందుకు యత్నించగా, ఇంటి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి నేవూరి జీవన్రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ధాన్యాన్ని బయట పారబోశారు. ఇంటి ముందు పల్సర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వంగ అంజాగౌడ్ ఇంటిపైకి దాడికి వెళ్లగా విషయాన్ని తెలుసుకున్న అంజాగౌడ్ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇంతలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ గౌడ్ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి, గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించిన భూములను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతాప్రెడ్డి, జీవన్రెడ్డి, అంజాగౌడ్, నర్సింహారెడ్డిలతో తమకు క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డితో డీఎస్పీ ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రాత్రి వరకు గ్రామ పంచాయతీ వద్దే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాట తప్పారు గ్రామానికొచ్చి జిల్లా స్థాయి అధికారులు తమకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయి 15 రోజులవుతోంది. ఇంత వరకు ఏ ఒక్క అధికారి వచ్చి తమకు న్యాయం చేయలేదని, గుంట నక్కల్లా కొంతమందికి ఆశ చూపి భూములను అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై మండిపడ్డారు. ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితుల మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని విమర్శించారు. పోలీసు పహారాలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
తూళ్లూరులో టెన్షన్
-
విద్యుత్ సౌధలో ఉద్రిక్తత
-
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన


