team india
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్గా తయారయ్యాడు. ఇంకా ఫిట్గా, బెటర్ క్రికెటర్గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.కొత్త లుక్లో సర్ఫరాజ్ ఖాన్ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.సర్ఫరాజ్తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్తో జరిగిన హొం టెస్ట్ సిరీస్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే -
టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లి తదుపరి ఆడబోయే మ్యాచ్లు ఇవే..!
టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో రోహిత్, కోహ్లి భారత్ తరఫున ఎన్ని వన్డేలు ఆడతారని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం ప్రకారం భారత్ 2027 వన్డే వరల్డ్కప్ వరకు 9 సిరీస్ల్లో 8 మంది ప్రత్యర్థులపై 27 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరతారు. అక్కడ ఆగస్ట్ వరకు 4 వరకు గడపనున్న భారత్.. అదే నెల 17వ తేదీ నుండి బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఇక్కడి నుండి టీమిండియా వన్డే క్రికెట్ షెడ్యూల్ మొదలుకానుంది.బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లి ఈ సిరీస్లో చెలరేగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు ఉండటంతో రోకోను ఆపడం బంగ్లా బౌలర్లకు పెద్ద సవాలే అవుతుంది.అనంతరం భారత్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు (5 టీ20లు కూడా ఆడుతుంది) ఆడనుంది.ఈ ఏడాది చివర్లో టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్ట్లు, 5 టీ20లు సహా మూడు వన్డేలు ఆడనుంది.వచ్చే ఏడాది (2026) జనవరిలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్లో కూడా విరాట్, రోహిత్ తమదైన మార్కును చూపించే అవకాశం ఉంది.అనంతరం చాలా గ్యాప్ తర్వాత జూన్లో భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘన్లు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. స్వదేశంలో ఆడబోయే సిరీస్ కావడంతో ఈ సిరీస్లో కూడా రోకో చెలరేగే అవకాశం ఉంది.జూలైలో భారత్ ఇంగ్లండ్లో పర్యటించి మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో మూడు వన్డేలు ఆడనుంది.అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడనుంది.డిసెంబర్లో భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది.దీని తర్వాత భారత్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. ఈ మెగా టోర్నీ రోహిత్-కోహ్లిల జమానాకు చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైతే తప్ప రోహిత్, కోహ్లి దాదాపుగా అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దిగ్గజాలు వన్డే వరల్డ్కప్తో తమ క్రికెట్ ప్రస్తానాన్ని ముగిస్తారేమో చూడాలి. -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అత్యధిక కాలం టాప్ ర్యాంక్లో కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. ఇవాళ (మే 14) విడుదల చేసిన ర్యాంకింగ్స్ల జడేజా టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2022, మార్చి 9న విండీస్ ఆటగాడు జేసన్ హెల్డర్ను గద్దె దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన జడ్డూ.. 1152 రోజుల పాటు (38 నెలలకు పైగా) టాప్ ర్యాంక్డ్ టెస్ట్ ఆల్రౌండర్గా కొనసాగాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆల్రౌండర్లైన జాక్ కల్లిస్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్కు కూడా ఇది (ఇంతకాలం) సాధ్యం కాలేదు.36 ఏళ్ల జడ్డూ 2022 మార్చి నుంచి 23 టెస్ట్లు ఆడి 36.71 సగటున 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో జడ్డూ 22.34 సగటున 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్లో జడేజా, తర్వాతి స్థానాల్లో మెహిది హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్), మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు. మెహిది హసన్ ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి జన్సెన్ను కిందికి దించి రెండో స్థానానికి ఎగబాకాడు. మెహిది హసన్కు జడేజాకు మధ్య 73 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్న జడేజా జూన్లో ఇంగ్లండ్తో జరుగబోయే టెస్ట్ సిరీస్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2024 టీ20 వరల్డ్కప్ తర్వాత పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జడేజా 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. -
రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన టీమిండియా స్టార్ పేసర్
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాటలోనే మహ్మద్ షమీ కూడా పయనిస్తున్నాడని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతుంది. రోహిత్, విరాట్ లాగే షమీ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై షమీ తాజాగా స్పందించాడు. Mohammad Shami squashes retirement rumours. pic.twitter.com/PoKqLoS42l— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2025తన రిటైర్మెంట్పై ఓ ఇంగ్లిష్ వెబ్సైట్లో రాసిన వార్తను ఖండిస్తూ.. దాన్ని రాసిన వ్యక్తికి మొట్టికాయలు వేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్క పెట్టుకో. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీ లాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు. ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త. సారీ అంటూ తన సోషల్మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. తన రిటైర్మెంట్పై దుష్ప్రచారం చేసిన వ్యక్తికి గట్టిగా ఇస్తూనే షమీ సదరు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాడు.కాగా, 34 ఏళ్ల షమీ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ టీమిండియాలో స్థిరపడలేకపోతున్నాడు. ఇదే కారణంగా షమీని త్వరలో ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయరని ప్రచారం సాగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ మునుపటి జోరును కొనసాగించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అడపాదడపా ప్రదర్శనతో సరిపెట్టిన అతను ఐపీఎల్-2025లో దారుణంగా విఫలమయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్ షమీని గంపెడాశలతో సొంత చేసుకుంటే అతను కనీస న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తర్వాత షమీ వ్యతిరేకుల స్వరం పెద్దదైంది. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయొద్దంటూ కొందరు సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. షమీ స్థానంలో ఐపీఎల్లో ఇరగదీస్తున్న ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యామ్నాయ పేసర్లుగా అర్షదీప్ సింగ్, సిరాజ్, ఖలీల్ అహ్మద్ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్ వరకు అద్భుతంగా రాణించిన షమీ.. ఆతర్వాత గాయం తాలూకా సమస్యలతో ఢీలా పడిపోయాడు. భారత్లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. తన కెరీర్లో 64 టెస్ట్లు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు. -
రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్లో సత్తా చాటిన మంధన.. తాజాగా ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో సెంచరీ (ఫైనల్లో), అర్ద సెంచరీ సాయంతో 264 పరుగులు చేసిన మంధన.. తన రేటింగ్ పాయింట్లను 727కు పెంచుకుని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ను మూడో స్థానానికి పడేసింది. తాజా ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంధనకు లారాకు మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో మంధన ఒక్కరే ఉన్నారు. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎల్లిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), అలైసా హీలీ (ఆస్ట్రేలియా), చమారీ ఆటపట్టు (శ్రీలంక), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా), ఆమీ జోన్స్ (ఇంగ్లండ్) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. ట్రై నేషన్ సిరీస్లో రాణించిన చమారీ ఆటపట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకింది. భారత ప్లేయర్లలో జెమీమా రోడ్రిగెజ్ 15, కెప్టెన్ హర్మన్ప్రీత్ 16, దీప్తి శర్మ 32, రిచా ఘోష్ 42, ప్రతిక రావల్ 45, హర్లీన్ డియోల్ 52, యస్తికా భాటియా 67, పూజా వస్త్రాకర్ 70, షఫాలీ వర్మ 86, స్థానాల్లో ఉన్నారు. ట్రై సిరీస్లో సౌతాఫ్రికాపై సెంచరీతో రాణించిన జెమీమా 5 స్థానాలు మెరుగుపర్చుకోగా.. ఇదే టోర్నీలో సత్తా చాటిన దీప్తి శర్మ 13 స్థానాలు మెరుగుపర్చుకుంది.బౌలింగ్ విభాగానికొస్తే.. భారత్ తరఫున దీప్తి శర్మ (4) ఒక్కరే టాప్-10లో ఉన్నారు. సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. ఆష్లే గార్డ్నర్, మెగాన్ షట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ట్రై సిరీస్లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 34వ స్థానానికి ఎగబాకింది. రాణా దాదాపు 16 నెల తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చింది.కాగా, భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై నేషన్ సిరీస్లో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మంధన సెంచరీతో కదంతొక్కడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ మంధనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. -
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్గా, ఇటు కెపె్టన్గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్లో అద్భుతమైన కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్తోనే రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్వన్ టెస్టు బ్యాటర్గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్వన్ బ్యాటర్గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. -
‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్కు గుడ్బై చెప్పాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే టీమ్ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గత ఏడాది వరల్డ్ కప్ విజయం తర్వాత టి20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్ టెస్టులకు గుడ్బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్ బంగర్ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్నెస్ ఒక కారణం కాగా, ఇంగ్లండ్లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్తో కొత్తగా 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ సైకిల్ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్లాంటి సాధారణ బౌలర్ బంతికి క్లీన్బౌల్డ్ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్తో సిరీస్ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్ శర్మలాంటి బ్యాటర్ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్ కోహ్లి‘కెప్టేన్ ఫైర్’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్ ధోని ‘కూల్ కెప్టేన్’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్ను తగ్గించి అయినా అదనపు బౌలర్ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం, మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్ రిచర్డ్సన్ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్గా తొలి టెస్టు మ్యాచ్లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో ఆసీస్కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్లో విరాట్ సెంచరీతో భారత్కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్ 2018): కఠినమైన పిచ్పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్ బౌలింగ్ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్ (పుణే, 2019): కెరీర్లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్గా విరాట్ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీతో సచిన్ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్, ఇష్టమైన ఫార్మాట్ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్ కప్ కొనసాగి ఆపై రిటైర్ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్ టెండూల్కర్⇒ నువ్వు రిటైర్ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్ యుగంలో టెస్టు ఫార్మాట్ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్ కోహ్లి. టెస్టు క్రికెట్ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్ మంజ్రేకర్ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్ గంభీర్⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్ కుంబ్లే -
కోహ్లి రిటైర్మెంట్పై స్పందించిన వైఎస్ జగన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.క్రికెట్ పట్ల విరాట్కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంపారు.One of the greatest Indian cricketer of all time, @imVKohli, bids adieu to Test cricket.It has always been fascinating to watch him play - his passion, consistency and hunger in pursuit of excellence have been unmatched. His records speak louder than words, and his legacy will… pic.twitter.com/wBHNVEwKgY— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025కాగా, 36 ఏళ్ల విరాట్ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్లు (210 ఇన్నింగ్స్లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.టీమిండియా టెస్ట్ కెప్టెన్గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్ ఎవరూ లేరు. -
ఆటగాడిగా, కెప్టెన్గా కోహ్లి సాధించిన ఘనతలు..!
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 12) ప్రకటించాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించాడు. కెప్టెన్గా చెరగని ముద్ర వేశాడు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.2011 వెస్టిండీస్ (జూన్లో) పర్యటన సందర్భంగా టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్లు (210 ఇన్నింగ్స్లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.కోహ్లి టెస్ట్ల్లో 10000 పరుగులు పూర్తి చేయాలని కలలు కాన్నాడు. అయితే అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన కారణంగా అతను అనుకున్న టార్గెట్ను రీచ్ కాలేకపోయాడు. కోహ్లి తన టార్గెట్కు 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.టీమిండియా టెస్ట్ల్లో కనీసం ఐదేళ్లు డామినేట్ చేయడం చూడాలని కోహ్లి కలలుగన్నాడు. దీన్ని అతను కెప్టెన్గా ఉన్న కాలంలో (2015-2022) నెరవేర్చుకున్నాడు. కోహ్లి కెప్టెన్గా ఉన్న కాలం టీమిండియాకు స్వర్ణ యుగం లాంటిది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ 68 మ్యాచ్ల్లో ఏకంగా 40 మ్యాచ్లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కోహ్లి రికార్డుల్లో నిలిచిపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా చేరింది.భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించే సమయంలో కోహ్లి వ్యక్తిగతంగానూ రాణించాడు. టీమిండియా కెప్టెన్గా కోహ్లి ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఏకంగా ఏడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.2016-18 కోహ్లి ఆటగాడిగా, భారత కెప్టెన్గా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో కోహ్లి 35 టెస్టుల్లో 66.59 సగటున 3,596 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ సాధించిన పలు ఘనతలు - కెప్టెన్గా అత్యధిక టెస్ట్ విజయాలు: 40 - విరాట్ కోహ్లీ (68 మ్యాచ్లు) (ఆసియా ఆటగాళ్లలో)- స్వదేశం వెలుపల అత్యధిక టెస్ట్ విజయాలు: 16 - విరాట్ కోహ్లీ (37 మ్యాచ్లు) (భారత కెప్టెన్లలో)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు: 7 - విరాట్ కోహ్లీ (24 మ్యాచ్లు)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు (భారత ఆటగాళ్లలో): 12 విరాట్ కోహ్లి (93 ఇన్నింగ్స్లు)- కెప్టెన్గా అత్యధిక టెస్ట్ పరుగులు: 5864 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్లు) (ఆసియా ఆటగాళ్లలో)- కెప్టెన్గా అత్యధిక టెస్ట్ సెంచరీలు: 20 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్లు)- ఆసియా ఖండం అవతల అత్యధిక సెంచరీలు: 14 విరాట్ కోహ్లి (108 ఇన్నింగ్స్లు)- అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం- కోహ్లి సారథ్యంలో టీమిండియా 49 నెలలు నంబర్ వన్గా ఉండింది. -
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఇకపై టీమిండియా టెస్టు జట్టులో చూడలేము.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఆటను, అల్లరిని మిస్సవుతాము.. అవును!.. పద్నాలుగేళ్లుగా తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలతో అలరించిన కోహ్లి సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు.టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన 36 ఏళ్ల కోహ్లి.. తన కెరీర్ను ముగించాడు.బ్యాటర్గా సూపర్ హిట్తన పద్నాలుగేళ్ల కెరీర్లో కోహ్లి 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. సగటు 46.85. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 254. ఆసీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర విదేశీ గడ్డలపై సెంచరీలతో అలరించాడు.తన అద్బుత బ్యాటింగ్తో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265), సునిల్ గావస్కర్ (10,122) తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్గా కోహ్లి రికార్డు సాధించాడు.టెస్టుల్లో భారత జట్టు దిశను మార్చిన యోధుడు2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.చిరస్మరణీయ విజయాలు2018-19లో తొలిసారి ఆసీస్ గడ్డపై కోహ్లి సేన టెస్టు సిరీస్ విజయం సాధించింది. అనంతరం 2021-22లో ఇంగ్లండ్లో 2-2తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికాలోనూ చిరస్మరణీయ విజయాలు సాధించింది. సొంతగడ్డపై కోహ్లి కెప్టెన్గా వరుసగా 11 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు.సారథిగా మొత్తంగా 68 మ్యాచ్లలో నలభై విజయాలు సాధించిన కోహ్లి.. గ్రేమ్ స్మిత్ (53), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా(41) తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021 ఫైనల్కు టీమిండియాను చేర్చాడు. అయితే, 2022లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు పలికాడు.ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లి.. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్బై చెప్పిన వారం లోపే తానూ అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం స్వయంగా కింగ్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ‘‘ఇప్పుడే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కోహ్లి?’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావుభారత మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు’’ అని ప్రశ్నించాడు. ఇక భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో అత్యద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నందుకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లి.అసలైన టార్చ్బేరర్ నువ్వేకెప్టెన్గా నువ్వు కేవలం మ్యాచ్లు మాత్రమే గెలవలేదు. ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేశావు. టెస్టుల్లో ఫిట్నెస్, దూకుడుతో పాటు ఒక రకమైన గర్వంతో ఎలా ఆడాలో చూపించావు. కొత్త ప్రమాణాలు రూపొందించావు. భారత టెస్టు క్రికెట్లో అసలైన టార్చ్బేరర్ నువ్వే. ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
యూ టర్న్ తీసుకున్న యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు. తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్కు కాని సమర్పించలేదని తెలిపాడు.కాగా, ఉత్తర్ప్రదేశ్లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.జైస్వాల్కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.2019-20 సీజన్లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు. -
ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత బలగాలు ఇస్తున్న ధీటైన సమాధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ సోషల్మీడియాలో దుమారం రేపుతుంది. రాయుడును నెటిజన్లు ఆడుకుంటున్నారు.“An eye for an eye makes the whole world blind.”Let’s remember — this isn’t a call for weakness, but a reminder of wisdom.Justice must stand firm, but never lose sight of humanity.We can love our nation fiercely and still hold compassion in our hearts.Patriotism and peace can…— ATR (@RayuduAmbati) May 8, 2025విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని మండిపడుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతి చర్యకు దిగికపోతే వారు మనల్ని మట్టుబెడతారని అంటున్నారు. పాక్ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. భారత దళాలు పాక్ దుశ్చర్యలను కేవలం తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!— ATR (@RayuduAmbati) May 8, 2025తన ట్వీట్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు డిఫెన్స్లో పడ్డాడు. సదరు ట్వీట్ను తొలగించకపోయినా, జనాలను శాంతింప జేసేందుకు మరో రెండు ట్వీట్లు చేశాడు. వీటిలో మొదటి దాంట్లో ఇలా రాసుకొచ్చాడు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.In moments like these, we stand united not in fear, but in resolve. I feel immense gratitude to our Indian Army who are the real heroes who carry the weight of a nation with unmatched courage, discipline, and selflessness🙏🏻Your sacrifices don't go unnoticed. Your bravery is what…— ATR (@RayuduAmbati) May 8, 2025రెండో ట్వీట్లో ఇలా రాశాడు. ఇలాంటి క్షణాల్లో మేము భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాము. అసమాన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా ఉండవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత రేపటికి మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.రాయుడు ముందు చేసిన ట్వీట్కు డ్యామేజ్ కంట్రోల్గా ఈ ట్వీట్లు చేసినప్పటికీ జనాల ఆగ్రహం తగ్గలేదు. మొదటి ట్వీట్నే ఆసరగా చేసుకుని ఏకి పారేస్తున్నారు. టీమిండియా, ఐపీఎల్, రాజకీయాలతో ముడిపెట్టి తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తాన్ని ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేల రాయుడు క్రికెట్ అభిమానులకు మంచి స్టఫ్గా మారాడు. -
క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్మ్యాన్ స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్ట్లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్ల్లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్ భారత్ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్ మ్యాచ్ల్లో హిట్మ్యాన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్లో రోహిత్ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్ల్లో రోహిత్ కెప్టెన్గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్లను భారత్ కోల్పోయింది. -
టీమిండియా భారీ టార్గెట్.. వీరోచితంగా పోరాడిన సౌతాఫ్రికా
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్లో ఇవాళ (మే 7) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా రోడ్రిగెజ్ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. భారత బౌలర్లలో అమన్జోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. భారత్ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. -
వాళ్లకు డబ్బులు ఇచ్చానో లేదో మీకెందుకు?
సుదీర్ఘ కాలంగా తనపై విమర్శలు చేసే ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల వ్యాఖ్యలపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం కామెంటేటర్లుగా ఉన్న సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), రవిశాస్త్రి (Ravi Shastri) తనపై పదే పదే విమర్శలు చేసిన విషయాన్ని పరోక్షంగా గంభీర్ గుర్తు చేశాడు. ఆ గాయం అంత పెద్దదేమీ కాదుకాగా 2011లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో గంభీర్ తలకు తగిలిన గాయం ‘అంత పెద్దదేమీ కాదు’ అని రవిశాస్త్రి అప్పట్లో విమర్శించాడు. మరోవైపు.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్మనీలో సహచర కోచింగ్ సిబ్బందికంటే గంభీర్ ఎక్కువ మొత్తం తీసుకోవడాన్ని గావస్కర్ ప్రశ్నించాడు.ఇప్పుడు వీరిద్దరికి కలిపి గంభీర్ సమాధానమిచ్చాడు. ‘నేను కోచ్గా వచ్చి ఎనిమిది నెలలే అయింది. ఫలితాలు రాకపోతే విమర్శించే హక్కు అభిమానులకు ఉంది. కానీ 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్లో కూర్చున్నవారు భారత క్రికెట్ను తమ ఆస్తిగా భావిస్తున్నట్లున్నారు. డబ్బులు ఇచ్చానా లేదా అనేది మీకెందుకు?కానీ భారత్ క్రికెట్ వారిది కాదు.. 140 కోట్ల మంది భారతీయులది. వారు నా కోచింగ్ను, నా గాయాన్ని, చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్మనీని కూడా ప్రశ్నించారు. నేను నిజానికి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా అనేది వారికి అనవసరం. నేనెంత డబ్బు ఖర్చుపెట్టాను.. ఎంత పెట్టుబడి పెట్టాను అన్న వివరాలు వారికెందుకు? అయినా నేనేమీ ఇక్కడ సంపాదించి విదేశాలకు వలసవెళ్లిపోలేదే? 180 రోజులు విదేశాల్లోనే గడపడం లేదే? నేను భారతీయుడిని.. పన్ను తప్పించుకునేందుకు ఎన్నారైగా మారటం లేదు. గాజు గృహాల్లో ఉండేవారు వేరేవాళ్ల మీద రాళ్లు విసరవద్దు’ అని గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.గంభీర్ మార్గదర్శనంలోకాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ పదవిని చేపట్టాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గా రాణిస్తోంది.టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా... దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్ను మాత్రం కోల్పోయింది. అయితే, ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి సత్తా చాటింది. ఈ క్రమంలో బీసీసీఐ రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్కోచ్ గంభీర్కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, గతంలో ద్రవిడ్ తాను ప్రత్యేకంగా ఎక్కువ ప్రైజ్మనీ తీసుకోకుండా.. సహాయక సిబ్బందికి సమానంగా పంచాడని గావస్కర్ గుర్తు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా గంభీర్ మార్గదర్శనంలో దారుణంగా విఫలమవుతోంది. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైంది. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ -
టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్రేట్ విషయంలో భారత్ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్లో భారత్పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్కు ఎదురుదెబ్బసౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్రౌండర్ కశ్వీ గౌతమ్ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్ క్యాప్డ్ పేసర్ క్రాంతి గౌడ్తో రీప్లేస్ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్ సీజన్లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్కు ప్రాతినథ్యం వహిస్తుంది. -
అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకొన్నా: కోహ్లి
టీమిండియా బ్యాటర్గా, కెప్టెన్గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకొన్నాఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్గా ఉన్నాను.ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్గా ఉన్నా.. బ్యాటర్గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్పోజ్ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఈ సీజన్లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్-19 క్రికెట్లో కెప్టెన్గా భారత్కు టైటిల్ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.కెప్టెన్గానూ తనదైన ముద్రబ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.రికార్డుల రారాజుటెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
వార్షిక ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా
ఐసీసీ వార్షిక పరిమిత ఓవర్ల ఫార్మాట్ల ర్యాంకింగ్స్ భారత పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్ గతేడాది మే నుండి జరిగిన అన్ని మ్యాచ్లను 100 శాతంగా, గత రెండు సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్లను 50 శాతంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడ్డాయి. ప్రస్తుత వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. వార్షిక ర్యాంకింగ్స్లోనూ టాప్ ప్లేస్ దక్కించుకుంది. గడిచిన రెండేళ్లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా.. గతేడాది టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్లో భారత్ రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని పాయింట్ల సంఖ్యను 122 నుంచి 124కు పెంచుకుంది. భారత్ తర్వాత రెండో స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్.. వన్డేల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది.ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ల్లో భారత్, ఆసీస్కు ఓడించిన శ్రీలంక ఐదు రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని తాజా ర్యాంకింగ్స్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. గత రెండేళ్లలో మెరుగైన ప్రదర్శనలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. మాజీ వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.మరోవైపు టీ20 ర్యాంకింగ్స్లోనూ భారత్ హవా కొనసాగింది. ప్రస్తుత టీ20 ఛాంపియన్స్ అయిన భారత్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆసీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వరుస స్థానాల్లో నిలిచాయి.టెస్ట్ల్లో ఆస్ట్రేలియాఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్లో ప్రస్తుత డబ్ల్యూటీసీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ను దక్కించుకుంది. ఆసీస్ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కంటే 13 పాయింట్లు అధికంగా సాధించింది. ఈ దఫా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ను ఎదుర్కోబోయే సౌతాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయాల నేపథ్యంలో భారత్ నాలుగో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ టాప్-10లో ఉన్నాయి. -
ఇంటర్నేషనల్ బ్రాండ్కు గ్లోబల్ అంబాసిడర్గా కేఎల్ రాహుల్
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పాల్ & షార్క్కు (Paul & Shark) గ్లోబల్ అంబాసిడర్గా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్ & షార్క్ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్ పాల్ & షార్క్కు గ్లోబల్ అంబాసిడర్గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్.పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం వారెస్లో ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రధానంగా లైఫ్స్టైల్ మరియు స్పోర్ట్వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. ఈ జట్టు విజయాల్లో కేఎల్ రాహుల్ది కీలకపాత్ర. రాహుల్ ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్రేట్తో 371 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 5న హైదరాబాద్లో జరుగనుంది. -
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్మీడియా వేదికగా రోహిత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్కప్లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్గా, కెప్టెన్గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్కప్ సెంచరీలు- 7 కెప్టెన్గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్లు)కెప్టెన్గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు -
ఇంగ్లండ్ టూర్కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్కు కూడా పిలుపు..?
ఐపీఎల్ 2025 ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్ మధ్యలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్ ఫామ్ బ్యాటర్ కరుణ్ నాయర్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ను ప్రత్యామ్నాయ ఓపెనర్గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్గా సీఎస్కే యువ సంచలనం ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అశ్విన్ రిటైర్ కావడంతో అతని స్థానాన్ని కుల్దీప్ యాదవ్తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్ కోసం అక్షర్ పటేల్ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటుతున్న శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత సీనియర్ జట్టుతో పాటు భారత-ఏ జట్టును కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.ప్రస్తుతం ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. సీఎస్కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (11), లక్నో (10), కేకేఆర్ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (6), సన్రైజర్స్ (6), సీఎస్కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. -
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్లో కోడ్ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్ వెనుక పడ్డారు. ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్ రేట్లో ప్రతి ఓవర్కు ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు.ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయంఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.రాణా ఓవరాల్గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్లో భారత్, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్ టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ టీ20 వరల్డ్కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్గా గంభీర్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్కు చోటు
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.🚨 𝗡𝗘𝗪𝗦 🚨BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndiaDetails 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్) -
IPL 2025: కేకేఆర్తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్లో చేరిపోయాడు. నాయర్ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్లో చేరిపోయాడు. నాయర్తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి. -
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఆగస్ట్లో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్ జూన్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది.ఇంగ్లండ్లో భారత పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- జూన్ 20-24రెండో టెస్ట్- జులై 2-6మూడో టెస్ట్- జులై 10-14నాలుగో టెస్ట్- జులై 23-27ఐదో టెస్ట్- జులై 31-ఆగస్ట్ 3ఈ సిరీస్ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)రెండో టెస్ట్- అక్టోబర్ 10-14 (కోల్కతా)ఈ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- నవంబర్ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్- నవంబర్ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్ 3 (రాయ్పూర్)మూడో వన్డే- డిసెంబర్ 6 (వైజాగ్)తొలి టీ20- డిసెంబర్ 9 (కటక్)రెండో టీ20- డిసెంబర్ 11 (ఛండీఘడ్)మూడో టీ20- డిసెంబర్ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్ 19 (అహ్మదాబాద్) -
రెండో సారి 'ఆ ఘనత' సాధించిన శ్రేయస్ అయ్యర్.. గిల్, బుమ్రా మాత్రమే..!
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2025 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం శ్రేయస్.. న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓట్ల ద్వారా శ్రేయస్ను ప్లేయర్ ఆఫ్ ద మంత్గా (మార్చి) నిర్ణయించారు.శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి (2022 ఫిబ్రవరి, 2025 మార్చి). భారత క్రికెటర్లలో శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా (2024 జూన్, 2024 డిసెంబర్) మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్ తరఫున గిల్ అత్యధికంగా మూడు సార్లు (2023 జనవరి, 2023 సెప్టెంబర్, 2025 ఫిబ్రవరి) ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు.2021 జనవరిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అమల్లోకి వచ్చిన తొలి మూడు నెలల్లో భారత ఆటగాళ్లే (పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్) ఈ అవార్డు గెలవడం విశేషం.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్న టీమిండియా క్రికెటర్లు..శుభ్మన్ గిల్-3జస్ప్రీత్బుమ్రా-2శ్రేయస్ అయ్యర్-2రిషబ్ పంత్-1 (2021 జనవరి)రవిచంద్రన్ అశ్విన్-1 (2021 ఫిబ్రవరి)భువనేశ్వర్ కుమార్-1 (2021 మార్చి)విరాట్ కోహ్లి-1 (2022 అక్టోబర్)యశస్వి జైస్వాల్-1 (2024 ఫిబ్రవరి)మార్చి నెలలో శ్రేయస్ అయ్యర్శ్రేయస్ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ భారత్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో శ్రేయస్ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో 79 పరుగులు చేసిన శ్రేయస్.. సెమీస్లో ఆసీస్పై 45, ఫైనల్లో న్యూజిలాండ్పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ మిడిలార్డర్లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.మహిళల విభాగంలో వాల్మహిళల విభాగంలో మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం చేతన ప్రసాద్ (యూఎస్ఏ), జార్జియా వాల్ (ఆస్ట్రేలియా), అన్నాబెల్ సదర్ల్యాండ్ (ఆస్ట్రేలియా) పోటీ పడగా.. జార్జియా వాల్ విజేతగా నిలిచింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ (ఫోటోలు)
-
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్లో జరిగే ఒలింపిక్స్లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్లో టాప్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్కు భారీ షాక్! -
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్తో కలిసి దిగిన ఫోటో సోషల్మీడియాలో వైరలవుతుంది.Former cricketer Kedar Jadhav set to start his political career Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 202540 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్రైజర్స్) 95 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్రేట్తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. -
భారత్లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు హోం సీజన్ (స్వదేశంలో ఆడే మ్యాచ్లు) షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 2) ప్రకటించింది. అక్టోబర్లో వెస్టిండీస్.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్లు భారత్లో పర్యటించనున్నాయి.విండీస్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్ కోల్కతా వేదికగా అక్టోబర్ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ భారత్లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్లో భారత్ 2-0 తేడాతో విండీస్ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్ జరుగనుంది. నవంబర్ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, వైజాగ్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, చండీఘడ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్కప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్ను షెడ్యూల్ చేశారు.కాగా, భారత క్రికెట్ జట్టు ఐపీఎల్ 2025 తర్వాత ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్ జట్టు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్ ప్రారంభమవుతుంది. భారత్లో వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ల షెడ్యూల్ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి.భారత్తో సిరీస్లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్ను హోస్ట్ చేసింది. డార్విన్లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్ల తర్వాత ఆసీస్ భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్తో సిరీస్ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్లతో టీ20 సిరీస్లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్బోర్న్నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
అసాధారణ విజయాలు.. మేమంతా అందుకు అర్హులమే: రోహిత్ శర్మ
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.ఎన్నో ఎత్తుపళ్లాలుఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కెప్టెన్గా రోహిత్ శర్మ, హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ సాధించింది.అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్లో మేము సెమీస్లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్బ్యాక్ ఇచ్చాము.ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.మేమంతా అందుకు అర్హులమేమేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
భార్యతో కలిసి రూ. 21 కోట్లతో రెండు అపార్ట్మెంట్లు కొన్న సూర్యా భాయ్ (ఫొటోలు)
-
టీమిండియాలోకి కరుణ్ నాయర్..?
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసే భారత జట్టుకు దేశవాలీ స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ (భారత జట్టుకు) ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. కరుణ్ను నేరుగా భారత జట్టులోకి కాకుండా తొలుత భారత్-ఏ జట్టుకు ఎంపిక చేస్తారని సమాచారం. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్-ఏ ఇంగ్లండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్లకు కరుణ్ను ఎంపిక చేసి, ఇక్కడ సత్తా చాటితే టీమిండియాకు ఎంపిక చేయాలని భారత్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనకు, దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగే మ్యాచ్లకు భారత జట్ల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. కరుణ్ విషయంలో సెలెక్టర్లు సానుకూలంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. రోహిత్ న్యూజిలాండ్, ఆసీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ల్లో కెప్టెన్గా, ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్ను తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజాగా వెలువడిన రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. తాజాగా జరిగిన సెలెక్టర్ల సమావేశంలో రోహిత్నే ఇంగ్లండ్ టూర్కు కెప్టెన్గా కొనసాగించాలని డిసైడ్ చేశారట.కాగా, ఐపీఎల్ 2025 తర్వాత భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జూన్ 20న జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ను ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు నాలుగు రోజుల మ్యాచ్లు జరుగుతాయి. ఇంగ్లండ్ లయన్స్, ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ల కోసం మే చివరి వారంలో భారత జట్లను ప్రకటించే అవకాశం ఉంది.అరివీర భయంకర ఫామ్లో కరుణ్కరుణ్ నాయర్ దేశవాలీ సీజన్లో అరివీర భయంకర ఫామ్లో ఉన్నాడు. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి కరుణ్.. విదర్భ జట్టు చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుమందు కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్లు ఆడిన కరుణ్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. కరుణ్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. -
తొలిసారి పసిడి మెరుపులు
పాట్నా: సెపక్తక్రా ప్రపంచకప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్కప్లో పురుషుల రెగూ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్తక్రా ప్రపంచకప్లో భారత్కు ఇదే తొలి పసిడి పతకంకాగా... స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. తొలి సెట్లో ఓడి వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు సెట్లు నెగ్గి విజేతగా నిలిచింది. దేశంలో పెద్దగా ఆదరణ లేని ఈ క్రీడలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా... ఈ వరల్డ్కప్లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రజతం... పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది. ‘స్వదేశంలో జరిగిన సెపక్తక్రా ప్రపంచకప్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బృందానికి అభినందనలు. రెగూ జట్టు స్వర్ణంతో పాటు మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తుపై భరోసా పెంచింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
లవ్ లెటర్లు తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ లిఫ్ట్ చేస్తా: శ్రేయాంక (ఫోటోలు)
-
సిరాజ్తో డేటింగ్ రూమర్స్పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్తో డేటింగ్ రూమర్స్పై బిగ్బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. -
భారత జట్టు కెప్టెన్గా యువరాజ్ సింగ్
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా మళ్లీ ఎంపికయ్యాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్ కోసం ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ యువీని కెప్టెన్గా నియమించింది. యువీ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్లో విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ డబ్ల్యూసీఎల్ ఈ ఏడాది జులైలో (18 నుంచి) యునైటెడ్ కింగ్డమ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.డబ్ల్యూసీఎల్ మొదటి సీజన్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు పాల్గొనగా.. ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను చిత్తు చేసి ఛాంపియన్గా నిలిచింది. తొలి సీజన్లో భారత్ తరఫున యువీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించారు.ఈ సీజన్లో భారత జట్టులో మరో స్టార్ కూడా చేరనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ సీజన్లో ఇండియా ఛాంపియన్స్తో జతకట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. డబ్ల్యూసీఎల్లో ఇండియా ఛాంపియన్స్కు సుమంత్ బల్, సల్మాన్ అహ్మద్, జస్పాల్ బహ్రా ఓనర్లు వ్యవహరిస్తున్నారు. డబ్ల్యూసీఎల్ టోర్నీలో అంతర్జాతీయ వేదికపై మెరిసిన చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రైవేటు యాజమాన్యం అండర్లో జరుగుతుంది.కాగా, డబ్ల్యూసీఎల్ రెండో సీజన్లో పాకిస్తాన్కు కొత్త సారధి వచ్చాడు. ఈ సీజన్ కోసం పాక్ ఛాంపియన్స్ మేనేజ్మెంట్ సర్ఫరాజ్ అహ్మద్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ వెటరన్ వికెట్ కీపర్ 2023 నుంచి కాంపిటేటివ్ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. సర్ఫరాజ్ చేరిక పాకిస్తాన్ ఛాంపియన్స్కు బూస్టప్ ఇస్తుంది. గత సీజన్ పాక్కు యూనిస్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరించగా.. మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మల్, వాహబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్ -
ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్కు ఇది మూడోసారి (2002, 2013, 2025). -
బీసీసీఐకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృంద అధిపతి నితిన్ పటేల్ రాజీనామా చేశాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ, గతంలో ఎన్సీఏ)లో మూడేళ్లుగా స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్కు అధిపతిగా ఉన్న నితిన్ పటేల్ వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీనిపై నితిన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా... బోర్డు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించాయి. ‘నితిన్ రాజీనామా చేశాడు. బోర్డుతో అతడికి చక్కటి అనుబంధం ఉంది. గత మూడేళ్లలో టీమిండియా కోసం నితిన్ ఎంతో చేశాడు. సీఓఈలో వైద్య విధానాలను రూపొందించడంలో అతడి పాత్ర కీలకం. ఆటగాళ్లెవరైనా గాయపడి ఎన్సీఏకు వెళ్తే... వారు పూర్తిగా కోలుకోవడమే కాకుండా రెట్టించిన ఉత్సాహంతో కోలుకునే విధంగా తీర్చిదిద్దాడు. నితిన్ కుటుంబం విదేశాల్లో స్థిరపడింది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, షమీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వంటి ఎందరో ఆటగాళ్లు గాయపడి ఎన్సీఏకు వెళ్లగా... నితిన్ పర్యవేక్షణలో తిరిగి కోలుకున్నారు. -
వయసు పెరుగుతున్నా అదే టెంపర్.. విండీస్ ఆటగాడితో కయ్యానికి కాలు దువ్విన యువరాజ్ సింగ్
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు. pic.twitter.com/y2iHtEPyCr— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ విజేతగా నిలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్ను గెలిపించారు.అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు. రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్ను కవ్వించాడని మ్యాచ్ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు. లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు. -
హోలీ ఆడినందుకు షమీ కూతురిపై మండిపడ్డ ముస్లిం మత పెద్ద
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్రముఖ మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవలికాలంలో తరుచూ టార్గెట్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని తప్పుబట్టిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ.. తాజాగా షమీ కూతురు ఐరా హోలీ ఆడటాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. హోలీ రోజు ఐరా రంగులు పూసుకొని దిగిన ఫోటో ఒకటి సోషల్మీడియాలో ప్రత్యక్షం కావడంతో మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఫైరయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాను తిట్టి పోశాడు. రంజాన్ మాసంలో ముస్లింలు హోలీ ఆడటం అక్రమమని.. షరియత్కు ఇది వ్యతిరేకమని అన్నాడు.ఐరా లాంటి చిన్నారి రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాం చట్టానికి విరుద్ధమని ఓ వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్దాంతం చేయాలా అని మండిపడుతున్నారు. కొందరేమో ఇందులో చిన్నారి ఐరా తప్పు లేదు కానీ, రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడం పెద్ద నేరమని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఐరా తల్లిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఐరా తల్లి హసీన్ జహా మహ్మద్ షమీతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటుంది. కాగా, మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు కూడా పెద్ద రాద్దాంతం చేశాడు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండకుండా షమీ పెద్ద నేరం చేశాడని అరోపించాడు. ఇలా చేసి షమీ ఇస్లాం సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడని విమర్శించాడు. మౌలానా షాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యలపై అప్పట్లో భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. షమీ ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద షో చేస్తున్నావని రజ్వీని ప్రశ్నించారు. దేశం కోసం శ్రమించాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలని అనడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మతోన్మాధం ఎక్కువైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చురకలంటించారు.ఇదిలా ఉంటే, షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత్ టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లు తీసిన షమీ.. ఆసీస్తో జరిగిన సెమీస్లో 3 వికెట్లు పడగొట్టాడు. షమీ త్వరలో ఐపీఎల్లో ఆడనున్నాడు. ఈ సీజన్లో షమీని సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ఆడాడు. మెగా వేలంలో షమీని సన్రైజర్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. -
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్తో జరిగే మ్యాచ్తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను తప్పించి కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
న్యూ లుక్లో విరాట్.. సోషల్మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్ను ఐపీఎల్లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను సైతం తప్పించి కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం!
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్కప్-2023(ICC ODI World Cup)లో రన్నరప్గా నిలిచిన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup)లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.టెస్టుల్లో మాత్రం ఘోర పరాభావాలుఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దుబాయ్ వేదికగా ఈ వన్డే టోర్నమెంట్లో వరుసగా ఐదు విజయాలతో విజేతగా అవతరించింది. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ సేనకు గతేడాది నుంచి ఘోర పరాభావాలు ఎదురవుతున్నాయి.వరుసగా రెండుసార్లు ఫైనల్కు.. ఈసారి మాత్రంముఖ్యంగా సొంతగడ్డపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. విదేశీ జట్టు(న్యూజిలాండ్) చేతిలో వైట్వాష్కు గురికావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడిపోవడం విమర్శలకు దారితీసింది. ఈ రెండు పరాజయాల కారణంగా టీమిండియా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్కు చేరుకోలేకపోయింది.ఈ మెగా ఈవెంట్ను ఐసీసీ 2019లో మొదలుపెట్టగా తొలి రెండు సీజన్ల(2019- 2021, 2021-2023)లో భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక .. తాజా ఎడిషన్(2023-25)లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.ఆసీస్ వర్సెస్ ప్రొటిస్ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా మరోసారి తుదిపోరుకు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. జూన్లో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇరుజట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.సుమారు రూ.45 కోట్లు నష్టంఅయితే భారత్ ఫైనల్లో లేకపోవడం మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీసీ ఏకంగా 40 లక్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) నష్టపోనుందని సమాచారం. భారత్ ఫైనల్ చేరుకుంటుందనే గట్టి నమ్మకంతో ఎంసీసీ మ్యాచ్ టికెట్ రేట్లను భారీగా పెంచగా.. ఇప్పుడు వాటిని తగ్గించాల్సి వస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోనుంది.స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్కు ముందు వరకు కూడా భారత్ సునాయాసంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కివీస్ చేతిలో 0–3తో ఓటమితో అంతా మారిపోయి రేసులో టీమిండియా వెనుకబడిపోయింది. భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న సమయంలో పెట్టిన గరిష్ట టికెట్ ధరకంటే కనీసం 50 పౌండ్లు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. ఇదంతా కూడా ఎంసీసీ ఆదాయానికి గండి కొడుతోంది. గత ఏడాది లార్డ్స్లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టుకు టికెట్ రేట్ భారీగా ఉండటంతో కేవలం 9 వేల మంది హాజరయ్యారు. దాంతో ఎంసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కాస్త అందుబాటులో ఉంటే టికెట్లను ఉంచాల్సి వస్తోంది.చదవండి: కెప్టెన్గా, ఓపెనర్గా రోహిత్ శర్మనే..! -
ప్రపంచ క్రికెట్లో భారత్ ఒక్కటే అలా చేయగలదు.. రాహుల్ను ఎంత పొగిడినా తక్కువే: స్టార్క్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయానంతరం టీమిండియాపై ఆసీస్ స్పీడ్గన్ మిచెల్ స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగత కారణాల చేత ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్క్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత క్రికెట్ను, టీమిండియా కీలక సభ్యుడు కేఎల్ రాహుల్ను ఆకాశానికెత్తాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం భారత్ ఒక్కటే ఒకే రోజు మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించగలదని అన్నాడు. టెస్ట్ల్లో ఆస్ట్రేలియాపై.. వన్డేల్లో ఇంగ్లండ్పై.. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించినా భారత జట్లు గట్టి పోటీ ఇవ్వగలవని కితాబునిచ్చాడు. భారత్ మినహా ప్రపంచ క్రికెట్లో ఏ దేశానికి ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించే సత్తా లేదని కొనియాడాడు.కేఎల్ రాహుల్ను ఆకాశానికెత్తిన స్టార్క్మిచెల్ స్టార్క్ టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ప్రదర్శనలు అద్భుతమని కొనియాడాడు. టీమిండియాకు రాహుల్ మిస్టర్ ఫిక్సిట్ లాంటి వాడని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం అతను ఏమైన చేయగలడని కొనియాడాడు. ఓపెనర్గా, మిడిలార్డర్లో, ఆరో స్థానంలో, వికెట్ కీపింగ్ బ్యాటర్గా, ఫీల్డర్గా.. ఇలా ఏ పాత్రలో అయినా రాహుల్ ఒదిగిపోగలడని కితాబిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రాహుల్ తన ఐదో స్థానాన్ని అక్షర్ పటేల్కు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతాలు చేశాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా గెలుపుకు రాహుల్ ప్రధాన కారకుడని పేర్కొన్నాడు. రాహుల్ లాంటి మల్టీ టాలెంటెడ్ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్లో కేఎల్ రాహుల్తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నాడు. స్టార్క్ను గతేడాది మెగా వేలంలో ఢిల్లీ రూ. 11.75 కోట్లు సొంతం చేసుకుంది. అంతకుముందు ఏడాది (2024) స్టార్క్ కేకేఆర్కు ఆడాడు. ఆ సీజన్ వేలంలో కేకేఆర్ స్టార్క్కు రికార్డు ధర (రూ. 24.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక ధర. ఐపీఎల్లో అత్యధిక ధర పొందిన ఆటగాడి రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. పంత్ను ఈ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇదే సీజన్ వేలంలో ఐపీఎల్లో రెండో అత్యధిక ధర కూడా నమోదైంది. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్కు రూ. 26.75 కోట్లు చెల్లించింది.ఐపీఎల్లో టాప్-5 పెయిడ్ ప్లేయర్స్రిషబ్ పంత్- 27 కోట్లు (లక్నో, 2025)శ్రేయస్ అయ్యర్- 26.75 కోట్లు (పంజాబ్, 2025)మిచెల్ స్టార్క్- 24.75 కోట్లు (కేకేఆర్, 2024)వెంకటేశ్ అయ్యర్- 23.75 కోట్లు (కేకేఆర్, 2025)పాట్ కమిన్స్- 20.50 కోట్లు (సన్రైజర్స్, 2024)2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్ -
కెప్టెన్గా, ఓపెనర్గా రోహిత్ శర్మనే..!
ప్రతిష్టాత్మక విజ్డన్ సంస్థ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా, ఓపెనర్గా టీమిండియా సారధి రోహిత్ శర్మను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి విజ్డన్ టీమ్ ఆఫ్ ద టోర్నీకి ఎంపికయ్యారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ నుంచి నలుగురు.. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, ఫైనల్కు ముందు గాయపడిన స్పీడ్స్టర్ మ్యాట్ హెన్రీ విజ్డన్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజ్మతుల్లా ఒమర్జాయ్ విజ్డన్ జట్టుకు ఎంపికయ్యారు.రోహిత్కు జతగా రచిన్ రవీంద్ర ఓపెనర్గా ఎంపిక కాగా.. విరాట్ వన్డౌన్లో, జో రూట్ నాలుగో స్థానం కోసం ఎంపిక చేయబడ్డారు. వికెట్కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ ఎంపిక కాగా.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో ఒమర్జాయ్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా బ్రేస్వెల్, సాంట్నర్ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి.. స్పెషలిస్ట్ పేసర్లుగా మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ ఎంపికయ్యారు.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ఎంపిక చేయడంతో పాటు విజ్డన్ టీమిండియా ఆటగాళ్లకు రేటింగ్లు కూడా ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా ఈ రేటింగ్లు ఇచ్చింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందారు. వీరికి 10కి 9 పాయింట్లు లభించాయి. రాహుల్, వరుణ్ తర్వాత విరాట్ అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందాడు. విరాట్కు 10కి 8.5 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆతర్వాత రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్కు తలో 8 పాయింట్లు లభించాయి. శుభ్మన్ గిల్కు 7.5.. షమీ, జడేజాలకు తలో 7.. హార్దిక్, హర్షిత్ రాణాకు 10కి 6 పాయింట్లు లభించాయి.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి టైటిల్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా నిలిచింది. ఈ టైటిల్తో భారత్ ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. రోహిత్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించింది. కేవలం ఏడాదిలోపే భారత్ టీ20 వరల్డ్కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన అర్ద శతకం సాధించి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గానూ రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
ఐసీసీ బీసీసీఐ ఆడమన్నట్టల్లా ఆడుతుంది.. విండీస్ దిగ్గజ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడాన్ని పాకిస్తాన్ వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ ఒకే వేదికపై ఆడి లబ్ది పొందిందని కొన్ని భారత వ్యతిరేక శక్తులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రాతినిథ్యమే లేని విండీస్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం మొదలుపెట్టింది. భారత్ దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడటాన్ని విండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ తప్పుబట్టాడు. మిగతా జట్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించి మ్యాచ్లు ఆడితే, టీమిండియా మాత్రం కాలు కదపకుండా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడిందని అన్నాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చినా పాకిస్తాన్ కూడా టీమిండియాతో మ్యాచ్కు దుబాయ్కు వెళ్లిందని గుర్తు చేశాడు. ఇలాంటప్పుడు పాక్ జట్టుకు ఆతిథ్య సౌలభ్యం ఎక్కడ లభించిందని ప్రశ్నించాడు. ఒకే వేదికపై టీమిండియా మ్యాచ్లు షెడ్యూల్ చేసినందుకు ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. బీసీసీఐ ప్రతి కోరికను తీర్చడాన్ని ఐసీసీ మానుకోవాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక (దుబాయ్) విషయంలో ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డాడు. ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడటం ద్వారా టీమిండియా లబ్ది పొందిందని ఆరోపించాడు. ఈ విషయంలో మిగతా జట్లకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇకనైనా ఐసీసీ బీసీసీఐకి సహకరించడం మానుకోవాలని అన్నాడు. 2024 టీ20 వరల్డ్కప్లోనూ ఓ విషయంలో ఐసీసీ బీసీసీఐకి సహకరించిందని నిరాధార ఆరోపణ చేశాడు. టీమిండియా కోసం బీసీసీఐ చేసే ప్రతి అభ్యర్థనను నెరవేర్చకూడదని ఐసీసీకి సూచించాడు. అప్పుడప్పుడైనా బీసీసీఐకి నో చెప్పాలని వ్యంగ్యంగా అన్నాడు. ప్రపంచంలో బీసీసీఐ ధనిక బోర్డు కావడంతో ఐసీసీ వారి చెప్పినట్టల్లా ఆడుతుందని అన్నాడు. తనవరకు ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని ఎద్దేవా చేశాడు. బీసీసీఐ ప్రతి విషయంలో ఐసీసీని శాశిస్తుందని తెలిపాడు. రేపటి రోజుల్లో బీసీసీఐ నో బాల్స్ వద్దు, వైడ్ బాల్స్ వద్దన్నా ఐసీసీ తలూపుతుందని అన్నాడు. బీసీసీఐని తృప్తి పరిచేందుకు ఐసీసీ ఏమైనా చేస్తుందని అన్నాడు. 74 ఏళ్ల ఆండీ రాబర్ట్స్ తొలి మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడింటిలో విండీస్ తొలి రెండు ప్రపంచకప్లను గెలిచింది. 1983 వరల్డ్కప్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో విండీస్ను చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. నేడు రాబర్ట్స్ చేసిన వ్యాఖ్యలు నాటి ప్రపంచకప్ అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుంది. కాగా, రాబర్ట్స్ లేవనెత్తిన విషయాన్నే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా లేవనెత్తాడు. ఒకే వేదికపై ఆడి, ఎలాంటి ప్రయాణ బడలికలు లేకుండా టీమిండియా లబ్ది పొందిందని సోషల్మీడియా వేదికగా ఆరోపించాడు. అయితే ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు అదనంగా ఒరిగిందేమీ లేదని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అనడం విశేషం. ఈ టోర్నీలో భారత్ వేదికతో సంబంధం లేకుండా చాలా బలంగా ఉండిందని అక్రం అన్నాడు. ఈ జట్టుతో భారత్ పాకిస్తాన్లో కూడా గెలిచేదని తెలిపాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్లను దుబాయ్లో అడి అన్నింటా విజయాలు సాధించింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్లో పర్యటించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ టీమిండియా మ్యాచ్లను దుబాయ్కు మార్చింది. -
ఇలా అయితే వరల్డ్ ఎలెవెన్పై కూడా గెలుస్తారు.. టీమిండియాపై పాక్ మాజీ ప్రశంసల వర్షం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ జట్టుతో భారత్ వరల్డ్ ఎలెవెన్పై కూడా సునాయాసంగా గెలుస్తుందని కితాబునిచ్చాడు. ఛాంపియన్స్గా నిలిచేందుకు టీమిండియా ఆటగాళ్లు వంద శాతం అర్హులని కొనియాడాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత సెలెక్టర్లు సరైన జట్టును ఎంపిక చేశారని అన్నాడు. వారు దుబాయ్లో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి స్పిన్ లోడ్తో బరిలోకి దిగారని తెలిపాడు. ఒకే వేదికపై ఆడటం భారత్కు కలిసొచ్చిందని అంటూనే ట్రోఫీ విజయంలో సెలెక్టర్ల పాత్ర అమోఘమని కితాబునిచ్చాడు.దుబాయ్లో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకమని తెలిపాడు. తనకు అక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి స్పిన్నర్ల పాత్ర గురించి తెలుసని చెప్పాడు. కేవలం స్పిన్నర్లే కాకుండా టీమిండియా మొత్తం పటిష్టంగా ఉందని అన్నాడు. ఈ జట్టుతో ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించవచ్చని తెలిపాడు.తమ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా ఈ టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్లు గెలిచిందని గుర్తు చేశాడు. వన్డే ఫార్మాట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన మహ్మద్ సిరాజ్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా భారత సెలెక్టర్లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నాడు. నలుగురు స్పిన్నర్లకు ఆడించడం టీమిండియా వర్కౌట్ అయ్యిందని తెలిపాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో (అబ్రార్ అహ్మద్) బరిలోకి దిగి పెద్ద తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు.కాగా, పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అజేయ జట్టుగా నిలిచి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లపై విజయాలు సాధించి, సెమీస్లో ఆస్ట్రేలియా, ఫైనల్స్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి, ముచ్చటగా మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి పాకిస్తాన్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ సొంతగడ్డపై ఆడుతున్న అడ్వాంటేజ్ను కూడా పొందలేక గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట (న్యూజిలాండ్, భారత్ చేతుల్లో) ఓడింది. బంగ్లాదేశ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో పాక్కు సొంత అభిమానుల నుంచే ఛీదరింపులు ఎదురవుతున్నాయి. ఆ దేశ మాజీలు పాక్ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లను తూర్పారబెడుతున్నారు. పాక్ మాజీలు పాక్ ఓడిపోయిన దానికంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్ గెలిచినందుకు ఎక్కువగా బాధపడుతున్నారు. పైకి టీమిండియాను పొగుడుతున్నట్లు నటిస్తున్నప్పటికీ లోలోపల కుమిలిపోతున్నారు. -
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ టైగర్స్తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. -
చాంపియన్స్ మనమే..!
చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
అపురూపంగా అక్కున చేర్చుకొని...
దుబాయ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల చేతుల్లో నాలుగో ఐసీసీ టైటిల్స్...రవీంద్ర జడేజాకు ముచ్చటగా మూడోది. గిల్, పంత్, పాండ్యా, అక్షర్, అర్‡్షదీప్ సింగ్, కుల్దీప్ ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ ట్రోఫీని అందుకోగా... షమీ, అయ్యర్, రాహుల్, సుందర్, రాణా మొదటిసారి కప్ను ముద్దాడారు... 15 మంది సభ్యుల జట్టులో అందరి ఘనతలు వేర్వేరు కావచ్చు... కానీ ఇప్పటికే ఎన్ని గెలిచినా, ఏం సాధించినా మరో విజయం దక్కినప్పుడు అందరిలో కనిపించే ఆనందం ఒక్కటే... సంబరాల్లో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జడేజా బౌండరీ కొట్టి ఛేదన పూర్తి చేయడంతో మొదలైన జోష్ సోమవారం వరకు సాగింది. స్టేడియంలో ఒకవైపు జట్టు సహచరులతో విజయాన్ని పంచుకుంటూనే మరోవైపు రోహిత్, కోహ్లి, జడేజా, షమీ, గిల్ తమ కుటుంబ సభ్యులతో ట్రోఫీ ఆనందాన్ని ప్రదర్శిస్తూ సుదీర్ఘ సమయం గడిపారు. అక్కడి నుంచి ఇదే ఉత్సాహం డ్రెస్సింగ్ రూమ్లోనూ కొనసాగింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేక్ను కెప్టెన్ రోహిత్ కట్ చేసిన తర్వాత తమ విజయానుభూతిని అంతా పంచుకున్నారు. అనంతరం హోటల్ చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కుల్దీప్ చెప్పినట్లు రాత్రంతా పార్టీ కొనసాగింది. గిల్, పాండ్యా, వరుణ్ హోటల్ గదుల్లోనే చాంపియన్స్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిస్తూ ఈ మధుర క్షణాలను చిరస్మరణీయం చేసుకున్నారు. సోమవారం ఉదయం విజేత కెప్టెన్తో ఐసీసీ ప్రత్యేక ఫొటో షూట్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఐసీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టోర్నీ జ్ఞాపికలుగా మ్యాచ్లలో ఉపయోగించిన బంతులు, స్టంప్స్పై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా నేపథ్యంగా జరిగిన షూట్లో ట్రోఫీతో భారత సారథి సగర్వంగా నిలిచాడు. గత ఏడాది రోహిత్ నాయకత్వంలోనే గెలుచుకున్న టి20 వరల్డ్ కప్ను కూడా చాంపియన్స్ ట్రోఫీతో కలిపి ప్రదర్శించడం విశేషం. స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లుచాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి సంబరాలు ముగించిన వెంటనే టీమిండియా స్వదేశం పయనమైంది. సోమవారం రాత్రికే జట్టు ఆటగాళ్లంతా భారత్కు చేరుకున్నారు. -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి! -
HYD: భారత్ విక్టరీపై ఫ్యాన్స్ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్సుఖ్నగర్లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్ బండ్ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్, అమీర్పేట్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025 -
భారత్ జట్టుకు అభినందనలు తెలుపుతున్న సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు
-
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్కు అనుకూలించే పిచ్పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్కు శుభారంభాన్ని అందించారు. శుభ్మన్ గిల్తో (31) కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
CT 2025 Final: సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్లు.. అయినా టఫ్ టార్గెట్ను సెట్ చేసిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్ను మార్చే ప్రమాదముంది.ఈ పిచ్పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్కు అనుకూలించే పిచ్పై సాంట్నర్, బ్రేస్వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్వెల్ (21) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరో రెండు క్యాచ్లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
టీమిండియాకు అసలుసిసలైన మొనగాడు
-
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్మన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్మన్ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్కి ముందు భారత్కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్మన్ హెన్రిచ్ క్లాసెన్ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్కు పెద్ద దెబ్బ అవుతుంది. -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడినా ఫైనల్కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్కు చేరింది. సెమీస్లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్కు అది తొలి ఐసీసీ టైటిల్. -
వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో చండీఘడ్ పోలీసులు వినోద్ సెహ్వాగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు విచారణకు హాజరుకాకపోవడంతో 2023లో స్థానిక కోర్టు వినోద్ సెహ్వాగ్తో పాటు మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వినోద్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం వినోద్ తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను పోలీసులు వ్యతిరేకించారు. దీంతో దీనిపై విచారణ మార్చి 10కి వాయిదా పడింది. అప్పటివరకు వినోద్ సెహ్వాగ్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు.అసలేం జరిగిందంటే.. క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో వినోద్ సెహ్వాగ్తో పాటు విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుండి రూ. 7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. చెల్లింపుగా, కంపెనీ రూ. కోటి చొప్పున ఏడు వేర్వేరు చెక్కులను జారీ చేసింది.అయితే అకౌంట్లో సరిపడా నిధులు లేని కారణంగా అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. పలు ఫాలోఅప్ల అనంతరం శ్రీ నైనా ప్లాస్టిక్స్ అధినేత కృష్ణణ్ మోహన్ ఖన్నా కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ డైరెక్టర్లైన వినోద్ సెహ్వాగ్, విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రాను నిందితులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై వినోద్ సెహ్వాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్కు సంబంధించి ఇటీవలికాలంలో వచ్చిన రెండో వార్త ఇది. వీరూ అతని భార్యతో విడాకులు తీసుకోనున్నాడని కొద్ది రోజుల కిందట సోషల్మీడియా కోడై కూసింది. ఇన్స్టాలో వీరూ, అతని సతీమణి ఇద్దరు అన్ఫాలో చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. వీరూ గత కొద్ది రోజులుగా తన భార్యను విడిచి పెట్టి, తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు తిరిగే వీరూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.46 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అప్పటినుంచి కామెంటేటర్గా, విశ్లేషకుడిగా క్రికెట్తో సంబంధం కలిగి ఉంటున్నాడు. సెహ్వాగ్కు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరూ క్రికెటర్లే కావడం విశేషం. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవలికాలంలో జూనియర్ క్రికెట్లో సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్గా పేరుండేది. సెహ్వాగ్ భారత్ తరఫున టెస్ట్ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సెహ్వాగ్ తన కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. కేవలం బ్రాడ్మన్, గేల్, లారా మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Champions Trophy 2025: శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్కప్లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయాడు.శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్లు ఆడి 79.92 స్ట్రయిక్రేట్తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్కు చేరింది.ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. మొదటి బ్యాటింగ్తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్లో ఆసీస్ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్పైనే గెలవడం విశేషం. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్లన్నీ డే మ్యాచ్లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్కప్కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్తో తలపడనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా
-
IND Vs AUS: ఆస్టేలియాను కొట్టేశారు... ఫైనల్లో భారత్
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్తో... ఆపై చక్కటి బ్యాటింగ్తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం! దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రాణించిన స్మిత్... హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్ను బౌలింగ్కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.వరుణ్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్లో గిల్కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు. ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఆరంభంలోనే శుబ్మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు. అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్వెల్ బౌలింగ్లో భారీ సిక్స్తో రాహుల్ మ్యాచ్ను ముగించాడు. 1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది. 746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు. గిల్కు అంపైర్ వార్నింగ్ హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు. అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్వర్త్ ప్రత్యేకంగా గిల్కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్కు విచక్షణాధికారం ఉంటుంది.స్మిత్ అదృష్టం అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. రోహిత్కు లైఫ్కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్వర్డ్ పాయింట్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్ను లబుషేన్ అందుకోలేకపోయాడు. పాకిస్తాన్పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్కు ముందు ఆటగాళ్లంతా ఫామ్లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లలో భారత్ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. 336 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న భారతీయ ఫీల్డర్గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న రెండో ఫీల్డర్గానూ కోహ్లి (161 క్యాచ్లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్లు) తొలి స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్వెల్ (బి) అక్షర్ 7; డ్వార్షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0. -
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా మూడోసారి (2013, 2017, 2025), మొత్తంగా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్కు చేరిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 వరల్డ్కప్.. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరింది. ప్రపంచంలో ఏ ఇతర కెప్టెన్ ఈ నాలుగు ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్కు చేర్చలేదు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.ప్రతీకారం తీర్చుకున్న భారత్తాజాగా గెలుపుతో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 2023 వరల్డ్కప్ ఫైనల్స్ తర్వాత వన్డేల్లో భారత్ ఆసీస్ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. హ్యాట్రిక్ విజయాలుఇతర టోర్నీలో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఆసీస్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్లో మూడుసార్లు ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో టీమిండియానే జయకేతనం ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి 1998 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత 2000 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్లో ఇరు జట్లు రెండో సారి ఢీకొన్నాయి. ఈసారి భారత్ 20 పరుగుల తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. తాజాగా 2025 ఎడిషన్ సెమీస్లో గెలుపుతో భారత్ ఆసీస్పై హ్యాట్రిక్ విజయాలు (ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్లో) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్లో ఆసీస్ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్లో టీమిండియా ఆసీస్ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్వెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
ఫైనల్కు చేరిన టీమిండియాకు కిషన్రెడ్డి అభినందనలు
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(మంగళవారం) జరిగిన తొలి సెమీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా విజయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. . ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రోహిత్ సేనకు అభినందనలు తెలియజేశారు. ఇదే జోష్ ను ఫైనల్ కూడా కనబరిచి చాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు.ఆసీస్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), రాహుల్(42 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడగా, హార్దిక్ పాండ్యా( 24 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ 28)లు బ్యాట్ ఝుళిపించారు. దాంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ తలపడనుంది. -
CT 2025, IND VS AUS 1st Semis: 97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారత్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లి (26 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 19 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 93/2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 31 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్కు దక్కింది.97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!ఈ మ్యాచ్లో భారత్ ఆసక్తికర రీతిలో జట్టును సమీకరించింది. కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో (మహ్మద్ షమీ) బరిలోకి దిగింది. 97 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్ లేదా ఫైనల్స్లో ఇలా ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.మొత్తంగా ఐసీసీ వన్డే సెమీస్ లేదా ఫైనల్స్లో ఓ జట్టు ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగడం ఇదే నాలుగో సారి మాత్రమే. తొలి రెండు సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు ఎడిషన్లలో (1998, 2000) చోటు చేసుకోవడం విశేషం. 1998 ఎడిషన్ ఫైనల్లో సౌతాఫ్రికా, 2000 ఎడిషన్ సెమీస్లో పాకిస్తాన్ జట్లు ఇలానే ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్తో బరిలోకి దిగాయి. మూడో సందర్భం 2011 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో చోటు చేసుకుంది. నాడు శ్రీలంక న్యూజిలాండ్పై ఒకే ఒక పేసర్ను బరిలోకి దించి విజయం సాధించింది. 14 ఏళ్ల అనంతరం భారత్ తిరిగి ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్లో ఒకే ఒక పేసర్ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది.ఐసీసీ ఈవెంట్ల సెమీస్ లేదా ఫైనల్స్లో ఒకే ఒక పేసర్తో బరిలోకి దిగిన జట్లు..సౌతాఫ్రికా (1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్)- వెస్టిండీస్పై గెలుపుపాకిస్తాన్ (2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)- న్యూజిలాండ్ చేతిలో ఓటమిశ్రీలంక (2011 వన్డే వరల్డ్కప్ సెమీస్)- న్యూజిలాండ్పై గెలుపుభారత్ (2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్) -
CT 2025, IND VS AUS: సిక్సర్ల శర్మ.. హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్లు)క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్లు)గ్లెన్ మ్యాక్స్వెల్-49 (30 ఇన్నింగ్స్లు)డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్లు)సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్లు)మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా తక్కువ స్కోర్కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్కు దక్కింది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్ బ్యాటర్గా కాకుండా ఫీల్డర్గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్లో జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టుకున్న ఫీల్డర్గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లో చెరి 334 క్యాచ్లు పట్టారు. ఇంగ్లిస్ క్యాచ్తో విరాట్ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు) ఇప్పటివరకు 657 ఇన్నింగ్స్ల్లో పాల్గొని 335 క్యాచ్లు అందుకోగా.. రాహుల్ ద్రవిడ్ 571 ఇన్నింగ్స్ల్లో 334 క్యాచ్లు పట్టాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్లు పట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, ద్రవిడ్ తర్వాత మహ్మద్ అజహరుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256) ఉన్నారు.ఓవరాల్గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్ల రికార్డు మహేళ జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే 768 అంతర్జాతీయ ఇన్నింగ్స్ల్లో 440 క్యాచ్లు పట్టాడు. ఈ జాబితాలో జయవర్దనే తర్వాత రికీ పాంటింగ్ (364), రాస్ టేలర్ (351) జాక్ కల్లిస్ (338) ఉన్నారు. విరాట్ 335 క్యాచ్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కూపర్ కన్నోలిని షమీ డకౌట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపు ట్రవిస్ హెడ్ మెరుపులు మెరిపించాడు. హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కొద్ది సేపటి వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్కు 56 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా లబూషేన్ను (29) బోల్తా కొట్టించాడు. ఆతర్వాత వచ్చిన జోస్ ఇంగ్లిస్ (11) కొద్ది సేపే క్రీజ్లో నిలబడి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. ఇంగ్లిస్ తర్వాత బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టాస్తున్నాడు. స్టీవ్ స్మిత్, క్యారీ ఐదో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్మిత్ 71, క్యారీ 38 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 36 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 195/4గా ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమీ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. -
CT 2025: సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది. తద్వారా సెమీస్లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్లో ఆసీస్ భారత్ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్కు ఆసీస్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్లో ఫలితంతో రెండో సెమీస్లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్లో ఆసీస్ను ఓడించి టీమిండియా ఫైనల్కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్కు వేదికవుతుంది.హ్యాట్రిక్ విజయాలుభారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్కు చేరింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. -
CT 2025: ఐదేసిన వరుణ్.. న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు అనంతరం భారత్ గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది. తద్వారా సెమీస్లో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడతుంది. మార్చి 4న ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్.. గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.రాణించిన శ్రేయస్, హార్దిక్, అక్షర్తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత టాప్-3 బ్యాటర్లు రోహిత్ శర్మ (15), శుభ్మన్ గిల్ (2), విరాట్ కోహ్లి (11) విఫలమయ్యారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.ఐదేసిన వరుణ్250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో లక్ష్యానికి 45 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న వరుణ్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కుల్దీప్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి భారత్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. వీరందరూ చెలరేగడంతో భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్ను గెలిపించేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. అయితే అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, బ్రేస్వెల్ 2, మ్యాట్ హెన్రీ 2, విలియమ్ ఓరూర్కీ 1 పరుగు చేశారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (28) బ్యాట్ ఝులిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
Champions Trophy 2025: టీమిండియా మేనేజర్ ఇంట విషాదం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు మేనేజర్గా వ్యవహరిస్తున్న ఆర్ దేవరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవరాజ్ తల్లి కమలేశ్వరి ఇవాళ (మార్చి 2) ఉదయం మృతి చెంచారు. దీంతో దేవరాజ్ భారత బృందాన్ని వదిలి హైదరాబాద్కు బయల్దేరారు. దేవరాజ్ తిరిగి టీమిండియాతో కలుస్తారా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. మంగళవారం జరిగే సెమీఫైనల్ ఫలితంపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. దేవరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దేవరాజ్ తల్లి మృతి పట్ల హెచ్సీఏ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో తెలిపింది. దేవరాజ్ ఇటీవలే టీమిండియా మేనేజర్ ఎంపికయ్యారు.ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) మాత్రమే రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా ఓడితే సెమీస్లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
Champions Trophy 2025: న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయంన్యూజిలాండ్పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విలియమ్సన్కు మిగతా కివీస్ బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో వరుణ్తో పాటు కుల్దీప్ (2), హార్దిక్ పాండ్యా (1), అక్షర్ పటేల్ (1), రవీంద్ర జడేజా (1) వికెట్లు తీశారు.అంతకుముందు భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్.. ఆస్ట్రేలయాతో తలపడనుంది. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తివరుణ్ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మ్యాట్ హెన్రీ (2) వికెట్ ఈ మ్యాచ్లో వరుణ్కు ఐదవది. విరాట్ కోహ్లి క్యాచ్ పట్టడంతో హెన్రీ ఔటయ్యాడు.సాంట్నర్ క్లీన్ బౌల్ట్.. వరుణ్ ఖాతాలో నాలుగో వికెట్న్యూజిలాండ్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో న్యూజిలాండ్ చివరి ఆశాకిరణం మిచెల్ సాంట్నర్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డేంజర్ మ్యాన్ విలియమ్సన్ ఔట్169 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. డేంజర్ మ్యాన్ కేన్ విలియమ్సన్ (81) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో విలియమ్సన్ స్టంపౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. బ్రేస్వెల్ ఔట్.. వరుణ్ ఖాతాలో మూడో వికెట్159 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బ్రేస్వెల్ (2) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. డేంజర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతిరే డేంజర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. ఫిలిప్స్ను వరుణ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 35.4 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 151/5గా ఉంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే 86 బంతుల్లో 99 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్133 పరుగుల వద్ద (32.2 ఓవర్లు) న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా కీలకమైన టామ్ లాథమ్ (14) వికెట్ తీశాడు. లాథమ్ జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 117 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్జడేజా బౌలింగ్లో బౌండరీతో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్కు వన్డేల్లో ఇది 47వ హాఫ్ సెంచరీ. కేన్ తన హాఫ్ సెంచరీలో 5 బౌండరీలు బాదాడు. మ్యాజిక్ చేసిన కుల్దీప్.. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్93 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ డెలివరీతో డారిల్ మిచెల్ను (17) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 26 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 104/3గా ఉంది. కేన్ విలియమ్సన్ 45, టామ్ లాథమ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాంటే ఇంకా 146 పరుగులు చేయాలి. విల్ యంగ్ను క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి49 పరుగుల వద్ద (13.3 ఓవర్లు) న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో విల్ యంగ్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ విలియమ్సన్కు (19) జతగా డారిల్ మిచెల్ క్రీజ్లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టడంతో రచిన్ రవీంద్ర (6) ఔటయ్యాడు. విల్ యంగ్కు (10) జతగా కేన్ విలియమ్సన్ క్రీజ్లోకి వచ్చాడు.రాణించిన శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు.ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో మెరిశాడు. జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పలు అద్భుతమైన క్యాచ్లు పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (కోహ్లి), కేన్ విలియమ్సన్ (జడేజా) పట్టిన క్యాచ్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచాయి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్246 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (45) ఔటయ్యాడు. చివరి ఓవర్లో హార్దిక్ సింగిల్స్ తీయకుండా ఓవరాక్షన్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా223 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్182 పరుగుల వద్ద (39.1 ఓవర్లు) భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు (3) జతగా రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్172 పరుగుల వద్ద (36.2 ఓవర్లు) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 98 బంతుల్లో 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో విల్ యంగ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్కు (17) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్128 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో కుదురుకున్న అక్షర్ పటేల్ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్లో లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో అక్షర్ ఔటయ్యాడు. కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అక్షర్ను పెవిలియన్కు పంపాడు. శ్రేయస్కు (51) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన శ్రేయస్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్ 75 బంతుల్లో 4 బౌండరీల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శ్రేయస్కు ఇది అత్యంత నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీ. 29 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 127/3గా ఉంది. శ్రేయస్ 51, అక్షర్ పటేల్ 42 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (మార్చి 2) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శుభ్మన్ గిల్ (2) ఈ టోర్నీలో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్కు ఔటయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ కోహ్లి 11 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.కష్టాల్లో ఉన్న భారత్ను శ్రేయస్ అయ్యర్ (35 నాటౌట్), అక్షర్ పటేల్ (23 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు ఇప్పటికే 60 పరుగులు జోడించారు. 23 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జేమీసన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే -
ఐపీఎల్తో పోటీకి దిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్.. షెడ్యూల్ ప్రకటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఇండియన్ ప్రీమియర్ లీగ్తో (IPL) నేరుగా పోటీకి దిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) పీఎస్ఎల్ 10వ ఎడిషన్ షెడ్యూల్ను ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ షెడ్యూల్ ఐపీఎల్-2025 షెడ్యూల్తో క్లాష్ అవుతుంది. పీఎస్ఎల్ 10వ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది. మే 18న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 25న ముగుస్తుంది. ఐపీఎల్లో పాల్గొనే విదేశీ ప్లేయర్లను ఇరకాటంలో పెట్టేందుకే పీసీబీ పీఎస్ఎల్ను ఐపీఎల్ డేట్స్లో ఫిక్స్ చేసింది.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం 34 మ్యాచ్లు (6 జట్లు) జరుగనున్నాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో రెండు ఎలిమినేటర్ మ్యాచ్లు, ఫైనల్ సహా 13 మ్యాచ్లు జరుగనున్నాయి. రావల్పిండి స్టేడియం క్వాలిఫయర్-1 సహా 11 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ మరియు ముల్తాన్ స్టేడియాల్లో తలో ఐదు మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సీజన్లో మూడు డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో రెండు వీకెండ్లో (శనివారం) జరుగనుండగా.. ఓ డబుల్ హెడర్ పాక్ నేషనల్ హాలిడే లేబర్ డే రోజున జరుగనుంది.లీగ్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ టూ టైమ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.ఈ సీజన్లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరుగనుంది. ఏప్రిల్ 8న పెషావర్లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో పాల్గొనే జట్లపై త్వరలో ప్రకటన వెలువడనుంది.పీఎస్ఎల్-2025 పూర్తి షెడ్యూల్..11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం12 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ13 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ16 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం18 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం20 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ22 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం23 ఏప్రిల్ - ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం24 ఏప్రిల్ - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 25 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 26 - లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 27 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 29 - క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ఏప్రిల్ 30 - లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 1 - ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 1 - లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియంమే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియంమే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం13 మే – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం14 మే – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్16 మే – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్18 మే – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్ -
Shubman Gill: పరుగుల వేటగాడు.. మిస్టర్ నంబర్ వన్
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు అధిరోహిస్తున్న 25 ఏళ్ల శుభ్మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ నంబర్వన్ ర్యాంకర్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన అతడు బ్యాటర్గానూ ఇరగదీస్తున్నాడు. అంతా కలిసొస్తే భవిష్యత్లో భారత భావి కెప్టెన్గా గిల్ను చూడవచ్చు.... పంజాబ్ యువ ఓపెనర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గిల్ ప్రస్థానం వర్దమాన ఆటగాళ్లకు ఆదర్శం.బ్యాట్ పట్టగానే ఆ కుర్రాడు తన పరుగుల వేట ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపెట్టాడు. అంతర్ జిల్లా అండర్–16 క్రికెట్ టోర్నీ మ్యాచ్లో 351 పరుగులు చేసి ప్రకంపనలు రేపాడు. అదే ఊపులో విజయ్ మర్చంట్ ట్రోఫీ అరంగేట్రంలోనే అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్–19 జాతీయ జట్టుకు సులువుగానే ఎంపికయ్యాడు. అప్పటికే ఓపెనర్గా రాటుదేలిన ఆ కుర్రాడు 2018లో జరిగిన అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు.న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో 372 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకొని యువభారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తదనంతరం అండర్–19 ప్రదర్శనతో అనతి కాలంలోనే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ పంజాబ్ యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ గురించే. సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు వైస్ కెప్టెన్విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న జట్టుకు గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడంటే అతడి ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన గిల్ ముఖ్యంగా వన్డేల్లో తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు.2019లో న్యూజిలాండ్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు 52 మ్యాచ్లు ఆడి 62.13 సగటుతో 2734 పరుగులు సాధించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు భారీ ఇన్నింగ్స్లు ఆడతాడనే గుర్తింపు తెచ్చుకున్న గిల్ ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ, 8 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.మూడు ఫార్మాటల్లో సెంచరీలు చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో వీరవిహారం చేశాడు. మూడు మ్యాచ్లలో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకొని ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు.అండర్–19 స్థాయిలోనే గిల్ కంటే మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా ఇప్పుడు టీమిండియా సెలక్షన్ దరిదాపుల్లో కూడా లేకుండా పోగా ప్రతిభకు క్రమశిక్షణ జోడించిన శుభ్మన్ గిల్ ‘ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న గిల్ ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ సారథిగా కొనసాగుతున్నాడు. – ఇంతియాజ్ మొహమ్మద్చదవండి: CT 2025 Aus Vs Afg: వరుణుడు కరుణిస్తే... -
ఇంగ్లండ్తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో (International Masters League-2025) భారత మాస్టర్స్ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్తోనే ప్రారంభమైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలు, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో భారత్.. శ్రీలంక మాస్టర్స్ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి విండీస్ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత మాస్టర్స్ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్తోనే ప్రారంభమైంది. ఈ లీగ్లో ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలుచ, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో భారత్.. శ్రీలంక మాస్టర్స్ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి విండీస్ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ -
టీమిండియా వైస్ కెప్టెన్కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. -
పాక్ను ఆడేసుకుంటోన్న నెటిజన్స్.. పుష్ప-2 సీన్ను కూడా వదల్లేదు!
భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగరేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అతిథ్య పాక్ జట్టును భారత్ మట్టికరిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. పాక్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే దాయాదుల పోరు అంటే ఓ రేంజ్లో ఫైట్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇరుదేశాల అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఓటమి పాలైన జట్టుపై విమర్శలు కూడా అదేస్థాయిలో ఉంటాయి.ఇంకేముంది పాక్ జట్టు ఇండియాతో ఓడిపోవడంతో నెటిజన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆ జట్టుపై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. కింగ్ కోహ్లీని ప్రశంసలు కురిపిస్తూ.. పాక్ టీమ్ను ఫుట్బాల్ ఆడేస్తున్నారు నెటిజన్స్. తాజాగా పాక్ జట్టుపై చేసిన ఓ మీమ్ మాత్రం తెగ వైరలవుతోంది. ఇందులో మన పుష్పరాజ్ను కూడా వాడేశారు. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలోని ఓ పైట్ సీన్తో క్రియేట్ చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.పుష్ప-2 చిత్రంలోని గంగమ్మ జాతర సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ గురించి సినిమా చూసిన ఎవ్వరైనా మర్చిపోలేరు. తాజాగా ఆ ఫైట్ సీన్లోని ఓ క్లిప్తో పాక్ టీమ్ను ట్రోల్ చేశారు. అల్లు అర్జున్కు ఫేస్కు కోహ్లీని చూపిస్తూ.. రౌడీలను పాక్ జట్టుతో పోలుస్తూ మీమ్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరలవుతోంది. ఇంకేముంది ఈ ఫన్నీ మీమ్ చూసిన మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఆ మీమ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. #INDvsPAK pic.twitter.com/7dP4diEwq7— Unlisted-pre IPO Investment Zone (@reddy73375) February 23, 2025 -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
-
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్ను తిలకించిన వారిలో ఉన్నారు. -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.అద్భుత సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. -
Champions Trophy 2025: పాక్తో కీలక సమరం.. మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్లో టాస్ ఓడాడు. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్తో మ్యాచ్లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్ -
INDvsPAK: ఆదివారం.. ‘ఆట’విడుపు
సాక్షి, హైదరాబాద్: హాలిడే బద్ధకం ఎగిరిపోనుంది. రోజంతా కళ్లార్పనివ్వని ఉద్వేగం దరి చేరనుంది. నగర వాసులకు ఈ సన్డే.. అసలు సిసలు హాట్ హాట్ విందును వడ్డించనుంది. ఆదివారం జరగనున్న భారత్, పాకిస్తాన్ క్రికెట్ పోరును వీక్షించేందుకు ఎవరి స్థాయిలో వారు ఏర్పాట్లు చేసుకున్నారు. సిద్ధమైన వేదికలు... పాక్– ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే ఎక్కడ లేని సందడి. పైగా ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ ఫీవర్ రెండింతలైంది. దీంతో యువత, చిన్నా, పెద్దా, క్రికెట్ అభిమానులందరి వారాంతపు రొటీన్ మారిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే డేఅండ్ నైట్ మ్యాచ్ను మిస్ కాకూడదు అదొకటే ప్లాన్. మధ్యాహ్నం 2 గంటలకే పనులన్నీ పూర్తి చేసుకుని టీవీల ముందు కూర్చోవడం మాత్రమే లక్ష్యం. రివెంజ్ తీరేనా? గత 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని ఈసారి టీం ఇండియా తిప్పికొడుతుందనే నమ్మకం ధీమా నగర వాసుల్లో కనిపిస్తోంది. రెండు జట్లూ శాయశక్తులా పోరాడతాయి కాబట్టి.. ఉత్కంఠభరిత మ్యాచ్ తప్పదని నమ్ముతున్న సిటిజనులు ఆ థ్రిల్ని తనివితీరా ఆస్వాదించాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబ్స్, ఓపెన్ థియేటర్స్, ఇతర ప్రదేశాల్లో స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్పెషల్ మెనూలు సిద్ధం చేశారు. ఫ్రెండ్స్తో కొందరు, ఫ్యామిలీస్తో కలిసి కొందరు.. ఎవరికివారు తమకు అనువైన వేదికలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.. ఏదేమైనా.. అందరి నోటా ఒకటే మాట ‘జయహో ఇండియా’. -
Champions Trophy 2025: దాయాదుల సమరంలో ఎవరిది పైచేయి..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరంలో (India Vs Pakistan) రేపు జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ భారత్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆ దేశ అభిమానులు ఊహల్లో ఊరేగుతుంటే.. భారత అభిమానులు ఈసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్పప్పటికీ ఫలితం తేలాలంటే రేపటి వరకు ఆగాలి.చరిత్ర పరిశీలిస్తే.. భారత్, పాకిస్తాన్ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 57 సార్లు విజయం సాధించగా.. పాక్ 73 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. భారత్పై పాక్ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ తొలిసారి 2004 ఎడిషన్లో ఢీకొన్నాయి. నాటి మ్యాచ్లో (బర్మింగ్హమ్) పాక్ భారత్పై విజయం సాధించింది. ఆ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (67), అజిత్ అగార్కర్ (47) భారత్ 200 పరుగల మార్కును తాకేందుకు దోహదపడ్డారు. అనంతరం మొహమ్మద్ యూసఫ్ (81 నాటౌట్), ఇంజమామ్ ఉల్ హక్ (41) రాణించడంతో పాక్ విజయతీరాలకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి దాయాదుల సమరంలో 2009లో జరిగింది. సెంచూరియన్ వేదికగా నాడు జరిగిన మ్యాచ్లో మరోసారి పాక్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. షోయబ్ మాలిక్ (128), మొహమ్మద్ యూసఫ్ (87) సత్తా చాటడంతో 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన భారత్.. రాహుల్ ద్రవిడ్ (76), గౌతమ్ గంభీర్ (57) రాణించినప్పటికీ లక్ష్యానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది.2013 ఎడిషన్లో భారత్, పాక్లు మూడోసారి ఢీకొట్టాయి. ఈసారి భారత్.. పాక్ను మట్టికరిపించింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్ష ప్రభావితమైన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 165 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో శిఖర్ ధవన్ (48) రాణించడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఆ సీజన్లో భారత్.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది.2017 ఎడిషన్లో భారత్, పాక్ అదే బర్మింగ్హమ్ వేదికగా నాలుగోసారి తలపడ్డాయి. ఈసారి కూడా భారత్దే పైచేయి అయ్యింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (91), శిఖర్ ధవన్ (68), విరాట్ కోహ్లి (81 నాటౌట్) చెలరేగడంతో భారత్ 319 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 164 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది.2017 ఎడిషన్లోనే భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. ఆ సీజన్ ఫైనల్లో పాక్.. భారత్ను ఓడించి తమ తొలి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (114) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం ఛేదనలో భారత్ తడబడింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా (76) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఏడేళ్ల అనంతరం భారత్, పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి తలపడుతున్నాయి. ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూస్తే.. పాక్పై టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంది. ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్పై విజయం సాధించి ఉత్సాహంగా ఉండగా.. పాక్ తమ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. రేపు జరుగబోయే మ్యాచ్లో భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.బలాబలాల విషయానికొస్తే.. పాక్తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత బ్యాటింగ్ లైనప్ను చూస్తే ప్రపంచంలో ఎంతటి మేటి జట్టైనా గజగజ వణకాల్సిందే. ఓపెనర్ శుభ్మన్ గిల్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కూడా మాంచి టచ్లో కనిపించాడు. పాకిస్తాన్ అనగానే విరాట్కు పూనకం వస్తుంది. ఇటివలికాలంలో విరాట్ పెద్దగా ఫామ్లో లేకపోయినా పాక్తో మ్యాచ్ అంటే అతను చెలరేగుతాడు. శ్రేయస్ అయ్యర్ అయ్యర్ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. బంగ్లాతో మ్యాచ్లో నిరాశపర్చినా తిరిగి గాడిలో పడతాడు. బంగ్లా మ్యాచ్లో కేఎల్ రాహుల్ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడి టచ్లోకి వచ్చాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలోనూ పాక్తో పోలిస్తే భారత్ పటిష్టంగానే కనిపిస్తుంది. షమీ గత మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అదే మ్యాచ్లో అక్షర్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. యువ పేసర్ హర్షిత్ రాణా సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్పై రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నారు.పాక్ విషయానికొస్తే.. భారత్తో పోలిస్తే ఈ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పేలవంగా ఉంది. గడిచిన మ్యాచ్లో ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బతింది. ఆ మ్యాచ్లో బాబర్ ఆజమ్, ఖుష్దిల్ షా మినహా ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కీలక ఆటగాడు ఫకర్ జమాన్ తొలి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ పెద్దగా ఫామ్లో లేదు. బాబర్, రిజ్వాన్ తప్పించి పాక్ బ్యాటింగ్ లైనప్లో అనుభవజ్ఞుడైన ఆటగాడే లేడు. సౌద్ షకీల్, సల్మాన్ అఘా ఎప్పుడు రాణిస్తారో వారికే తెలీదు. బౌలింగ్ విషయానికొస్తే.. పాక్ బౌలింగ్ గతంలో ఎన్నడూ లేనంత ఛండాలంగా ఉంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్ పోటీ పడి పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పర్వాలేదనిపించినా స్పిన్ను గట్టిగా ఆడే భారత బ్యాటర్ల ముందు నిలవడం చాలా కష్టం. ఎలా చూసినా పాక్పై పైచేయి సాధించేందుకు భారత్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
వీడియో: మాజీ కెప్టెన్ గంగూలీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
కోల్కత్తా: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గంగూలీ ప్రయాణిస్తున్న కారు ఎక్స్ప్రెస్వేపై ప్రమాదానికి గురైంది. ఇక, ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత గంగూలీ పది నిమిషాల పాటు రోడ్డుపైనే వేచి చూశారు.వివరాల ప్రకారం.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి బుర్ద్వాన్ వెళ్లారు. ఈవెంట్కు వెళ్తున్న సమయంలో గంగూలీ ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్స్ప్రెస్వేపై ప్రమాదానికి గురైంది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో ఆయన కారు డ్రైవర్ సడెన్గా బ్రేక్లు వేయాల్సి వచ్చింది.దీంతో, ఆయన కారు వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారును వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ సౌరవ్ గంగూలీ, డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, గంగూలీ అక్కడే కాసేపు వేచి చూశారు. అనంతరం, ఆయన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. Sourav Ganguly News:सौरव गांगुली की कार का एक्सीडेंट, बाल-बाल बचे दादा#SauravGanguly #Accident #LatestNews @khanduri_pooja pic.twitter.com/7ZnuBdhDYi— Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) February 21, 2025 -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సూపర్గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్కు పెవిలియన్కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్లో శుభ్మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. రోహిత్ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్కు 260వ ఇన్నింగ్స్లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే!
భారత అభిమానులకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోరమైన పరాజయం చవిచూడటమే ఇందుకు కారణం. ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ మ్యాచ్లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత్ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు బదులు చెప్పేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగిందో చూద్దామా?!ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన 23 సంవత్సరాల విరామం తర్వాత 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ టోర్నమెంట్లో ప్రపంచ క్రికెట్ అగ్రస్థానంలో ఉన్న జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇంతవరకు ఎనిమిది సార్లు ఛాంపియన్షిప్ పోటీలు జరుగగా, ఆస్ట్రేలియా మరియు భారత్ రెండుసార్లు ఈ టైటిల్ ని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. 1998లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భారత్ ప్రదర్శన మీ కోసం:1998 (బంగ్లాదేశ్)1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టౌర్నమెంట్ కి బంగ్లాదేశ్ ఆతిధ్యమిచ్చింది. నాకౌట్ ఫార్మాట్లో జరిగిన ఈ టౌర్నమెంట్ లోని ప్రారంభ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది, సచిన్ టెండూల్కర్ 141 పరుగులు సాధించడం తో భారత్ 307 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ మళ్ళీ బౌలింగ్ లోనూ విజృంభించి నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులను 263 పరుగులకే పరిమితం చేశాడు. మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం లోని భారత్ జట్టు సెమీ-ఫైనల్లో వెస్టిండీస్తో తలపడింది. సౌరవ్ గంగూలీ మరియు రాబిన్ సింగ్ లు అర్థ సెంచరీలు సాధించి భారత్ స్కోర్ ను 242/6 కు చేర్చారు. కానీ శివనారాయణ్ చంద్రపాల్ (74) మరియు బ్రియాన్ లారా (60 నాటౌట్) రాణించడంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అయితే, వెస్టిండీస్ను ఫైనల్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2000 (కెన్యా)కెన్యా ఆతిధ్యమిచ్చిన రెండో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య కెన్యాను సునాయాసంగా ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్కు చేరుకుంది.సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ జట్టు సౌరవ్ గంగూలీ అజేయంగా నిలిచి 141 పరుగులు చేయడంతో భారత్ 295 పరుగులు స్కోర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో, గంగూలీ సెంచరీని సాధించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రిస్ కైర్న్స్ కూడా రాణించి సెంచరీ సాధించడంతో కివీస్ భారత్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరవేసుకొనిపోయింది.2002 (శ్రీలంక)2002 నుండి ఈ టౌర్నమెంట్ ని నాకౌట్ ఫార్మాట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు "పూల్స్"గా విభజించారు. భారత్, ఇంగ్లాండ్ మరియు జింబాబ్వేతో పాటు పూల్ 2లో ఉంది. ప్రతి పూల్ నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్కు అర్హత సాధించింది. భారత్ రెండు విజయాలతో పూల్లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ అర్హత సాధించింది. గంగూలీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్స్లో దక్షిణాఫ్రికా ను 10 పరుగుల తేడాతో ఓడించింది.ఫైనల్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార్ సంగక్కరల అర్ధ సెంచరీలతో రాణించడం తో ఆ జట్టు 244/5 స్కోర్ చేసింది. కానీ భారత్ లక్ష్య సాధనకి వర్షం అడ్డంకిగా నిలిచింది. ఫలితంగా భారత్ స్కోర్ రెండు ఓవర్ల కు 14/0 వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ను రిజర్వ్ డేకి మార్చారు, అక్కడ ఆట మళ్ళీ మొదటి నుండి ప్రారంభమైంది. శ్రీలంక మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసి 222/7 స్కోరు చేసింది. వర్షం మరోసారి ఆటకు అవరోధం గా నిలిచింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 38/1తో ఉంది. చివరికి భారత్, శ్రీలంక లని సంయుక్త విజేతలు గా ప్రకటించారు.2004 (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్లో జరిగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో 12 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈ టౌర్నమెంట్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. భారత్, పాకిస్తాన్ మరియు కెన్యాతో పాటు గ్రూప్ సి నుంచి రంగంలోకి దిగింది. కానీ కెన్యాపై కేవలం ఒక మ్యాచ్ గెలిచిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే టౌర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ టౌర్నమెంట్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.2006 (భారత్)భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ, ఫైనల్ కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ చేతిలో వరుసగా ఆరు వికెట్లు మరియు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై టౌర్నమెంట్ నుంచి గ్రూప్ స్థాయిలోనే వైదొలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను ఓడించి ట్రోఫీ ని కైవసం చేసుకుంది.2009 (దక్షిణాఫ్రికా)2009లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు టోర్నమెంట్ను ఎనిమిది జట్లుగా కుదించారు. అన్ని జట్లని నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్లతో పాటు గ్రూప్ ఎ నుంచి రంగంలోకి దిగింది. కానీ మరోసారి గ్రూప్ లో మూడవ స్థానంలో నిలిచి తర్వాత గ్రూప్ను దాటలేకపోయింది. భారత్ పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్ను ఓడించింది, కానీ సెమీ-ఫైనల్కు చేరుకోవడానికి అది సరిపోలేదు.2013 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)ఎమ్ ఎస్ ధోని నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని లో విజేత గా నిలిచింది. గ్రూప్ బి లో మూడు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్ లో భారత్ జట్టు ఇంగ్లాండ్తో తలపడింది, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 129/7కే పరిమితమైంది. కానీ రవీంద్ర జడేజా (2/24), ఇషాంత్ శర్మ (2/36) మరియు రవిచంద్రన్ అశ్విన్ (2/15) రాణించడంతో భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ ని 124/8కే పరిమితం చేయడంతో భారత్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.2017 (ఇంగ్లాండ్ అండ్ వేల్స్)2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూడడం తో ట్రోఫీ ని నిలబెట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకలతో కూడిన తమ గ్రూప్లో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా నిలిచి 123 పరుగులు సాధించడంతో భారత్ సెమీఫైనల్స్లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. అయితే భారత్ చివరికి ఫైనల్ లో పాకిస్తాన్ చేతి లో ఓటమి చవిచూసింది. -
Champions Trophy 2025: ఎట్టకేలకు పాక్లో భారత జెండా ఎగిరింది..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా సమసిపోయింది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు పాక్లోని కరాచీలో స్టేడియంలో భారత జెండా పెట్టకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ. అయితే, ఈ ఆనవాయితీని పాక్ క్రికెట్ బోర్డు తుంగలో తొక్కింది. భారత్ మినహా మిగతా దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీ స్టేడియం పైకప్పుపై ఎగరేసింది. ఈ విషయం పెద్దది కావడంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. దీంతో పీసీబీ దిగొచ్చింది. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రమేయం లేకపోతే పీసీబీ ఇష్టానుసారంగా వ్యవహరించేదని అంటున్నారు. The Indian flag is present at National Bank Stadium Karachi ahead of the ICC Champions Trophy 2025. Via - @imransiddique89 #ChampionsTrophy2025 pic.twitter.com/NUa8Gh837B— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 18, 2025కాగా, ఇదే ఐసీసీ నిబంధనలను సాకుగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు టీమిండియా జెర్సీలపై వారి దేశం పేరును ముద్రించుకుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. నేటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్కు కరాచీలోని నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.రేపు (ఫిబ్రవరి 20) జరుగబోయే మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న టీమిండియా న్యూజిలాండ్తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
వన్డేల్లో సరికొత్త చరిత్ర.. 40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏ
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏఈ మ్యాచ్లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఒమన్పై యూఎస్ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్ఏ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే. -
కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 33 ఏళ్ల శార్దూల్ 2025-26 కౌంటీ సీజన్ తొలి అర్ద భాగం కోసం ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎసెక్స్తో డీల్లో శార్దూల్ ఏడు మ్యాచ్లు ఆడనున్నాడు. శార్దూల్ కౌంటీల్లో ఆడటం ఇదే తొలిసారి. ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై శార్దూల్ ఆనందం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో ఆడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు.2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శార్దూల్.. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి కారణంగా తరుచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. శార్దూల్ చివరిగా 2023 బాక్సింగ్ డే టెస్ట్లో (సౌతాఫ్రికాతో) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలికాలంలో శార్దూల్ దేశవాలీ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. బౌలింగ్లో రాణిస్తుండటంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాట్తోనూ సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో శార్దూల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 33 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో పలు అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో ముంబై సెమీస్కు చేరడంలో శార్దూల్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శార్దూల్ విదర్భతో జరుగుతున్న సెమీస్లో పాల్గొంటున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శార్దూల్ ఓ వికెట్ తీసి, 37 పరుగులు చేశాడు.కష్టాల్లో ముంబైవిదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (67 నాటౌట్), తనుశ్ కోటియన్ (5) ముంబైను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విదర్భ యువ స్పిన్నర్ పార్థ్ రేఖడే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ షోరే (74), దనిశ్ మలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీతో రాణించారు. శివమ్ దూబే ఐదు వికెట్లతో మెరిశాడు. -
CT 2025: రోహిత్ సేన కొడుతుందా!.. స్పిన్నర్ల ప్రభావం కీలకం
సాక్షి క్రీడా విభాగం: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు అజేయంగా తమ జైత్రయాత్రను కొనసాగించింది. వరుసగా పది విజయాలతో ఆల్టైమ్ గ్రేట్ వన్డే టీమ్లలో ఒకటిగా కనిపించింది. దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడినా... ఇప్పుడు దాదాపు పదిహేను నెలల తర్వాత ఇదే ఫార్మాట్లో శిఖరాన నిలిచే అవకాశం మళ్లీ జట్టు ముందుకు వచ్చింది. ముఖ్యంగా వరల్డ్ కప్ టీమ్లో ఉన్న ఆటగాళ్లే దాదాపుగా ఈ మెగా టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు. కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ విజయం వారికి ప్రత్యేకంగా మారవచ్చు. ఫామ్పరంగా చూసినా ఇతర జట్లతో పోలిస్తే రోహిత్ సేననే బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడోసారి మన జట్టు టైటిల్ కొడుతుందా అనేది ఆసక్తికరం.2017లో రన్నరప్గా నిలిచిన జట్టులోని ఐదుగురు ప్లేయర్లు ప్రస్తుత టీమ్లో భాగంగా ఉన్నారు. యూఏఈలో 2021 టి20 వరల్డ్ కప్లో సెమీస్ చేరడంలో విఫలమైన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఐసీసీ టోర్నీలో బరిలో నిలిచింది. బ్యాటింగ్లో సత్తా ప్రదర్శిస్తే... టీమిండియా వన్డే బ్యాటింగ్ కూర్పు చాలా కాలంగా అనూహ్య మార్పులు లేకుండా నిలకడగా ఉంది. అదే జట్టుకు ప్రధాన బలం కూడా. రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్లతో టాప్–5 విషయంలో ఎలాంటి సమస్య లేదు. 2023 నుంచి చూస్తే వీరంతా కనీసం 1000 పరుగులు సాధించారు. ఇటీవల ఇంగ్లండ్తో సిరీస్లో రాణించడం కూడా సానుకూలాంశం. గిల్, అయ్యర్ చెలరేగిపోతుండగా ఫామ్ను అందుకున్న రోహిత్ సెంచరీతో సత్తా చాటాడు. కోహ్లి, రాహుల్ కూడా ఆకట్టుకున్నారు. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల బ్యాటింగ్ మనకు ఎప్పుడూ అదనపు ప్రయోజనాన్ని అందించింది. వీరికి ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా జత కలిశాడు. ఇటీవలి కాలంలో బ్యాటింగ్లో అక్షర్ అంచనాలకు మించి మెరుగై ఏ స్థానంలోనైనా ఆడి ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ విఫలమైతే పంత్ రూపంలో తగిన ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది కాబట్టి బెంగ లేదు. పేసర్లు రాణిస్తారా... జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కావడం నిస్సందేహంగా జట్టుకు పెద్ద దెబ్బ. రవిశాస్త్రి చెప్పినట్లు అతని గైర్హాజరు జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అయితే అందుబాటులో ఉన్నవారిలో షమీ ఆ స్థాయి బౌలర్. కానీ గాయం నుంచి కోలుకొని వచ్చిన అతను ఎంత వరకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడనేది చూడాలి. పెద్దగా అనుభవం లేని అర్‡్షదీప్, హర్షిత్ రాణా ఒత్తిడిని తట్టుకొని షమీకి అండగా నిలవడం అవసరం. హార్దిక్ పాండ్యా సత్తా చాటగలడు కాబట్టి మూడో పేసర్ బెంగ లేదు. ముగ్గురు ఖాయం! చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపుపై ఆశలు రేపుతున్న కీలక విభాగం స్పిన్ బౌలింగే. మన మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతుండటం కచ్చితంగా సానుకూలాంశం. అందుకే టీమ్ ఐదుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. ఫిబ్రవరి 9 వరకు ఐఎల్టి20 మ్యాచ్ల నిర్వహణలో పిచ్లన్నీ నెమ్మదిగా మారిపోయాయి. 11 రోజుల వ్యవధిలో జీవం ఉన్న పిచ్లను తయారు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి ఇవన్నీ స్పిన్కు అనుకూలించవచ్చు.బౌలింగ్లో వైవిధ్యం ఉన్న మన స్పిన్నర్లు ఫామ్లో కూడా ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టంగా మారిపోనుంది. ఆరేళ్లుగా ఇక్కడ పెద్ద జట్లేవీ వన్డేలు ఆడలేదు. అయితే 2018 నుంచి ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 213 మాత్రమే. తక్కువ స్కోరింగ్ల మ్యాచ్లలో స్పిన్నర్లు ప్రభావం చూపడం ఖాయం. తుది జట్టులో కనీసం ముగ్గురిని జట్టు ఎంచుకుంటుంది. 2 చాంపియన్స్ ట్రోఫీలో రెండుసార్లు (2002, 2013)లలో విజేతగా నిలిచిన భారత్ మరో రెండుసార్లు (2000, 2017)లో ఫైనల్లో ఓడింది. 9 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత్ 9 వన్డేలే ఆడింది. ఇందులో 5 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. వీటిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లపై సిరీస్ నెగ్గగా... శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. -
CT 2025: ఆతిథ్య జట్టు పాక్ పేరుతో కూడిన టీమిండియా జెర్సీల ఆవిష్కరణ (ఫొటోలు)
-
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బౌలింగ్ కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తండ్రి హఠాన్మరణం కారణంగా భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. మోర్కెల్.. టీమిండియాతో కలిసి ఫిబ్రవరి 15న భారత్ నుంచి దుబాయ్కు వచ్చాడు. ఫిబ్రవరి 16న తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న మోర్నీ.. ఆతర్వాత తండ్రి మరణవార్త విని సౌతాఫ్రికాకు బయల్దేరాడు. మోర్నీ తిరిగి భారత బృందంతో ఎప్పుడు కలుస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. మోర్నీ లేని లోటు టీమిండియా పేస్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్లో భారత పేస్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. మోర్నీ అండర్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా రెచ్చిపోయాడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్లో యువ పేసర్ హర్షిత్ రాణా సత్తా చాటాడు. మోర్నీ ఆథ్వర్యంలోనే హర్షిత్ రాటుదేలాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న ఆడనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికైనా మోర్నీ అందుబాటులోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. దీని తర్వాత భారత్.. మార్చి 2న న్యూజిలాండ్తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
Champions Trophy 2025: పాక్లో ఎగరని భారత జెండా
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు భారత్, పాక్ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. మెగా టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలన్నిటినీ కరాచీలోని నేషనల్ స్టేడియం పైకప్పుపై ఎగురవేసి.. ఒక్క భారత జెండాను మాత్రం మిస్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్కు రావడం లేదు కాబట్టే భారత జెండాను పెట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ ఇచ్చింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలనే ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా పాక్లో పర్యటించడంలేదన్న అక్కసుతో పీసీబీ ఈ పని చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాకిస్తాన్లో (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) పర్యటించేందుకు అంగీకరించని విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్కు షిఫ్ట్ చేశారు. భారత్.. పాక్ సహా మిగతా దేశాలతో ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్ సహా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి.టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లన్నీ పాకిస్తాన్కు చేరుకున్నాయి. 1996 వరల్డ్కప్ తర్వాత పాక్లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఫ్యామిలి మ్యాన్ కోహ్లికి.. బీసీసీఐ భారీ షాక్
-
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్లో తమ తొలిమ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
మన ‘చాంపియన్స్’ కసరత్తు షురూ
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు. ప్రాక్టీస్లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్కు ఉపక్రమించాడు.బ్యాటర్లు నెట్స్లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు. -
Champions Trophy 2025: రాణా మెరుపులు మెరిపిస్తాడా?
గత సంవత్సరం టి20 ప్రపంచ కప్లో విజయం తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్, పాకిస్తాన్లలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ గురి పెట్టింది. తమ తొలి మ్యాచ్లో భారత్ ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది.ఈ టోర్నమెంట్ కోసం భారత క్రీడాకారులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. భారత్ జట్టు ఎంపికపై పెద్దగా వివాదం లేకపోయినా, జట్టులోని ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టోర్నమెంట్ కి దూరం కావడంతో అతని స్తానం లో జట్టులోకి వచ్చిన ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాపైనే ఆసక్తి రేకెత్తుతోంది. సిరాజ్ను మినహాయించడం ఆశ్చర్యకరంసిరాజ్ను జట్టు నుంచి మినహాయించడం చాలా ఆశ్చర్యకరం కలిగించింది. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు మేనేజిమెంట్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికీ, మరీ దారుణంగా విఫలం కాలేదు. పైగా రాణా తో పోలిస్తే సిరాజ్ చాలా అనుభవం గడించాడు. సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేలు ఆడాడు. 24.04 సగటు తో 5.18 ఎకానమీతో 71 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్ దాదాపు 2022 ప్రారంభం నుండి 2024 చివరి వరకు భారత్ తరఫున వన్డే ల్లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్గా ఖ్యాతి గడించాడు. ఈ నేపధ్యంలో జట్టు మేనేజిమెంట్ కి సిరాజ్ స్థానంలో రాణా ఎందుకు మెరుగ్గా కనిపించాడు..?ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక జట్టుని ప్రకటించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ .."సిరాజ్ ఆడకపోవడం దురదృష్టకరమని అన్నాడు. బుమ్రా లేకపోవడంతో డెత్-బౌలింగ్ నైపుణ్యం ఉన్న ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్దీప్ సింగ్ అవకాశం కల్పించామని తెలిపాడు. షమీ ఫిట్నెస్ సాధించడంతో సిరాజ్ కి చోటు కల్పించలేక పోయామని చెప్పాడు. అయితే సిరాజ్ డెత్ బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయిన కారణంగానే జట్టుకి దూరమయ్యాడనేది వాస్తవం.ఇంగ్లాండ్ సిరీస్లో రాణించిన రాణా ఇక రాణా విషయానికొస్తే, ఇంగ్లాండ్ సిరీస్కు ముందు రోహిత్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చాడు. "బుమ్రా లేని కారణంగా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కి కొత్తదనం కావాలి. రాణాలో మాకు ఆ సామర్ధ్యం కనిపించింది. ఇంగ్లాండ్ సిరీస్ మొదటి మ్యాచ్లో రాణా తన తొలి ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. రెండవ ఓవర్ మెయిడెన్ వేసిన తర్వాత మూడవ ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు సాధించాడు. అయితే సాల్ట్ అవుటైన తర్వాత మళ్ళీ బౌలింగ్ కి వచ్చిన రాణా వెంటనే తన 6'2" అడుగుల ఎత్తుని అనువుగా ఉపయోగించుకొని ప్రతి దాడి చేసాడు.140kph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసి తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. బెన్ డకెట్ను అవుట్ చేసి వన్డేల్లో తన తొలి వికెట్ను నమోదు చేసుకున్నాడు. 22 ఏళ్ల వయసులో ఉన్న రాణా తన నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్దు కుంటున్నాడు. పేస్ బౌలర్ గా రాణించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణా చెప్పుకోదగ్గ రీతిలో రాణించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడన్నదాని పైనే జట్టులో రాణాని కొనసాగించడం ఆధారపడి ఉంటుంది.ఈ దశలోనే సిరాజ్ కి భారత్ జట్టు ద్వారాలు మూసుకొని పోయాయని చెప్పడం కష్టమే. బుమ్రా, షమీ లను మినహాయిస్తే సిరాజ్ ని సవాలు చేయగల సత్తా ప్రస్తుత భారత్ జట్టులో చాలా తక్కువ మందికి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ బెంచ్ సభ్యులలో ఒకడైన సిరాజ్ మళ్ళీ త్వరలోనే జట్టులోకి వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో రాణా ఎలా రాణిస్తాడనేదే ప్రస్తుతం ఆసక్తి కలిగించే విషయం. -
ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదు: టీమిండియాకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలో దిగనుంది. వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా ఈ పేస్ గుర్రం ఐసీసీ టోర్నమెంట్కు దూరమయ్యాడు. అయితే, ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో బుమ్రా లేని లోటు టీమిండియాపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్.ప్రపంచ స్థాయి బౌలర్ అయిన బుమ్రా స్థానాన్ని వేరొక ఆటగాడు భర్తీ చేయడం అంత సులువేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh)ను ఉద్దేశించి డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో అంతగా అనుభవం లేని అర్ష్దీప్.. నేరుగా ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టి అద్భుతాలు చేస్తాడని ఊహించలేమన్నాడు.సిరాజ్ను కాదనికాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా దూరమవుతాడని ముందుగానే ఊహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. పేస్ దళంలో సీనియర్ మహ్మద్ షమీతో పాటు అర్ష్దీప్ సింగ్కు చోటిచ్చింది. అయితే, మరో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్పై మాత్రం నమ్మకం ఉంచలేకపోయింది.సిరాజ్ను కాదని అర్ష్దీప్ను ఐసీసీ ఈవెంట్కు ఎంపిక చేయడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే వెల్లడించాడు కూడా. ఆరంభంలో కొత్త బంతితో ప్రభావం చూపుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం రాణించలేకపోతున్నాడని పేర్కొన్న సిరాజ్.. అర్ష్దీప్ మాత్రం రెండు సందర్భాల్లోనూ మ్యాజిక్ చేయగలడని పేర్కొన్నాడు. అందుకే తాము ఈ యువ పేసర్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘ఒకరు జట్టులో లేకపోవడం వల్ల మరొకరికి చోటు దక్కడం నిజంగా ఓ గొప్ప అవకాశమే. అయితే, బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అతడు జట్టులో లేకుంటే కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది.ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదుఇక అర్ష్దీప్ విషయానికి వస్తే.. టీ20లకు, వన్డే ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. నాలుగు ఓవర్లు వేయడానికి.. పది ఓవర్ల బౌలింగ్కు కచ్చితంగా తేడా ఉంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడానికి ఇది టీ20 కాదు. వరుస ఓవర్లు, దీర్ఘమైన స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. అయితే, అర్ష్దీప్నకు అలాంటి అనుభవం లేదు’’ అని పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20లలో అర్ష్దీప్ సింగ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటి వరకు 99 వికెట్లు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమిండియా తరఫున కేవలం తొమ్మిది వన్డేలు మాత్రమే ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ పద్నాలుగు వికెట్లు తీయగలిగాడు. తొమ్మిది వన్డేలు ఆడిఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో పాల్గొన్న అర్ష్దీప్ సింగ్ ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్లో ఆడాడు. ఈ వన్డేలో ఐదు ఓవర్లు బౌల్ చేసిన అర్ష్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుంది. ఇక ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక అర్హత సాధించాయి. కాగా బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కోసం భారత్, శ్రీలంక జట్ల ప్రకటన
ఫిబ్రవరి 22 నుంచి భారత్లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్ (2025) కోసం భారత్ (Indian Masters), శ్రీలంక (Sri Lanka Masters) జట్లను ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రకటించారు. ఈ టోర్నీలో భారత మాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నాయకత్వం వహించనుండగా.. శ్రీలంక మాస్టర్స్కు కుమార సంగక్కర (Kumara Sangakkar) సారధిగా ఉంటాడు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. శ్రీలంక మాస్టర్స్ జట్టులో సంగక్కర, కలువితరణ, ఉపుల్ తరంగ తదితర స్టార్లు పాల్గొంటున్నారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు.ఈ టోర్నీలో వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సౌతాఫ్రికా తరఫున మఖాయ ఎన్తిని, ఇంగ్లండ్ తరఫున మాంటి పనేసర్ లాంటి మాజీ స్టార్లు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్లకు రాజ్కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్లతో పాటు నాకౌట్ మ్యాచ్లు రాయ్పూర్లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో విజేతలు మార్చి 16న రాయ్పూర్లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్హిట్స్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, నమన్ ఓఝా (వికెట్కీపర్), స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, పవన్ నేగి, గురుకీరత్ మాన్, అభిమన్యు మిధున్శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర (కెప్టెన్), రొమేశ్ కలువితరణ (వికెట్కీపర్), అషాన్ ప్రియరంజన్, ఉపుల్ తరంగ, లహీరు తిరుమన్నే, చింతక జయసింఘే, సీక్కుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, దిల్రువన్ పెరీరా, చతురంగ డిసిల్వ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ప్రసాద్, అసేల గణరత్నే -
ప్రేమ పెళ్లి చేసుకున్న టాప్ క్రికెటర్లు (ఫొటోలు)
-
మహాకుంభ్లో పుణ్య స్నానం చేసిన దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే
భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, తన సతీమణి చేతనతో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా కుంబ్లే దంపతులు మహాకుంభ్ మేళాలో పాల్గొన్నారు. అమృత స్నానం ఆచరిస్తున్న దృశ్యంతో పాటు పౌర్ణమి చంద్రుడి ఫోటోను, బోటులో భార్య చేతనతో తీసుకున్న సెల్ఫీని కుంబ్లే ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇందుకు బ్లెస్డ్ అని క్యాప్షన్ పెట్టి, మహాకుంభ్, ప్రయాగ్రాజ్ హ్యాష్ట్యాగ్లను జోడించాడు.Blessed 🙏🏽#MahaKumbh #Prayagraj pic.twitter.com/OFY6T3yF5F— Anil Kumble (@anilkumble1074) February 12, 2025కాగా, బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో మహాకుంభ్కు జనం పోటెత్తారు. నిన్న ఒక్క రోజే రెండు కోట్ల మందికిపైగా పుణ్య స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు. మహాకుంభ్ను నిన్నటి వరకు దాదాపుగా 50 కోట్ల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు. మహాకుంభ్కు లెక్కలేని సంఖ్యలో జనం పోటెత్తుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ప్రయాగ్రాజ్లోకి వాహనాల అనుమతిని నిషేధించారు. ఎక్కడో ఉన్న పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ల వరకు జనం నడిచి వెళ్తున్నారు.అనిల్ కుంబ్లే విషయానికొస్తే.. 54 ఏళ్ల ఈ దిగ్గజ స్పిన్నర్ భారత్ తరఫున 132 టెస్ట్లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. టెస్ట్లు, వన్డేల్లో కలుపుకుని కుంబ్లే దాదాపుగా 1000 వికెట్లు తీశాడు. కుంబ్లేకు ఐపీఎల్లో కూడా ప్రవేశముంది. కుంబ్లే ఆర్సీబీ తరఫున 2008-10 మధ్యలో 42 మ్యాచ్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఆటగాడిగా రిటైరైన అనంతరం కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించాడు. కుంబ్లే ఆథ్వర్యంలో టీమిండియా చారిత్రక విజయాలు సాధించింది. కుంబ్లే ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
ప్రాణాపాయస్థితిలో రిషబ్ పంత్ను కాపాడిన వ్యక్తి
టీమిండియా స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పంత్.. రూర్కీలోని తన సొంతింటికి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్న పంత్ను హైవేపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కాపాడారు. వీరిలో ఓ వ్యక్తి రజత్ (25) ప్రస్తుతం చావు బతుకులతో పోరాడుతున్నాడు. రజత్.. తన ప్రియురాలు మనూ కశ్యప్తో (21) కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరి ప్రేమను మనూ తరపు వారు అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల కిందట ఈ జంట ఎవరూ లేని నిర్మానుష ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న వీరిని అటుగా వెళ్తున్న వారు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మనూ తుదిశ్వాస విడిచింది. రజత్ పరిస్థితి విషమంగా ఉంది. మనూ మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లి రజతే తన కూతురికి విషమిచ్చి చంపాడని ముజఫర్నగర్ పోలీసులకు (ఉత్తర్ప్రదేశ్) ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వైఫల్యం కారణంగా ఇద్దరూ ఇష్ఠపూర్వకంగానే ఆత్మహత్యకు పాల్పిడినట్లు పోలీసులు చెప్పారు.మనూ, రజత్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనూ పెద్దలు వేరే వ్యక్తితో ఆమె వివాహానికి ప్లాన్ చేశారు. ఇది తెలిసి మనూ, రజత్ ఆత్యహత్యకు పాల్పడ్డారు.కాగా, రజత్ అతని స్నేహితుడు నిషు.. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. తనను కాపాడినందుకు పంత్.. రజత్, నిషులకు స్కూటర్ గిఫ్ట్గా ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పిమ్మట పంత్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. పునరాగమనంలో పంత్ మునుపటి తరహాలోనే అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన పంత్.. గతేడాది టీమిండియా టీ20 వరల్డ్కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల బెడద.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న స్టార్ పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.పేలవ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.ఆఫ్ఘనిస్తాన్నూ వదలని గాయాల సమస్యఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్ఫన్ నాలుగు నెలలు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్ఫర్ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. -
కటక్ నుంచి అహ్మదాబాద్కు టీమిండియా క్రికెటర్ల పయనం (ఫొటోలు)
-
బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) భారత స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Burah) ఆడతాడా లేదా అనేది నేడు తేలిపోతుంది. అతని ఫిట్నెస్ నివేదికను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఇటీవలే స్కానింగ్ జరిగింది. దీనిపై డాక్టర్లు ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. జనవరిలో ఆ్రస్టేలియాతో సిడ్నీతో జరిగిన చివరి టెస్టు తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్లోనూ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయనే లేదు. అతను కనీసం ఐదు వారాల పాటు బౌలింగ్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే చివరి వన్డేలో (బుధవారం) ఆడి అతను తన ఫిట్నెస్ నిరూపించుకుంటాడని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే బుమ్రా ఈ మ్యాచ్ కూడా ఆడటం సందేహమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు 11వ తేదీ వరకు అవకాశం ఉంది. బుమ్రా సిద్దంగా లేకపోతే ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) టీమ్లో స్థానం లభించవచ్చు. తాజాగా ఇంగ్లండ్తో సిరీస్లో రాణా తొలి రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు. -
రోహిత్లాగే కోహ్లి కూడా ఫామ్లోకి వస్తాడు.. చాంపియన్స్ ట్రోఫీ భారత్దే..!
ముంబై: భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) భారత్ వశమవుతుందని శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) అన్నాడు. రిలయన్స్ శీతల పానియాల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అతను మీడియాతో ముచ్చటించాడు. ‘ఇద్దరు అసాధారణ ఆటగాళ్లు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు. ఎప్పుడైనా సరే క్లాస్ శాశ్వతం. ఫామ్ లేకపోవడం తాత్కాలికం. తప్పకుండా రోహిత్లాగే కోహ్లి కూడా ఫామ్లోకి వస్తాడు. ఇద్దరు ప్రత్యర్థి బౌలింగ్పై ఎదురుదాడికి దిగితే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంటుంది’ అని మురళీ వివరించాడు. రోహిత్ బృందం ఆల్రౌండ్ వనరులతో పటిష్టంగా కనబడుతోందన్నాడు. భారత్ సహా పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లలో నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నారని, పాకిస్తాన్లోని పిచ్లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయని చెప్పాడు. -
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.ఈ మ్యాచ్లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు. అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవాకరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్ల్లో 188.4 స్ట్రయిక్రేట్తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్రేట్తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు. -
IND Vs ENG: హిట్మ్యాన్ సూపర్ షో.. సిరీస్ టీమిండియా కైవసం
కటక్: ఇంగ్లండ్తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.హిట్మ్యాన్ సూపర్ షో..చాలాకాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇది రోహిత్కు 32వ వన్డే శతకం.కోహ్లి విఫలం..శుభ్మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లి ెపెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ాసాల్ట్ుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్.ఆకట్టుకున్న అయ్యర్కోహ్లి ఔటైన తర్వాత సెకండ్ డౌన్లోక్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్.. స్ట్రైక్రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ మూడో వికెట్గా ఔటయ్యాడు.లివింగ్ స్టోన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రషీద్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 44 పరుగులు చేసిన అయ్యర్..రనౌట్ అయ్యాడు.నిరాశపరిచిన రాహుల్.. మెరిసిన అక్షర్ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్.. జెమీ ఓవర్టాన్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్.అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే: హిట్మ్యాన్ వీరవిహారం
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.కటక్లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్లో ఉన్నాడు. ఇది రోహిత్కు 32వ వన్డే శతకం. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది. -
రెండో వన్డే: టీమిండియా టార్గెట్ 305
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మేనేెజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. -
విరాట్ కోహ్లిని అధిగమించిన స్టీవ్ స్మిత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్ల్లో స్టీవ్కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు.టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.విరాట్ను అధిగమించిన స్టీవ్విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది. తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు. -
రాణించిన జడ్డూ, శ్రేయస్, గిల్, అక్షర్.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో (England) మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా (Team India) ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే (47.4 ఓవర్లలో) ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (59), శుభ్మన్ గిల్ (87), అక్షర్ పటేల్ (52) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా శ్రేయస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యలోనే భారత్ గెలుపు ఖరారు చేశాడు. లక్ష్యానికి చేరువైన తరుణంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (9 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జేకబ్ బేతెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.జడేజా@600ఈ మ్యాచ్లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ జడేజానే.అరంగ్రేటంలోనే మెరిసిన రాణా.. నిరాశపరిచిన జైస్వాల్ఈ మ్యాచ్తో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆతను.. ఆతర్వాత కోలుకుని మూడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ రాణాకు చుక్కలు చూపించాడు. ఇదే మ్యాచ్తో వన్డే అరంగేట్రం చేసిన మరో భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.కొనసాగిన రోహిత్ వైఫల్యాల పరంపరఅంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఈ మ్యాచ్లో అతను 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులకే ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రోహిత్ ప్రదర్శనలు చాలా దారుణంగా ఉన్నాయి.గత 16 ఇన్నింగ్స్ల్లో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ చేసింది కేవలం 166 పరుగులే. విరాట్ దూరం.. పంత్కు నో ప్లేస్ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్లో ఆడలేదు. గాయాల కారణంగా కోహ్లి మ్యాచ్లకు దూరం కావడం చాలా అరుదు. ఈ మ్యాచ్లో మరో భారత స్టార్ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ అదనంగా వికెట్కీపింగ్ బాధ్యతలు మోశాడు. -
IND VS ENG 1st ODI: కొనసాగుతున్న రోహిత్ వైఫల్యాల పరంపర
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ (Rohit Sharma) వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. కొద్ది రోజుల కిందటి వరకు టెస్ట్లకే పరిమితమైన రోహిత్ బ్యాడ్ ఫామ్.. ఇప్పుడు వన్డేలకు కూడా పాకింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. భారీ అంచనాల నడుమ ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలి బంతి నుంచే రోహిత్ కాన్ఫిడెంట్గా కనిపించలేదు. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్లను ఎదుర్కొనేందుకు హిట్మ్యాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ సాకిబ్ మహమూద్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అత్యంత చెత్తగా ఔటైన అనంతరం రోహిత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నీ పని అయిపోయింది పో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ రంజీల్లో ఆడి, అక్కడా మర్యాద పోగొట్టుకున్నాడు. పసికూన జమ్మూ అండ్ కశ్మీర్తో జరిగిన మ్యాచ్లో వరుసగా 3, 28 పరుగులకు ఔటయ్యాడు. అంతకుముందు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ వైఫల్యాలు పతాక స్థాయికి చేరాయి. ఆ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సిరీస్లో ఫామ్తో తెగ ఇబ్బంది పడిన రోహిత్ చివరి టెస్ట్ నుంచి స్వతాహాగా తప్పుకున్నాడు. 2024-25 సీజన్లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు పరిశీలిస్తే దారుణంగా ఉన్నాయి. గత 16 ఇన్నింగ్స్లలో రోహిత్ కేవలం ఒకే అర్ద సెంచరీ చేశాడు. అతను బ్యాటింగ్ సగటు కేవలం 10.37గా ఉంది. గత ఏడాదంతా కలుపుకుని రోహిత్ కేవలం 166 పరుగులే చేశాడు.2024-25లో మూడు ఫార్మాట్లలో రోహిత్ ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..652382520818113610392 (నేటి మ్యాచ్)టెస్ట్లతో పోలిస్తే వన్డేల్లో పర్వాలేదనిపించే రోహిత్.. ఇక్కడ కూడా విఫలం కావడంతో అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే తమ ఆరాధ్య ఆటగాడి పని అయిపోయిందా అనుకుంటూ మదనపడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం 249 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) త్వరగా ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ (59) మెరుపు ఇన్నింగ్స్తో భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. శుభ్మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (18) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 111 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. -
IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
టీమిండియా (Team India) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో (England) జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే.ఏకైక భారత స్పిన్నర్ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు. తాజా ప్రదర్శనతో జడ్డూ.. ఇంగ్లండ్పై వన్డేల్లో అత్యధిక వికెట్లు (43) సాధించిన బౌలర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ భారత్తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (198 మ్యాచ్ల్లో 223 వికెట్లు) తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడ్డూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం సనత్ జయసూర్య (445 మ్యాచ్ల్లో 323 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (247 మ్యాచ్ల్లో 317), డేనియల్ వెటోరీ (295 మ్యాచ్ల్లో 305) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయం
ఇంగ్లండ్తో తొలి వన్డే.. టీమిండియా ఘన విజయంనాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ద సెంచరీలు సాధించి టీమిండియాను గెలిపించారు.ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్లక్ష్యానికి 28 పరుగుల దూరంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (52) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. లక్ష్యానికి 85 పరుగుల దూరంలో భారత్ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ 60 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే మరో 85 పరుగులు చేయాలి. గిల్తో పాటు అక్షర్ (29) క్రీజ్లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ ఔట్మంచి టచ్లో కనిపించిన శ్రేయస్ అయ్యర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జేకబ్ బేతెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 16 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 113/3గా ఉంది. గిల్కు (28) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ఈ మ్యాచ్లో శ్రేయస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బేకబ్ బేతెల్ బౌలింగ్లో బౌండరీ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 101/2గా ఉంది. శ్రేయస్తో పాటు శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 43/2గా ఉంది. శ్రేయస్ (18), శుభ్మన్ గిల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ ఔట్రోహిత్ వైఫల్యాల పరంపర వన్డేల్లోనూ కొనసాగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 7 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చెత్త షాట్ ఆడి కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 248 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను 248 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టగా.. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్241 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆదిల్ రషీద్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ డౌన్.. లివింగ్స్టోన్ ఔట్183 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో వికెట్కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి లివింగ్స్టోన్ (5) ఔటయ్యాడు. హర్షిత్ రాణాకు ఇది మూడో వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్ ఔట్170 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (52) ఔటయ్యాడు. 33 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 170/5గా ఉంది. జేకబ్ బేతెల్ (22), లివింగ్స్టోన్ క్రీజ్లో ఉన్నారు. 30 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/430 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 162/4గా ఉంది. జేకబ్ బేతెల్ (18), జోస్ బట్లర్ (48) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. రూట్ ఔట్111 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో జో రూట్ (19) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన రాణాఅరంగ్రేటం పేసర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బేశాడు. 10వ ఓవర్ మూడో బంతికి డకెట్ను (32) ఔట్ చేసిన రాణా.. అదే ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ను డకౌట్ చేశాడు. 10 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 77/3గా ఉంది. జో రూట్ (1), జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. సాల్ట్ రనౌట్ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకరంగా కనిపించిన సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లేని మూడో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.రాణా బౌలింగ్లో చితక్కొట్టిన సాల్ట్ఆరో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో వరుసగా 6,4,6,4,0,6 బాదాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.కట్టుదిట్టంగా భారత పేసర్ల బౌలింగ్టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్కు దిగగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్నే మెయిడిన్ వేసి శుభారంభం అందించాడు. అతడికి తోడుగా హర్షిత్ రాణా కొత్త బంతితో బరిలోకి దిగి వన్డేల్లో తన మొదటి ఓవర్నే మెయిడిన్(సున్నా పరుగులు) చేశాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 26/0 (5)బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్నాగ్పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే ఇవాళ (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆడటం లేదు. అతని కుడి మోకాలికి గాయమైంది. కోహ్లి గాయపడటంతో యశస్వి జైస్వాల్కు అవకాశం వచ్చింది. యశస్వి.. రోహిత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడు. యశస్వికి వన్డేల్లో ఇది తొలి మ్యాచ్ (డెబ్యూ). ఈ మ్యాచ్లో యశస్వితో పాటు హర్షిత్ రాణా కూడా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కు కూడా అవకాశం దక్కలేదు. కేఎల్ రాహుల్ వికెట్కీపింగ్ బాధ్యతలను అదనంగా మోయనున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది.ఇంగ్లండ్ విషయానికొస్తే.. టీ20 సిరీస్ ఆడిన జట్టులో పెద్దగా మార్పులు లేవు. జో రూట్ కొత్తగా జట్టులో చేరాడు. ఈ సిరీస్ భారత్, ఇంగ్లండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ -
విధ్వంసకర శతకం.. రెండో స్థానానికి దూసుకొచ్చిన అభిషేక్ శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో (ICC T20 Rankings) టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దుమ్మురేపాడు. ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడిన శర్మ.. ఒక్కసారిగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం శర్మ కెరీర్లో అత్యుత్తమంగా 829 రేటింగ్ పాయింట్లు సాధించాడు. శర్మ దెబ్బకు సహచరుడు తిలక్ వర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్తో సిరీస్లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి దిగజారాడు. ఆసీస్ విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ దెబ్బకు టాప్-10 (హెడ్ మినహా) బ్యాటర్లు తలో స్థానం కోల్పోయారు. ఇంగ్లండ్తో జరిగిన చివరి రెండు టీ20ల్లో సత్తా చాటిన శివమ్ దూబే 38 స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో పర్వాలేదనిపించిన హార్దిక్ పాండ్యా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలింగ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్తో చివరి టీ20లో రెండు వికెట్లతో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆదిల్ రషీద్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున టాప్-5లో ఉన్న ఏకైక బౌలర్ వరుణ్ ఒక్కడే. తాజా ర్యాంకింగ్స్లో విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. హసరంగ, ఆడమ్ జంపా తలో స్థానం దిగజారి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్తో చివరి టీ20లో ఓ మోస్తరుగా రాణించిన భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు. టీ20ల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్ అర్షదీప్ 8 నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. ఇవి మినహా బౌలర్ల విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. జట్ల ర్యాంకింగ్స్లో భారత్ ఏ జట్టుకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. 19561 పాయింట్లతో టీమిండియా టాప్లో కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12417 పాయింట్లు మాత్రమే కలిగి ఉంది. -
అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో హిట్మ్యాన్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్-2023 మాదిరి ఈ మెగా టోర్నీలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడుగానే ఆడతాడని అంచనా వేశాడు.ఘోర పరాభవాలుకాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ముంబైకర్.. గతేడాది ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఘోర పరాభవం పాలైంది.దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయింది. అనంతరం.. టెస్టులతో బిజీ అయిన రోహిత్ శర్మ.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో, ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ కెప్టెన్గా, బ్యాటర్గా దారుణంగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో ఈ రెండు సిరీస్లనూ టీమిండియా కోల్పోయింది.అనంతరం రంజీ బరిలో దిగిన రోహిత్ శర్మ అక్కడా ముంబై ఓపెనర్గా విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు సన్నద్ధమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానున్నాడు. ఈ నేపథ్యంఓ 37 ఏళ్ల రోహిత్ శర్మను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ.. అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కానుందని పేర్కొన్నాడు.అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం‘‘చాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడతాడని అనుకుంటున్నా. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లోనూ అతడు అగ్రెసివ్గా ముందుకెళ్లాడు. కాబట్టి ఈసారీ అదే జోరు కొనసాగిస్తాడు. అయితే, అతడితో పాటు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగేది ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశం.శుబ్మన్ గిల్ వస్తాడో రాడో తెలియదు. ఒకవేళ గిల్ గనుక ఓపెనర్గా ఉంటే.. అతడితో కలిసి రోహిత్ రెచ్చిపోవడం ఖాయం. ఏదేమైనా రోహిత్ శర్మకు కెప్టెన్గా ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ కానుంది. ఒకవేళ ఇందులో గనుక భారత్ గెలిస్తే.. నాలుగు ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన తొలి టీమిండియా ప్లేయర్గా అతడు చరిత్రకెక్కుతాడు.ఇక సారథిగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. అయితే, అతడు ఈ టోర్నీలో బ్యాటర్గానూ రాణించాల్సి ఉంది’’ అని సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు. ఇక కెప్టెన్గా 2024 టీ20 వరల్డ్కప్ ట్రోఫీనీ ముద్దాడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి రెండున న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడుతుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ టైటిల్ కోసం తలపడుతున్నాయి.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
వరుణ్ చక్రవర్తికి బంపరాఫర్..?
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) బంపరాఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం ఎంపిక చేసిన భారత జట్టులో (Team India) వరుణ్కు చోటు కల్పించనున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో వరుణ్కు చోటు దక్కలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్ ముగిసిన టీ20 సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వరుణ్కు ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ ఖరారైందని తెలుస్తుంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ముగిసినా వరుణ్ భారత వన్డే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.వరుణ్ ప్రస్తుతం భారత వన్డే జట్టుతో కలిసి నాగ్పూర్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో తొలి వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.Varun Chakaravarthy training with Indian ODI Team in Nagpur 🚨- He's not officially part of the squad yet.📸: Sandipan Banerjee#INDvENG #ChampionsTrophy #Nagpur pic.twitter.com/vqfyQJtdLe— OneCricket (@OneCricketApp) February 4, 2025కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో మార్పులు చేర్పుల కోసం ఇంకా అవకాశం ఉంది. ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో చెలరేగిన నేపథ్యంలో వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల రిటైరైన భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సిఫార్సు చేశాడు. ఒకవేళ వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్కు యాడ్ చేస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్లో వరుణ్ 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో వరుణ్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో వరుణ్ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడిపోయారు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ (టీ20 సిరీస్లో) ఇరగదీశాడు. ఆ సిరీస్లో వరుణ్ 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లపై వరుణ్ పూర్తి ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా భాగమన్న విషయం తెలిసిందే.వన్డేల్లో ఇదే జోరు కొనసాగించగలడా..?ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ విషయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తలెత్తుతుంది. టీ20 ఫార్మాట్లో చెలరేగిపోతున్న వరుణ్ వన్డేల్లో రాణించగలడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 33 ఏళ్ల వరుణ్ ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేయలేదు. వరుణ్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వరుణ్ వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ వన్డేలకు సూట్ అవుతుందో లేదో వేచి చూడాలి. వరుణ్ భారత్ తరఫున 18 టీ20ల్లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 33 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఒక్క సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్ల్లోనే 9 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీశాడు. వరుణ్కు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. వరుణ్ గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు
ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ (Team India Captain) రోహిత్ శర్మను (Rohit Sharma) ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ సిరీస్లో హిట్మ్యాన్ మరో 134 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు సాధించేందుకు రోహిత్కు మరో 19 ఇన్నింగ్స్ల సమయం ఉంది.ప్రస్తుతం రోహిత్ 257 వన్డే ఇన్నింగ్స్ల్లో 31 సెంచరీలు, 57 అర్ద సెంచరీల సాయంతో 10866 పరుగులు చేశాడు. విరాట్ వన్డేల్లో 11,000 పరుగులను 222 ఇన్నింగ్స్ల్లోనే పూర్తి చేశాడు. వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 276 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. రోహిత్ మరో 19 ఇన్నింగ్స్ల్లో 134 పరుగులు చేస్తే సచిన్ను వెనక్కు నెట్టి విరాట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు.కాగా, ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో రోహిత్ శర్మ ఈ ఏడాది తొలిసారి టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జనవరి ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రోహిత్ బరిలోకి దిగలేదు. ఫామ్లేమి కారణంగా రోహిత్ వాలంటీర్గా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం ఈ ఏడాది భారత్ ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడింది. గతేడాది టీ20 వరల్డ్కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్లో ఆడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో జరుగబోయే తొలి వన్డే రోహిత్కు ఈ ఏడాది భారత్ తరఫున తొలి మ్యాచ్ అవుతుంది.రంజీల్లోనూ నిరాశేఇంగ్లండ్తో టీ20 సిరీస్ జరిగే సమయంలో రోహిత్ రంజీ బరిలోకి దిగాడు. ఖాళీగా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. గతేడాది నుంచి పెద్దగా ఫామ్లో లేని రోహిత్ రంజీ మ్యాచ్తో అయినా తిరిగి టచ్లోకి రావాలని భావించాడు. కానీ రోహిత్కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది.ఫిబ్రవరి 6 నుంచి మొదలుఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లను కటక్, అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి.చిత్తుగా ఓడిన ఇంగ్లండ్వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ భారత్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ముగిసిన చివరి టీ20లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి భారత్కు ఘన విజయాన్ని అందించారు. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్కు బిగ్ షాక్.. సంజూ శాంసన్కు గాయం..?
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్కు (Rajasthan Royals) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ (Sanju Samson) శాంసన్ గాయపడినట్లు సమాచారం. ఇంగ్లండ్తో ఐదో టీ20 సందర్భంగా సంజూ చూపుడు వేలికి గాయమైనట్లు తెలుస్తుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ సంధించిన బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ సందర్భంగా సంజూ చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఆతర్వాత సంజూ బ్యాటింగ్ను కొనసాగించినప్పటికీ.. కొద్ది సేపటికే ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సంజూ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో ద్రువ్ జురెల్ వికెట్కీపింగ్ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. దీంతో సంజూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా సంజూ రంజీ బరిలో ఉండడని సమాచారం. రంజీలో సంజూ ప్రాతినిథ్యం వహించే కేరళ, క్వార్టర్ ఫైనల్లో జమ్మూ అండ్ కశ్మీర్తో తలపడాల్సి ఉంది.డగౌట్లో సంజూఇంగ్లండ్తో చివరి టీ20లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన సంజూ.. ఆతర్వాత స్కానింగ్కు వెళ్లలేదు. డగౌట్లో ఎక్స్ట్రా ప్లేయర్ జెర్సీ వేసుకుని కనిపించాడు. దీన్ని చూసి అభిమానులు సంజూకు ఏమీ కాలేదని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సంజూ చూపుడు వేలుకు బాగా వాపు వచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడు స్కానింగ్కు వెళ్లగా డాక్టర్లు ఫ్రాక్చర్ను గుర్తించినట్లు సమాచారం.ఘోర వైఫల్యంఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రతి మ్యాచ్లో ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో సంజూ వీక్నెస్ను గుర్తించిన ఇంగ్లండ్ పేసర్లు పదేపదే ఒకే తరహా బంతులు వేసి అతన్ని ఔట్ చేశారు.4-1 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజూ విఫలమైనప్పటికీ భారత్ 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో సంజూ సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి టీ20లో విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్రేట్తో 276 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు.మార్చి 21 నుంచి ప్రారంభంఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్లో రాజస్థాన్ ఆరంభ ఎడిషన్లో మాత్రమే టైటిల్ సాధించింది. గత సీజన్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ జట్టు రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. -
అజేయం... అద్వితీయం
త్రిష... త్రిష... త్రిష... ఈ ప్రపంచకప్ను అద్దం ముందు పెడితే తెలంగాణ ఆల్రౌండర్ ప్రదర్శనే ప్రతిబింబిస్తుందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్లో కనబరిచిన ఆల్రౌండ్ షోకే ఆమెను ఆకాశానికెత్తేయడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్లోనూ తనదైన శైలిలో ఓపెనింగ్ దూకుడు, బౌలింగ్లో జట్టుకు అవసరమొచ్చినప్పుడు కీలకమైన వికెట్లు తీయడం త్రిషకే చెల్లింది. సఫారీ జట్టుతో టైటిల్ సమరంలో త్రిషతోపాటు స్పిన్నర్లు పారుణిక (4–0–6–2), ఆయుశి (4–2–9–2), వైష్ణవి (2/23)ల మాయాజాలంతో ‘ఫైనల్ వార్’ వన్సైడ్ అయ్యింది. కౌలాలంపూర్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఆధిపత్యం అటు ఇటు కూడా మారలేదు. తొలి బంతి మొదలు విజయ తీరం చేరేదాకా భారత అమ్మాయిలదే హవా. ఏ లక్ష్యంతోనైనా మలేసియాలో అడుగు పెట్టారో ఆ లక్ష్యాన్ని అజేయంగా, అద్వితీయ ఆటతీరుతో మన అమ్మాయిలు అందుకున్నారు. వరుసగా రెండోసారి టి20 అండర్–19 ప్రపంచకప్ టైటిల్ను భారత అమ్మాయిలు సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరిలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన భారత్ తమ జైత్రయాత్రను అ‘ది్వతీయ’ంగా ముగించింది. టోర్నీ మొత్తంలో ఓటమెరుగని మన జట్టే మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత స్పిన్ వలలో సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. మరో ముగ్గురు పది పైచిలుకు పరుగులు చేశారంతే! లెగ్ స్పిన్తో గొంగడి త్రిష 4–0–15–3తో అద్బుతమైన స్పెల్ వేయగా... మిగతా స్పిన్నర్లు పారుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్కు ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత జట్టు స్టార్ ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన బ్యాటింగ్తో 11.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలిచింది. ఆల్రౌండ్ మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అది్వతీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుంది. స్పిన్ వలలో విలవిల దక్షిణాఫ్రికాకు సీనియర్, జూనియర్, జెండర్ (పురుషులు, మహిళలు) ఇలా ఏ స్థాయిలోనూ ప్రపంచకప్ భాగ్యం లేదన్నది మరోసారి నిరూపితమైంది. మొదట బ్యాటింగ్కు దిగి భారీ స్కోరుతో ‘కప్’ భాగ్యం దక్కించుకుందామనుకున్న సఫారీ యువ తుల జట్టు భారత స్పిన్ వలలో చిక్కి శల్యమైంది. రెండో ఓవర్లోనే పారుణికతో భారత్ మాయాజాలం నుంచి ఆఖరి దాకా బయట పడలేకపోయింది. సిమోన్ లౌరెన్స్ (0)ను పారుణిక డకౌట్ చేయగా, జెమ్మా బొథా (14 బంతుల్లో 16; 3 ఫోర్లు) బౌండరీల దూకుడుకు ఆదిలోనే షబ్నమ్ చెక్ పెట్టింది. ఇక అక్కడితో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. ధనాధన్ ప్రపంచకప్ కోసం 83 పరుగుల లక్ష్య దూరంలో ఉన్న భారత్ను ఓపెనర్ త్రిష తన షాన్దార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో మరింత సులువుగా, వేగంగా విజయతీరాలకు తీసుకెళ్లింది. బౌండరీలతో తనమార్క్ స్ట్రోక్ ప్లేతో అలరించిన ఆమె జట్టు గెలిచేదాకా క్రీజులో నిలిచింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: జెమ్మా (సి) కమలిని (బి) షబ్నమ్ 16; లౌరెన్స్ (బి) పారుణిక 0; దియార (బి) ఆయుశి 3; కైలా రేనెకె (సి) పారుణిక (బి) త్రిష 7; కరబో మెసో (బి) ఆయుశి 10; మీక్ వాన్ (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23; కోలింగ్ (బి) వైష్ణవి 15; శేషిని నాయుడు (బి) త్రిష 0; ఆష్లే వాన్విక్ (సి) వైష్ణవి (బి) పారుణిక 0; మోనాలిసా (బి) వైష్ణవి 0, ఎన్తబిసెంగ్ నిని (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 82. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–20, 4–40, 5–44, 6–74, 7–74, 8–80, 9–80, 10–82. బౌలింగ్: జోషిత 2–0– 17–0, పారుణిక 4–0–6–2, షబ్నమ్ 2–0–7– 1, ఆయుశి 4–2–9–2, వైష్ణవి 4–0–23–2, త్రిష 4–0–15–3. భారత్ ఇన్నింగ్స్: కమలిని (సి) లౌరెన్స్ (బి) రేనెకె 8; త్రిష (నాటౌట్) 44; సనిక (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 6; మొత్తం (11.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84. వికెట్ల పతనం: 1–36. బౌలింగ్: ఎన్తబిసెంగ్ 1–0–7–0, ఫే కోలింగ్ 2–0–19–0, కైలా రేనెకె 4–1–14–1, శేషిని 1–0–12–0, వాన్విక్ 1–0–12–0, మోనాలిసా 1.2–0–10–0, జెమ్మా బొథా 1–0–9–0. -
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం.. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్ఈ మ్యాచ్లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్ల టీ20 కెరీర్లో అభిషేక్కు ఇది రెండో సెంచరీ.ఈ మ్యాచ్లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్కు ఇది భారీ పరాజయం.చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తిఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. -
IND VS ENG 5th T20: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్లో (Bilateral Series) అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లో హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను పేకమేడలా కూల్చారు. బ్యాటింగ్లో చెలరేగిన అభిషేక్ బౌలింగ్లోన సత్తా చాటి 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.ప్రస్తుత సిరీస్లో వరుణ్ ప్రదర్శనలు..తొలి టీ20-3/23 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)రెండో టీ20-2/38మూడో టీ20-5/24 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)నాలుగో టీ20-2/28ఐదో టీ20-2/25 -
IND VS ENG 5th T20: అభిషేక్ శర్మ మహోగ్రరూపం.. 37 బంతుల్లోనే శతకం
ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్లో భారత్ ఓ భారీ రికార్డు సాధించింది. పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు పవర్ ప్లేల్లో టీమిండియా అత్యధిక స్కోర్ 82/2గా ఉండింది. 2021లో స్కాట్లాండ్పై భారత్ ఈ స్కోర్ చేసింది.టీ20 పవర్ ప్లేల్లో భారత్ అత్యధిక స్కోర్లు95/1 ఇంగ్లండ్పై (2025)82/2 స్కాట్లాండ్పై (2021)82/1 బంగ్లాదేశ్పై (2024)78/2 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఈ మ్యాచ్లో అభిషేక్ విధ్వంసం హాఫ్ సెంచరీతో ఆగలేదు. హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజ్లో ఉన్నాడు. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 143/2గా ఉంది. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ 7 బంతుల్లో 16, తిలక్ వర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ కాస్త పర్వాలేదనిపించగా.. శాంసన్ వరుసగా ఐదో ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/5. అభిషేక్ (108), రింకూ సింగ్ (1) క్రీజ్లో ఉన్నారు. -
హర్షిత్ రాణా రంగప్రవేశం టీమిండియాకు శుభపరిణామం
పూణేలో ఇంగ్లాండ్తో శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో శివం దుబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా అసాధారణ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున తన టీ20 అరంగేట్రం చేసాడు. భారత్ క్రికెట్ జట్టు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ఒక ఆల్ రౌండర్ స్థానంలో పేసర్ను జట్టులోకి తీసుకోవడాన్ని క్రికెట్ నిపుణులు, ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నిశితంగా విమర్శించారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన నియమావళికి విరుద్ధమని ఇంగ్లాండ్ నిపుణుల వాదన. దీనికి భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటి వాళ్ళు కూడా సమర్ధించడం విశేషం. ఎందుకంటే ఐసీసీ నియమావళి ప్రకారం దూబే స్థానం లో 'లైక్-ఫర్-లైక్' ప్రత్యామ్యాయ ఆటగాడ్ని ఎంచుకోవాలి. రాణా రావడంతో భారత్ జట్టుకి మేలు చేకూరింది. అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించింది.ఐసీసీ నియమావళి ప్రకారం కంకషన్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా దాదాపు ఒకే తరహా ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలి. ఈ విషయం పై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ భారత్ జట్టు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. " ఐసీసీ నిబంధలు ప్రకారం కంకషన్ లేదా అనుమానిత కంకషన్కు గురైన ఆటగాడికి సమానమైన వారిని మాత్రమే ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవాలని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా పూర్తి స్థాయి పేస్ బౌలర్ కాగా, దుబే బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాబట్టి భారత్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా 12 మంది ఆటగాళ్లతో పోటీ కి దిగిందని భావించాల్సి వస్తుందని పీటర్సన్ పేర్కొన్నాడు.అంతకుముందు శివమ్ దూబే 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. క్లిష్ట సమయంలో భారత్ ని ఆదుకుని జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించాడు. భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన బంతి హెల్మెట్కు తగలడం తో దూబే గాయం కారణంగా వైదొలిగాడు. దూబే స్తానం లో వచ్చిన రాణా నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహించే రాణా ఇంగ్లాండ్ 12వ ఓవర్లో లియామ్ లివింగ్స్టోన్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో జాకబ్ బెథెల్ను కేవలం 6 పరుగులకే వెనక్కి పంపి ఇంగ్లాండ్పై మరో దెబ్బ వేసాడు. 18వ ఓవర్లో జామీ ఓవర్టన్ను 19 పరుగులకు క్లీన్ బౌలింగ్ చేసి భారత్ కి విజయం ఖాయం చేశాడు. రాణా 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన శైలి లో అరంగ్రేటం చేసాడు.ఈ వివాదం ఎలా ఉన్న రాణా తన ఈ మ్యాచ్ లో తన ఆటతీరు చాల సంతృప్తినిచ్చిందని, తనకు కలల అరంగేట్రం లభించిందని చెప్పాడు. "ఇది నాకు ఇప్పటికీ కలల అరంగేట్రం. దుబే గాయంతో వైదొలగడం తో రెండు ఓవర్ల తర్వాత నేను కంకషన్ ప్రత్యామ్నాయంగా ఆడబోతున్నాని సమాచారం అందింది. నేను చాలా కాలంగా భారత్ జట్టు తరుఫున ఆడాలని ఎదురు చూస్తున్నాను. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నాను. నేను ఐపీఎల్లో బాగానే బౌలింగ్ చేసాను.ఇక్కడ కూడా అదే రీతిలో ఆడుతున్నానని రాణా పూణే మ్యాచ్ అనంతరం చెప్పాడు.8వ ఓవర్లో మైదానంలోకి దిగిన రాణా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ కూడా పట్టుకుని అతన్ని అవుట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రాణాను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందిస్తూ “పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే బ్యాట్స్మన్ స్థానంలో పూర్తి స్థాయి బౌలర్ అయిన రాణా ని ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. రమణ్దీప్ (సింగ్) దూబేకు సమానమైన ప్రత్నామ్యాయం అని వ్యాఖ్యానించాడు.దీని పై భారత్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా విమర్శించడం గమనార్హం. "ఇదేమీ ఆట? దూబే స్థానంలో రాణా ప్రత్నామ్యాయ అతగాడి రంగ ప్రవేశం చేయడం ఇది ఐపీఎల్ మ్యాచ్ లో సూపర్సబ్ వ్యవహారం లాగా ఉంది ”అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు హర్షిత్ రాణా రాణించడం భారత్ కి శుభపరిణామం. ఇప్పటికే భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోక పోవడం, సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిటినెస్ పై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో రాణా రంగప్రవేశం భారత్ కి కొంత ఉపశమనాన్నిస్తుదనడంలో సందేహం లేదు. -
ఐదో టీ20లో భారత్ ఘన విజయం
ఐదో టీ20లో భారత్ ఘన విజయంముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్ను 150 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను పేకమేడలా కూల్చారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్59 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ (2) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్48 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ను (7) వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు పంపాడు. టార్గెట్ 248.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్కు శుభారంభమే లభించింది. అయితే ఆ జట్టు 3వ ఓవర్ తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో బెన్ డకెట్ డకౌటాయ్యాడు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 48/1గా ఉంది. ఫిల్ సాల్ట్ (39) ధాటిగా ఆడుతున్నాడు. అభిషేక్ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (247/9) చేసింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్.. సెంచరీని 37 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20ల్లో అభిషేక్ది భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), సెంచరీ (37). టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అభిషేక్కు టీ20ల్లో ఇది రెండో సెంచరీ.టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135) కూడా అభిషేక్దే. అలాగే ఓ టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13) కొట్టింది కూడా అభిషేకే. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.37 బంతుల్లో శతక్కొట్టిన అభిషేక్హాఫ్ సెంచరీ తర్వాత పేట్రేగిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన శతకం. టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. గతేడాది చౌహాన్ సైప్రస్పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసం.. 17 బంతుల్లో అర్ధ శతకంఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సంజూ ఔటయ్యాక ఒక్కసారిగా బీస్ట్ మోడ్లోకి వచ్చిన అభిషేక ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది 17 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ దెబ్బకు భారత్ తొలి 6 ఓవర్లలో 95 పరుగులు చేసిం్ది. అభిషేక్ 58, తిలక్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.సంజూ శాంసన్ మరోసారి విఫలంటీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విఫలమైనా టీమిండియా మేనేజ్మెంట్ సంజూకు మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో తొలి బంతికే సిక్సర్ బాదిన సంజూ.. ఆతర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే సంజూ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు) ఆతర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 2) నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. భారత్ తరఫున అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి రాగా.. గత మ్యాచ్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన సాకిబ్ మహమూద్కు ఇంగ్లండ్ రెస్ట్ ఇచ్చింది. సాకిబ్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్భారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి -
హార్దిక్, దూబే విధ్వంసం.. నిప్పులు చెరిగిన రాణా.. నాలుగో టీ20లో టీమిండియా విజయం
స్వదేశంలో ఇంగ్లండ్తో (England) జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ (Team India) మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పూణే వేదికగా ఇవాళ (జనవరి 31) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఇంగ్లండ్పై టీ20 సిరీస్ గెలవడం ఇది వరుసగా ఐదుసారి. భారత్కు స్వదేశంలో ఇది వరుసగా 17వ సిరీస్ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (Shivam Dube) (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్ను హార్దిక్, దూబే మెరుపు ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (39), ఫిలిప్ సాల్ట్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.బ్రూక్ క్రీజ్లో ఉండగా.. ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో బ్రూక్తో పాటు బ్రైడన్ కార్స్ను ఔట్ చేసి తిరిగి భారత్ను గేమ్లోకి తెచ్చాడు. బ్రూక్, కార్స్ ఔటయ్యాక జేమీ ఓవర్టన్ కొద్ది సేపు భారత బౌలర్లను బయపెట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన శివమ్ దూబేకు కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా (Harshit Rana) మ్యాజిక్ చేశాడు. తన కెరీర్లో తొలి టీ20 ఆడిన హర్షిత్.. ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టాడు. హర్షిత్.. ప్రమాదకరమైన లివింగ్స్టోన్ (9), జేకబ్ బేతెల్ (6), జేమీ ఓవర్టన్ (19) వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో హర్షిత్ 150 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం విశేషం. హర్షిత్తో పాటు రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్లో నామమాత్రపు ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరుగుతుంది. -
IND VS ENG 4th T20: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా (Team India) మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడిన పాండ్యా.. భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రయిక్రేట్తో 1032 పరుగులు చేయగా.. పాండ్యా 174.24 స్ట్రయిక్రేట్తో 1068 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా శివాలెత్తిపోయాడు. చాలాకాలం తర్వాత అతని బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ జాలు వారింది. ఈ మ్యాచ్లో తొలి 14 పరుగులు చేసేందుకు 17 బంతులు తీసుకున్న హార్దిక్.. ఆతర్వాత చేసిన 39 పరుగులను కేవలం 13 బంతుల్లో రాబట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి హార్దిక్ స్కోర్ 17 బంతుల్లో 14 పరుగులు కాగా.. 18 ఓవర్ ముగిసే సరికి అతని స్కోర్ 30 బంతుల్లో 53 పరుగులుగా ఉండింది. 15-18 ఓవర్ల మధ్యలో హార్దిక్.. శివమ్ దూబేతో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్, శివమ్ దూబే (Shivam Dube) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్ను హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, జోస్ బట్లర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (12), లివింగ్స్టోన్ (8) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. కాగా, 5 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
తీరు మార్చుకోని సంజూ శాంసన్.. వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న సూర్య
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో పలువురు టీమిండియా బ్యాటర్ల వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. తొలి మ్యాచ్లో 20 బంతుల్లో 26 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో (5,3,1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. సూర్య విషయానికొస్తే.. ఏదో కెప్టెన్సీ బాధ్యత మోస్తున్నాడని తప్పిస్తే, ఈ సిరీస్ మొత్తంలో సూర్య ప్రదర్శనలు శూన్యం. సిరీస్ను డకౌట్తో ప్రారంభించిన సూర్య.. ఇవాళ జరుగుతున్న నాలుగో టీ20లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మధ్యలో రెండు, మూడు మ్యాచ్ల్లో అతను 12, 14 పరుగులు చేశాడు. సూర్య ప్రదర్శన ఈ సిరీస్కు ముందు నుంచే చెత్తగా ఉంది. చివరి 10 ఇన్నింగ్స్ల్లో అతను కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యపై విమర్శలు తారా స్థాయికి చేరాయి. కెప్టెన్సీకి వేరే వాళ్లకు కట్టబెట్టి ముందు అతన్ని జట్టులో నుంచి తీసేయండని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇతను కేవలం ఐపీఎల్ ప్లేయర్ మాత్రమేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.అభిషేక్ శర్మది అదే తీరు.. మంచి ఆరంభాలు లభించినా..!ఈ సిరీస్లో అభిషేక్ శర్మ కాస్త పర్వాలేదనిపిస్తున్నా అతని నిలకడలేమి ఆందోళన కలిగిస్తుంది. తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ నాక్ (34 బంతుల్లో 79) ఆడిన అభిషేక్ ఆతర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో మంచి ఆరంభాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు, మూడు టీ20ల్లో వరుసగా 12, 24 పరుగులు చేసిన అభిషేక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్లో 19 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో అభిషేక్కు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే అతను చివరి వరకు క్రీజ్లో ఉండాల్సింది. అయితే అతను తన సహజ సిద్దమైన దూకుడును ప్రదర్శించి వికెట్ పారేసుకున్నాడు. అభిషేక్ వికెట్ సమర్పించుకోవడంతో పాటు భారత్ను కష్టాల్లోకి నెట్టాడు.తిలక్ ఖాతాలో వరుసగా రెండు వైఫల్యాలుసిరీస్లోని రెండో టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ (55 బంతుల్లో 72 నాటౌట్) ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన తిలక్.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో టీ20లో 18 పరుగులు చేసిన తిలక్.. ఇవాళ జరుగుతున్న నాలుగో మ్యాచ్లో గోల్డెన్ డకౌటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలం కావడంతో తిలక్పై కూడా విమర్శలు మొదలవుతున్నాయి.నాలుగో టీ20 విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (181/9) చేసింది. 12 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జట్టును హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. తొలుత హ్యాట్రిక్, ఇప్పుడు..?
రంజీ ట్రోఫీ (Ranji Trophy) రన్నింగ్ సీజన్లో ముంబై ఆల్రౌండర్, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆది నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్న శార్దూల్.. ప్రస్తుతం మేఘాలయాతో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత హ్యాట్రిక్ (Hat Trick) తీసిన శార్దూల్.. బ్యాటింగ్లో మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శార్దూల్.. ఓవరాల్గా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. శార్దూల్తో పాటు మిగతా ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (671/7) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.ముంబై బ్యాటర్లలో సిద్దేశ్ లాడ్ (145), వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (86 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా.. కెప్టెన్ అజింక్య రహానే (96) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సుయాంశ్ షేడ్గే (61) అర్ద సెంచరీతో రాణించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి ముంబై 585 పరుగుల ఆధిక్యంలో ఉంది.అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగడంతో మేఘాలయా తొలి ఇన్నింగ్స్లో 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి 3, సిల్డెస్టర్ డిసౌజా 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. మేఘాలయా ఇన్నింగ్స్లో 10వ నంబర్ ఆటగాడు హిమాన్ పుఖాన్ చేసిన 28 పరుగులే అత్యధికం. శార్దూల్ దెబ్బకు మేఘాలయా టాపార్డర్కు చెందిన ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో మేఘాలయా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శన నమోదు చేసింది. 90ల్లో ఔటైన ఐదుగురు ఆటగాళ్లు..ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ల్లో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లు 90ల్లో ఔటయ్యారు. వీరిలో ఇద్దరు పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా, ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని 99 పరుగుల వద్ద ఔట్ కాగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 96, రైల్వేస్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ 95, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 91 పరుగుల వద్ద ఔటయ్యారు. -
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం
చాలాకాలం తర్వాత రంజీ (Ranji Trophy) బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (KL Rahul) తొలి ఇన్నింగ్స్లోనే నిరాశపరిచాడు. హర్యానాతో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్లో రాహుల్ 26 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్ 37 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాది మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్ కంబోజ్ ఓ సాధారణ బంతితో రాహుల్ను బోల్తా కొట్టించాడు. వికెట్కీపర్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రాహుల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.కాగా, ఈ మ్యాచ్లో రాహుల్ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్ రాహుల్ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో (బెంగళూరు) జరుగుతుంది. సొంత మైదానంలో రాహుల్ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ ఇన్నింగ్స్లో తొలుత రాహుల్ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సూపర్ టచ్లో కనిపించిన రాహుల్ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు.ఈ మ్యాచ్లో హర్యానా టాస్ గెలిచి కర్ణాటకను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేవీ అవనీశ్ ఔట్ కావడంతో కర్ణాటక 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాహుల్.. మయాంక్ అగర్వాల్తో కలిసి రెండో వికెట్కు 54 పరుగులు జోడించాడు. రాహుల్ ఔటయ్యాక దేవ్దత్ పడిక్కల్ క్రీజ్లోకి వచ్చాడు. ఈ లోగా మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల అనంతరం కర్ణాటక స్కోర్ 121/2గా ఉంది. మయాంక్ 63, పడిక్కల్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ను ఔట్ చేసిన కంబోజ్ అనీశ్ను కూడా పెవిలియన్కు పంపాడు.బీజీటీలోనూ నిరాశపరిచిన రాహుల్రాహుల్ ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ 5 టెస్ట్ల్లో కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. గాయాలు, ఫామ్ లేమి కారణంగా రాహుల్ ఇటీవలికాలంలో తరుచూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. రాహుల్ టీ20 జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైంది. వన్డేల్లోనూ రాహుల్ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. రాహుల్కు బీజీటీ 2024-25లో ఐదు టెస్ట్లు ఆడే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో (77).. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో (84) మాత్రమే రాహుల్ రాణించాడు. -
IND Vs ENG: భారత్ను ముంచిన బ్యాటర్లు
ఇంగ్లండ్ స్కోరు 7 వద్దే తొలి వికెట్ను కోల్పోయింది. కానీ రెండో వికెట్ 83 పరుగుల వద్ద పడింది. అప్పటికి 9 ఓవర్లే ముగిశాయి. ఇలా పుంజుకున్న ప్రత్యర్థి ఇన్నింగ్స్ను వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేయడంతో అనూహ్యంగా 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. హమ్మయ్య పట్టు సాధించామనుకుంటే... డెత్ ఓవర్లు, మిగతా బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ 170 పైచిలుకు పరుగులు చేసింది. కానీ భారత్ మొదటి వికెట్ 16 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాతా పడిపోతూనే 85/5 స్కోరు వద్ద సగం వికెట్లను సమరి్పంచుకొని ఓటమికి స్వాగతం పలికింది. దీంతో తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ సత్తా చాటితే... ఈ ఒక్కటి గెలిస్తే సిరీస్ వశమయ్యే మ్యాచ్లో నిలువెత్తు నిర్లక్ష్యం భారత్ను ముంచింది. రాజ్కోట్: సిరీస్ను గెలిపించే మ్యాచ్ను భారత్ సిరీయస్గా తీసుకున్నట్లు లేదు. అందుకే తగిన మూల్యం ఓటమిగా చెల్లించుకుంది. రేసులో నిలవాలనుకున్న ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్... వరుణ్ బిగించిన స్పిన్ ఉచ్చు నుంచి బయటపడి... అనంతరం ఆతిథ్య జట్టును బంతితో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఫలితంగా సిరీస్ రేసులో నిలిచేందుకు ఇంగ్లండ్ 26 పరుగులతో భారత్ను ఓడించి గెలుపు బోణీ కొట్టేసింది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.బెన్ డకెట్ (28 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్లు), లివింగ్స్టోన్ (24 బంతుల్లో 43; 1 ఫోర్, 5 సిక్స్లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేశాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (40; 1 ఫోర్, 2 సిక్స్లు) ఒక్కడే రాణించాడు. లివింగ్స్టోన్ భారీ సిక్సర్లు సాల్ట్ (5)ను పాండ్యా త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ డకెట్, బట్లర్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను గాడిన పెడితే వరుణ్ ఉచ్చులో ఇంగ్లండ్ చిక్కుకుంది. బట్లర్ సహా, స్మిత్ (6), ఓవర్టన్ (0), కార్స్ (3), ఆర్చర్ (0)లు వికెట్లు పారేసుకున్నారు. కానీ లివింగ్స్టోన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో కూలుతున్న పర్యాటక జట్టు కోలుకుంది. 127/8 నుంచి 171/9 స్కోరుకు చేరుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం! భారత్ ముందున్నది సాధారణ లక్ష్యం కానేకాదు. ఇలాంటి ఛేదనకు చక్కని శుభారంభం, తదనంతరం మిడిలార్డర్ బాధ్యత ఎంతో ముఖ్యం... కానీ ఈ ఒక్కటీ ఓడితే పోయేదేముంది అన్నట్లు భారత బ్యాటర్ల ఆటతీరు సాగింది. సంజూ సామ్సన్ (3), అభిషేక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (14), తిలక్ వర్మ (18), సుందర్ (6), అక్షర్ (15), జురేల్ (2) ఇలా అంతా... మా వల్లకాదంటూ ప్రత్యర్థి బౌలింగ్కు తలొగ్గారు. హార్దిక్ చేసిన ఆ మాత్రం స్కోరు భారత్ పరువు నిలిపింది... కానీ ఒడ్డున పడేయలేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 5; డకెట్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 51; బట్లర్ (సి) సామ్సన్ (బి) వరుణ్ 24; హ్యారీ బ్రూక్ (బి) బిష్ణోయ్ 8; లివింగ్స్టోన్ (సి) జురేల్ (బి) పాండ్యా 43; స్మిత్ (సి) జురేల్ (బి) వరుణ్ 6; ఓవర్టన్ (బి) వరుణ్ 0; కార్స్ (సి) తిలక్వర్మ (బి) వరుణ్ 3; ఆర్చర్ (బి) వరుణ్ 0; రషీద్ నాటౌట్ 10; మార్క్వుడ్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.వికెట్ల పతనం: 1–7, 2–83, 3–87, 4–108, 5–115, 6–115, 7–127, 8–127, 9–147. బౌలింగ్: షమీ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 4–0–33–2, సుందర్ 1–0–15–0, వరుణ్ 4–0– 24–5, రవి బిష్ణోయ్ 4–0–46–1, అక్షర్ పటేల్ 3–0–19–1, అభిషేక్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 3; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) కార్స్ 24; సూర్య (సి) సాల్ట్ (బి) వుడ్ 14; తిలక్ వర్మ (బి) రషీద్ 18; హార్దిక్ పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 40; సుందర్ (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 6; అక్షర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 15; జురేల్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; షమీ (సి) బ్రూక్ (బి) ఓవర్టన్ 7; రవి బిష్ణోయ్ నాటౌట్ 4; వరుణ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–16, 2–31, 3–48, 4–68, 5–85, 6–123, 7–131, 8–140, 9–140. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–2, వుడ్ 3–0–29–1, బ్రైడన్ కార్స్ 4–0–28–2, లివింగ్స్టోన్ 1–0–11–0, రషీద్ 4–0–15–1, జేమీ ఓవర్టన్ 4–0–24–3. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న అర్షదీప్
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో ఇవాళ (జనవరి 28) జరుగబోయే మూడో టీ20లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అర్షదీప్ 62 మ్యాచ్ల్లో 98 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు.తొలి పేసర్గా చరిత్రకెక్కనున్నాడు..!నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన పేసర్గా చరిత్రకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ పేరిట ఉంది. రౌఫ్ 71 మ్యాచ్ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. అర్షదీప్కు తన 63వ మ్యాచ్లోనే 100 వికెట్ల మైలురాయిని క్రాస్ చేసే అవకాశం వచ్చింది.రషీద్ 53 మ్యాచ్ల్లోనే..!టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 53 మ్యాచ్ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు. 2021లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఈ ఫీట్ను సాధించాడు. రషీద్ తర్వాత అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచ్చనేకు దక్కుతుంది. సందీప్ 54 మ్యాచ్ల్లో 100 వికెట్ల మార్కును తాకాడు.టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లురషీద్ ఖాన్ (53 మ్యాచ్లు)సందీప్ లామిచ్చనే (54 మ్యాచ్లు)వనిందు హసరంగ (63 మ్యాచ్లు)ఎహసాన్ ఖాన్ (71 మ్యాచ్లు)హరీస్ రౌఫ్ (71 మ్యాచ్లు)నేటి మ్యాచ్లో అర్షదీప్ మరో రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన మూడో బౌలర్గా హసరంగతో కలిసి సంయుక్తంగా నిలుస్తాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న అర్షదీప్కు నేటి మ్యాచ్లో రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో అర్షదీప్ 3 వికెట్లు తీశాడు. అర్షదీప్ రెండు రోజుల కిందటే ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికైన విషయం తెలిసిందే.భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. నేటి మ్యాచ్లోనూ భారత్ ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తుంది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ (39 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రెండో మ్యాచ్లో తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విశేషంగా రాణించారు. వీరి ప్రదర్శనల కారణంగానే భారత్ తొలి రెండు టీ20ల్లో నెగ్గింది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్కప్లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్తో పాటు ఆస్ట్రేలియా సెమీస్కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (జనవరి 27) ప్రకటించింది. గతేడాది టెస్ట్ల్లో విశేషంగా రాణించినందుకు గానూ బుమ్రాను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. బుమ్రా గతేడాది టెస్ట్ల్లో 14.92 సగటున 71 వికెట్లు తీశాడు. గతేడాది టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రానే.గతేడాది టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ అత్యధిక వికెట్లు సాధించాడు. అట్కిన్సన్ గతేడాది 11 మ్యాచ్ల్లో 52 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రా, అట్కిన్సన్ తర్వాత షోయబ్ బషీర్ (49), మ్యాట్ హెన్రీ (48), రవీంద్ర జడేజా (48) ఉన్నారు.బుమ్రా టెస్ట్ల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్ వన్ ర్యాంక్ బౌలర్గానూ నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందిన బౌలర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై అనేక సంచలన వికెట్ టేకింగ్ స్పెల్స్ వేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్లో బుమ్రా లీడింగ్ వికెట్టేకర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, కమిందు మెండిస్ పోటీపడ్డారు. అంతిమంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు బుమ్రానే వరించింది. 2018లో కోహ్లి తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ బుమ్రానే.మరోవైపు ఇవాళ ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన గెలుచుకుంది. మంధన గతేడాది (2024) ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైంది. మంధన గతేడాది 13 వన్డేల్లో నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్రేట్తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లపై తలో సెంచరీ చేసింది. ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు.ఇవాళే ప్రకటించిన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ గెలుచుకున్నాడు. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, వనిందు హసరంగ పోటీపడ్డారు.ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధనఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్