breaking news
Stanford
-
పరిశోధనా రంగంలో స్ఫూర్తి పతాకం
సంధ్యా షెనాయ్ (Dr Sandhya Shenoy ) సైన్స్ రంగంలో రాణించాలనుకునే భారత యువతకు ఒక స్ఫూర్తిపతాకం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ డచ్ అకడెమిక్ పబ్లిషర్ ఎల్స్వియర్తో కలిసిప్రతి ఏటా వెలువరించే అత్యంత ప్రతిభావంతులైన సైంటిస్ట్లజాబితాలో ఆమె వరుసగా మూడుసార్లు నిలిచింది. తాజాగా వెలువడిన 2025 జాబితాలో ఆమెకు మూడోసారి స్థానం దక్కడంతో భారత పరిశోధనా రంగంలో హర్షాతిరేకాలు వెలువెత్తుతున్నాయి. సంధ్యా షెనాయ్ పరిచయం.సంధ్యా షెనాయ్కు విద్యా రంగంలో, పరిశోధన రంగంలో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. 2010లో మొదటిసారి ఆమె ఘనత వార్తపత్రికల ద్వారా లోకానికి తెలిసింది. దానికి కారణం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో ఆమె సెంట్ పర్సెంట్ సాధించడం. ఇలా ఎం.ఎస్సీ కెమిస్ట్రీలో నూరు శాతం మార్కులు సాధించడం అసాధ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతవరకూ ఆ ఘనత సాధించిన వారు ఒక్కరూ లేరు. మొదటిసారి సంధ్యా షెనాయ్ ఆ మార్కులు సాధించింది. ‘స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి’ అని అందరి చేతా అనిపించుకుందామె.హాజరు.. చదువు...కొంకిణి మాతృభాష కలిగిన సంధ్యా షెనాయ్ సొంత ప్రాంతం ఉడిపి. అక్కడే బి.ఎస్సీ. వరకూ చదివి కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత కుటుంబం బెంగళూరులో స్థిరపడటంతో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నూరు శాతం మార్కులు సాధించి నానో కెమిస్ట్రీలో పీహెచ్డీ కొనసాగించింది. ‘నా చదువులో ఎప్పుడూ కాలేజీ ఎగ్గొట్టలేదు. నూరు శాతం అటెండెన్స్తో ఉంటాను. అలాగే క్లాసుల్లో రన్నింగ్ నోట్స్ మిస్ కాను. పరీక్షలకు అదే చదువుకుంటాను. అలాగే మార్కులు తెచ్చుకున్నాను’ అంటుందామె. కెమిస్ట్రీలో విశేషమైన అభిరుచి ఉన్న షెనాయ్ మొదట అధ్యాపక వృత్తిలో ఉంటూనే తన పరిశోధనను కొనసాగించి ఉత్తమ సైంటిస్ట్ అవ్వాలని నిశ్చయించుకుంది.చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్వేస్ట్ హీట్ను విద్యుత్గా...మంగళూరు శ్రీనివాస యూనివర్సిటీలో ప్రొఫెసర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా పని చేస్తున్న సంధ్యా షెనాయ్ థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్లో విశేషమైన పరిశోధన కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు ప్రచురించడం ద్వారా గుర్తింపు పొందింది. లండన్లోని ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ (ఆర్.ఎస్.సి.) ఆమెను లీడింగ్ ఫిమేల్ రీసెర్చర్గా గుర్తించింది. ఈ గుర్తింపు పొందడం అంత సులువు కాదు. పర్యావరణ రంగానికి చేటు చేస్తున్న వేస్ట్ హీట్ (కర్మాగారాలు, ఇతర యంత్ర పరికరాల వల్ల వెలువడే ఉష్ణం) వృథా అవడమే కాకుండా పర్యావరణానికి చేటు చేస్తుండటం వల్ల ఆ వేస్ట్ హీట్ను విద్యుత్తుగా ఎలా మార్చవచ్చో పరిశోధనలు చేస్తూ, వాటి ఫలితాలను ప్రతిపాదిస్తూ సంధ్యా షెనాయ్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్ల దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమెకు 2021లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2024లో ‘కెమిస్ట్రీ మెడల్’ లభించాయి.చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదికప్రపంచ సైంటిస్టుల జాబితాలో...ప్రపంచంలో అత్యుత్తమ సైంటిస్టుల 2 శాతం పట్టికను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏటా ప్రకటిస్తూ ఉంటుంది. ఆగస్టు 30 నాటికి ఆ సంవత్సరంలో వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించిన పరిశోధన పత్రాల ఆధారంగా, వాటికి అందిన ఆదరణను బేరీజు వేసుకుని సెప్టెంబర్లో ఈ జాబితాను విడుదల చేస్తారు. 2023 నుంచి సంధ్యా షెనాయ్ ఈ పట్టికలో నిలుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 19న విడుదల చేసిన 2025 జాబితాలో మూడవసారి కూడా సంధ్యా షెనాయ్కు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్త సైంటిస్టులకు సమఉజ్జీగా మన దేశం నుంచి ఒక మహిళా పరిశోధకురాలు ఈ స్థాయి గుర్తింపు ΄పొందుతుండటం మన సైన్సు రంగానికి గర్వకారణం. అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువతరం. -
యూఎస్లో బెస్ట్ బిజినెస్ స్కూల్స్ ఇవే..
వాషింగ్టన్: మార్కెట్లో ఎన్ని కోర్సులున్నా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)కు ఉన్న క్రేజ్ వేరే. కోర్సు సమయంలో ఇంటర్న్షిప్ అవకాశాలతో పాటు.. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించాలనుకునే వారు సాధారణంగానే ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే యూఎస్లోని టాప్ బిజినెస్ స్కూల్స్లో ఈ కోర్సు కాస్త వ్యయంతో కూడుకున్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ ఇటీవల ఫుల్ టైం ఎంబీఏ కోర్సును అందిస్తున్న అమెరికాలోని ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా-2016ను విడుదల చేసింది. ఈ జాబితాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొదటి స్థానంలో నిలువగా.. స్టాన్ఫోర్డ్ రెండో స్థానం దక్కించుకుంది. బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థుల అనుభవాలు, కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగాలు పొందుతున్న సరళి, ట్యూషన్ ఫీజులు, ఇంటర్న్షిప్ అవకాశాలు లాంటి విస్తృతమైన సమాచారంతో ఈ ర్యాంకులను రూపొందించినట్లు బ్లూమ్బర్గ్ బిజినెస్ వీక్ వెల్లడించింది. ఈ జాబితాలో టాప్ 20లో నిలిచిన యూఎస్లోని ఉత్తమ బిజినెస్ స్కూళ్లు ఇవే.. 1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 2. స్టాన్ఫోర్డ్ 3. డ్యూక్ 4. చికాగో(బూత్) 5. డర్ట్మోత్ 6. పెన్సిల్వేనియా(వార్టన్) 7. ఎమ్ఐటీ 8. రైస్(జోన్స్) 9. నార్త్ వెస్టర్న్ (కెల్లాగ్) 10. యూసీ బర్క్లీ(హాస్) 11. కొలంబియా 12. వర్జీనియా 13. మిచిగాన్(రాస్) 14. యేల్ 15. కార్నేగి మిలాన్(టెప్పర్) 16. కార్నెల్(జాన్సన్) 17. ఎన్వైయూ(స్టెర్న్) 18. టెక్సాస్(మేస్) 19. వాషింగ్టన్(ఫాస్టర్) 20. ఎమోరి(గొయ్జుటా) -
నిశ్చింతగా నారింజ తినవచ్చు...
నారింజపండు కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల పుల్ల తేన్పులతో కనిపించే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు ఈ పండు తినరు. కానీ స్టాన్ఫోర్డ్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ విషయానికి తగిన ఆధారాలు దొరకలేదు. కాబట్టి పులితేన్పులను ఈ పండు ఎక్కువ చేస్తుందనే అపోహ వీడి హాయిగా తినవచ్చు. ఇక నారింజలో పీచు కూడా ఎక్కువే. అయితే దీన్ని పండుగా తింటేనే పీచు మనకు లభ్యమవుతుంది. అయితే జ్యూస్ తీసినప్పుడు పీచును చాలావరకు కోల్పోయే అవకాశాం ఉంది. కాబట్టి దీన్ని పండుగా తినడమే మంచిది. అదీగాక మిగతా పండ్లలో ఉండే చక్కెర వేగంగా విడుదల అవుతుందేమోగాని... నారింజ పండు తిన్నవారిలో దీనివల్ల లభ్యమయ్యే చక్కెర చాలా మెల్లగా శరీరంలోకి విడుదల అవుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే చక్కెరవ్యాధి గ్రస్తులు సైతం నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. వాళ్లకూ ఇది సురక్షితమైన పండు అని చెప్పవచ్చు. -
ఐఐటీ మద్రాసే ఇండియా స్టాన్ ఫోర్ఢ్
దేశంలో అనేక విఙ్నాన పరిశోధనలకు ఇప్పుడు ఐఐటీ మద్రాస్ బాటలు వేస్తోంది. ఈ-కామర్స్, ఈ-మార్కెటింగ్ రంగాల్లో దిగ్గజాలను గమనించినట్లైతే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జొమాలో, క్వికర్, ఓలా లేదా హౌసింగ్ రంగాల్లోని దిగ్గజాలందరూ ఐఐటీ ఢిల్లీలోగానీ, లేదా ఐఐటీ ముంబైలో గానీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే స్టాన్ ఫోర్డ్ లాంటి యూనివర్శిటీలు వందల్లో ఇంజనీర్లను తయారుచేస్తున్నాయి. అయిదేళ్ల క్రితం వరకు టెక్నాలజీ, అకడమిక్ టీచింగ్ లో కొన్ని సంవత్సరాలపాటు వాటి హవా నడిచింది. అయితే ఇటీవల ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ ప్రొఫెసర్లు అశోక్ ఝుంఝుంవాలా, ఎంఎస్ అనంత్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే తరగతి గదుల్లో విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సఖ్యతను పెంపొందించడం. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి తెలియజేస్తూ....మా విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి పనిచేస్తే ఆర్ అండ్ డీ విభాగం తప్పకుండా అభివృద్ధి బాటలో నడుస్తుంది అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు.... ధ్వనితరంగాల నియంత్రణలో విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ కలిసిరావాలి. వర్టెక్స్ ఇంజనీరింగ్ లో ఏటీఎం టెక్నాలజీని ఉపయోగించి ధ్వని తరంగాలను నియంత్రించవచ్చు. ఈ ఎకో టెక్నాలజీని వర్టెక్స్ కంపెనీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రశంసిస్తూ....మా కంపెనీ ఏసీ అవసరం లేకుండా పనిచేసే ఏటీఎంలు, ఎంఎన్ ఆర్ ఈజీఏ లోని ఏటీఎంలకు ఉపయోగపడేలా వ్యాపారాత్మక సోలార్ సిస్టమ్ ను ఉత్పత్తి చేస్తోందన్నారు. యూనిక్ మోడల్... ఐఐటీ ముంబై భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఐఐటీ ముంబై డైరెక్టర్ రామమూర్తి మాట్లాడుతూ...క్రెడిట్ సిస్టమ్ ద్వారా వినియోగదారుల సహకారంతో రీసెర్చ్ పార్క్ ఒక్కటే సరైంది. ఏంజిల్ ప్రైమ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీపతి ఆచార్య మాట్లాడుతూ...రీసెర్చ్ పార్క్ లోని స్టార్టప్స్ను అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇతర కంపెనీలు కూడా ఈ మోడల్ ను అనుకరిస్తుండటమే ఐఐటీ ముంబై మోడల్ విజయవంతమైందనడానికి కారణంమని ఐఐటీ ముంబై డైరెక్టర్ దేవాంగ్ ఖతార్ తెలిపారు.


