breaking news
soubin shahir
-
'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్
ఈనెల 5-6 తేదీల్లో దుబాయి వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. దీనితి భారతీయ సినిమా ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ అందరూ హాజరు కాబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకకు ఆహ్వానం వచ్చినా సరే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్ వెళ్లలేకపోతున్నాడు. ఇతడు దుబాయి వెళ్లేందుకు ఎర్నాకులం కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరిగింది?మలయాళ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. రీసెంట్గానే 'కూలీ'తో దక్షిణాదిలోని మిగతా భాషా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు. గతేడాది ఇతడు లీడ్ రోల్ చేస్తూ 'మంజుమ్మల్ బాయ్స్' అనే చిత్రాన్ని నిర్మించాడు. మూవీ హిట్ అయినప్పటికీ పెట్టుబడిదారుడిని మోసం చేయడంతో ఇతడిపై చీటింగ్ కేసు నమోదైంది. జూలై నెలలో అరెస్ట్ కూడా అయ్యాడు. వెంటనే బెయిల్పై విడుదలైనప్పటికీ ఇంకా ఇబ్బందులు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)'మంజుమ్మల్ బాయ్స్' సినిమాకు సౌబిన్తో పాటు అతడి తండ్రి, మరొకరు నిర్మాతగా వ్యవహరించారు. అలానే సిరాజ్ అనే ఇన్వెస్టర్ కొంత పెట్టుబడి పెట్టారు. వచ్చిన లాభాల్లో 40 శాతం వాటా ఇస్తానని ముందే మాట్లాడుకున్నారట. ఈ లెక్క ప్రకారం రూ.40 కోట్ల వరకు ఇవ్వాలని, కానీ తనకు రూ.5.99 కోట్లు మాత్రమే ఇచ్చారని సిరాజ్.. కొన్నాళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సౌబిన్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వెంటనే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చారు.ఈ క్రమంలోనే ఇప్పుడు దుబాయి వెళ్లేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎర్నాకులం కోర్ట్ సౌబిన్కి అనుమతి నిరాకరించింది. దీంతో అతడు సైమా అవార్డ్స్ కోసం దుబాయి వెళ్లలేకపోతున్నాడు. (ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?) -
'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు
రీసెంట్గా వచ్చిన 'కూలీ' సినిమా.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వీకెండ్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో అందరికంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. యాక్టింగ్లో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. తనదైన నటనతో కట్టిపడేశాడు. అలా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇతడు.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొనేశాడు. ఇంతకీ దీని ధర ఎంతంటే?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసే తెలుగు ఆడియెన్స్కి సౌబిన్ చాలా ఏళ్లుగా పరిచయమే. అప్పుడెప్పుడో వచ్చిన 'ప్రేమమ్' నుంచి గతేడాది రిలీజైన 'మంజుమ్మల్ బాయ్స్' వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు 'కూలీ' సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సినిమాలో తన సక్సెస్ని ముందే అంచనా వేశాడో ఏమో గానీ ఈ మధ్యే బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొనుగోలు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.3.30 కోట్లు వరకు ఉంది. తన కుటుంబంతో కలిసి సౌబిన్.. కారులో షికారుకి వెళ్లాడు. ఆ విజువల్స్ వీడియోలో చూడొచ్చు. 'కూలీ'తో అటు తమిళం, ఇటు తెలుగు దర్శకుల దృష్టిలో సౌబిన్ పడ్డాడు. మరి రాబోయే రోజుల్లో తెలుగు మూవీస్లోనూ ఇతడికి అవకాశాలు రావడం గ్యారంటీలానే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Roadway Cars (@roadwaycars) -
'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?
కూలీ సినిమా (Coolie Movie)కు బాగా హైప్ తెచ్చిన సాంగ్ మోనికా. పూజా హెగ్డే (Pooja Hegde) వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవుతోంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అని అందరూ ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది. అయితే శివరాత్రిరోజే ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట! అందులోనూ ఆరోజు పూజాకు ఉపవాసం. అయినా సరే ఖాళీ కడుపుతోనే సెట్లోకి అడుగుపెట్టి ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసింది. తన కష్టానికి ప్రతిఫలంగా మోనికా సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.ఫస్ట్ ఆయన్నే అనుకున్నా..అయితే ఈ సాంగ్లో పూజాతోనే పోటీపడుతూ స్టెప్పులేశాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. తొలిసారి ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో సౌబిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ నోరెళ్లబెట్టారు. నిజానికి సౌబిన్ స్థానంలో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఉండాల్సిందట! ఈ విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా వెల్లడించాడు. ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్.. ఫహద్ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాసినట్లు తెలిపాడు. బిజీగా ఉండటంతో..తీరా ఫహద్ను సంప్రదించగా.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాడు. అందువల్లే సౌబిన్ను ఎంపిక చేశామని వెల్లడించాడు. లోకేశ్ డైరెక్ట్ చేసిన కూలీ మూవీలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించాడు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత