-
తండ్రీకొడుకుల నేపథ్యంలో...
నటుడు ధన్ రాజ్ దర్శకుడిగా మారారు. ఈ కొత్త చిత్రంలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్ రాజ్ నటించనున్నారు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై పొలవరపు పృథ్వి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుబ్బు కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు శివబాలాజీ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి ‘బలగం’ దర్శకుడు వేణు గౌరవ దర్శకత్వం వహించగా, తెలుగు స్క్రిప్ట్ను దర్శకుడు రాజేంద్ర, తమిళ స్క్రిప్ట్ను దర్శకుడు భరత్కమ్మ యూనిట్ సభ్యులకు అందించారు. ‘విమానం’ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ మూవీకి కథ–మాటలు అందిస్తున్నారు. ‘‘తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. నవంబరు 9 నుంచి రెగ్యులర్ షూటింగ్నుప్రారంభించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రంప్రారంభోత్సవంలో నటులు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్, భూపాల్, పృథ్వి, ‘రాకెట్’ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: దుర్గా ప్రసాద్. -
ఏంటి పవన్ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్లో..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రీమేక్ సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది) మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్ తేజ్కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్ చిత్రాల జాబితాలో పవన్కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్ తేజ్కి ఇది మొదటి రిమేక్ మూవీగా నిలవనుంది. కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాకి రీమేక్గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. పవన్ రీమెక్ సినిమాల లిస్ట్ ఇదే 'బ్రో' సినిమాకు ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్మార్, అన్నవరం, గబ్బర్సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్సాబ్, భీమ్లానాయక్ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్లు కావడం విశేషం. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్లో మెప్పించినా.. మరికొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్కు కామన్ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) -
విమానం: అన్నీ ఇచ్చేవాడిని దేవుడనరు, నాన్న అంటారు!
‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి’ అని తండ్రి అంటాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ వంటి సంభాషణలతో ‘విమానం’ టీజర్ విడుదలైంది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం జూన్ 9న విడుదల కానుంది. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి వీరయ్య పాత్రను సముద్ర ఖని, కొడుకు పాత్రను మాస్టర్ ధ్రువన్ చేశారు. విమానం ఎక్కాలని ఆశపడే కొడుక్కి బాగా చదువుకుంటే నువ్వే ఎక్కగలవని తండ్రి అంటాడు. ‘‘తండ్రీ–కొడుకు–విమానం చుట్టూ సాగే భాగోద్వేగాల ప్రయాణమే ఈ విమానం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ , ధన్రాజ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్ , కెమెరా: వివేక్ కాలేపు. -
Samuthirakani: దర్శకుడి కార్యాలయంలో అపరిచితురాలు
చెన్నై: మదురవాయిల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కార్యాలయంలోకి ఒక అపరిచితురాలు చొరబడి కారుపై ఆరేసిన రెయిన్కోట్లను దొంగలించింది. ఈ మేరకు కార్యాలయ మేనేజర్ కార్తీక్ శుక్రవారం సాయంత్రం స్థానిక మదురవాయిల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక మహిళ కార్యాలయంలోకి చొరబడి అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్కోట్లను తీసుకుని వాటిని ధరించి కారుపై కొంచెం సేపు పడుకుని వెళ్లిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: (Simbu-Sudha Kongara: కేజీఎఫ్ చిత్ర బ్యానర్లో శింబు) -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి చెల్లెలు
Sai Pallavi Sister Puja Kannan Debut In Kollywood As Heroine: హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోతో కాకుండా కేవలం నటనతోనే ఎంతోమంది అభిమానులకు దగ్గరైంది ఈ మలయాళీ బ్యూటీ. తాజాగా సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే పూజా తెరంగేట్రం గురించి పలు వార్తలు వచ్చినా తాజాగా వాటిని నిజం చేస్తూ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ను రివీల్ చేసింది. తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకత్వంలో చిత్తారాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా నటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రముఖ నటుడు సముద్రఖని సైతం ఉన్నారు. ఇక ఈ సినిమాను థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి అక్క సాయిపల్లవిలా పూజా కన్నన్ హీరోయిన్గా ఏ మేరకు మెప్పిస్తుందనే చూడాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement