-
ఇదంతా త్రివిక్రమ్ మాయ – అల్లు అర్జున్
‘ఇండస్ట్రీ హిట్ అని నిర్మాతలు చెప్పారు. ఇది నా విక్టరీ కాదు’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని చెప్పిన మొదటి వ్యక్తి చిరంజీవిగారు. ప్రతి హీరోకి ఏదో టైమ్లో ఒక రికార్డు సినిమా పడుతూ ఉంటుంది. మా నాన్న అరవింద్గారికి గీతా ఆర్ట్స్లో 10 ఆల్ టైమ్ సినిమాలు రికార్డ్ హిట్లు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త కాదు. నాన్నగారితో ఒక కొడుకుగా ఫస్ట్ టైమ్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం ఆనందంగా ఉంది. మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశారు. ఈ స్థాయికి తగ్గట్టు నేను ప్రయాణం చేయాలి అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేను బెస్ట్ చేయాలని చేశాను. దాన్ని జనం ఆదరించారు. ఇది గోల్డ్మైన్ అవుతుందని నేనూహించలేదు. సినిమా అనేది టీమ్ వర్క్. ఒకరి పేరే చెప్పాల్సి వస్తే అది డైరెక్టర్ త్రివిక్రమ్గారే. ఈ సినిమాపై నీ ఫీలింగ్ ఏంటి బన్నీ? అని మా నాన్న అడిగారు. ‘ఇదంతా త్రివిక్రమ్ మాయ డాడీ’ అన్నాను’’ అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘అంకెలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్కు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు, బన్నీకి అంకెల బదులు ఈ సినిమా ఎంతమంది చూశారనేదే ఎక్కువ ఆనందం ఇస్తుంది’’ అన్నారు. -
ఫారిన్ పోదాం రాములా!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘రాములో.. రాములా..’ సాంగ్ టీజర్ను మంగళవారం విడుదల చేశారు. పూర్తి పాటను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల ప్రథమార్ధంలో విదేశాల్లో చిత్రీకరణ జరిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. -
నిను చూసి ఆగగలనా!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల...వైకుంఠపురములో..’. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?’ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు. తమన్ సంగీతం అందించగా సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని అడిగినప్పుడు కొన్ని క్లాసికల్ పదాలు రాయాలనిపించింది. అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్కు థ్యాంక్స్. బన్నీ ఏ పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోగలడు. తమన్ మంచి సంగీతం అందించారు. శ్రీరామ్ బాగా పాడారు’’ అన్నారు. ‘‘బన్నీకి ఇప్పటివరకు 12 పాటలకు వర్క్ చేశాను. ఈ సారి కొత్తగా ఉండాలని ఈ పాటను రెడీ చేశాం. శాస్త్రిగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు’’ అన్నారు తమన్. జనవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్. -
ఇక ఆగేది లేదు
నాన్స్టాప్గా దూసుకెళ్లడానికి స్కెచ్ రెడీ చేశారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ ముగిసింది. ఫైట్ సీన్లు తీశారు. షూటింగ్స్కు కాస్త బ్రేక్ ఇచ్చి తన భార్య పిల్లలతో (భార్య స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా) కలిసి స్విట్జర్లాండ్ వెళ్లొచ్చారు అల్లు అర్జున్. ఇప్పుడు షూటింగ్ను షురూ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ఆరంభం కానుంది. ఇక పెద్దగా బ్రేక్ తీసుకోకుండా సినిమా పూర్తయ్యే వరకూ నాన్స్టాప్గా షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారట. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. -
అల్లు అర్జున్, త్రివిక్రమ్ల మూవీ ప్రారంభోత్సవం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
బాటిల్ విసిరిన ఆకతాయి.. సింగర్ రియాక్షన్ ఇదే!
పారిపోయిన సీఎం రమేష్
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
అమెరికాలో పెళ్లిళ్లు పెటాకులు !
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement