-
ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్ లవ్ స్టోరి’
త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్ హీరోగానూ ఆసక్తికర చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’హైదరాబాద్ లవ్ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్కు రెడీ అవుతోంది. జియా, రావు రమేష్, సూర్య, సనలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించారు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్లలు సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
కొత్త రకం...
‘‘సగటు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ మెచ్చే, అందర్నీ ఆలోచింపజేసే సినిమా తీయాలనేది నా లక్ష్యం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ రెడ్డి. రామ్శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్రెడ్డి సమర్పణలో శ్రీకాంత్రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ ఈ నెల 17న రిలీజవుతోంది. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సుదర్శన్ నా స్నేహితుడే. కాంటెంపరరీ ఇష్యూ స్ఫూర్తితో కథ రెడీ చేశాడు. కంటెంట్ పరంగా, కమర్షియల్గా డెప్త్ ఉన్న ఈ కథ విని ఆర్టిస్టులందరూ సింగిల్ సిట్టింగ్లో ఓకే చెప్పారు. కథ, కథనం హైలెట్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. అదే విధంగా కమర్షియల్ సినిమాల్లో ఇదో కొత్త రకం అనే టాక్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
ఈ సినిమాతో హిట్ గ్యారంటీ
– పూరి జగన్నాథ్ ‘‘నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్ శంకర్కు హిట్ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది. మహిత్ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. రామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రం నిర్మించారు. మహిత్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను పూరి జగన్నా«థ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో గోపీచంద్ విడుదల చేసి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కథ నచ్చడంతోనే శరత్ కుమార్ ఈ సినిమా చేశారు. మహిత్ పాటలు, రీ–రికార్డింగ్ హైలెట్. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్ను ‘నేనో రకం’ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘రామ్ శంకర్ కెరీర్లో ‘నేనో రకం’ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. మార్చి 17న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. రామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు’’ అన్నారు. -
ఏ రకం?
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తె రకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సమాజంలో ఉన్న ఒక సమస్య ఇతివృత్తమే ఈ చిత్రం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధానంగా చూపించనున్నాం. సాయిరామ్ శంకర్ లేకుంటే ఈ చిత్రం చేసేవాళ్లం కాదు. శరత్కుమార్ నెగటివ్ రోల్లో కనిపిస్తారు. ఈ సినిమా చూసిన రాధికగారు తమిళంలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిత్ మంచి పాటలిచ్చాడు. మే మొదటి వారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. హీరో సాయిరామ్ శంకర్, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తదితరులు మాట్లాడారు. -
అమ్మ అయిన రేష్మీమీనన్
ప్రతి స్త్రీ మాతృప్రేమను చవి చూసే తరుణం వ స్తుంది. నటి రేష్మీమీనన్ ప్రస్తుతం అలాంటి తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు. అదేంటి ఆమె తల్లి అవ్వడం ఏమిటీ? ఇటీవలేగా నటుడు బాబీ సింహాతో ప్రేమ కలాపాలు అంటూ ప్రచారం హోరెత్తింది అంటారా? నిజమే. అది రియల్ లైఫ్ కథ. ఇది రీల్లైఫ్ కహానీ. ఇంతకీ విషయం ఏమిటంటే రేష్మీమీనన్ భయమా ఇరుక్కు అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఆమె ఒక బిడ్డ కు తల్లిగా నటించడం విశేషం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వసంతం ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కోవైసరళ, నన్కడవుల్ రాజేంద్రన్, విజయ్ టీవీ.జగన్, లోల్లుసభ జీవా, భరణీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది వినోదం మేళవిం చిన వైవిధ్యభరిత థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పా రు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య ప్రేమను ఆవిష్కరించే చిత్రం భయమా ఇరుక్కు అని తెలిపారు. ఇందులో రేష్మీమీనన్ బిడ్డకు తల్లిగా నటించారని చెప్పారు. వీరిద్దరితోపాటు నాన్కడవుల్ రాజేంద్రన్ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ పయనించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందన్నారు. అదేవిధంగా కోవైసరళ స్వామీజీగా కీలక పాత్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు. చిత్రం తొలి ఘట్టం షూటింగ్ను కేరళలో పూర్తి చేసినట్లు, రెండో ఘట్టం షూటింగ్ను చెన్నైలో చిత్రీకరిస్తునట్లు వెల్లడించారు. ఇందులో ఒక ఇల్లు ముఖ్య భూమికగా ఉంటుందన్నారు. కేరళలో జనసంచారానికి దూరంగా ఉన్న ఒక ఇంటిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఎలాంటి రవాణా వసతులు లేని ఆ ఇంటిని చేరడానికి బోటులో మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
Advertisement