breaking news
quality treatment
-
ప్రజారోగ్య విప్లవం ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్ భారత్ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు. దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్ భారత్ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. నిధుల వ్యయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకుపైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టంచేశారు. ఆయుష్మాన్ భారత్ అమలుతో ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని వెల్లడించారు. అదేసమయంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు చేస్తున్న 63 శాతం నుంచి 39 శాతానికి తగ్గిపోయినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఆర్థిక భారం నుంచి లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. అనారోగ్యం పాలైతే ఆయుష్మాన్ భారత్ ఆదుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం 2018 సెపె్టంబర్ 23న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదలతోపాటు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య బీమాను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ప్రతిఏటా ఆ రు కోట్లకుపైగా కుటుంబాలు పేదరికంలోకి జారిపోకుండా లబ్ధి పొందుతున్నాయని కేంద్రం వెల్లడించింది. -
మార్పుతోనే నాణ్యమైన వైద్యం
ఘనంగా 37వ రాష్ట్ర స్థాయి దంత వైద్య సదస్సు కాకినాడ వైద్యం : వృత్తి ఒత్తిడిలో పడి వైద్యరంగంలో వస్తున్న మార్పులను గుర్తించకపోతే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించలేరని పలువురు వైద్య ప్రముఖులు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఇండియ¯ŒS డెంటల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ రాష్ట్ర స్థాయి దంత వైద్య సదస్సు రెండోరోజైన బుధవారం ఘనంగా జరిగాయి. దంత వైద్య శాస్త్రంలో వస్తున్న మార్పులు, ఆధునిక పరిజ్ఞానం, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు తదితర అంశాలను రీసోర్స్పర్సన్లు డా.అశోక్ లేలె, డా. రుబి¯ŒS రూబే వివరించారు. మూడు విభాగాలుగా సదస్సు జరిగింది. తొలుత జాతీయస్థాయి రీసోర్స్పర్సన్ల ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్రంలోని పలు డెంటల్ కళాశాలలకు చెందిన వైద్య విద్యార్థులు 350 ప్రతులను సెమినార్లో ప్రెజెంటేష¯ŒS చేశారు. సేవా దృక్పథంతో సేవలందించాలి నిరుపేదలకు సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని ముఖ్యఅతిథి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఆయన జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా డెంటల్ పరికరాల ట్రేడ్ఫేర్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ప్రారంభించారు. మరో విభాగంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ వైద్యవృత్తిలో అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రస్థాయి సెమినార్ను కాకినాడలో తొలిసారిగా నిర్వహించడంతో దీనిని నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.మహాలక్ష్మి, ఇండియ¯ŒS డెంటల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు డా. టీఎ¯ŒS తిలక్రాజ్, ఏపీ స్టేట్ అధ్యక్షుడు డా.వి.వరప్రసాద్, కార్యదర్శి డా.కె.అజయ్ బెనర్జీ, పలువురు కార్యనిర్వాహక సభ్యులు, సుమారు వెయ్యి మంది వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.