breaking news
Puri Rath Yatra
-
కాసేపట్లో పూరీ రథయాత్ర.. భారీగా తరలిన భక్తులు
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి.#WATCH | Odisha: Devotees gather in large numbers at Puri's Jagannath Temple for the annual Rath Yatra, which is set to begin today. pic.twitter.com/jOCJphlKVx— ANI (@ANI) June 27, 2025Every single day, at 214 feet high, a priest fearlessly climbs the Jagannath Temple in Puri without ropes or safety - to change the flag. pic.twitter.com/qgqgLgvmX9— urvi (@itsmiling_face) June 26, 2025సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.VIDEO | Odisha: Several foreign devotees gather to attend the Jagannath Rath Yatra in Puri. Here’s what one foreign devotee, Premdas, said: “We came from Vrindavan under the guidance of our Gurudev. We feel extremely happy to be in such a sacred place to have the darshan of… pic.twitter.com/8WwwyPIPzX— Press Trust of India (@PTI_News) June 27, 2025 -
పవిత్ర తులసి మాలలతో బుల్లి రథం
భువనేశ్వర్/పూరీ: పవిత్రమైన తులసి మాలలతో బుల్లి రథం రూపుదిద్దుకుంది. స్వామివారి భక్తులకు ఈ కళాఖండం అంకితం చేసినట్లు సృజనాత్మక కళాకారుడు బిశ్వజిత్ నాయక్ తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి 8 అంగుళాల ఎత్తు, 7 అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ రథంలో 551 తులసి మాలలు, 175 ఐస్క్రీం పుడకల్ని వినియోగించారు. రథయాత్రకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంరథయాత్రకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. రథాలు లాగడం మొదలుకొని యాత్ర పూర్తయ్యే వరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రథాలు లాగడంపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూరీ రిజర్వు పోలీసు గ్రౌండులో చేపట్టిన ఈ కార్యక్రమం రథయాత్రను తలపింపజేసింది. బలభద్రుని తాళ ధ్వజం, జగన్నాథుని నందిఘోష్, సుభద్ర దర్ప దళనంకు ప్రతీకగా మూడు జీపుల్ని మూడు రథాల మాదిరిగా వినియోగించారు. క్లియరెన్స్, కార్డన్ ఏర్పాటు దశల్లో అనుబంధ బలగాలకు మెలకువలను నేర్పించారు. అదనపు పోలీసు డైరెక్టరు జనరల్, జిల్లా న్యాయాధికారులు, సీనియర్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. -
Jagannath Rath Yatra నేడే జగన్నాథుని నేత్రోత్సవం
భువనేశ్వర్: అశేష భక్త జనం అభీష్టం నెరవేరే మధుర క్షణం చేరువైంది. నవనవలాడే యవ్వన రూపుతో ఆరాధ్య దైవం జగన్నాథుడు భక్తుల మధ్య ప్రత్యక్షం కానున్నాడు. మర్నాడు శ్రీ గుండిచా యాత్రకు బయల్దేరుతాడు. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి. గత 14 రోజులుగా తెరచాటున స్వామి భక్తులకు కానరాకుండా రహస్య ఉపచారాలతో సరికొత్త ఉత్సాహం పునరుద్ధరించుకోవడంతో శ్రీ క్షేత్రం హడావిడిగా ఉంది. చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతజ్యేష్ట పూర్ణిమ నాడు అష్టోత్తర కలశ జలాభిõÙకాన్ని స్నాన యాత్రగా జరుపుకున్న స్వామి తడిసి ముద్దయ్యాడు. దీంతో మూల విరాటుల సహజ రూపు చెదిరి పోయింది. జ్వర పీడతో వైద్య నియమాల ప్రకారం అనవసర మండపానికి తరలిపోయాడు. అది మొదలుకొని భక్తులకు నిత్య దర్శనం కొరవడింది. దైతపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజవైద్య వర్గం తైలాది వైద్య ఉపచారాలతో దేవుళ్ల ఆరోగ్యం కోలుకుంది. యథాతథంగా భక్తులకు నిత్య దర్శనం ప్రసాదించేందుకు భగవంతునికి మార్గం సుగమం అయింది. హింగుళ (ఎరుపు), హరితల (పసుపు), కస్తూరి, కేశర (కుంకుమ), కొయిత (మారేడు గుజ్జు) వంటి సహజ మూలికా వర్ణ ద్రవ్యాల మేళవింపుతో మూల విరాటుల ముఖాలకు క్రమ పద్ధతిలో రంగులు హద్ది యవ్వన రూపం తీర్చి దిద్దుతారు. జగన్నాథుని సంస్కృతిలో ఇదో గోప్య సేవ. కాగా, గురువారం భక్తులు ప్రవేశించేందుకు శ్రీ మందిరం తలుపులు తెరుచుకుంటాయి. గుడిలో బలభద్ర స్వామి, దేవీ సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.రథాలపై నీలచక్రాల అమరిక పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోక్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్, బసంత పండా, భరత్ భూషన్ మహంతి, రాజేంద్ర కుమార్ బెహరా, అశోక్ మహారాణా పాల్గొన్నారు. -
Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
Jagannath Yatra 2025 జగన్నాథ రథయాత్ర 2025 ఒడిశాలోని పూరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్రను ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారైనా చూసి తరించాలని భావించే ఆధ్యాత్మిక సందర్భం. దేశ, విదేశాల నుంచీ ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథ రథయాత్రను చూసి తరిస్తారు. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది.ఉత్సవ విగ్రహాలకు బదులుగా సాక్షాత్తు గర్భగుడిలో ఉండే విగ్రహమూర్తులేప్రత్యేకంగా తయారు చేసిన మూడురథాల్లో (జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్ర దేవి) యాత్ర ద్వారా ఒడిశాలోని పూరి వీధుల గుండా ఊరేగడం ఇక్కడి విశేషం. ఈ ఉత్సవంలో ఒవేలాది మంది భక్తులు లాగుతున్న మూడు భారీ చెక్క రథాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, గొప్ప రథయాత్ర. అందుకేబ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) జగన్నాథ రథయాత్ర చరిత్ర 5 వేల సంవత్సరాల నాటిదనీ, ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ రాజు ప్రస్తుత జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు రూపుదిద్దుకుందని చెబుతారు. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేయడం ఈ రథయాత్ర మరో ప్రత్యేకత. ఈ యాత్రలో రథం తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష రెండవ రోజు నుండి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర జూన్ 27 ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ముందు అనేక శుభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనాయి.. రథం నిర్మాణం నుండి స్నాన పూర్ణిమ వరకు, జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్రలను 108 కలశాలతో స్నానం చేస్తారు. దీని తరువాత, జూన్ 26న గుండిచ ఆలయం శుభ్రం చేయబడుతుంది. గుండిచ ఆలయం అనేది దేవుని అత్తగారిల్లు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన అత్త ఇంటికి వెళ్లి, ఆమరుసటి రోజు అంటే జూన్ 27న రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రోజున, భగవంతుడు శ్రీమందిర్ నుండి మూడు గొప్ప రథాలలో గుండిచ ఆలయానికి బయలుదేరుతాడు. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు కొనసాగిన తిరుగు ప్రయాణం, బహుద యాత్ర జూలై 5న సాగుతుంది. ఈ సందర్భంలో జగన్నాథుడు మళ్ళీ సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి శ్రీమందిర్కు బయలుదేరుతాడు.ప్రతి రథానికి ఒక ప్రాముఖ్యత ఉంది.నందిఘోష (జగన్నాథుని రథం)"విశ్వ ప్రభువు" అయిన జగన్నాథుడు మూడు రథాలలో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు. దాని పేరు సూచించినట్లుగా, అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది. మూడు రథాలు వరుసలో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడి వైపున ఉంచుతారు.తాళధ్వజ (బలభద్ర ప్రభువు రథం)జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు. "తలధ్వజ" అనే పేరు దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది. బలరాముడి రూపంగా పరిగణించబడే బలభద్రుడు ఈ రథంలో స్వారీ చేస్తాడు. అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడమ వైపున ఉంచుతారు.దర్పదలన (సుభద్రాదేవి రథం)అతి చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరించబడిన రథం జగన్నాథుడు మరియు బలభద్రుని సోదరి అయిన సుభద్ర దేవికి చెందినది. "దర్పదలన" అనే పేరుకు "గర్వాన్ని నాశనం చేసేది" అని అర్థం, దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో చూపిస్తుంది. పండుగ సమయంలో సుభద్ర దేవి రథాన్ని ఆమె సోదరుల రథాల మధ్య ఉంచుతారు. ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది . మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు.ప్రతి రథం కోసం దాదాపు 1,000 చెక్క ముక్కలను ఉపయోగిస్తారు. నిర్మాణానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. విశేషమేమిటంటే, ఈ భారీ నిర్మాణాలు ఎటువంటి లోహపు మేకులు లేదా ఫాస్టెనర్లు లేకుండా తయారు చేస్తారు. "మహారాణులు" అని పిలువబడే కళాకారుల తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. శ్రీ జగన్నాథునికి లేహ్య సేవఈ రథయాత్రకు సంబంధించిన రథాల తయారీ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే ఆ యాత్రంలోభాగంగా జన్నాథునికి లేహ్య సేవ ఘనంగా నిర్వహించారు. స్నాన పూర్ణిమనాడు భారీ స్నానం చేసిన తర్వాత శ్రీ జగన్నాథుడు, అతని తోబుట్టువులు అస్వస్థతకు గురయ్యారు. వారు త్వరగా కోలుకోవడానికి ఆలయ రాజ ఆయుర్వేద వైద్యుల మార్గదర్శకత్వంలో వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నారు. దేవతలు ప్రస్తుతం అనవసర మండపంపై కొలువు దీరి గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సేవల్లో ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలు, మూలికా ఔషధాలు వాడతారు. ఈ సమయంలో స్థానిక మూలికలు మరియు వేర్లతో తయారు చేసిన ఔషధాలు, పండ్ల రసాలు మూల విరాట్లకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ వారం ఒస్సా లగ్గి (తైల పూత) ఉపచారంతో సేవలు అందించారు. సుధ సువారో సేవక వర్గం తయారు చేసిన ఒస్సా అనే ప్రత్యేక వైద్యాన్ని దేవతలకు అందజేశారు. మంగళ వారం అపరాహ్న ధూపం తర్వాత దేవతలకు ఒస్సా లగ్గి నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. దైతపతి సేవకులు రాత్రి పూట ఈ చికిత్స నిర్వహించారు. -
పూరీలో మాత్రమే జగన్నాథ రథయాత్ర
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రను ఒడిశాలోని పూరీలో మినహా రాష్ట్రాంలోని మిగిలిన ప్రాంతాల్లో చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కరోనా విజృంభణతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో అనుమతులివ్వలేమని తెలిపింది. పూరీ మినహా ఇతరప్రాంతాల్లో రథయాత్రలను అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ‘నాకూ జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనమేమీ నిపుణులం కాము. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఛాన్సు తీసుకోలేము. కావాలంటే యాత్రను టీవీలో చూడొచ్చు. వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాం’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈనెల 12న పూరీ సహా పలు ప్రాంతాల్లో వార్షిక రథయాత్ర జరగాల్సి ఉంది. -
కనులపండువగా పూరీ రథయాత్రకు అంకురార్పణ
భువనేశ్వర్/పూరీ: శ్రీక్షేత్రంలో భంవురి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు. జగన్నాథుని రథయాత్ర ఘట్టాలను నిర్ణీత కాలంలో ఓ క్రమపద్ధతిలో ముగించడం ఆనవాయితీ కాగా, శ్రీమందిరం రత్నసింహాసనంపై కొలువైన మూలవిరాట్లకు తొలుత పూజలు చేసి, ఆజ్ఞామాలలు సమర్పించారు. అనంతరం 3 రథాలకు వేర్వేరుగా తయారు చేసిన ఆజ్ఞామాలలను రథ నిర్మాణ ప్రాంగణానికి తీసుకువచ్చిన ప్రధానార్చకుల వర్గం ఇరుసు, చక్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఇరుసుకు ఇరువైపులా రెండు చక్రాల చొప్పున అమర్చారు. ఈ ప్రక్రియనే భంవురి ఉత్సవంగా పేర్కొంటారు. దీనినే రథయాత్రలో ప్రధాన భాగంగా కూడా భావిస్తారు. స్థానికంగా అయితే దీనిని చొక్కా డేరా నీతిగా వ్యవహరిచంగా, ఏటా దీనిని కనులపండువగా నిర్వహిస్తుండడం విశేషం. కరోనా విజృంభణ వేళ కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ శ్రీమందిరం ఆచార వ్యవహారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉత్సవ ఆద్యంతాలు విజయవంతంగా సాగడం గమనార్హం. -
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
-
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైన యాత్రకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'రథయాత్ర' లో వైద్యులకు నో లీవ్
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో జూలై 1 నుంచి ఆగస్టు వరకు జరగనున్న పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని 280 మంది వైద్యులు, 650 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందించనున్నట్టు ఒడిషా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నబకాలేబర్ గా పిలిచే ఈ పవిత్ర ఉత్సవంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథ ఆలయం వద్ద స్వామి వారి తోబుట్టువుల పాత ప్రతిమలను మార్చి వాటి స్థానంలో కొత్త దేవతల ప్రతిమలు ప్రతిష్ఠించి ఈ ఉత్సవాలు చేసుకుంటారు. ఈ ప్రతిమల ఊరేగింపు కార్యక్రమం జూలై 18న జరగనుంది. రథయాత్ర ఊరేగింపులో భక్తులకు సౌకర్యార్థం అత్యవసర చికిత్స అందుబాటులో ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యులకు, పారామెడికల్ వైద్యసిబ్బందికి సూచనలు చేసింది. ఎవరైనా దీనికి రాలేమని చెబితే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అత్ను సబ్యాషి నాయక్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో ఒడిషా ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించనుంది. ఈ యాత్ర సమయంలో వైద్యులకు సెలవులు మంజూరు చేయబోమంటూ తేల్చిచేప్పేసింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప వైద్యులకు సెలవులు మంజూరు చేస్తామని, దానికి కూడా వైద్య కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. రథ యాత్ర జరిగే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకూ వైద్యల కొరత లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వైద్యులను కూడా రప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రథయాత్రకు 50 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు ఒడిషా ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
పూరీజగన్నాధుని రథయాత్ర