-
కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ
ద్వారక: కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీగా మిగిలిపోయిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. అసలు దేశంలో బీజేపీ మినహా జాతీయ పార్టీలేవీ లేవన్నారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్లో ద్వారక నుంచి పోరుబందర్ దాకా బీజేపీ రెండో విడత గుజరాత్ గౌరవ్యాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘దేశం పేరిట కేవలం ఓ వంశాన్ని ప్రమోట్ చేయడం, ఓ కుటుంబానికి సేవ చేయడమే కాంగ్రెస్ నేతల ఏకసూత్ర కార్యక్రమంగా మారింది. ఇక టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, అకాలీదళ్, జేఎంఎం, పీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. నమ్మిన సిద్ధాంతానికి నిలువెల్లా కట్టుబడ్డ ఏకైక జాతీయ పార్టీ దేశంలో బీజేపీ మాత్రమే’’ అని ఈ సందర్భంగా అన్నారు. షా ఓ జూనియర్: నితీశ్ పట్నా: కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వారి విమర్శలను పట్టించుకోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షానుద్దేశిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. సామాజిక ఉద్యమ నేత జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలు ఆచరిస్తానని చెప్పుకునే నితీశ్.. అధికారం కోసం కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నారంటూ అమిత్ చేసిన ఆరోపణలపై బుధవారం ఆయన ఈ మేరకు స్పందించారు. -
బీజేపీ చీఫ్గా మళ్లీ నడ్డాకే అవకాశం?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మరో విడత 2024 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొనసాగింపు ద్వారా రానున్న రోజుల్లో వరుసగా జరగనున్న కీలక అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి సంస్థాగతంగా మేలు కలుగుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నడ్డా మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. బీజేపీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డ్ ఆయన పదవీ కాలం మరో విడత పొడిగిస్తూ ఈలోగానే ఒక తీర్మానం ఆమోదిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ రాష్ట్ర విభాగాల్లో సంస్థాగత ఎన్నికలు ఇంకా ప్రారంభం కానప్పటికీ, చీఫ్గా నడ్డా కొనసాగుతారని తెలిపాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్రాల్లోనైనా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. నడ్డాకు ముందు పార్టీ చీఫ్గా ఉన్న అమిత్ షాకు కూడా ఇదే విధమైన కొనసాగింపునిచ్చారు. అప్పట్లో ఎన్నికలు ముగిసిన వెంటనే సంస్థాగత ఎన్నికలు జరిగాయి. అమిత్ షా కేంద్ర కేబినెట్లో జాయిన్ కావడంతో జేపీ నడ్డా బీజేపీ చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీకి విశ్వాస పాత్రుడిగా, ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో సత్సంబంధాలున్న వ్యక్తిగా నడ్డాకు పేరుంది. పార్టీని విస్తరించి వ్యూహాలను అమలు చేయగల నేతగా నడ్డా పేరు తెచ్చుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, బిహార్లో పార్టీ మంచి ఫలితాలను రాబట్టడం వంటివి నడ్డా హయాంలో బీజేపీ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటికీ తెలంగాణలో పార్టీ బలం గణనీయంగా పెరగడం వెనుక నడ్డా కృషి ఉందంటున్నారు. -
నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఆదివారం కొద్దిసేపు అయింది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్కు సాయం చేయాలంటూ ఒక పోస్ట్, రష్యాకు సాయం చేయాలంటూ మరో పోస్టు ఆయన అకౌంట్లో ప్రత్యక్షమయ్యాయి. విరాళాలను క్రిప్టో కరెన్సీ రూపంలోనూ స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పీటీఐతో మాట్లాడుతూ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందన్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ యథావిధిగా నడుస్తోందని, హ్యాకింగ్పై ట్విట్టర్ బాధ్యులతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
మరికొంతకాలం అమిత్ షాయే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరు నెలలపాటు అధ్యక్ష బాధ్యతలను కొనసాగించనున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తాత్కాలిక చీఫ్ను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు అమిత్షా గురువారం వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులతో భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, 18న ఆఫీస్ బేరర్లు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. రోడ్మ్యాప్పై కమిటీ గురువారం నాటి సమావేశంలో అమిత్షా.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమైందని కొనియాడారు. బెంగాల్, ఏపీ, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తెలంగాణ, ఒడిశాలలో మంచి ఫలితాలను సాధించిందన్నారు. సంస్థాగత ఎన్నికలతోపాటు ఇతర ప్రధాన అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు బీజేపీ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్, నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
‘కమలా’ధీశుడు ఎవరో..?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఎవరు నియమితులవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉంటూనే అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవిలో ఉండాలనేది బీజేపీ సంప్రదాయం. కాబట్టి షా పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. బీజేపీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా స్థానాన్ని మరొకరు భర్తీ చేసి, ఆయనలా పనిచేయాలంటే చాలా కష్టమైన పనే. అయితే కొత్త చీఫ్గా కాస్త తక్కువ వయసు ఉన్న అలాగే పార్టీ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి నియమితులు కావొచ్చనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజస్తాన్ వ్యక్తి భూపేంద్ర యాదవ్, అలాగే కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్ ప్రదేశ్కు చెందిన జేపీ నడ్డాల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడైన నడ్డాను మోదీ ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. గత ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. అలాగే పార్టీ అగ్రనాయకులు, ఆరెస్సెస్ ఆశీస్సులు నడ్డాకు బాగా ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైనందున, తగినంత అనుభవం కూడా నడ్డాకు ఉంది. మరోవైపు పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో అమిత్ షాకు భూపేంద్ర యాదవ్ ఎంతో సాయం చేస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమిత్ షా కూడా భూపేంద్ర యాదవ్ను బాగా నమ్ముతారు. గతేడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్ గుజరాత్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్ పేరు కూడా కొత్త చీఫ్ రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుసగా మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. -
రైతుల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టండి
సాక్షి, అమరావతి : రైతులకు గిట్టుబాటు ధరతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రైతు సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కోరారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ శనివారం నిర్వహంచిన రైతు మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్షా తాడేపల్లిగూడెంలో హార్టికల్చర్ యూనివర్శిటీ గెస్ట్హౌస్లో పలు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించేందకు కనీసం వారం, పది రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలంటూ భారతీయ కిసా¯ŒS సంఘం ప్రతినిధులు అమిత్షాకు వినతిపత్రం అందజేశారు. క్వింటా ధాన్యం పండించడానికి రైతుకు రూ.2 వేలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రూ.1,500 మించి గిట్టుబాటు ధర కల్పించడం లేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు లాభదాయకత ఎలా సా««దl్యమో ఆలోచించాలని సంఘ ప్రతినిధులు ఆయనకు వివరించారు. దీనికి స్పందించిన అమిత్షా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రిఫైన్డు పామ్ ఆయిల్ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాన్ని 30 శాతం పెంచి, దేశీయ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ పామ్ రైతులు కోరారు. కొబ్బరి పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పన, ప్రకృతి వ్యవసాయం పోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్లో అదనపు నిధుల కేటాయింపు అంశాలపై ఆయా రైతు సంఘాల ప్రతినిధులు వినతి ప్రతాలు ఇచ్చారు. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడతానని అమిత్షా హామీ ఇచ్చారు. భారతీయ కిసా¯ŒS సంఘం జాతీయ కార్యదర్శి కుమార్స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు వివిధ రైతు సంఘాల ప్రతిని«ధులు అమిత్షాను కలిసిన వారిలో ఉన్నారు. ప్రత్యామ్నాయం చూపాకే నిర్వాసితులను ఖాళీ చేయించాలి రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షాను పోలవరం నిర్వాసితుల ప్రతినిధుల బృందం కలిసింది. తమకూ పెరిగిన రేట్ల ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చింది. ఇటీవల కాలువ నిర్మాణంలో భూములు పోయిన వారికి ఎకరాకు రూ.15 లక్షల వరకు పరిహారం అందజేశారని, తమకు గతంలో ఎకరాకు రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షల పరిహారం అందిందని గుర్తు చేశారు. తమకూ ఆర్ఆర్ ప్యాకేజీని అందజేయాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు చూపిన తర్వాతే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల తరుపున పోరాడుతున్న వనవాసి కల్యాణ ఆశ్రమం జాతీయ కన్వీనర్ గిరీష్ కుజార్, రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయశాస్రి నాయకత్వంలో 20 మంది నిర్వాసితులు అమిత్షాను కలిశారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
ఎన్నికల బహిష్కరణపై విచారణ
నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి
గ్రామాన్ని అభివృద్ధి చేయకుంటే ఓటెయ్యం
మాతోనే రామాలయ అభివృద్ధి
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
విస్తృత తనిఖీలు చేపట్టాలి
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement