-
కృష్ణదేవరాయలు తొందరపడ్డారా?
రాజకీయాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు ఎక్కువ సందర్భాలలో అనుకూలంగా ఉంటాయి. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కానీ ఆయనకు విబేధాలు ఏమీ లేవు. ఆయనకు పార్టీలో తగు గౌరవం లభించింది. ఎమ్మెల్యేల నుంచి సహకారం పొందగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కాకపోతే ఈసారి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందని కృష్ణదేవరాయలకు పార్టీ అధిష్టానం సూచించింది. దానికి కారణం ఈయన అభ్యర్ధిత్వం అక్కడ ఉపయోగపడుతుందనే కదా! కానీ రాయలకు ఇష్టం లేదు. నరసరావుపేట నుంచే పోటీచేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. అంతవరకు తప్పు లేదు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకత్వంతో చర్చించవచ్చు. సీఎం జగన్ను కలిసి తన వాదన వినిపించవచ్చు. అలా కాకుండా కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియవలసి ఉంది. కానీ, ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అంత సమర్ధనీయంగా లేవు. నరసరావుపేటలో బీసీ అభ్యర్ధిని పోటీలో దించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోందని, దాంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన చెప్పారు. అంటే కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, దానికే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఆయన గందరగోళంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. పార్టీ నాయకత్వంపైన, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన ఎలాంటి విమర్శలు చేయకపోవడం కొంతలో కొంత బెటర్. నిజానికి పార్టీకి కట్టుబడి ఉండటం అన్నది ఒక విధానం. విద్యాధికుడై, పలు విద్యా సంస్ధలను నిర్వహించే కృష్ణదేవరాయలు అందుకు భిన్నంగా కేవలం ఒక పదవిని ఆశించి ఇలా వ్యవహరించడం ఆయనకు అంత ప్రతిష్టకాదని చెప్పక తప్పదు. ఆయన తండ్రి లావు రత్తయ్య 1996లో ఎన్.టీ.ఆర్.టీడీపీ తరపున బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలో రానించలేకపోయారు. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా మంచిపేరు తెచ్చుకున్నా, రాజకీయాలలో ఆయనకు ఉన్న ఆసక్తిని నెరవేర్చుకోలేకపోయారు. కానీ, వైఎస్సార్సీపీను స్థాపించిన సీఎం జగన్.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చి నరసరావుపేట నుంచి పోటీకిగాను టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. అంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు సడన్గా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం మాత్రం తొందరపాటే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళతారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అయినా రాయలు వంటి విద్యాధికులు అలా చేస్తారా అని అనుకునేవారు. ఒక వేళ ఆయన నిజంగానే అలా టీడీపీలోకి వెళితే రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తులలో ఈయన కూడా ఒకరు అవుతారు. విశేషం ఏమిటంటే వైఎస్సార్సీపీ నుంచి అయితే నరసరావుపేట టిక్కెట్ కావాలట. టీడీపీ అయితే గుంటూరు నుంచి పోటీకి దిగుతారట. ఇది వాస్తవమో, కాదో తెలియదు. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారేమోనన్న అనుమానం వస్తుంది. కృష్ణదేవరాయలు ఇలా ఓపెన్ అయిపోవడంతో బహుశా రాజీ చర్చలు కూడా ఏమీ ముందుకు వెళ్లకపోవచ్చు. నరసరావుపేట సీటును వైఎస్సార్సీపీ ఒక బీసీ అభ్యర్ధికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఎంపీ బాలశౌరిది మరో కధ. ఈయనకు పార్టీలో ఎనలేని గుర్తింపు ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఒకసారి తెనాలి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆధ్వర్యంలో మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. అయినా ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో కొత్త అభ్యర్దికి అవకాశం ఇస్తారన్న భావన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. దాంతో ఆయనకు అసంతృప్తి ఏర్పడినట్లు ఉంది. సామాజికవర్గం రీత్యా జనసేనకు వెళితే బెటర్ అని ఆయన అనుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ను కలిశారు. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఆయనకు జనసేట టిక్కెట్ వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు. అయినా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గమనిస్తే పాలిటిక్స్లో విధేయతకు తక్కువ అవకాశం ఉంటుందని రుజువు చేసినట్లయింది. పార్టీలో కొంతమందితో విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయినా పార్టీ నాయకత్వంతో సంబంధాలు బాగానే ఉన్నప్పుడు ఇలా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే వారికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బాలశౌరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్సీపీలోకి రాలేదా అన్న ప్రశ్న రావచ్చు. టీడీపీలో నాని అవమానాలకు గురవడం వల్ల పార్టీ మారక తప్పలేదు. సొంత తమ్ముడితోనే నానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం కుంపటి పెట్టించింది. తిరువూరులో జరిగిన పార్టీ సభ ఏర్పాట్లకు రావద్దని ఎంపీగా ఉన్న నానికి చెప్పడం అంటే ఒకరకంగా అవమానించడమే. ఆ నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక, లావు కృష్ణదేవరాయలకు కానీ, బాలశౌరికి కానీ పార్టీలో అలాంటి అవమానాలేమీ లేవు. పైగా వారికి మంచి గౌరవమే లభించింది. అయినా టిక్కెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే రాజకీయాలలో వీరు విలువలు పాటించలేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ వీటిని ఏమీ పట్టించుకోకుండా, కేవలం జనాన్ని నమ్ముకుని రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దులు ఎవరన్నదానికి కొంతమేరకే ప్రాముఖ్యత ఉంటుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. కాబట్టి సీఎం జగన్కు ఎవరూ ఎదురు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేనల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు టిక్కెట్ల కేటాయింపు ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పద్దతి ప్రకారం అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకత అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తు చేశారు. -
ఆర్థిక లోటులో ఉంటే వాటా అడుగుతారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం రూ.16 వేల కోట్ల ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీలో రైల్వే పనుల నిమిత్తం రూ.9 వేల కోట్లు కేటాయించారని సంతోషించాలో బాధపడాలో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర విభజనకన్నా ముందుగానే కోటిపల్లి–నరసాపురం, గూడూరు–దుగరాజపట్నం, నడికుడి–శ్రీకాళహస్తి ఖమ్మం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, తుముకూరు–రాయగఢ, మరికుప్పం–కుప్పం రైల్వే లైన్లు అనుమతించారని వాటిలో చాలావరకు పురోగతిలో లేవని వివరించారు. లోక్సభలో మంగళవారం రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పాటైందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన సౌత్కోస్ట్ రైల్వేజోన్కు నిధులు కేటాయించి కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. గుంటూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు కేటాయించిన రూ.80 కోట్లు ఇతర డివిజన్లకు మళ్లించారన్నారు. ఇలా ఎందుకు మళ్లించారో తేల్చాల్సి ఉందన్నారు. మిర్చి, పొగాకు, పత్తి తదితరాలు ఎగుమతి అయ్యే గుంటూరు రైల్వేస్టేషన్లో సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు స్టేషన్కు తిరిగి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కరోనా పేరుతో నడికుడిలో పలు రైళ్లను ఆపడం లేదని అడిగితే ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్రంలో రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తూరులో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్కు కేటాయించిన భూముల్లో కంటైనర్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఐఆర్సీటీసీ ప్యాకేజీలు లేవన్నారు. ఏపీలో తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, కనకదుర్గ ఆలయం, శ్రీకాళహస్తి, లేపాక్షి, కాణిపాకం ఆలయాలకు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పర్యాటక ప్యాకేజీ రూపాందించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలన్నారు. ఈస్ట్కోస్ట్ రైల్వేజోన్లో ఖాళీలు భర్తీచేయాలని, నూతన సౌత్కోస్ట్ రైల్వేజోన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీల నిమిత్తం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. సౌత్కోస్ట్ జోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని, వాల్తేరు డివిజన్ను దీన్లోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం రాష్ట్రం సూచనలు పరిగణించి అమలు చేయాలని ఆమె కోరారు. ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ కరోనా సమయంలో రద్దుచేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలాస–విశాఖ, విశాఖ–విజయవాడ, విశాఖ–రాజమండ్రి, విశాఖ–కాకినాడ ప్యాసింజర్ల రద్దువల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరారు. తద్వారా ఏపీ, తెలంగాణల్లో ఆర్థిక పురోగతి ఉంటుందన్నారు. నెల్లిమర్ల, గరివిడి, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్ వంటి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 23 బౌద్ధ స్మారకాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఓడీవోఎఫ్పీలో పలు ఉత్పత్తుల గుర్తింపు ఒక జిల్లా దృష్టి సారించిన ఒక ఉత్పత్తి (ఓడీవోఎఫ్పీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 10 ఉత్పత్తులు గుర్తించినట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా ఆర్థిక, సాంకేతిక, వ్యాపార సహకారం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు జవాబుగా తెలిపారు. -
ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. చెక్డ్యాంల బలోపేతానికి రెండేళ్లుగా నిధులివ్వలేదు ఆంధ్రపద్రేశ్లో చెక్డ్యాంల బలోపేతానికి వాటర్ బాడీస్ రిపేర్ రెన్నోవేషన్, రీస్టోరేషన్ నిమిత్తం 2019–20, 2020–21ల్లో నిధులు విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాశ్రెడ్డి, వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. హస్తకళల ప్రోత్సాహానికే హున్నార్హాట్లు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హస్తకళలను ప్రోత్సహించడానికే హున్నార్హాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో హాట్లు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ హస్తకళల పోటీపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు రెడ్డెప్ప, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్, సంజీవ్కుమార్, ఎం.వి.వి.సత్యనారాయణ, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఆర్ఐపీలో 31 ప్రాజెక్టులు డ్యాం రిహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డీఆర్ఐపీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 31 ప్రాజెక్టులకుగాను రూ.667 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పి.వి.మిథున్రెడ్డి, ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. గ్రామ్ ఉజాలలో మూడు జిల్లాలు గ్రామ్ఉజాల ప్రోగ్రామ్లో ఏపీలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. తొలిదశలో గుర్తించిన జిల్లాల్లో లబ్ధిదారుల అవగాహనకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీసీఎస్ఎల్) చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనే అప్పర్భద్ర కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన జలాల్లో భాగంగానే తెలంగాణలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు ఉందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర అంశం సమసినట్లేనని భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
సంక్షేమానికి కోతలు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: పరిమితికి మించి టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ప్రస్తుతం నికర రుణపరిమితిలో ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు రాయితీలు తగ్గించడం సబబు కాదన్నారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్, ఎంపీ నందిగం సురేశ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్తో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని చెప్పారు. ఎరువులు, ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య రంగంలో సబ్సిడీలను తగ్గిస్తే ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. మూలధన వ్యయం పెరిగిందని కేంద్రం చెబుతోందని, ప్రభుత్వ రంగ సంస్థల రుణాల చెల్లింపులు పోగా గతేడాదితో పోలిస్తే మూడు శాతం మాత్రమే పెంచారని తెలిపారు. రూ.7.5 లక్షల కోట్లకు పెంచినట్లు కేంద్రం ప్రకటించినందున ఏపీకి సాయం చేయాలని కోరారు. ఆ నిధులు సమకూరిస్తే విభజన హామీలన్నీ నెరవేరతాయన్నారు. జీఎస్టీ, పెట్రోలు, డీజిలు సెస్సులు బట్టి చూస్తే రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకుపైనే వడ్డీ రుణాలు అందించవచ్చన్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు విషయంలోనూ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలను చూసైనా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు. చదవండి: AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ బఫూన్ అని అభివర్ణించారు. మాట తీరు, వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే విపక్ష నేత చంద్రబాబు సహించలేకపోతున్నారని ఎంపీ నందిగం సురేశ్ విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement