-
Karnataka: అసెంబ్లీ స్పీకర్గా ఖాదర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా మలయాళీ కాంగ్రెస్ నేత యూటీ ఖాదర్ సోమవారం నామినేట్ అయ్యారు. ఆయన మంగళవారం ఉదయం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్లు అధినేత ఖాదర్కు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఖాదర్ విధాన సభ ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఖాదర్ నేపథ్యం.. ఆయన కేరళలోని కాసర్గోడ్లోని ఉప్పల ప్రాంతానికి చెందినవాడు. మూలాలు కాసర్గోడ్లో ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది అంతా మంగళూరులోనే. ఖాదర్ గత కర్ణాటక అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాదర్ దాదాపు 22, 790 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుంపలాపై విజయం సాధించారు. అంతేగాదు అంతకమునుపు సిద్ధరామయ్య ప్రభుత్వం హయాంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఆరోగ్యం, ఆహారం పౌర సరఫరాల మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఖాదర్ను స్పీకర్గా ప్రతిపాదించడం బట్టి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంఘాల నాయకులకు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ముఖ్యమైన స్థానాల్లో తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. (చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్ఫ్రెండ్పై కేసు పెట్టిన మహిళ) -
మంత్రి ఖాదర్కు షాక్ ఇచ్చిన అధిక ధరలు
బొమ్మనహళ్లి( బెల్గాం): స్వయానా రాష్ట్ర మంత్రికి అధిక ధరలు షాక్ ఇచ్చాయి. శీతాలకాల సమావేశాలు జరుగుతున్న బెల్గాం కన్నడ సౌధలోని ఫుడ్కోర్టులో బిస్కెట్ కోసం వెళ్లిన రాష్ట్ర ఆహర, పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టి. ఖాదర్ అక్కడి ధరలను పరిశీలించి ఖంగుతిన్నాడు. ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తుండటంపై మండిపడ్డారు. వెంటనే సదరు ఫుడ్కోర్టుపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
తాడిపత్రి టౌన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. తాడిపత్రిలోని సీబీ రోడ్డులో లారీ ఢీకొని కావేటిసముద్రం గ్రామానికి చెందిన సోమశేఖర్రెడ్డి(45) అనే వ్యాపారి మృతిచచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన బతుకుదెరువు కోసం స్వగ్రామం వదిలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్నారు. నాటి మధ్యామ్నం వ్యాపార నిమిత్తం బైక్లో బయలుదేరగా ఎదురొచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. కొడికొండ చెక్పోస్టు సమీపంలో మరొకరు.. చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జువారి సీడ్స్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన ప్రమాదంలో టాటా ఏస్ ఆటో డ్రైవర్ ఖాదర్(45) మరణించినట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. మాంసం వ్యర్థాల లోడుతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో జువారి సీడ్స్ వద్దకు రాగానే చెడిపోయిందన్నారు. దీంతో ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని నిలబెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఖాళీ సిలిండర్లతో బెంగళూరు వైపునకు బయలుదేరి వచ్చిన ఈచర్ వాహనం వెనుక వైపు నుంచి ఆటోను ఢీకొనడంతో ఖాదర్ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతన్ని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
హిందూపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుడు షేక్ ఖాదర్ బాషా గుండెపోటుకు గురై మృతిచెందాడు. అగ్రిగోల్డ్లో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేవో అనే మనస్థాపంతో గత రెండు రోజులుగా ఖాదర్ బాధపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం ఖాదర్ గుండెపోటుకు గురై మృతిచెందాడు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం... ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర నిరాశే మిగిలింది. జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందడం వల్లే గుండెపోటుతో ఖాదర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. -
నకిలీనోట్ల కేసులో నాలుగేళ్ల జైలు
మదనపల్లి రూరల్ (చిత్తూరు): నకిలీ నోట్ల చెలమాణీ కేసులో ఇద్దరు వ్యక్తులకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మదనపల్లికి చెందిన విశ్వనాథ్, ఖాదర్లు నకలీ నోట్ల చెలామణీ కేసులో ఇటీవల అరెస్టు అయ్యారు. వీరిని దోషులుగా నిర్ధరించిన కోర్టు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement