-
నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్. అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. -
‘బంగార్రాజు’ మూవీ డైరెక్టర్కు తమిళ నిర్మాత భారీ ఆఫర్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘బంగార్రాజు’ మూవీతో భారీ హిట్ కొట్టాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడంతో ‘బంగార్రాజు’ పక్కా పండగ సినిమా అనిపించింది. చదవండి: ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా అందుకే సంక్రాంతి సెలబ్రెషన్స్ను రెట్టింపు చేసుకునేందుకు ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత నాగార్జున ఈ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ సి కల్యాణ్ కృష్ణ నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికగా మారింది. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్పై అప్డేట్ బయటకు వచ్చంది. చదవండి: నా బెస్ట్ ఆన్స్క్రీన్ పెయిర్ సమంతనే: నాగ చైతన్య ఆయన నెక్ట్ సినిమా తమిళ అగ్ర నిర్మాతతో ఉండనుందని ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాతో కల్యాణ్ కృష్ణ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎవరు? ఎప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవుతుంది? అనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఎక్కువగా హీరో సూర్య, కార్తిలతోనే తీశాడు. దీంతో ఈ సినిమాలో కూడా వాళ్లిద్దరిలో ఒకరు ఉండే అవకాశం ఉందని ఊహగాహనాలు వస్తున్నాయి. Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big venture👍💐💐👍 Other details Soon..@kegvraja #Sankranti #Bangarraju #BlockbusterBangarraju pic.twitter.com/Q45kO6Prm4 — Studio Green (@StudioGreen2) January 16, 2022 -
నటుడి బంధువు ఆత్మహత్య.. ప్రముఖ నిర్మాతకు ఊరట
సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే 2017లో నటుడు శశికుమార్ బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో కోలీవుడ్లో కలకలానికి దారి తీసింది. ఆ వ్యవహారంపై సినీ ఫైనాన్షియర్ బోద్రాను నిర్మాత జ్ఞానవేల్ రాజా విమర్శిస్తూ ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఫైనాన్షియర్ బోద్రా చెన్నై హైకోర్టులో జ్ఞానవేల్ రాజా తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పిటీషన్ దాఖలు చేశారు. పలుమార్లు విచారణ అనంతరం కేసుకు సంబంధించి న్యాయమూర్తి దండపాణి బుధవారం ఫైనాన్షియర్ బోధ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై వేసిన పిటీషన్లో తగిన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Deepika Padukone: అటు ద్రౌపదిగా, ఇటు సీతగా! -
వినోదభరితంగా మిస్టర్ లోకల్
మిస్టర్ లోకల్ చిత్రం వినోదమే ప్రధానంగా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తెలిపారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞావేల్రాజా నిర్మించిన చిత్రం మిస్టర్లోకల్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి రాజేశ్.ఎం దర్శకుడు. హిప్ ఆప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజేశ్.ఎం మాట్లాడుతూ శివకార్తికేయన్ హీరోగా స్టూడియోగ్రీన్ పతాకంపై చిత్రం చేయడం నిశ్చయం అయినప్పుడు తనకు మంచి విజయవంతమైన చిత్రం ఇవ్వాలని నిర్మాత జ్ఞానవేల్రాజా కోరారన్నారు. ఇక నటుడు శివకార్తికేయన్ మద్యం తాగే సన్నివేశాలు, అలాంటి పాటల సన్నివేశాలు, మహిళలను కించపరచే అంశాలు లాంటివి లేకుండా వినోదాత్మక చిత్రం కావాలని అడిగారన్నారు. దీంతో అలాంటివేవీ ఈ మిస్టర్ లోకల్ చిత్రంలో ఉండవని చెప్పారు. కుటుంబ సమేతంగా చూసి ఆనందించే క్లీన్ ఎంటర్టెయినర్ గా మిస్టర్ లోకల్ ఉంటుందని తెలిపారు. చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ ఇది చాలా సింపుల్ కథాంశంతో కూడిన కాలక్షేప చిత్రంగా ఉంటుందని తెలిపారు. టీవీ రంగంలో ఉండగానే దర్శకుడు రాజేశ్తో కలిసి పనిచేయాలని ఆశ పడ్డానన్నారు. ఆయన తెరకెక్కించిన ఎస్ఎంఎస్ చిత్రంలో తానూ ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పానని అన్నారు. ఇక రాజేశ్ సెట్ చేసి ఇచ్చిన చిత్రమే వరుత్తపడాద వాలిభర్ సంఘం అని తెలిపారు. అది తన కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. నయనతారతో రెండవసారి కలిసి నటించిన చిత్రం మిస్టర్ లోకల్ అని తెలిపారు. ఇంతకు ముందు వేలైక్కారన్ చిత్రంలో కలిసి నటించామని, అయితే ఆ చిత్రంలో ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయిందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నయనతార చిత్రం అంతా ఉంటారని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి మంచి మంచి చిత్రాలతో మిమ్మల్ని కలుస్తానని శివకార్తికేయన్ చెప్పారు. -
దేవరాట్టం కాపాడుతుంది
దేవరాట్టం చిత్రం తనను కాపాడుతుందనే నమ్మకాన్ని ఆ చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ వ్యక్తం చేశారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ చిత్రం దేవరాట్టం. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ జంటగా నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్రాజా మాట్లాడుతూ దర్శకుడు ముత్తయ్యతో తాను నిర్మించిన రెండవ చిత్రం దేవరాట్టం అని చెప్పారు. ఆయన చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేశారన్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రాన్ని ఏకధాటిగా పని చేసి పూర్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. చిత్ర నిర్మాణాన్ని కూడా అంతా ఆయనే చూసుకున్నారన్నారు. ఇది మదురై నేపధ్యంలో సాగే కథ, ఈ కథకు గౌతమ్కార్తీక్, మంజిమా మోహన్లు సరిపోతారా? అన్న భయం తనకు కలిగిందన్నారు. ఈ చిత్రం అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు. చిత్ర కథానాయకుడు గౌతమ్కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనను కాపాడుతుందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం రావడానికి ముఖ్య కారణం నిర్మాత జ్ఞానవేల్రాజా అని తెలిపారు. దర్శకుడు ముత్తయ్య తనకు మదురై ప్రజల భాషను వారి ప్రవర్తనను, జీవన విధానాన్ని నేర్పించారని చెప్పారు. నటి మంజిమా మోహన్ చాలా సపోర్టు చేశారని చెప్పారు. అనంతరం దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ ఇది జాతి గురించి చర్చించే కథా చిత్రం అనే అపోహ పడుతున్నారనీ, నిజానికి దేవరాట్టం అనేది ఒక కళ అని తెలిపారు. -
‘తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలి’
తమిళసినిమా: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మనం చాలా నేర్చుకోవాలని స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత కేఇ.జ్ఞానవేల్రాజా వ్యాఖ్యానించారు. అల్లుఅర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రం తమిళంలోనూ ఎన్ పేర్ సూర్య పేరుతో విడుదల కానుంది. కే.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా లగడపాటి నిర్మించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్ పొందారు. నటి అనుఇమ్మానుయేల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో శరత్కుమార్ విలన్గా నటించడం విశేషం. అరుణ్, కవిత, బిమ్మన్, చారుహాసన్, సాయికుమార్, ప్రదీప్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేఇ.జ్ఞానవేల్రాజా మాట్లాడుతూ మనం తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలని అన్నారు. నటీనటుల పారితోషికం, వారి సహకారం వంటి విషయాలను మనం అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. అక్కడ రూ.50కోట్లు పారితోషికం తీసుకునే నటుడు కూడా అడ్వాన్స్గా రూ.5 లక్షలే తీసుకుంటారని, దీన్ని మన నటీనటులు కూడా పాటిస్తే బాగుంటుందని ఆన్నారు. ఈ విషయంపై నడిగర్ సంఘం చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. బాలీవుడ్కు వెళ్లినా తెలుగు చిత్రపరిశ్రమ గురించే చెప్పుకుంటున్నారని, ఆ పరిశ్రమ అంత సుభిక్షంగా ఉందని, అందుకే తానూ అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించానన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ లారెన్స్ హీరోగా తాను నిర్మించిన లక్ష్యం (తెలుగులో స్టైల్) తమిళ ప్రేక్షకులు ఆదరించారని, మంచి కథా చిత్రాలను ఎప్పుడూ ఆదరించే తమిళ ప్రేక్షకులు ఎన్ పేర్ సూర్య చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇది అల్లుఅర్జున్ కెరీర్లోనే పెద్ద చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. సమావేశంలో శక్తిఫిలిం ఫ్యాక్టరి శక్తివేల్, రచయిత విజయ్బాలాజీ పాల్గొన్నారు. -
నేనే డబ్బింగ్ చెబుతా : విజయ్ దేవరకొండ
తమిళసినిమా: తమిళం నేర్చుకుని తన చిత్రానికి తానే డబ్బింగ్ చెబుతానని తెలుగు యువ నటుడు విజయ్ దేవరకొండ తమిళ ప్రేక్షకులకు మాట ఇచ్చారు. ఈయనిప్పుడు నోటా చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ.జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తేనాంపేటలోని నక్షత్ర హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టైటిల్ను ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్తో ఒక చిత్రం చేయాలని భావించానని మంచి కథ లభించడంతో చిత్రాన్ని తెరకెక్కిస్తునట్టు చెప్పారు. తెలుగు చిత్రం అర్జున్రెడ్డి తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు బాలా పొందారని, ఆ చిత్రం తెలుగు వెర్షనే చెన్నై, చెంగల్పట్టు ఏరియాల్లో రూ.3కోట్లు వసూలు చేసిందని తెలిపారు. చిత్ర హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్ చెప్పిన కథ విని ఇలాంటి కథే తనకు సూట్ అవుతుందని భావించి చిత్రానికి అంగీకరించానని తెలిపారు. ఈ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానని తమిళ ప్రేక్షకులకు మాట ఇస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. -
తమిళంలోకి తొలి అడుగు
విజయ్ దేవరకొండ తమిళ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా కె.ఇ.జ్ఞానవేల్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్నివ్వగా, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘జ్ఞానవేల్ రాజాగారి బ్యానర్లో సినిమా చేయడం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కథ వినగానే ఎగై్జటింగ్గా అనిపించింది. డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు. ‘‘అర్జున్ రెడ్డి’ని 5సార్లు థియేటర్లో చూశాను. విజయ్ అద్భుతమైన నటుడు. మా బ్యానర్లో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్లో విజయ్ హీరోగా నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆనంద్ శంకర్, సంగీత దర్శకుడు శామ్.సి, ఆర్ట్ డైరెక్టర్ కిర ణ్ ఇలా పెద్ద సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మార్చి 8న హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు జ్ఞానవేల్ రాజా. ‘‘అర్జున్ రెడ్డి’ బాగా నచ్చింది. విజయ్ బాగా యాక్ట్ చేశాడు. నేను చెప్పిన కథ విని బాగా ఎగై్జట్ అయ్యాడు. తమిళం నేర్చుకుని మరీ డైలాగ్స్ చెబుతా అన్నాడు. అంత ప్యాషనేట్ యాక్టర్’’ అన్నారు ఆనంద్ శంకర్. ‘‘ఇటీవల విజయ్తో హోలీ సాంగ్ చేశాను. వెంటనే ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా చేస్తున్నాను. స్క్రిప్ట్ విని ఎగై్జట్ అయ్యాను. స్టూడియో గ్రీన్ బ్యానర్లో యాక్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మెహరీన్. కేయస్ రామారావు, బీవీయస్యన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, స్వప్నా దత్, నవీన్ ఎర్నేని తదితరులు పాల్గొన్నారు. -
చెన్నై ఎక్స్ప్రెస్కు టైముందట!
ఆల్మోస్ట్ ఇంకో ఏడాది టైముందట.. అల్లు అర్జున్ చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కడానికి! నిజం చెప్పాలంటే... ఈ టైమ్కి అల్లు అర్జున్ ఎక్కేయాలి. ఒకానొక దశలో అసలు చెన్నై ఎక్స్ప్రెస్ను క్యాన్సిల్ చేశారనే మాటలూ వినిపించాయి. అయితే... అటువంటిదేం లేదట. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్ కాదు, తమిళ సినిమా. అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలుగు–తమిళ సినిమా ఒకటి ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలో అట్టహాసంగా ప్రారంభోత్సవమూ జరిగింది. నిజానికి, ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత బన్నీ–లింగుస్వామి సినిమా షూట్ మొదలవ్వాలి. కానీ, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రారంభించారు బన్నీ. మరోపక్క విశాల్ హీరోగా తమిళంలో ‘సండైకోళి–2’ ప్రారంభించారు లింగుస్వామి . తెలుగులో మంచి విజయం, విశాల్కు గుర్తింపు సాధించిన ‘పందెం కోడి’కి సీక్వెల్ ఇది. మరి, ముందుగా ప్రకటించిన బన్నీ సినిమా సంగతేంటి? అంటే... ‘‘తప్పకుండా ఆ సినిమా ఉంటుంది. ‘నా పేరు ఇండియా–నా ఇల్లు ఇండియా’ పూర్తయిన తర్వాత బన్నీ ఆ సినిమా స్టార్ట్ చేస్తారు. ఈలోపు లింగుస్వామి ‘సండైకోళి–2’ పూర్తి చేసి వస్తారు. ఆల్రెడీ బన్నీ–లింగుస్వామిలు ఎప్పుడో స్క్రిప్ట్ను లాక్ చేశారు’’ అని గీతా ఆర్ట్స్ సన్నిహిత వర్గాల సమాచారం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement