-
ట్రాన్స్కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి..
నాంపల్లి(హైదరాబాద్): నీతోనే నా పెళ్లంటూ ఓ యువతిని ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) దయాకర్ జాదవ్ మోసగించాడు. వివాహం చేసుకుంటానంటూ కరీంనగర్లోని తన గదికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గర్భధారణ పరీక్షల నిమిత్తం సోమాజిగూడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గైనకాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించి టాబ్లెట్స్ ఇప్పించాడు. తన కోరిక తీర్చుకున్నాక “ఇకపై నీతో నా పెళ్లి జరగదంటూ ప్లేటు ఫిరాయించాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి.. బాధితురాలు తెలిపిన మేరకు.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీకి దయాకర్ జాదవ్ “టీఎస్ట్రాన్స్కో’ లో అసిస్టెంట్ ఇంజినీరు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీటెక్ చదివిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భార్యాభర్తలమేనంటూ దయాకర్ సదరు యువతితో నమ్మబలికి శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలోనే రూ.2 కోట్లు కట్నం ఇచ్చే మరో సంబంధం తనకు వచ్చిందంటూ బుకాయించి ఆమెను దూరం పెట్టాడు. దీంతో అమ్మాయి బంధువులు ఇందుకు కారణమేమిటో తెలుసుకునేందుకు అతడితో ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయంగా అన్ని దారులను బ్లాక్ చేసిపెట్టాడని బాధితురాలు వాపోయింది. నిందితుడు దయాకర్ జాదవ్తో పాటు అతడి తల్లి లక్ష్మి, సోదరి లత, సోదరుడు విలాకర్, స్నేహితుడు బీర ప్రకాష్లను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను డిసెంబరు 19వ తేదీలోగా అందజేయాలంటూ జిల్లా పోలీసు శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్లకు పాఠమైంది..
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు. కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.! చదవండి👉: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా? క్రైం నంబరు 173/2011 సిరిసిల్ల పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్ శ్రీనివాస్(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్ 2011 జూన్ 20న హైదరాబాద్ ఉప్పల్లోని ఏఆర్కే అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్మెంట్లో హత్యచేశారు. ఫ్రిజ్లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు. పక్కావ్యూహంతో.. వలపు వల ♦ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్ ఉరఫ్ శేఖర్(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్ సిరిసిల్లు మకాం మర్చాడు. ♦సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు. ♦తమ ఇంటి యజమాని శ్రీనివాస్ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్లో ఓ అపార్ట్మెంట్లో రెండునెలల కోసం ప్లాట్ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్ సుజాతతో శ్రీనివాస్కు ఫోన్ చేయించి ట్రాప్ చేశారు. ♦2011 జూన్ 20న శ్రీనివాస్ను హైదరాబాద్ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్ వెళ్లి అపార్ట్మెంట్లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్ శ్రీనివాస్ను బంధించాడు. శ్రీనివాస్ తండ్రి గడ్దాస్ నర్సప్పకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు. ♦బంధీగా ఉన్న శ్రీనివాస్ జూన్ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు. చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్.. 2017 సెప్టెంబరు 12న శిక్ష శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్ఫోన్ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలకు చార్జ్షీట్ అప్పుడు నేను సిరిసిల్ల టౌన్ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్షీట్ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్లకు ఇటీవల పాఠంగా బోధించారు. – సర్వర్, ఎస్బీ, సీఐ, సిరిసిల్ల -
త్వరలో కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన!
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఆయన ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ, ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రాల సందర్శనకు రానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిన విషయం తెలిసిందే. వేములవాడ, కొండగట్ట పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీలు ముమ్మరం చేశారు. కొండగట్టుకు మాస్టర్ప్లానే శరణ్యం.. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంపై పార్కింగ్, తాగునీరు, గదులు, ప్రాథమిక చికిత్స కేంద్రం, మెట్లదారి అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, ఘాట్ రోడ్ పునరుద్ధరణ, 100 ఫీట్ల రోడ్డు, కోతుల పార్కు, కొండగట్టు రైల్వే స్టేషన్ హాల్టింగ్ సౌకర్యం, బస్టాండ్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇవన్నీ తీరాలంటే.. కేవలం మాస్టర్ ప్లాన్తో సాధ్యమవుతుంది. ‘కొండగట్టు మాస్టర్ ప్లాన్పై సీఎం దృష్టికి తీసుకెళ్లాను. కొండకు రావాలని కోరాను. గత పాలకుల సమయంలో కొండగట్టు ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. కొండగట్టును మరో యాదాద్రి తరహాలోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తారు’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాదాద్రి తరహాలో... రాజాద్రి! సీఎం 2019 డిసెంబరు 30లో చివరిసారిగా పర్యటించారు. అంతకుముందు 2015 జూన్ 18లోనూ వచ్చారు. ఆ సమయంలో ఆలయ సముదాయాలను కలియ తిరిగిన కేసీఆర్ రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో యాదాద్రి తరహాలో రాజాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే.. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ ఆలయానికి ప్రత్యేక నిధులేమీ విడుదల కాలేదు. ‘వేములవాడ ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు పూర్తి అవగాహన ఉంది. సీఎం దంపతుల వివాహం కూడా ఇక్కడే జరిగింది. అందుకే.. వేములవాడ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తప్పకుండా వేములవాడను ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుంటారు’ అని ఎమ్మెల్యే రమేశ్ బాబు చెప్పారు. -
బండి సంజయ్.. నీకు దమ్ముంటే ఆయనపై గెలువు చూద్దాం..!!
-
విషాదం: సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని, ముగ్గురు మృతి మరణించారని అధికారులు తెలిపారు. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. సంబంధిత వార్త: ఆ ముగ్గురూ ఎక్కడ?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement