-
టంపాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!
ప్లోరిడాలోని టంపాలో ఓ తెలుగుకుటుంబం దాతృత్వం చరిత్ర సృష్టించింది. టంపాలో సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పౌండేషన్కు తెలుగువారైన పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను(ఏకంగా రూ. 400 కోట్లు) విరాళంగా అందించింది. ఇంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటించి అమెరికాలో ఉండే యావత్ తెలుగువారంతా గర్వపడేలా చేసినందుకు నాట్స్ ప్రత్యేకంగా పగిడిపాటి కుటుంబాన్ని అభినందించింది. ఏకంగా 50 మిలియన్ల విరాళంఅమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పగిడిపాటి దేవయ్య, రుద్రమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పగిడిపాటి కుటుంబంలోని సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్ వీరందరూ కలిసి ఇచ్చిన ఈ విరాళం ప్లోరిడాలోని టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటివరకు ఇచ్చిన అతి పెద్ద విరాళాల్లో ఇది ఒక్కటిగా నిలిచి చరిత్ర సృష్టించింది. నాట్స్ ప్రశంసల వర్షం..ఈ విరాళం ద్వారా సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కొత్త పీడియాట్రిక్ సదుపాయం అభివృద్ధికి దోహదపడుతుంది. పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయం. పగిడిపాటి కుటుంబ దాతృత్వానికి గుర్తింపుగా, కొత్త పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెట్టనున్నారు. డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మన అమెరికాలో తెలుగువారు అద్భుత విజయాలు సాధించి సేవా రంగంలో కూడా ముందుండాలని నాట్స్ అకాంక్షిస్తోంది. పగిడిపాటి రుద్రమ్మ, దేవయ్య మరిన్ని విజయాలు సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని నాట్స్ కోరుకుంటుంది.(చదవండి: అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య
ప్రముఖ నటుడు, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తండ్రి అయ్యాడు. నేడు(బుధవారం) ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రయిన ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆయన స్వయంగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కూతురికి హోప్ ఎలిజబెత్ బాసిల్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తూ తాను తండ్రి అయినట్లు ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్పై క్లారిటీ వచ్చేసింది? దీంతో ఆయనకు మలయాళ సినీ ప్రముఖులు, నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దుల్కర్ సల్మన్, నజ్రియా ఫాహద్, టోనివో థామస్, ఐశ్వర్యా లక్ష్మీ, సంయుక్త, రాజీషా విజయన్ లాంటి స్టార్లు జోసెఫ్ దంపతులకు విషెష్ తెలిపారు. కాగా బాసిల్ జోసెఫ్ తెలుగు సినీ ప్రియులకు సైతం సుపరిచితమే. ఇటీవల ఆయన నటించిన జయ జయ జయ హే చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. చదవండి: వరుస ఫ్లాప్లు.. అలా చేస్తేనే పూజాకు ఆఫర్స్ ఇస్తామంటున్నారట? ఇందులో ఆయన భార్యను వేధించే భర్తగా కనిపించాడు. అంతేకాదు మలయాళంలో ఆయన వినూత్న కథా చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. కుంజీరమాయనమ్, గోధా వంటి చిత్రాలతో ఆయన మాలీవుడ్లో పాపులర్ అయ్యాడు. మిన్నల్ మెరళి చిత్రం ద్వారా డైరెక్టర్గా మారి తొలి చిత్రానికే దర్శకుడిగా పలు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యాడు. దీంతో ఆయన పేరు జాతీయ వ్యాప్తంగా మారుమోగింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. Thrilled to announce the arrival of our little bundle of joy, HOPE ELIZABETH BASIL ! She has already stolen our hearts and we are over the moon with love for our precious daughter.We can't wait to watch her grow and learn from her every day pic.twitter.com/RpQoLaCdm0 — basil joseph (@basiljoseph25) February 15, 2023 -
‘100 రకాల’ డ్రాగన్ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!
డ్రాగన్ ఫ్రూట్ పుష్కలంగా పోషకాలు కలిగి ఉండే పండు. అంతేకాదు, ఖరీదైనది కూడా. ఈ రెండు లక్షణాలూ 72 ఏళ్ల వృద్ధుడు జోసెఫ్ను రైతుగా మార్చేశాయి. కేరళకు చెందిన ఆయన అమెరికా వెళ్లినప్పుడు తియ్యని డ్రాగన్ ఫ్రూట్ రుచి చూసి పరవశుడయ్యారు. ఏడేళ్ల క్రితం ఆ పండును ఏడు డాలర్లకు కొన్నారాయన. ఆ రుచి, కళ్లు చెదిరే ధర ఆయనను డ్రాగన్ రైతుగా మార్చేసింది. హైదరాబాద్లో మెషిన్ టూల్ ఇండస్ట్రీ నిర్వహించి విరామ జీవనం గడుపుతున్న జోసెఫ్.. తన స్వస్థలం కొట్టాయం దగ్గర్లోని చెంగనస్సెరీకి తిరిగి వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక దేశ విదేశాల నుంచి డ్రాగన్ మొక్కల్ని సేకరించటం మొదలు పెట్టారు. ఈక్వడార్, తైవాన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి డ్రాగన్ మొక్కల్ని తెప్పించి ఇంటి పెరట్లోని 65 సెంట్ల స్థలంలో నాటారు. 100 రకాలు ఇప్పటికి దాదాపు 100 రకాలు సేకరించారు. అందులో కొన్ని మాత్రమే రుచిగా ఉంటాయంటారు జోసెఫ్. కొన్ని రకాల పండు లోపలి గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నిటికి ఎర్రగా, పసుపు పచ్చగానూ ఉంటాయి. డ్రాగన్ జీవవైవిధ్యంతో ఆయన పెరటి తోట కళకళలాడుతూ ఉంటుంది. తనకు నచ్చిన రకాలను సంకరం చేసి 10 కొత్త డ్రాగన్ వంగడాలను రూపొందించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. 65 రోజులకు పండు కోతకు వీటిల్లో జేకే1 పలోరా 2, రెడ్ చిల్లీ, వండర్ బాయ్ జేకే 2 అనే రకాల మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. జేకే1 పలోరా 2 రకం పసుపు రంగు పండు అన్నిటికన్నా తియ్యనిది (బ్రిక్స్ 23.6). పూత వచ్చాక 65 రోజులకు పండు కోతకు వస్తుందని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తన డ్రాగన్ పండ్ల రంగు, రుచిని బట్టి.. ఒక్కో మొక్కను రూ. వంద నుంచి 4,000 వరకు విక్రయిస్తుండటం విశేషం. వండర్ బాయ్ జేకే 2 రకం (క్రాస్ పాలినేషన్ రకం) పండు తియ్యదనం బ్రిక్స్ 21.5. ఈ మొక్క ధర రూ. 1,500. రెడ్ చిల్లీ పండు తియ్యదనం బ్రిక్స్ 17.5. దీని కటింగ్ను రూ. వెయ్యికి అమ్ముతున్నారాయన. అన్నట్టు.. మొక్కలతో పాటు పండ్లను కూడా అమ్ముతున్నారు జోసెఫ్(94472 94236). అనేక రాష్ట్రాల్లో తన కస్టమర్లున్నారని ఆయన అంటున్నారు కించిత్ గర్వంగా! చదవండి: Cocoponics: మట్టి లేని సేద్యం.. కూరగాయలు పుష్కలం! రూపాయి పెట్టుబడికి 11 వరకు ఆదాయం! -
ఏడాది కావొస్తున్న చై-సామ్ విడాకులు, సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ మాజీ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయి ఏడాది కావోస్తోంది. గతేడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. అప్పటి నుంచి వీరి విడాకుల వార్తలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వీరద్దరు మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశించే వారు ఎంతోమంది ఉన్నారు. చదవండి: లలిత్ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్ చెప్పిందా? అసలేం జరిగింది! అయితే వీరి విడాకులు వార్తలపై ఇంతకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇటూ అక్కినేని ఫ్యామిలీ కానీ, అటూ సమంత కుటుంబ సభ్యులు కానీ దీనిపై పెద్ద స్పందించలేదు. ఈ క్రమంలో చై-సామ్ విడిపోయి ఏడాది దగ్గరపడుతున్న క్రమంలో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. దీంతో మరోసారి చై-సామ్ విడాకుల అంశం వార్తల్లో నిలిచింది. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్బుక్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్ ఫొటోలను రిపోస్ట్ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ ‘చాలా కాలం క్రితం నాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అవి లేవు. ఇకపై ఉండవు కూడా. కాబట్టి కొత్త కథ, కొత్త జీవితం మొదలు పెడదాం’ అని అని ఆయన రాసుకొచ్చారు. కాగా చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం ఆయన స్పందిస్తూ ఈ విషయం వినగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, ఒక్కసారిగా కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాపం లిగాన్.. 68 ఏళ్లు జైల్లో.. అందర్నీ కోల్పోయి..
రోజు రోజుకు ప్రపంచం మారిపోతోంది. దాంతో పాటే మన పరిసరాలు కూడా ఎంతో మారిపోతున్నాయి. ఒక రోజు చూసినట్లుగా మరో రోజు ఉండటం లేదు. మనకు బాగా తెలిసిన ప్రాంతం అయినా.. ఓ ఏడాదో, రెండోళ్ల తర్వాతో మనం అక్కడకి వెళితే గుర్తుపట్టలేనంతగా మార్పులు వస్తున్నాయి. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవంతులు కనబడుతున్నాయి. కొత్త రకం రవాణా వాహనాలు, మెట్రో రైళ్లు, పడవల్లాంటి కార్లు.. ఇలా ఒకటేమిటి ఎన్నో మార్పులు తక్కువ సమయంలోనే రావడం చూసి మనమే ఆశ్చర్యపోతున్నాం. అలాంటిది ఓ వ్యక్తి 68 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకు వస్తే ఎలా ఉంటుంది. తన చిన్నప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిసరాలు చూసి ఆశ్చర్యపోకుండా ఉండగలడా? ఇలాగే అమెరికాకు చెందిన జోసఫ్ లిగాన్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆకాశ హార్మ్యాలను చూసి.. లిగాన్ జైలుకెళ్లినప్పుడు తాను చూసిన సాధారణ నగరం ఫిలడెల్ఫియాను.. ఆకాశ హార్మ్యాలతో విరాజిల్లుతున్న ఇప్పటి ఫిలడెల్ఫియాను చూసి ఆశ్చర్యపోయాడు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎత్తైన భవనాలను చూస్తూ.. ఇదంతా నాకు కొత్తగా ఉంది. అప్పట్లో ఇవన్నీ లేవు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కొత్త కొత్తగా మారిపోయిన వీధులను ఆసక్తిగా చూస్తున్నాడు. సరికొత్త పరిస్థితులను మెల్లగా అలవాటుపడుతున్నాడు. స్వెట్లర్లు, సాక్సులు, ఇతర ఆధునిక అవసర వస్తువులు కొనుక్కొని జీవితంలోని మరో అంకంలోకి అడుగుపెడుతున్నాడు. కాగా, అమెరికాలో జువనైల్ ఖైదీగా జైల్లోకి వెళ్లి అక్కడే ఎక్కువ కాలం ఉన్న రెండో వ్యక్తిగా లిగాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. పాల్ గిడేల్ జూనియర్ లిగాన్ కంటే 213 రోజులు ఎక్కువగా జైల్లో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులో.. అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన లిగాన్ 15వ ఏట అంటే 1953లో జీవిత ఖైదీగా జువనైల్ జైలులో అడుగుపెట్టాడు. తన గ్యాంగుతో కలసి మందు కొడుతూ.. దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తూ జల్సా చేసుకునేవాడు. అదే సమయంలో ఇద్దరిని హత్య చేసిన ఘటనలో అతను దోషిగా తేలాడు. దీంతో అతన్ని జైలుకు పంపారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎవరినీ చంపలేదని చెపుతూ వచ్చాడు. అయినా అతన్ని వదల్లేదు. ఎట్టకేలకు అతని లాయర్ కృషితో దాదాపు 7 దశాబ్దాల జైలు జీవితం తర్వాత ఫిబ్రవరి 11న విడుదలయ్యాడు. నూనూగు మీసాల వయసులో జైల్లోకి వెళ్లిన లిగాన్.. 83వ ఏట నెరిసిన జుట్టు, బోసి నోరుతో బయటకు వచ్చాడు. తన బంధువులు, స్నేహితుల్లో చాలా మంది ఇప్పుడు లేరు. అతనికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా నిలిచి అన్ని అవసరాలు తీరుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement