breaking news
Job list
-
రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన
బెంగళూరులో కేవలం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థికి ఆఫర్ చేస్తున్న భారీ వేతన ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. SDE-1 (సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్) పోస్టుకు ఈ ఉద్యోగానికి వార్షికంగా రూ.25 లక్షల జీతం, నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షల విలువైన ఈఎస్ఓపీలు లేదా స్టాక్ బోనస్, అలాగే రోజుకు రూ.600 జొమాటో క్రెడిట్స్ అందిస్తామని పేర్కొన్నారు.ఇదే కాకుండా 10 శాతం పనితీరు బోనస్, రూ.5 లక్షల వరకు రీలొకేషన్, సైనింగ్ ఇన్సెంటివ్లతో మొదటి సంవత్సరంలో మొత్తం వేతనం సుమారు రూ.35 లక్షలకు చేరుతుందని సమాచారం. ఉచిత జిమ్ సభ్యత్వం, ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం రూ.21,000 భత్యం, ప్రతి మూడు సంవత్సరాలకు ఫోన్ అప్గ్రేడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.ఈ జాబ్ లిస్టింగ్ను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ వినియోగదారు షేర్ చేయగా, వెంటనే వైరల్ అయింది. ఒక వైపు టెక్ రంగంలో తొలగింపులు జరుగుతుండగా, మరో వైపు జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందించారు. ఈ ఘటన టెక్ పరిశ్రమలో మారుతున్న నియామక ధోరణులు, వేతన వ్యత్యాసాలపై మరోసారి చర్చకు దారి తీసింది.At one side layoffs are happening and other side companies are offering such high salaries for 1 year experienceAnd the fun part is that same company would be paying lesser to 5-8yrs experience employee already working with them.Salary structure is completely broken in tech. pic.twitter.com/5k5Rivwb3H— EngiNerd. (@mainbhiengineer) January 14, 2026 -
మార్చిలో నియామకాలు పెరిగాయ్
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రకారం గత నెలలో జాబ్ లిస్టింగ్స్ 3 శాతం అధికమయ్యాయి. వివిధ ఉద్యోగాల కోసం నౌకరీ.కామ్లో నమోదయ్యే ప్రకటనల ఆధారంగా ప్రతి నెల కంపెనీ నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ విడుదల చేస్తోంది. దీని ప్రకారం.. ఐటీ, రిటైల్ రంగాల మూలంగా ఈ పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో జాబ్ లిస్టింగ్స్ 2,356 అయితే, మార్చిలో ఈ సంఖ్య 2,436 ఉంది. జాబ్ లిస్టింగ్స్ ఐటీ రంగంలో 11 శాతం, రిటైల్లో 15 శాతం వృద్ధి చెందాయి. చమురు, సహజ వాయువు రంగంలో 7 శాతం, అకౌంట్స్, ట్యాక్సేషన్, ఫైనాన్స్ 6, టెలికం, ఐఎస్పీ 5, బీపీవో, ఐటీఈఎస్ 1, బీఎఫ్ఎస్ఐలో 1 శాతం పెరిగాయి. జనవరి–మార్చిలో 23 శాతం.. కోవిడ్ సెకండ్ వేవ్తో విద్యా రంగంలో 13 శాతం, ఎఫ్ఎంసీజీ 10, హోటల్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ రంగాల్లో 8 శాతం నియామకాలు తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రిక్రూట్మెంట్ 23 శాతం పెరిగిందని నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. వృత్తి నిపుణుల కోసం డిమాండ్ మార్కెటింగ్, ప్రకటనల విభాగంలో 10 శాతం, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ 8, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో 6 శాతం పెరిగింది. 4–7, 8–12 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల కోసం నియామకాల వృద్ధి 6% నమోదైంది. నాయకత్వ విభాగంలో 16 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవారి కోసం జరిగే నియామకాలు 3 శాతం తగ్గాయి. -
మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలివ్వండి
అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మెమో రెండు రాష్ట్రాలు ఏర్పడగానే డిప్యుటేషన్లు రద్దు ఏప్రిల్ 1వ తేదీ కల్లా ఉద్యోగుల పంపిణీపై కేంద్ర సలహా కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతి శాఖలో మంజూరు పోస్టులెన్ని, ఎన్ని ఖాళీలున్నాయి, డిప్యుటేషన్పై ఏ శాఖలో ఎంతమంది ఉన్నారనే వివరాలను పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సోమవారం అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖలు ఉద్యోగులకు సంబంధించి పంపిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ఆర్థిక శాఖ సదరు సమాచారాన్ని మరోసారి ధ్రువీకరించాలని కోరుతూ అసలు ఏ శాఖకు ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి తదితర వివరాలను త్వరగా పంపాలని మెమోలో కోరింది. జిల్లా కార్యాలయాలకు మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారి సంఖ్య వివరాలను పంపాలని తెలిపింది. కొన్ని శాఖల్లో వంద పోస్టులు మంజూరు ఉంటే వాస్తవంగా పనిచేస్తున్న వారి సంఖ్య 200 వరకు ఉందని ఆర్థికశాఖ పరిశీలనలో తేలింది. సహకార శాఖ, ఖజానా, రెవెన్యూ శాఖల్లో పోస్టుల మంజూరు, పనిచేస్తున్న వారి సంఖ్యలో వ్యత్యాసం ఉన్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీమాంధ్రలో, అలాగే తెలంగాణలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉద్యోగులెంతో తెలియాల్సి ఉంది. ఆ వివరాలు వస్తే రెండు రాష్ట్రాల ఏర్పాటు తేదీ జూన్ 2 నుంచి డిప్యుటేషన్లు రద్దు అవుతాయి. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులు తక్కువగా ఉంటే అప్పుడు కొత్తగా డిప్యుటేషన్లపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. విభజన కారణంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగి అరుునా అతని సర్వీసు, సీనియారిటీ, హోదాకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. కమల్నాథన్ కమిటీ ఏప్రిల్ 1లోగా ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాల రూపకల్పన పూర్తి చేస్తుంది. ఏప్రిల్ 1 కల్లా ఉద్యోగుల పంపిణీకోసం కేంద్రం చట్టబద్ధమైన సలహా కమిటీని ఏర్పాటు చేస్తుంది. కమలనాథన్ కమిటీ మార్గదర్శక సూత్రాలకనుగుణంగా సలహా కమిటీ ఆప్షన్ల ఆధారంగా సీమాంధ్ర, తెలంగాణకు ఉద్యోగుల పంపిణీ జరుగుతుంది. ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి వెళ్లాలో నిర్ధారిస్తూ సలహా కమిటీ తొలుత తాత్కాలిక జాబితాను ప్రకటిస్తుంది. ఆ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలున్నా ఉద్యోగులు సలహా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. అభ్యంతరాలను పరిష్కరించాక ఏ రాష్ట్రానికి ఎంతమంది ఉద్యోగులు, వారి పేర్లతో సహా తుది జాబితాను సలహా కమిటీ ప్రకటిస్తుంది. ఆ తరువాత కూడా ఉద్యోగులకు అన్యాయం జరిగితే సలహా కమిటీ దృష్టికి తీసుకువెళ్లవచ్చు.


