-
మార్చిలో నియామకాలు పెరిగాయ్
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రకారం గత నెలలో జాబ్ లిస్టింగ్స్ 3 శాతం అధికమయ్యాయి. వివిధ ఉద్యోగాల కోసం నౌకరీ.కామ్లో నమోదయ్యే ప్రకటనల ఆధారంగా ప్రతి నెల కంపెనీ నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ విడుదల చేస్తోంది. దీని ప్రకారం.. ఐటీ, రిటైల్ రంగాల మూలంగా ఈ పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో జాబ్ లిస్టింగ్స్ 2,356 అయితే, మార్చిలో ఈ సంఖ్య 2,436 ఉంది. జాబ్ లిస్టింగ్స్ ఐటీ రంగంలో 11 శాతం, రిటైల్లో 15 శాతం వృద్ధి చెందాయి. చమురు, సహజ వాయువు రంగంలో 7 శాతం, అకౌంట్స్, ట్యాక్సేషన్, ఫైనాన్స్ 6, టెలికం, ఐఎస్పీ 5, బీపీవో, ఐటీఈఎస్ 1, బీఎఫ్ఎస్ఐలో 1 శాతం పెరిగాయి. జనవరి–మార్చిలో 23 శాతం.. కోవిడ్ సెకండ్ వేవ్తో విద్యా రంగంలో 13 శాతం, ఎఫ్ఎంసీజీ 10, హోటల్స్, ఎయిర్లైన్స్, ట్రావెల్ రంగాల్లో 8 శాతం నియామకాలు తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రిక్రూట్మెంట్ 23 శాతం పెరిగిందని నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. వృత్తి నిపుణుల కోసం డిమాండ్ మార్కెటింగ్, ప్రకటనల విభాగంలో 10 శాతం, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ 8, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో 6 శాతం పెరిగింది. 4–7, 8–12 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల కోసం నియామకాల వృద్ధి 6% నమోదైంది. నాయకత్వ విభాగంలో 16 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవారి కోసం జరిగే నియామకాలు 3 శాతం తగ్గాయి. -
మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలివ్వండి
అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మెమో రెండు రాష్ట్రాలు ఏర్పడగానే డిప్యుటేషన్లు రద్దు ఏప్రిల్ 1వ తేదీ కల్లా ఉద్యోగుల పంపిణీపై కేంద్ర సలహా కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతి శాఖలో మంజూరు పోస్టులెన్ని, ఎన్ని ఖాళీలున్నాయి, డిప్యుటేషన్పై ఏ శాఖలో ఎంతమంది ఉన్నారనే వివరాలను పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సోమవారం అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. ఇప్పటికే పలు శాఖలు ఉద్యోగులకు సంబంధించి పంపిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ఆర్థిక శాఖ సదరు సమాచారాన్ని మరోసారి ధ్రువీకరించాలని కోరుతూ అసలు ఏ శాఖకు ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి తదితర వివరాలను త్వరగా పంపాలని మెమోలో కోరింది. జిల్లా కార్యాలయాలకు మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారి సంఖ్య వివరాలను పంపాలని తెలిపింది. కొన్ని శాఖల్లో వంద పోస్టులు మంజూరు ఉంటే వాస్తవంగా పనిచేస్తున్న వారి సంఖ్య 200 వరకు ఉందని ఆర్థికశాఖ పరిశీలనలో తేలింది. సహకార శాఖ, ఖజానా, రెవెన్యూ శాఖల్లో పోస్టుల మంజూరు, పనిచేస్తున్న వారి సంఖ్యలో వ్యత్యాసం ఉన్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీమాంధ్రలో, అలాగే తెలంగాణలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉద్యోగులెంతో తెలియాల్సి ఉంది. ఆ వివరాలు వస్తే రెండు రాష్ట్రాల ఏర్పాటు తేదీ జూన్ 2 నుంచి డిప్యుటేషన్లు రద్దు అవుతాయి. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులు తక్కువగా ఉంటే అప్పుడు కొత్తగా డిప్యుటేషన్లపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయి. విభజన కారణంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగి అరుునా అతని సర్వీసు, సీనియారిటీ, హోదాకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. కమల్నాథన్ కమిటీ ఏప్రిల్ 1లోగా ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాల రూపకల్పన పూర్తి చేస్తుంది. ఏప్రిల్ 1 కల్లా ఉద్యోగుల పంపిణీకోసం కేంద్రం చట్టబద్ధమైన సలహా కమిటీని ఏర్పాటు చేస్తుంది. కమలనాథన్ కమిటీ మార్గదర్శక సూత్రాలకనుగుణంగా సలహా కమిటీ ఆప్షన్ల ఆధారంగా సీమాంధ్ర, తెలంగాణకు ఉద్యోగుల పంపిణీ జరుగుతుంది. ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి వెళ్లాలో నిర్ధారిస్తూ సలహా కమిటీ తొలుత తాత్కాలిక జాబితాను ప్రకటిస్తుంది. ఆ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలున్నా ఉద్యోగులు సలహా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. అభ్యంతరాలను పరిష్కరించాక ఏ రాష్ట్రానికి ఎంతమంది ఉద్యోగులు, వారి పేర్లతో సహా తుది జాబితాను సలహా కమిటీ ప్రకటిస్తుంది. ఆ తరువాత కూడా ఉద్యోగులకు అన్యాయం జరిగితే సలహా కమిటీ దృష్టికి తీసుకువెళ్లవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement