-
‘ముందు’కొచ్చిన నోబాల్పై మూడో కన్ను
దుబాయ్: త్వరలో జరిగే మహిళల పొట్టి ప్రపంచకప్లో మూడో కన్నుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్ను థర్డ్ అంపైర్ చూస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. ఇంతకుముందు భారత్, వెస్టిండీస్లలో జరిగిన మ్యాచ్ల్లో థర్డ్ అంపైర్కు ప్రయోగాత్మకంగా ఆ బాధ్యతను అప్పగించి పరిశీలించిన ఐసీసీ... అమ్మాయిల మెగా టోర్నీలో పూర్తిస్థాయిలో మూడో అంపైర్కే నిర్ణయాధికారం వదిలేసింది. ఇటీవల 12 మ్యాచ్ల్లో 4717 బంతులు సంధించగా... థర్డ్ అంపైర్ గీత దాటిన 13 నోబాల్లను గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు రావడంతో ఐసీసీ మెగా ఈవెంట్లో మూడో కన్నుకే ఆ పని అప్పజెప్పింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న అమ్మాయిల టి20 ప్రపంచకప్ ఈ నెల 21న మొదలవుతుంది. సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. -
‘నా చివరి టీ20 వరల్డ్కప్ ఇదే కావచ్చు’
గయానా: మహిళల క్రికెట్లో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న టీమిండియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్వుమెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తన చివరిది అవుతుండొచ్చని తెలియజేశారు. టీ20 అంటేనే ధనాధన్ ఆట అని, అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘జట్టులో చాలా మార్పులు వచ్చాయి, కొత్త ప్లేయర్లను ప్రోత్సాహించాల్సిన అవసరం ఏర్పడింది. దేశం తరపున ఎంతకాలం ఆడామన్న దానికంటే.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే గొప్ప విషయం. నా బ్యాటింగ్ కంటే ఎక్కువగా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించాను. యువ ప్లేయర్లు కుదురుకుని జట్టు సమతూకంగా ఉండడంతో ఇదే తనకు చివరి టీ20 వరల్డ్కప్ అయ్యే అవకాశం ఉంది’. అంటూ మిథాలీ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఆ ఫార్మట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిడిలార్డర్లో రావటంపై.. న్యూజిలాండ్ బలమైన జట్టు కావడంతో అనుభవం కలిగిన బ్యాటర్ మిడిల్ ఆర్డర్లో ఉంటే జట్టుకు ఉపయోగమని భావించామని అందకే ఆ మ్యాచ్లో ఓపెనింగ్కు రాలేదని వివరించారు. రెండో మ్యాచ్లో పాకిస్థాన్ స్పిన్నర్లతో బరిలోకి దిగడంతో ఓపెనర్గా వస్తేనే బెటర్ అనుకున్నామని పేర్కొన్నారు. ఇక తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, ప్లాన్కు ప్రకారమే ఆడితే కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది గనుక పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా ఆడాలో, నెమ్మదిగా ఆడాలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలీరాజ్ 56 పరుగులు (47 బంతుల్లో) చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. -
మిథాలి మెరిసినా ఓడిన భారత్
సావర్(బంగ్లాదేశ్): మిథాలి రాజ్ అర్థ సెంచరీ చేసినప్పటికీ న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ టి20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలయింది. మహిళా టి20 ప్రపంచకప్లో భాగంగా కివీస్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మిథాలి సేన 17 పరుగులతో ఓడిపోయింది. కివీస్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మిథాలి 47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 53 పరుగులు చేసింది. కౌర్ 27, గోస్వామి 10, మదానా 11 పరుగులు చేశారు. ముగ్గురు డకౌటయ్యారు. మరో ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement