-
ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్
చైనాలో దిగ్గజ కంపెనీ జియోనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్లతో సంబంధం ఉన్న ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 2018 మరియు అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలలో ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ట్రోజన్ హార్స్ వైరస్ తో దెబ్బతిన్నాయని కోర్టు కనుగొంది. “స్టోరీ లాక్ స్క్రీన్” ప్రత్యేక యాప్ వినియోగదారుల నుండి అయాచిత ప్రకటనలు మరియు ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా లాభాల సాధనంగా ఉపయోగబడిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ఐఫోన్13 కెమెరా ఫీచర్లు వైరల్) “స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ యొక్క అప్డేట్ ద్వారా వినియోగదారుల ఫోన్లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్ను అమర్చడానికి షెన్జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు కోర్టు తెలిపింది. నివేదిక తెలిపినట్లుగా, "పుల్ పద్ధతి"ని ఉపయోగించి వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్లలో అప్డేట్ చేసారని కోర్టు పేర్కొంది. దీని కోసం జియోనీ 40 లక్షల డాలర్లు ముడుపులు ఇచ్చుకుంది. 2018లో మొదటిసారిగా వారు ఈ వైరస్ను ఫోన్లలో ఇన్స్టాల్ చేయడం ప్రారంభించారు. 2019 అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్ఫోన్లను ప్రభావితం చేయడంతో ద్వారా.. కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది. -
జియోనీ ఎఫ్ 9 ప్లస్ : అద్భుత ఫీచర్లు, బడ్జెట్ధర
సాక్షి, ముంబై: మొబైల్ సంస్థ జియోనీ ఎఫ్ 9 ప్లస్ పేరుతో మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ డిస్ప్లే, బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమెరాలాంటి అద్భుత ఫీచర్లతో ఈ డివైస్ను తీసుకొచ్చింది. 6.26-అంగుళాల హెచ్డి + ఫుల్ వ్యూ డిస్ప్లే, వాటర్డ్రాప్ నాచ్తో ఫీచర్తో తీసుకొచ్చింది. ధర: రూ.7690 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు 6.26 ఇంచ్ డిస్ప్లే 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యతలతో బ్రాండ్లు అభివృద్ధి చెందాలి ,సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న ధోరణులకనుగుణంగా ఉత్పత్తులు ఉండాలి. ముఖ్యంగా కస్టమర్ల స్పష్టమైన అభిరుచిని చేరుకునేందుకు జియోనీ ఎల్లపుడూ ప్రయత్నిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ తెలిపారు. అంతేకాదు ఈ స్మార్ట్ఫోన్తో పాటు, జియోనీ ‘జీబడ్డీ’ పేరుతో కొత్త సబ్ బ్రాండ్ను కూడా ప్రకటించింది. ఈ బ్రాండ్ కింద వైర్లెస్ హెడ్ఫోన్స్, వైర్లెస్ నెక్బ్యాండ్ హెడ్సెట్, ఇయర్ఫోన్స్ , పవర్ బ్యాంక్లను ఆవిష్కరించింది. -
జియోని నుంచి ఒకే రోజు 8 స్మార్ట్ఫోన్లు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే రోజు ఎనిమిది స్మార్ట్ఫోన్ల లాంచింగ్కు సిద్దమైంది జియోని. ఈ స్మార్ట్ఫోన్లన్నింటి హైలెట్ బెజెల్-లెస్ డిస్ప్లేలే. ఈ ఫోన్లకు సంబంధించి కంపెనీ తాజాగా రెండు టీజర్లను విడుదల చేసింది. ఆన్లైన్లో పోస్టు చేసిన ఈ టీజర్లలో అన్ని స్మార్ట్ఫోన్ల పేర్లను రివీల్ చేసింది. జియోని ఎం7 ప్లస్, ఎస్11, ఎస్11ఎస్, ఎఫ్205, ఎఫ్6, స్టీల్ 3, ఎం7 లుగా పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లను నవంబర్ 26న జియోని విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లపై వస్తున్న రూమర్ల ప్రకారం ఎం7 ప్లస్ స్మార్ట్ఫోన్ ఫ్లాగ్షిప్ మోడల్స్లో ఒకటిగా తెలుస్తోంది. టీనా లిస్టింగ్లో ఎం7 ప్లస్ చాలా ప్రత్యేకమైన డిజైన్ను, మెటల్ ప్లేట్తో లెదర్ బ్యాక్ను, డ్యూయల్ కెమెరాలు, ఫింగర్ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంటుందని వెల్లడవుతోంది. 6జీబీ ర్యామ్, 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో ఇది రూపొందిందట. మరికొన్ని రూమర్ల ప్రకారం జియోని ఎస్11 కూడా వెనుక, ముందు వైపు రెండు కెమెరాలను ఉంటుందని టాక్. వెనుకవైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెనార్. ముందు వైపు 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఇది రూపొందిందని సమాచారం. ఈ స్మార్ట్ఫోన్ 5.99 అంగుళాల డిస్ప్లేను, 6జీబీ ర్యామ్ను, 64జీబీ స్టోరేజ్ను కలిగి ఉంటుందని సమాచారం. జియోని ఎఫ్205 స్మార్ట్ఫోన్... 5 అంగుళాల డిస్ప్లే, మీడియోటెక్ ఎంటీ6739 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా. జియోని ఎఫ్6కు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ ఎంటీ6739, 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్, వెనుక వైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు కెమెరాలు, ఫ్రంట్ వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్లన్నీ నిజమో కాదో తెలుసుకోవడం కోసం నవంబర్ 26న చైనాలో జరుగబోయే ఈవెంట్ కోసం వేచిచూడాల్సిందే. -
జియోని స్మార్ట్ఫోన్: భారీ బ్యాటరీ, సెల్ఫీ కెమెరా
సాక్షి, న్యూఢిల్లీ: జియోనీ ఇండియా కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్ను కొనసాగించిన కంపెనీ ఎక్స్ 1 ఎస్ పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను మంగళవారం లాంచ్ చేసింది. రూ.12,999 ధరలో బ్లాక్, గోల్డ్ కలర్స్లో సెప్టెంబర్ 21నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, అతిపెద్ద బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెప్పింది. ఆధునిక వినియోగదారులకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మెరుగైన సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను అందించే లక్ష్యంతో ఎక్స్ 1ఎస్ ను విడుదల చేశామని బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ అలోక్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఎయిర్టెల్ వినియోగదారులకు వరుసగా 6 రీచార్జ్లకు 10 జీబీ డేటా అదనం. ఎక్స్ 1 ఎస్ ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0.1 ఆపరేటింగ్ సిస్టం 1.5 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గొరిల్లా గ్లాస్ ప్రొ టెక్షన్ 3 ఫింగర్ ప్రింట్ సెన్సర్ 13 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 వరకు విస్తరించుకునే అవకాశం 4000 ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
డోంట్ వర్రీ: ఆ స్మార్ట్ఫోన్ల రేట్లు పెరగవు!
న్యూఢిల్లీ : వామ్మో నేటి నుంచి జీఎస్టీ వచ్చేసింది.. ఇక కొత్త స్మార్ట్ఫోన్ కొనుక్కోవాలంటే వెనుకా ముందు ఆలోచించాల్సిందేనని భయపడుతున్నారా? అయితే ఇలాంటి భయాలేమీ అక్కర్లేదట. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండు తయారీదారులు కొనుగోలుదారులకు గుడ్న్యూస్ చెప్పారు. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు చెప్పాయి. కొత్త పన్ను విధానంతో పడబోయే వ్యయాన్ని తామే భరించాలని కూడా కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఈ కంపెనీల స్మార్ట్ఫోన్లపై జీఎస్టీ ప్రభావం లేనట్టనేని తెలుస్తోంది. జీఎస్టీ ప్రభావం తమ ధరలపై పడదని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ వోహ్రా చెప్పారు. ''ప్రస్తుతం మార్కెట్లో భిన్నమైన పన్ను విధానం ఉంది. కొన్ని మార్కెట్లో నీవే పన్ను కడితే, కొన్ని మార్కెట్లో పన్నులను నీవే పొందుతావు'' అని చెప్పారు. జీఎస్టీ వల్ల పన్నుభారం పెరుగుతుందని, కానీ వాటిని కంపెనీలే భరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. చైనీస్ కంపెనీలు షియోమి, ఒప్పోలతో పాటు దేశీయ హ్యాండ్సెట్ తయారీదారి లావా కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావంతో రేట్లను పెంచమని చెప్పాయి. సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కూడా ప్రస్తుత మోడల్స్ రేట్లను పెంచకూడదని నిర్ణయించిందని తెలిసింది. అయితే కొత్త మోడల్స్పై జీఎస్టీ రేటు 12 శాతాన్ని విధించాలని చూస్తున్నట్టు సమాచారం. అధికారికంగా మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. మైక్రోమ్యాక్స్ మాత్రం దీనిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది. ఇండస్ట్రీ డేటా ప్రకారం మొత్తం 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లపై 5 శాతం వ్యాట్ రేటు, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉన్నాయి. అంటే మొత్తంగా మొబైల్ ఫోన్లపై 6 శాతం పన్ను ఉంది. జీఎస్టీ కింద వీటికి 12 శాతం పన్ను రేటు విధించారు. అంటే ప్రస్తుతమున్న దానికంటే 4-5 శాతం ఎక్కువ. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ రేట్లు ఎక్కువగా ఉన్నందున వారికి జీఎస్టీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. వ్యాట్ రేటు తక్కువగా ఉన్న పంజాబ్, రాజస్తాన్, చండీఘర్ లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండగా.. వ్యాట్ ఎక్కువగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో ధరలు తగ్గనున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement