breaking news
gifted land
-
పేదింటమ్మ పెద్ద మనసు
‘ధనానికి పేదను కావచ్చుగానీ గుణానికి కాదు’ అన్నట్లుగా ఉంటుంది కొందరి ధోరణి. వారి గుణంలోనే దానగుణం ఉంటుంది. అలాంటి ఒక మహిళ ఆత్రం లేతుబాయి.ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సహేజ్ గ్రామానికి చెందిన లేతుబాయి తనకు ఉన్న మూడెకరాల స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని పది కోలాం కుటుంబాలు ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వానికి దానంగా ఇచ్చింది...ఆత్రం లేతుబాయి... అడవులను, చెట్టుపుట్టలనూ నమ్ముకొని జీవిస్తోంది. వ్యవసాయమే జీవనాధారంగా అతిసాధారణ జీవితాన్ని గడుపుతోంది. బాహ్య ప్రపంచం, ఆధునిక పోకడలు అస్సలు తెలియని అలాంటి మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కారణం... దుబ్బగూడ గ్రామంలో పది కొలాం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. స్థలం లేకపోయినప్పటికీ ప్రత్యేక నిబంధనలతో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. మంజూరైతే చేశారు గానీ ఆ ఇండ్లను కట్టేందుకు స్థలం అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఆత్రం లేతుబాయి తన భర్త జంగు, ముగ్గురు కుమారులతో చర్చించింది. తన పేరిట ఉన్న మూడెకరాల నుంచి ఒక ఎకరం ప్రభుత్వానికి అందజేసింది.లేతుబాయి గతంలో కూడా ఇలానే తమ బంధువులు కొంతమందికి పూరిగుడిసెలు వేసుకునేందుకు చోటు కల్పించింది. ‘మా కొలాం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాయి. పక్కా ఇల్లు అనేది మాకు కల లాంటిది. అది నిజమైతే మా జీవితాలు మారుతాయి. అందుకే మాకు ఉన్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం ఇచ్చాను’ అంటుంది 56 సంవత్సరాల లేతుబాయి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా లేతుబాయి–జంగు దంపతులను ఘనంగా సన్మానించారు. లేతుబాయి నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్, ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
రిటైర్డ్ తహసీల్దార్పై విచారణ చేయండి
– కర్నూలు ఆర్డీఓకు కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ఆత్మకూరు మండలం కరివేనలో ఇనాం భూమికి పట్టాలు ఇచ్చిన రిటైర్డ్ తహసీల్దారుపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు. సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి కరివేన గ్రామానికి చెందిన చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపి రిటైర్డ్ తహసీల్దారుపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టర్కు విన్నవించిన వినతులు: గతంలో ఎమ్మిగనూరులోని ఎస్సీ బాలికల హాస్టల్లో హాస్టల్ మూసేసే వరకు ట్యూటర్గా పనిచేశానని, బకాయి వేతనాలు ఇప్పించాలని ఓ మహిళ కోరగా విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. డోన్ పట్టణంలోని హెచ్పీ గ్యాస్ డీలరు వద్దకు దీపం కనెక్షన్ కోసం వెళ్తే కనెక్షన్తో పాటు స్టవ్ తదితర వాటికి నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కొండపేట వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా డీఎస్ఓతో విచారణ జరిపిస్తామన్నారు. గోనెగండ్ల నాగేశ్వరరెడ్డి భార్య సర్పంచ్ కావడంతో ఆయన ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని కట్టడాలు సాగిస్తున్నారని, ఎవరైన ఫిర్యాదు చేస్తే తన అనుచరులతో దాడులు చేయిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు కోరారు. మద్దికెరలో సర్వే నెంబరు 554లో భూమిలో 33 సెంట్ల భూమిని వీఆర్ఓ తన తమ్ముని పేరుతో రిజిస్ర్టర్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు.


