-
కాటేసిన కరెంట్ తీగ
సిద్దిపేటరూరల్: అర్బన్ మండల పరిధిలోని తడ్కపల్లిలో విద్యుత్ షాక్తో కొమురయ్య అనే రైతు మృతి చెందాడు. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పెర్న కొమురయ్య అనే రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. గట్లపై తిరుగుతూ పొలాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఎప్పుడో తెగి కింద పడ్డ విద్యుత్ వైర్లు తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ ఏడీ శ్రీనివాస్ మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతునికి పెళ్లైన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తిమ్మారెడ్డిగూడెం(మునగాల) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బారెడ్డి వెంకట్రెడ్డి(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఉన్నప్పటీకీ మోటారు నడవక పోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఎల్టీ లైన్ తెగి పడి ఉండడాన్ని గమనించాడు. తెగిన విద్యుత్ వైరును అమర్చేందుకు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఆపేందుకు ప్రయిత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్న హెవీలైన్ను నుంచి విద్యుత్ సరఫరా కావడంతో వెంకట్రెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ లోగా పక్కనే ఉన్న ఇద్దరు రైతులు వచ్చి వెంకట్రెడ్డిని కిందకు దించారు. ఎల్టీలైన్కు ఆనుకొని హెవీలైన్ ఉండడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని రైతులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి వారణాసి ఉషారాణి ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ షాక్ తో రైతు మృతి
నెల్లూరు: మోటర్ పెట్టడానికి వెళ్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన నెల్లూరు జ్లిలా కోట మండలం కార్లపుడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగుంట మానయ్య(48) మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా.. అదే సమయంలో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి పడటంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వలిగొండ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగస్వామి(24) బుధవారం పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లింగస్వామికి ఇంకా వివాహం కాకపోవడం, చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. లింగస్వామి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
విద్యుధ్ఘాతంతో రైతు మృతి
నిజామాబాద్: పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన గంగి వీరన్న(60) ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు కట్టడానికి బావి వద్దకు వెళ్లాడు. పంపు పనిచేయకపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement