-
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
సోషల్ మీడియా ట్రెండింగ్లో ఎయిర్హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే?
ఎయిర్హెస్టెస్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది.. విమాన ప్రయాణీకులకు వెల్కమ్ చెప్పడం, లోపల అతిథి మర్యాదలు చేయడం. కాగా, ఓ మహిళా ఎయిర్హెస్టెస్కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. దుబాయ్కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలోకి ఎక్కేందుకు ఓ చిన్నపిల్లవాడు పాస్పోర్టు, వీసాతో వెళ్లాడు. ఇంతలో విమానం గేటు వద్ద ఓ ఎయిర్హెస్టెస్.. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. వెంటనే అతడిని హత్తుకుని చిరునవ్వుతో స్వాగతం పలికింది. ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్హోస్టెస్ కుమారుడు కావడమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) ఈ వీడియోను షేర్ చేసిన సదరు ఎయిర్హోస్టెస్..‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బావోద్వేగానికి గురువుతున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by V E E (@flygirl_trigirl) -
ఆకాశంలో ఐదు గంటలు
తాము ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మనకొద్దు అని దిగివెళ్లిపోయే వీలులేదు. ఎందుకంటే వారంతా ప్రయాణిస్తున్నది ఆకాశంలో. తమకు తాముగా భూమిపై కాలుపెట్టే పరిస్థితి లేదు. అంతా పైలట్ దయాదాక్షిణ్యాలపై అధారపడి ఉం ది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఐదు గంటలపాటు ఆకాశంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు తిరుచ్చి– దుబాయ్ విమాన ప్రయాణికులు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచ్చిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం ప్రతిరోజూ దుబాయ్లో బయలుదేరి రాత్రి 12.05 గంటలకు తిరుచ్చిరాపపల్లికి చేరుకుంటుంది. మరలా ప్రయాణికులను ఎక్కించుకుని దుబాయ్కి బయలుదేరుతుంది. యథావిధిగా గురువారం రాత్రి 120 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి తిరుచ్చి చేరుకుంది. తిరుచ్చిలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం తెల్లవారుజాము 1.20 గంటలకు దుబాయ్కి బయలుదేరింది. కంట్రోలు రూం ఆదేశాల ప్రకారం తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డు ప్రహరీగోడ వైపున పశ్చిమ దిశగా టేకాఫ్ తీసుకోవడానికి ముందు రన్వేలోనే తూర్పు దిశకు వెళ్లి మరల పశ్చిమ దిశకు మరల్చి రన్వేలో సగం దూరం వేగంగా నడిపి టేకాఫ్ తీసుకోవాలి. అయితే సదరు విమానం రన్వే ముగిసేచోట టేకాఫ్ చేయడంతో అక్కడి పదకొండు టవర్లలో నాలుగింటిని ఢీకొట్టింది. అదే తీరులో ముందుకు ఎగురుతుండగా విమానం వెనుకనున్న రెండుచక్రాలు 9 అడుగుల ప్రహరీగోడను ఢీకొట్టాయి. ఈ కారణంగా ప్రహరీగోడ పాక్షికంగానూ, టవర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే విమాన కిందిభాగం ధ్వంసమై కొన్ని శిథిలాలు కిందపడిపోయినట్లు సమాచారం. అయితే విమాన రెండుచక్రాలకు ఏమీకాలేదు. ఇంత జరిగినా ఏమాత్రం చలించని పైలట్ విఘ్నేష్కుమార్ దుబాయ్ వైపు విమానాన్ని పరుగులు పెట్టించాడు. విమానం భారీగా కుదుపులకు లోనుకావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఏమైందని ప్రశ్నిస్తే ఎయిర్హోస్టెస్ ఏదో సర్దిచెప్పారు. విమాన విధ్వంస దృశ్యాలను సీసీ కెమెరాల్లో చేసిన తిరుచ్చి కంట్రోలు రూంఅధికారులు పైలట్ను సంప్రదించగా విమానానికి ఏమీ కాలేదు, దుబాయ్ వెళుతున్నా అని బదులిచ్చాడు. విమానం స్వల్ప ప్రమాదానికి లోనైందని తిరుచ్చి కంట్రోలు రూం అధికారులు దుబాయ్ కంట్రోలు రూంకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు వీలులేదు, మరేదైనా జరిగితే మాకు తలనొప్పని వారు స్పష్టం చేశారు. దీంతో తిరుచ్చి అధికారులు ముంబయి విమానాశ్రయ కంట్రోలు రూంను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి పొందారు. దీంతో ఏమైందో తెలియక ముంబయి విమానాశ్రయంలో కలకలం రేగింది. తిరుచ్చి అధికారులు పైలట్కు ఫోన్ చేసి వెంటనే ముంబయి విమానాశ్రయంలో దిగాల్సిందిగా ఆదేశించారు. అప్పటికే విమానం దుబాయ్ దేశంలో సముద్రంపై ఎగురుతోంది. ఈ విమానం దుబాయ్కి మరో 45 నిమిషాల్లో చేరుతామనగా వెనక్కుమళ్లి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దుబాయ్ విమానం లాండ్ అయ్యేవరకు ముంబయి, తిరుచ్చి కంట్రోలు రూం అధికారులు, ప్రయాణికులు తీవ్ర ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొన్నారు. దుబాయ్ విమానంలోని 130 మంది ప్రయాణికులకు బస ఏర్పాటు చేసి ఉదయం 10.40 గంటలకు మరో విమానంలో పంపారు. రుజువైతే లైసెన్సు రద్దు: తిరుచ్చి విమానాశ్రయ అధికారి గుణశేఖరన్ మీడియాతో మాట్లాడుతూ విమానం టవర్కు ఢీకొనగానే కంట్రోలు రూంలో అలారం వినిపించిందని అన్నారు. దీంతో పైలట్ను ఫోన్లో సంప్రదించగా విమానానికి ఏమీ కాలేదని బదులిచ్చాడు. ముంబయిలో అత్యవసర లాండింగ్ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ విచారణకు ఆదేశించిందని, ఈ విచారణ బృందంలో తాను సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. పైలెట్ తప్పిదం ఉన్నట్టు విచారణలో తేలితే అతడి లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. అదే జరిగి ఉంటే.. విమానాశ్రయానికి అనుకునే తిరుచ్చిరాపల్లి–పుదుక్కోట్టై రహదారిని నిర్మించారు. ఈ రహదారిలో 24 గంటలు పెద్ద సంఖ్యలో వాహనాల రద్దీ ఉంటుంది. ఐదు నిమిషాలకు ఒకసారి పుదుక్కోట్టై బస్సు వెళుతుంటుంది. ప్రహరీని ఢీకొన్న సమయంలో ఏదైనా వాహనం వెళుతుండినట్లయితే విమానం ముందు భాగం సదరు వాహనాన్ని ఢీకొని పెద్ద ప్రమాదం చోటుచేసుకుని ఉండేది. అదృష్టవశాత్తు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. -
టేకాఫ్ అవుతూ గోడను ఢీకొట్టింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ విమానానికి భారీ ముప్పు తప్పింది. తిరుచ్చి నుంచి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలప్పుడు దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్–611 విమానం బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా.. పైలట్లకు ల్యాండింగ్ సమయంలో సూచనలు ఇచ్చేందుకు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద పరికరాన్ని విమానం ఢీకొంది. ఆ తర్వాత విమానం ప్రహరీ గోడను కూడా స్వల్పంగా తాకింది. ఈ ఘటనలతో విమానం కుదుపులకులోనై ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటు విమానం చక్రం, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 50 అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ, దానిపై ఉన్న కంచె కూడా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఎవ్వరికీ ఏమీ కాలేదు. విమానంలో కూడా అన్ని పరికరాలూ సవ్యంగానే పనిచేస్తున్నాయనీ, ఇబ్బందేమీ లేదని పైలట్లు చెప్పడంతో విమానం అలాగే దుబాయ్ వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని దుబాయ్ విమానాశ్రయానికి చేరవేయడంతో విమానం దెబ్బతిన్నందున తాము ల్యాండింగ్కు అనుమతించబోమని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విమానాన్ని తెల్లవారుజామున 5.45 ప్రాంతంలో ముంబైకి తరలించి, అక్కడ ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి 10.40 గంటలకు దుబాయ్కి పంపారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యనా లేక పైలట్ల నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించిందనీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించిందని తిరుచిరాపల్లి విమానాశ్రయ డైరెక్టర్ గుణశేఖరన్ చెప్పారు. -
ఎయిర్పోర్ట్లో భారీగా ఎర్రచందనం పౌడర్ స్వాధీనం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమీర్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు శుక్రవారం 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్ అహ్మద్ శుక్రవారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీలో అక్రమంగా ఉంచి 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఫౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు..
- ఈసీ ద్వంద్వ వైఖరి
- ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
- నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
- Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
Advertisement