ఎయిర్పోర్ట్లో భారీగా ఎర్రచందనం పౌడర్ స్వాధీనం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమీర్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు శుక్రవారం 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్ అహ్మద్ శుక్రవారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీలో అక్రమంగా ఉంచి 37 కేజీల ఎర్రచందనం పౌడర్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ ఫౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి