breaking news
DSC Scam
-
బాబు, బాబు కొడుక్కి వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 చంద్రబాబు హయాంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయి. ప్రిలిమ్స్లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? అని సవాల్ విసిరారు. బాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్ టెస్ట్లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మీ హయాంలో జరిగిన డీఎస్సీ.. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్ విసిరారు. -
కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్పోర్ట్స్కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఒప్పుకుందని వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయని.. కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవోలిచ్చే స్థాయికి డీఎస్సీ స్కాం వెళ్లింది. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్లు ఒప్పుకున్నారు. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ, జరిగింది ఏంటో తెలుసా?.. ఎఫ్ఐఆర్ కాపీలో నిందితుడిని సస్పెక్టెడ్ అని రాశారు. అరెస్ట్ శిక్ష సంగతి పక్కన పెడితే.. ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అసలు వెంటనే ఎఫ్ఐఆర్ రాయకుండా ఉన్నతాధికారులతో ఎందుకు మాట్లాడారు?. ఆడియో, వీడియో టేపుల్లో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ బయటకు వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదనేది కనుక్కోవడం పోలీసులకు ఎంత సేపు పని?. దారుణంగా అబద్దాలు ఆడుతున్నారు.. నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో జాబ్ ఇస్తారని ఓ మహిళా అభ్యర్థి దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆపై మోసం చేశారు. ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తారని మభ్య పెట్టారు. ఆమె తనను మోసం చేశారని కంప్లయింట్ చేశారు. ఎవరికి రూ.14 లక్షలు ఇచ్చారో అనేది కూడా ఉంది. డీఎస్సీ అని పేర్కొనకుండా.. ఏపీ టూరిజంలో మోసం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారు. గతేడాది నవంబర్లోనే ఇది జరిగితే.. ఇప్పటిదాకా ఎలాంటి కేసు లేదు. కేసులో పురోగతి లేదని ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవే కాదు.. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, ఇక్కడ నారా లోకేశ్తో చంద్రబాబు రాజీనామా చేయట్లేదు. పైగా మరింత దిగజారిపోయారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని దుష్ప్రచారానికి దిగారు. కానీ, ఆ వ్యవహారం అయన ప్రభుత్వం చివర్లోనే ప్రిలిమ్స్ జరిగింది.ఆక్రోశంతో దుష్ప్రచారం2019కి ముందే బాబు హయాంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టకముందే(2019 మే 26న).. ప్రిలిమ్స్ జరిగాయి. మేం ప్రిలిమ్స్లో పాసైన వాళ్లకు మెయిన్స్ మాత్రమే నిర్వహించాం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిజిటల్ వాల్యూయేషన్ జరిపించాం. అయితే కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. డిజిటల్ వాల్యూయేషన్ను పరిగణనలోకి తీసుకోకుండా మాన్యువల్ వాల్యూయేషన్ చేయాలని కోర్టు చెప్పింది. అలా చేశాకే.. నియామకాలు జరిపాం. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడిది?. అయితే చంద్రబాబు ప్రభుత్వం.. డిజిటల్ వాల్యూయేషన్లో అవకతవకలు జరిగాయని అంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పక్కన పెట్టాక ఆ ప్రస్తావన మళ్లీ ఎందుకు వస్తోంది?. అంటే.. ఇది 165 మంది జీవితాలను అతలాకుతలం చేసే ప్రయత్నమా?. ఇదే గ్రూప్-1 వ్యవహారంపై నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. 2025లో సిట్ వేశారు. ఆ సిట్ అధికారులు ఏ తప్పు జరగలేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇరికించే కుట్రలో భాగంగా మరో సిట్ వేశారు. సిట్లో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసేవారే కదా?. నిజాలను ఎవరూ దాచిపెట్టలేరు.. బయటకు రావాల్సిందే. మా హయాంలో ఇప్పటి డీఎస్సీ మాదిరి ఏ స్కాంలు జరగలేదు. మేమేం పరీక్షలే నిర్వహించకుండా.. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరికీ అనుకూలంగా జీవోలు తేలేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు.. బేరసారాలు జరిగినట్లుగా.. ఆడియో, వీడియోలు ఇలాంటి ఆధారాలేవీ బయటకు రాలేదు. మా హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబుకి ఈ ఆక్రోశం’’ అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో లీకేజీల నుంచి బేరసారాల వరకు పరిశీలించాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందే. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
పీవీ సింధులా ఎంత మందికి మెడల్స్ వచ్చాయి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన డీఎస్సీ అవకతవకలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ నిలదీశారు. పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసలు ఎలా అనగలిగిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కనీసం అభ్యర్థుల విద్యా సామర్థ్యాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం లేదా? అని అన్నారు. ‘‘చదువు చెప్పే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? చంద్రబాబు, లోకేశ్ మైండ్లో చిప్లు ఉన్నాయా? లేదా?’’ అని మండిపడ్డారు. స్పోర్ట్ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశారని.. రిక్రూట్మెంట్లు అయ్యాక వాటిని వెనక్కి కూడా తీసుకున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పీవీ సింధుకు ఇచ్చినట్లుగానే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.. కానీ పీవీ సింధులా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించారు? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని దేశానికి ఎన్నో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరని ఆయన అన్నారు. కానీ అదే పేరుతో సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.పీవీ సింధు స్థాయిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారు ఎంతమంది? దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించినవారు ఎంతమంది? అనేది చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అర్హతలు, వారు సాధించిన పతకాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు, నారా లోకేశ్ల అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయంటే.. ఆర్చరీలో గోల్డ్ మెడల్ అందుకున్న దుర్గయ్యకి కూడా ఉద్యోగం రాలేదు. కాల్లెటర్ పంపిన తర్వాత కూడా.. ఉద్యోగం ఇవ్వలేదు అంటే అర్థం చేసుకోవాలి అని వైఎస్ జగన్ అన్నారు. అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. -
బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే తండ్రీకొడుకుల బ్యాటింగ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తప్పు చేశారు అని క్లియర్ కట్గా ఉన్నా.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన డీఎస్సీ అవకతవకల అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. ఆ అవకతకవలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని తమకు ఆ హోదా ఇవ్వడం లేదు. కౌన్సిల్లోనూ మాట్లాడడానికీ సమయం ఇవ్వడం లేదు. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారు అని చంద్రబాబు, నారా లోకేశ్లను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం. అందుకే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1పై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు తప్ప.. తప్పు ఒప్పుకోవడం లేదు. అసెంబ్లీలో మాట్లాడతారు కానీ.. మండలిలో మాట్లాడరు. తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతుందని చంద్రబాబుకు భయం అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టారు. స్వయంగా ఈ విషయాన్ని లోకేశ్ సభలో అంగీకరించారు. ప్రశ్నాపత్రం తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీది. పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది. రెండూ ఒకే వ్యక్తి చేతిలో పెడితే పారదర్శకత ఉంటుంందా?. ఏపీ డీఎస్సీ నియామక చరిత్రలోనే రెండు బాధ్యతలు ఒకే అధికారి చేతికి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు బీజం పడింది. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం. ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?. ఇలా చేయడం లీకేజీకి తెర తీసినట్లు కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఆ లీకులు నవీన్ ఒక్కడి దగ్గరే ఆగాయా?నవీన్ తన ర్యాంకును, ఉద్యోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విద్యాశాఖకు లేఖ కూడా రాశారని జగన్ తెలిపారు. మొదటి మెరిట్ జాబితాలో నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. అలాంటప్పుడు ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంతో నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోందని వైఎస్ జగన్ అన్నారు. అదే నిజమైతే.. తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ నవీన్ కోర్టును ఎందుకు ఆశ్రయించాడని ప్రశ్నించారు. అంతేకాకుండా రెండో మెరిట్ జాబితాలో నవీన్ పేరు లేకుండా ఎలా విడుదల చేశారని నిలదీశారు.పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ముందుగానే నవీన్ పేరును మెరిట్ జాబితా నుంచి తొలగించారని అన్నారు. ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో పనిచేసే ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్ ఒక్కడి వరకే పేపర్ లీక్ పరిమితమైందా? లేక ఇంకా ఎంతమందికి చేరింది? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నవీన్ విషయంలోనే ఇలా జరిగిందా? డీఎస్సీ వ్యవహారంలో మరెవరైనా లబ్ధి పొందారా? అనే అంశాలపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు.


