-
Secunderabad Railway Station: రైల్వేకు నష్టం రూ.12 కోట్లు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్ఫామ్లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. -
శ్రీమంతుడు సినిమాలోలా.. రైలు వదిలి సైకిలెక్కి!
తాటిచెట్లపాలెం: ఆయన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గ్రామంలో పర్యటించినట్టు డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి కూడా తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో పర్యటించారు. కాలనీ మొత్తం సైకిల్పైనే ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు. సదుపాయాలు, వసతులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య, పరిశుభ్రత, సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, పర్యావరణ, ఆరోగ్య విభాగ సిబ్బంది ఉన్నారు. -
‘ఆ పిల్లల వివరాలు వెబ్సైట్లో పెడుతున్నాం’
సాక్షి, విజయవాడ : ఇంట్లోంచి పారియపోయి వచ్చిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశం అంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఆర్ ధనుంజయ్. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ధనుంజయ్ 2017 సంవత్సరంలో దాదాపు 230 మంది ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలను రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రెస్క్యూ టీం కాపాడారని తెలిపారు. అయితే ఈ ఏడాది వీరి సంఖ్య పెరిగిందని చెప్పారు. 2018 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 246 మంది ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు. ఇలా పట్టుకున్న పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. తాము కాపాడిన పిల్లల ఫోటోలను ఆర్పీఎఫ్ వెబ్ పోర్టల్లో పెడుతున్నాని వెల్లడించారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వారి అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్లను వెబ్సైట్తో పాటు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నట్లు తెలిపారు. -
సత్యదేవుని దర్శించిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం
అన్నవరం : దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం అశోక్కుమార్ దంపతులు బుధవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్విదించి, ప్రసాదాలను అందజేఆరు. ఎక్స్ప్రెస్లకు హాల్ట్ కల్పించండి... డీఆర్ఎం అశోక్కుమార్ను దేవస్థానం ఈఓ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నవరం రైల్వేస్టేషన్లో గరీబ్ రధ్, కోణార్క్, లోకమాన్యతిలక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు అన్నవరం రైల్వేస్టేషన్ హాల్ట్ కల్పించాలని కోరారు. అదేవిధంగా మూడో నెంబర్ ఫ్లాట్ఫాం పక్కన గల ఖాళీ స్థలంలో దేవస్థానం నిధులతో షెడ్డు నిర్మిస్తామని, అందులో ఆటోమే టిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఆర్ఎం అంగీకరించారు. సమయంలేక.. అన్నవరం రైల్వేస్టేషన్ను బుధవారం మధ్యాహ్నం డీఆర్ఎం తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆయన సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. సత్యదేవుని దర్శనం అయ్యే సరికే ఆరున్నర గంటలు అయింది. దీంతో సమయం లేక రైల్వేస్టేషన్ను పరిశీలించకుండానే విజయవాడ బయలుదేరి వెళ్లిపోయారు. ఆయన వెంట సీనియర్ డీసీఎం సిఫాలీ, స్టేషన్ టీటీఈ కిరణ్ తదితరులున్నారు. -
రైల్వేస్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం
వసతులపై సీసీఐ,ఎస్ఎంలపై ఆగ్రహం ఆటో, టూవీలర్ పార్కింగ్పై దృష్టిపెట్టాలని సూచన ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశం ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం రైల్వేస్టేషన్ను శుక్రవారం రైల్వే డీఆర్ఎం ఆశీష్ అగర్వాల్ అకస్మికంగా తనఖీ చేశారు. స్టేషన్ పనితీరుపై సీసీఐ సురేందర్, ఎస్ఎం సూర్యచంద్రరావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం డీఆర్ఎం కృష్ణా పుష్కరాలకు విజయవాడలో హాజరై తిరుగు ప్రయాణంలో ఖమ్మం రైల్వే స్టేషన్ను సందర్శించారు.స్టేషన్ను పూర్తి స్థాయిలో పరిశీలించి అసౌకర్యాల ఆరా తీశారు. స్టేషన్లో ప్లాట్ఫాంలను,బుకింగ్,ఏటీవీఎం,మంచినీటి వసతి,వెయిటింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం సౌకర్యాల పట్ల ప్రయాణికులను డీఆర్ఎం అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ ప్రాంగణం బయట వాహనాల పార్కింగ్కు అధికంగా స్థలం కేటాయింపుపై, పుష్కరాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. డీఆర్ఎం వెంట సీనియర్ డీసీఎం సత్యనారాయణ,సీడీఓఎం క్రిష్టోఫర్, ఎస్డీఎస్ఓ మీనా,ఏడీజేఈ శ్రీనాథ్, ఖమ్మం కమర్శియల్ ఇన్స్పెక్టర్ సురేందర్,ఎస్ఎం సూర్యచంద్రారావు, సీఐ రాజు,ఎస్ఐ సుబ్బారావు ,రైల్వేసిబ్బంది చౌదరి, జావీద్ పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీతో అధికారుల ఇక్కట్లు విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరుగుముఖంలో సికింద్రాబాద్కు ప్రత్యేక రైలులో బయలు దేరిన డీఆర్ఎం ఖమ్మం వస్తున్నారని అర్ధగంటముందు తెలుసుకున్న అధికారులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. డీఆర్ఎం వస్తున్న విషయంపై అధికారులు ఆగమేఘాల మీద స్టేషన్ ప్రాంగణాన్ని యుద్ధప్రాతిపదికన పరిశ్రుభత పనులు చేపట్టారు. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోయారు. ఏటీవీఎంలు ఉన్నప్పటికీ ప్రయాణికులు అంతగా అటువైపు చూడటం లేదు. అర్భాటంగా స్టేషన్లో ఏర్పాటు చేసిన ఏటీవీఎంలకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. దీంతో సొంతగానే రిటైర్డ్ ఉద్యోగులతో వాటి సేవలు కొనసాగుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement